breaking news
Pandit Jawaharlal Nehru
-
సాంకేతిక సౌరభం
వనపర్తిటౌన్: వనపర్తి ఎడ్యుకేషన్ హబ్కు కేరాఫ్గా మారింది. ఇందుకు సంస్థానాదీశుల కాలంలోనే బీజం పడింది. పాఠశాల విద్య, సాంకేతిక విద్యకు వనపర్తి రాజులు జీవం పోశా రు. 1936, అంతకంటే ముందు నిజాం ప్రభువు హయాంలో హైదరాబాద్ రాష్ట్రంలో పది పాఠశాలలు ఉంటే.. అందులో ఒకటి వనపర్తిలో (పాత జూనియర్ కళాశాల) ఏర్పాటు చేసేలా సంస్థానాదీశులు చొరవ తీసుకున్నారు. అప్పట్లో నిరుపేద కుటుంబాలకు చెందిన అన్ని వర్గాల విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్షిప్లు అందించే వారు. 1959లో సంస్థానాదీశుడు రాజా రామేశ్వర్రావు హయాంలో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాలలో చదువుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. నేపాల్, జర్మనీ తదితర దేశాల నుంచి వచ్చి సాంకేతిక విద్య ను అభ్యసించారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ కోర్సుల్లో 30 నుంచి 40 మందికి సాంకేతిక విద్య అందించారు. రాజా రామేశ్వర్రావు ఔదార్యం.. ఈ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలను రాజా రామేశ్వర్రావు 1959 నుంచి 1971 వరకు సమర్థవంతంగా నడిపారు. ఆ తర్వాత 20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాజప్రాసాదాన్ని (కళాశాల భవనం) ఒక్క రూపాయి ఆశించకుండా ప్రభుత్వానికి అందజేశారు. అప్పట్లో రాజా వారి నిర్ణయం సంచలనమని నేటికీ చర్చించుకుంటారు. ఆరు కోర్సులతో.. పాలిటెక్నిక్ విద్య ప్రభుత్వ అదీనంలోకి వచ్చాక మొదట్లో ఉన్న మూడు కోర్సులతో పాటు సీసీపీ, డీ ఫార్మసీ, ఇన్స్ట్రుమెంటేషన్ కోర్సులతో కళాశాల కొనసాగుతోంది. 1,200 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా.. కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ పేరుతో రాజప్రాసాదం విరాజిల్లుతోంది. 55 ఏళ్ల తర్వాత మహిళా పాలిటెక్నిక్ కళాశాల.. వనపర్తిలో సాంకేతిక విద్యకు అడుగులు పడిన 55 ఏళ్ల తర్వా త జిల్లాలోని పెబ్బేరుకు మహిళా పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. ఇందులో రెండు కోర్సులు ఉన్నాయి. ప్రస్తుతం 300 మంది విద్యార్థినులు చదువుతున్నారు. రాజుల కాలంలోనే మోడల్ బేసిక్ ప్రాక్టిసింగ్ స్కూల్ను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్య్ర అనంతరం కొన్నేళ్ల పాటు వనపర్తి పాతబజార్లోని హనుమాన్, శంకర్గంజ్లోని దేవాలయాల్లో బ్రాహ్మణులు నిరుపేదలకు చదువులు చెబుతూ జీవ నం సాగించేవారు. సంస్థానాధీశుల కాలం నుంచే వనపర్తిలో విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. స్వాతంత్ర్యానికి పూర్వమే ఇక్కడ పాఠశాల విద్యకు ప్రాధాన్యం ఉంది. ఫలితంగా ఇక్కడి ప్రజలు విద్యాపరంగా చైతన్యవంతులు అని గుర్తింపు వచి్చంది. ఉపాధి అవకాశాలు మెండు.. ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ శాఖ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ విద్య విద్యార్థులకు వరంలాంటిది. పాలిటెక్నిక్ విద్యతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయి. పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ప్రైవేట్ కంపెనీల్లో రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించొచ్చు. డిప్లామాతోనే విద్యార్థులు స్థిరపడే అవకాశం పాలిటెక్నిక్ విద్యతో చేకూరుతుంది. త్వరలో జరిగే పాలిసెట్ కౌన్సిల్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. – జగన్, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, వనపర్తి విద్యాపర్తిగా గుర్తింపు.. రాజుల కాలం నుంచే విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు. సాంకేతిక విద్యలో వనపర్తికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే కాకుండా రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల నుంచి ఇక్కడకు వచ్చి విద్యనభ్యసించారు. జిల్లాలోని పెబ్బేరులో పదేళ్ల క్రితం మహిళా పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ప్రైవేట్ రంగంలోనూ సాంకేతిక విద్య అందుబాటులోకి వచ్చింది. – టీపీ కృష్ణయ్య, విద్యావేత్త, వనపర్తి ఉన్నత స్థాయికి చేర్చింది.. వనపర్తిలో విద్యనభ్యసించిన ఎంతోమంది అత్యున్నత స్థాయికి చేరారు. నిజాం కాలం నుంచి వచ్చిన ప్రతి విద్యాసంస్థ ప్రారంభం వెనుక ప్రజా పోరాటాలు, ప్రజల ఆకాంక్షలు ఇమిడి ఉన్నాయి. రాజరికం నుంచి ప్రస్తుత రాజకీయ పార్టీలకు అతీతంగా విద్యావికాసంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే వనపర్తి అగ్రగామిగా నిలుస్తుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సైంటిస్టులు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి వంటి వారితో పాటు ప్రతి రంగంలో వనపర్తి అక్షర జ్ఞానం కనిపిస్తుంది. – గణేశ్కుమార్, ఉపాధ్యాయుడు, వనపర్తి విద్యకు పెద్దపీట.. నిజాం కాలంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహించిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అంతే కాకుండా కులమతాలకు అతీతంగా అందరికీ విద్య అందించడంలో వనపర్తి ఆది నుంచీ అడుగులు వేస్తోంది. సాంకేతిక విద్య అభ్యసించేందుకు నేపాల్, జర్మనీ, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే వారు. సాంకేతిక విద్యను చేరువ చేసేందుకు రాజా రామేశ్వర్రావు తన రాజప్రాసాదాన్ని ప్రభుత్వానికి ఉదారంగా ఇవ్వడం విద్యా విస్తరణపై వనపర్తి సంస్థానాధీశులకు ఉన్న దూరదృష్టిని తెలియజేస్తుంది. – భైరోజు చంద్రశేఖర్, వనపర్తి -
‘సంక్షేమం’ పెంచేందుకే సర్వే
సాక్షి, హైదరాబాద్: అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత పెంచడానికే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చె ప్పారు. రాష్ట్రంలో బీసీ కులగణన నిర్వహిస్తామని ఇ చ్చిన మాటకు కట్టుబడి సర్వే నిర్వహిస్తున్నామని పే ర్కొన్నారు. గురువారం ఆయన గాం«దీభవన్లో భా రత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియా తో మాట్లాడుతూ కులగణన ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతోందని అన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే కుటుంబ సర్వే కు సంబంధించి ప్రశ్నలు తయారు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చటమే బీఆర్ఎస్ లక్ష్యం తమ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పాలని భట్టి విక్రమార్క సవాల్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుచేయటం, రైతు రుణమాఫీ, ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యాలా? అని ప్రశ్నించారు.అధికారం పోయిందన్న అక్కసుతో అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని ఆరోపించారు. నెహ్రూ ఆశయాలు కొనసాగిస్తాం నెహ్రూ ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె మాట్లాడారు. -
పటేల్ చాటున పండిట్జీపై నింద
మోదీ తలపెట్టిన మరొక ప్రచారం– ‘పదిహేను కాంగ్రెస్ కమిటీలలో పన్నెండు ప్రధాని అభ్యర్థిత్వానికి పటేల్కు ఓటు వేయడం’. ఆధారాలేమిటో చెప్పకుండానే ఆయన ఈ వాదనను ముందుకు తెచ్చారు. అంటే పటేల్కు మెజారిటీ ఉన్నా, ఆయన్ను పక్కన పెట్టారన్నది మోదీ ఆరోపణ. కానీ గాంధీజీని గాడ్సే పొట్టన పెట్టుకున్న తరువాత కూడా నెహ్రూ, పటేల్ పొరపొచ్చాలు లేకుండానే సాగారు. 565 స్వదేశీ సంస్థానాలను ఇండియన్ యూనియన్లో అంతర్భాగం చేసేదాకా ఆ ఇరువురు కూడా సంయుక్తంగా శ్రమించినవారే! ‘స్వాతంత్య్రం వచ్చాక ఆనాటికి ఉన్న పదిహేను కాంగ్రెస్ కమిటీలలో పన్నెండు సర్దార్ వల్లభ్బాయ్ పటేల్ను ప్రధానిని చేయాలంటూ ఓటు వేశాయి. కానీ పటేల్ను పక్కన పెట్టి పండిట్ నెహ్రూకు పగ్గాలు కట్టబెట్టిన విషయాన్ని మరువరాదు. పటేల్ ప్రధాని అయి ఉంటే కశ్మీర్ సమస్య ఉండేది కాదు. రాజకీయ స్వలాభం కోసమే కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసింది.’ – ప్రధాని నరేంద్ర మోదీ (5–2–2018 నాటి పార్లమెంట్ ప్రసంగం నుంచి) ‘తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ రాటు తేలిన, అపార అనుభవం కలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు. దేశ మహా నాయకులలో ఒకరు. దేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్నీ, స్వతంత్ర న్యాయ వ్యవస్థనీ, సచేతనమైన పత్రికా వ్యవస్థనూ ప్రసాదించిన నేత నెహ్రూ.’ – మోదీ మంత్రిమండలిలో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ (2015 నవంబర్లో సింగ్ చేసిన ఈ ప్రసంగం వీడియోను 9–2–18న రాహుల్ విడుదల చేశారు) పార్లమెంట్ సహా, వివిధ వేదికల నుంచి నరేంద్ర మోదీ ఇటీవల పండిట్ నెహ్రూ మీద చేస్తున్న ఆరోపణలు, వ్యాఖ్యానాలు గుడ్డొచ్చి పిల్లను వెక్కిరిం చిన రీతిలోనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే గుడ్డెద్దు చేలో పడిన చందంగా ఉంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ‘దేశాభ్యుదయం’ కంటే; కాంగ్రెస్నూ, ఆ పార్టీ పూర్వ నాయకులనూ, వారితో పాటు కొందరు స్వాతంత్య్ర యోధులనూ ఆడిపోసుకోవడం బీజేపీ–పరివార్ ప్రధానికి పరిపాటైంది. అందరితో పాటు కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్లో ఎన్ని తప్పులు కనిపించినా, అది దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ నాయకత్వంలో పనిచేసిన అగ్రగామి దళం. గాంధీ నాయకత్వంలో ఒక్కతాటిపైకి వచ్చి కడదాకా పనిచేసిన వారు నెహ్రూ, పటేల్. ఉద్యమ నిర్వహణ, ఉధృతి సమయాలలో నాయకులలో అభిప్రాయభేదాలు సహజం. వీటిని మాత్రమే ఆసరా చేసుకుని, కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసిందనీ, అందుకే కాంగ్రెస్ నుంచి భారత్కు విముక్తి కల్పించాలనీ మోదీ అనడంలో ఔచిత్యం లేదు. పైగా గాంధీజీయే కోరుకున్నారనీ, ఆయన మాటనే తాను ఉటంకించాననీ, ఇది కొత్త మాటేమీ కాదనీ ఆయన సమర్థించుకోజూస్తున్నారు. జాతీయ కాంగ్రెస్ అగ్రదళంగా భారత్ స్వాతంత్య్రం సాధించింది. కానీ విభిన్న సిద్ధాంతాలకు, పాయలకు చెందిన పక్షాలు కూడా తమవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. అందుకే తొలినాటి స్వతంత్ర భారతదేశానికి ఆ శక్తులన్నింటితో కూడిన జాతీయ ప్రభుత్వం ఏర్పాటు కావాలని గాంధీజీ అభిలషించిన సంగతిని మోదీ విస్మరించడమూ సరికాదు. ఇలాంటి దృష్టితో పాటు, కాంగ్రెస్ నిర్వహించిన చరిత్రాత్మక పాత్రకు గుర్తింపుగా, ఆ సంస్థ నేతృత్వంలోనే ఒక ఉమ్మడి పాలనా వ్యవస్థ ఆవిర్భవించాలని గాంధీజీ ఆశించారు. అంతేగానీ, మోదీ వక్రీకరించినట్టు కాంగ్రెస్ నుంచి భారత్కు విముక్తి కలగాలన్న వ్యతిరేక భావన గాంధీ ఉద్దేశం కాదు. గాంధీజీయే కాదు, ఆనాటి నేతలు, మేధావులు ఊహించని మరొక పరి ణామం ఉంది. అలనాటి కాంగ్రెస్, కాంగ్రెస్–యూపీఏల హయాములలోనే గాంధీజీ ఆశయాలకు తూట్లు పడినాయి. గాంధీజీ హత్యానంతరం కొత్త వేషంతో, హిందూరాష్ట్ర బ్యానర్లతో దూసుకొచ్చి, కాలక్రమేణా ఢిల్లీ అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ–ఆరెస్సెస్–పరివార్ కూడా గాంధీ ఆశయాలకు భంగం వాటిల్ల చేసినదే. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తికి భిన్నంగా, తరువాత రాసుకున్న రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధంగా పాలనా వ్యవస్థను ఆ రెండు పార్టీలూ, వాటి కూటములూ కూడా మార్చేశాయి. ‘బహుజన హితాయ’ అన్న హితోక్తిని ‘బడావర్గాల హితాయ’గా వికృతం చేశాయి. మోదీ తలపెట్టిన మరొక ప్రచారం– ‘పదిహేను కాంగ్రెస్ కమిటీలలో పన్నెండు ప్రధాని అభ్యర్థిత్వానికి పటేల్కు ఓటు వేయడం’. ఆధారాలేమిటో చెప్పకుండానే ఆయన ఈ వాదనను ముందుకు తెచ్చారు. అంటే పటేల్కు మెజారిటీ ఉన్నా, ఆయన్ను పక్కన పెట్టారన్నది మోదీ ఆరోపణ. కానీ గాంధీజీని ఆరెస్సెస్–హిందూ మహాసభ కార్యకర్త గాడ్సే పొట్టన పెట్టుకున్న తరువాత కూడా నెహ్రూ, పటేల్ పొరపొచ్చాలు లేకుండానే సాగారు. 565 స్వదేశీ సంస్థానాలను రద్దు చేసి ఇండియన్ యూనియన్లో అంతర్భాగం చేసేదాకా ఆ ఇరువురు కూడా సంయుక్తంగా శ్రమించినవారే! మోదీ అర్ధంతరంగా వచ్చి ఈ చరిత్రను తుడిచివేద్దామనుకుంటే చెల్లదు. ‘నెహ్రూ కోసం పటేల్ను కాదని పక్కన పెట్టా ర’న్న మోదీ చెబుతున్న వ్యాఖ్య ఎవరో చేసింది కాదు. గాంధీ జయంతికి ఇండోర్లో జరిగిన బహిరంగ సభలో సర్దార్ పటేల్ స్వయంగా చెప్పిందే: ‘మాకు నాయకుడు పండిట్ నెహ్రూ. గాంధీజీ నెహ్రూను తన వారసుడిగా ప్రకటించారు. బాపు సైనికదళంగా ఆయన ఆదేశాన్ని పాటించడం మా ధర్మం. ఆ భావంతో గాంధీజీ ఆదేశాన్ని ఎవరు మనఃపూర్వకంగా పాటించరో వారంతా దేవుడి ముందు పాపం చేసిన వారవుతారు. నేను బాపూ సైనికుణ్ణి’ (ఇండోర్: 2.10.1950 : ప్యారెలాల్ ‘మహాత్మా: ది లాస్ట్ ఫేజ్’) అన్నారాయన. కశ్మీర్ విభజనానంతర సమస్య పటేల్నే ప్రధానమంత్రిగా ప్రకటించి ఉంటే కశ్మీర్ సమస్యే ఉత్పన్నమయ్యేది కాదని కూడా మోదీ భాష్యం చెప్పారు. తన విధానాలతో ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడల్లా మోదీ వారి దృష్టి నుంచి మళ్లించేందుకు ఇలాంటి ‘దారి మళ్లింపు’ ప్రకటనలు చేస్తూంటారు. కశ్మీర్ సమస్య విభజనానంతర భారతంలో సంస్థానాల విలీనీకరణతో ముడిపడిన సమస్య. హిందువులు మెజారిటీగా సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేస్తున్నప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న సంస్థానాలను పాకిస్తాన్లో కలపాలా, లేదా భారత యూనియన్లోనే ఉంచాలా అన్న సమస్య ఉత్పన్నమయింది. ఆ సమయంలో హిందువులు మెజారిటీగా ఉన్న జునాఘడ్, హైదరాబాద్లను భారత యూనియన్లో విలీనం కావడానికి పాకిస్తాన్ ఒప్పుకుంటే, కశ్మీర్ను పాకిస్తాన్కు ఇచ్చేయడానికి హోంమంత్రి పటేల్ ఒప్పుదలయ్యారు డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్: ఏజీ నూరాని పే: 160 (2013). జునాఘడ్, హైదరాబాద్లు భారత యూనియన్లో విలీనమైనా ముస్లిం మెజారిటీతో ఉన్న కశ్మీర్ ఎటూ కాకుండానే ఉండిపోయింది. 70 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య సమస్యగానే మిగిలి ఉంది. తన ఈ ప్రతిపాదనను పాకిస్తాన్ ‘దురదృష్టవశాత్తు’ ఆమోదించలేదనీ, ఫలితంగా జునాఘడ్, హైదరాబాద్, కశ్మీర్లనే గాక, తూర్పు పాకిస్తాన్ను కూడా కోల్పోయిందని పటేల్ అన్నారు. మోదీ భావిస్తున్నట్టు పటేల్ ప్రధాని అయినా, కశ్మీర్ కాష్టం తొలిగేది కాదు. కశ్మీర్ ప్రజల బాధలు అనంతం. బ్రిటిష్ అధికారులు రకరకాల సంధుల ద్వారా (లాహోర్–అమృత్సర్ సంధి 1846 మార్చి 9–11) బ్రిటిష్ సామంత ప్రాంతంగా ఏలుతూ ఉన్న గులాబ్సింగ్ను, సిక్కులను మోసగించి ఒకటిన్నర కోట్ల రూపాయలకు ఈస్టిండియా కంపెనీకి ధారాదత్తం చేశారు. అమృత్సర్ సంధి ద్వారానే బ్రిటిష్ వాళ్లు బియాస్, సింధు నదుల మధ్య కశ్మీర్, హజారా ప్రాంతాలనూ అమ్మేశారు. వారానికి రూ. 75 లక్షల పరి హారం చూపించి కులూ, మనాలీ ప్రాంతాలను కూడా కంపెనీ స్వాహా చేసింది. అలా బ్రిటిష్ కుట్రల ద్వారా ఏర్పడిందే జమ్మూ–కశ్మీర్. గాంధీజీ (1947 ఆగస్టు) శ్రీనగర్లో పర్యటించిన తర్వాత ఒక చారిత్రిక సత్యాన్ని ప్రకటించారు: ‘‘నా పర్యటనానుభవంలో తేలింది– కశ్మీర్–జమ్మూలలో కశ్మీరీల మనోవాంఛ మాత్రమే అంతిమ శాసనంగా ఉండాలని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. ఈ వాస్తవాన్ని ప్రస్తుత హిందూ మహారాజూ, మహారాణీ కూడా గుర్తించి, అంగీకరించారు. అమృత్సర్ సంధి అనేది కశ్మీర్ను అమ్మేసిన విక్రయ దస్తావేజు...’’. అలాగే, తాను హత్యకు గురి కావడానికి నెల ముందు ఢిల్లీలో ప్రార్థనా సమావేశంలో (1947 నవంబర్ 27న) గాంధీజీ మాట్లాడుతూ జమ్మూలోని హిందూ మైనారిటీ ప్రభుత్వ పాలనలో పెద్ద ఎత్తున అత్యాచారాలు జరగడానికి కారణం ఎవరో కాదు, మహారాజా హరిసింగ్ను బాధ్యుడిగా ప్రకటించారు (1947 డిసెంబర్ 25). అంతేగాదు, గాంధీజీ తన ఆరోపణను విశదీకరించే క్రమంలో ‘‘మహారాజా హరిసింగ్ తానిక ఎంత మాత్రమూ కశ్మీర్ పాలకుడ్ని కాననీ, కశ్మీర్ నిజమైన పాలకులు కశ్మీర్ ముస్లిం ప్రజలేనని వారికి నచ్చిన పద్ధతిలో కశ్మీర్ను పరిపాలించుకోవచ్చుననీ తనకు తానై హరిసింగ్ ప్రకటించాలని’’ 1947 డిసెంబర్ 25న గాంధీజీ అభిప్రాయపడ్డారని చరిత్రకారుడు, రాజ్యాంగ నిపుణుడు నూరానీ తన గ్రంథంలో నమోదు చేశారు. నిజాం సంస్థానం విలీనంలోనూ... హైదరాబాద్ సంస్థాన విమోచనకు పటేల్ ‘ఆపరేషన్ పోలో’ పేరిట ప్రారంభించిన సైనిక చర్య సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంధానకర్తగా పనిచేసిన కె. ఎం. మున్షీ పటేల్ కనుసన్నల్లో ఉన్నవారే. నాటి హైదరాబాద్ స్టేట్లో పటేల్ పంపిన యూనియన్ సైన్యం ప్రారంభించిన సైనిక చర్యల్లో ఘటిల్లిన పరిణామాల గురించి, ఆ గందరగోళాన్ని అవకాశంగా తీసుకుని మున్షీ హైదరాబాద్లోని బొల్లారం కేంద్రంగా ‘ఉండంతలు కొండంతలు’గా చిత్రించి నివేదికలు పంపడానికి కారణం, వాటిని పటేల్ నమ్మడానికి మూలం–మున్షీ, పటేల్ పూర్వరంగం ఆరెస్సెస్తో ఉన్న సంబంధాలేనని, పటేల్ మెతకతనానికి ఇదే కారణమని నూరానీ (అదే గ్రంథం: పే. 179) రాశాడు. గాంధీజీ హత్యకు ఆరెస్సెస్పైన నిషేధం విధించినా, క్రమంగా ఒత్తిళ్ల ఫలితంగా రద్దు చేసింది కూడా పటేల్ అని విస్మరించరాదు. పటేల్ను గాంధీ దేశ ప్రధానిని చేయకపోయినా, పటేల్ ఉప ప్రధానిగానే ఉన్నా హైదరాబాద్ విమోచన సందర్భంగా క్షేత్ర స్థాయిలో జరిగిన అనేక దుర్ఘనలపై విచారించిన కాంగ్రెస్ ప్రతినిధులు పద్మజానాయుడు (సరోజినీ నాయుడు కూతురు), ఖాజీ మహ్మద్ అబ్దుల్ గఫార్ఖాన్లు సమర్పించిన నివేదికలను పరిశీలించవలసిం దిగా ప్రధాని నెహ్రూ కోరినా, పటేల్ తోసి పుచ్చడమూ ఆనాడొక సంచలనంగా మారింది. ప్రధానమంత్రి కాకపోయినా నెహ్రూ క్యాబినెట్లో పటేల్ ‘ప్రధాని’గానే చెలామణి అవుతూ ప్రజల దృష్టికి రాని ‘బేఖాతరు’తనాన్ని చెలాయించుకుంటూనే వచ్చారని గమనించాలి. పైగా, గాంధీజీ హత్యానంతరం దేశ వ్యాప్తంగా ఆరెస్సెస్ వారు ఆనందంతో స్వీట్లు పంచడంతో ప్రతిపక్షాలు మరింత రెచ్చిపోయిన సందర్భంగా ఆరెస్సెస్పైన నిషేధం విధించక తప్పలేదని కూడా ఆరెస్సెస్ నేత గోల్వాల్కర్కు రాసిన లేఖలో పటేల్ (11.9.1948) హెచ్చరించవలసి వచ్చింది. ఈ లేఖ ఉద్దేశం ఆరెస్సెస్లో పునరాలోచన కోసం, హృదయ పరివర్తన కోసమేనని పటేల్ రాయడం గమనార్హం. మోదీ ఎంత ప్రయత్నించినా చారిత్రక ఆధారాలను మూసివేయలేరు, నిజాల్ని దాచలేరు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
చాచా చారిత్రక తప్పిదం
రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2011 సంవత్సరంలో ఒక సర్వే నిర్వహించింది. డ్యామ్లు, గనుల తవ్వకాలు, పరిశ్రమల ఏర్పాటు, వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల నిర్మాణం, జాతీయ పార్కుల ఏర్పాటు వంటి పథకాల కారణంగా గడచిన యాభై సంవత్సరాలలో నిర్వాసితులైన వారి సంఖ్య ఐదు కోట్లని ఆ సర్వే లెక్కకట్టింది. ఈ నిర్వాసితులలో మూడో వంతు మందికి మాత్రమే సక్రమంగా పునరావాసం కల్పించినట్టు ఇంకొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రథమ ప్రధాని పండిట్ నెహ్రూ చేసినది తప్పిదమే. దేశాభివృద్ధి కోసం త్యాగాలు చేయమని పేదలకే ఎం దుకు ఉద్బోధించాలి? అలాంటి త్యాగాలు చేయవలసిం దని ధనికులను ఎందుకు అడగకూడదు? అభివృద్ధి కోసం రైతులనూ, గిరిజనులనూ, పేదల నూ వారు నివశించే ప్రదేశం నుంచి వేరే చోటుకి తరలిం చే ప్రక్రియ సమర్థనీయమేనని చెప్పుకోవడానికి జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలు చేసిన కొన్ని ఉపన్యాసా లను ఉపయోగించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం యోచి స్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. భూసేకరణ బిల్లు వివా దాస్పదమై, తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్రం ఇలాంటి ఆలోచనకు వచ్చిందన్నదే ఆ వార్తల సారాంశం. త్యాగం బాధ్యత పేదలదేనా? దేశం స్వాతంత్య్రం సాధించుకున్న కొత్తలో, అంటే 1948 లో, మహానది మీద నిర్మించ తలపెట్టిన హిరాకుడ్ ప్రాజె క్టుకు ప్రథమ ప్రధాని శంకుస్థాపన చేశారు. ఆ సంద ర్భంగా ప్రసంగిస్తూనే జవహర్లాల్, ‘మీరు బాధపడ వలసి వస్తే కనుక, దేశ ప్రయోజనం కోసమే ఆ పని చేయండి!’ అన్నారు. దీనికి నేను అంగీకరించను. దేశాభివృద్ధి కోసం త్యాగం చేసే బాధ్యత ఎప్పుడూ పేదవర్గాల మీదే ఎందుకు ఉండాలి? దేశాభివృద్ధిలో మధ్య తరగతి చేసిన త్యాగం గురించిన మాటను ఆఖరిసారిగా మనం ఎప్పు డు విన్నాం? అలాగే దేశ ఆర్ధికాభివృద్ధికి ధనికవర్గం త్యాగం చేసిందన్న మాటను ఎప్పుడు విన్నాం? అంటే, పేద ప్రజలు నిరంతరం త్యాగాలు చేస్తూ ఉంటే, ఎలాం టి సంకోచాలు పెట్టుకోకుండా, ఆ లక్షలాది పేదల ఉపా ధికి ఉన్న భద్రతను భగ్నం చేస్తూ ధనికవర్గం దాని ఫలా లను అనుభవించాలని దాని అర్థం కాదా? తమకు న్యాయంగా రావలసిన ప్రయోజనాలు సిద్ధించకుండానే, వాటి కోసం పోరాడే క్రమంలోనే నిర్వాసితులలో కొన్ని తరాలు అంతరించిపోయాయి. 1948లో హిరాకుడ్ డ్యామ్ కోసం నిర్వాసితులైన వాళ్లు స్వతంత్ర భారతంలో 68 ఏళ్ల తరువాత కూడా పునరావాసం పొందలేక, నిరాశోపహతులై మిగిలిన దృశ్యాన్ని బహుశా నెహ్రూ ఊహించి ఉండరు. కొన్ని సర్వేల ప్రకారం ఏవేవో ప్రాజెక్టుల కోసం నిర్వాసితులై, వేరేచోట ఉంటున్నవారు, మరో పురోభివృద్ధి పథకం కోసం రెండోసారి కూడా నిర్వాసితులయ్యారు. ఆధునిక జలవనరుల మహా పథకాలను నెహ్రూ ‘ఆధునిక దేవా లయాలు’ అని పేర్కొనేవారు. కానీ భాక్రా డ్యామ్, తెహ్రీ డ్యామ్, పాంగ్ డ్యామ్ కోసం నిర్వాసితులైన వారిలో చాలా మంది ఇప్పటికీ పునరావాసానికి నోచుకోలేకపో యారు. పెద్ద పెద్ద నీటి ప్రాజెక్టులకీ, భారీ పరిశ్రమల నిర్మాణానికీ నేను వ్యతిరేకం కాదు. కానీ తమ తమ నెల వుల నుంచి బలవంతంగా నెట్టివేసిన వారి దుస్థితి పట్ల, వారు పడుతున్న కడగండ్ల పట్ల రాజ్యం, సమాజం మౌన ప్రేక్షకపాత్రకు ఎలా పరిమితం కాగలుగుతున్నాయి? ప్రాధాన్యం మేరకు వారికి పరిహారం, పునరావాస సౌక ర్యం ఎందుకు కల్పించరు? దేశంలో ఐదుకోట్ల నిర్వాసితులు రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) 2011 సంవత్సరంలో ఒక సర్వే నిర్వహించింది. డ్యామ్లు, గనుల తవ్వకాలు, పరిశ్రమల ఏర్పాటు, వన్య ప్రాణి సంరక్షణా కేంద్రాల నిర్మాణం, జాతీయ పార్కుల ఏర్పాటు వంటి పథకాల కారణంగా గడచిన యాభై ఏళ్లలో నిర్వాసితులైన వారి సంఖ్య ఐదు కోట్లని ఆ సర్వే లెక్కకట్టింది. ఈ నిర్వాసితులలో మూడో వంతు మందికి మాత్రమే సక్రమంగా పునరావాసం కల్పించినట్టు ఇం కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. డ్యామ్లూ, పారిశ్రామిక ప్రాంగణాలతోనే కాదు; రైల్వే మార్గాలు, రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం, విద్యుదీకరణ వంటి పనుల వల్ల కూడా రైతులు తమ భూముల నుంచి వేరు పడవలసివస్తున్నది. నిర్వాసితుల పట్ల ఎంత నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందంటే, హిమాచల్ ప్రదేశ్లోని యూనా జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి భారతీయ రైల్వేలు రైతులకు ఇవ్వవలసిన బకాయిలను కక్కించడానికి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ రైలును అటాచ్ మెంట్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. ఎప్పుడో 1998లో సేకరించిన భూములకు సంబంధించిన నష్టపరిహారం కేసులో ఆ న్యాయమూర్తి ఇటీవలనే అలాంటి ఆదేశాలు ఇవ్వవలసివచ్చింది. ఇలాంటి ఉదాహరణలు దేశం నలు మూలలా ఎన్నో కనిపిస్తాయి. అవన్నీ పేదప్రజలకు చట్ట బద్ధంగా అందవలసిన పరిహారం చెల్లింపులో, నష్టాలను భర్తీచేయడంలో కనిపించే అలసత్వానికి నిదర్శనాలే. దేశ ఆర్థికవృద్ధి ప్రస్థానంలో రైతులే పెద్ద ఆటం కంగా మారిపోయారంటూ మీడియాలలో కథనాలు వెలువడుతుంటాయి. కానీ విశాలంగా విస్తరించి ఉండే పెద్ద పెద్ద గోల్ఫ్ క్రీడామైదానాల నుంచి సెంటు భూమిని స్వాధీనం చేసుకోవడానికి కూడా ప్రభుత్వానికి ధైర్యం లేదు. ఒకవేళ స్వాధీనం చేసుకోవడానికి సర్కారు తెగించి ముందుకు వెళితే, వెనక్కి తగ్గేదాకా ధనికులు ఎలాంటి ఒత్తిడి తీసుకువస్తారో చూడొచ్చు. ఆర్థిక కార్యకలాపా లలో ప్రభుత్వం సమతుల్యత సాధించడానికి దోహదం చేసే విధంగా, సంవత్సరంలో పొందే కరువు భత్యంలో ఒక కిస్తీని వదులుకోమని ఉద్యోగులను అడగండి! వాళ్లు వెంటనే మూకుమ్మడి నిరసనకు దిగడం చూస్తాం. దేశా నికి పెట్టుబడులు అవసరమైన ఈ సందర్భంలో, విదేశీ పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఏడో వేతన సంఘం నివేదిక సిఫారసును వదులుకోమని ఉద్యోగులను కోరడం సాధ్యమవుతుందా? అలా కోర డం ఎందుకు సాధ్యం కాదు?! రాయితీలు అడగొద్దని చెప్పలేమా? దేశంలో కార్పొరేట్ రంగానికి పన్ను మినహాయింపుల పేరుతో కొండంత రాయితీ కల్పిస్తున్నాం. ఇలా 2004- 2005లో ధారపోసిన రాయితీ రూ. 42 లక్షల కోట్లు. గ్రామీణాభివృద్ధి పనులకూ, రైతులకు చేయూతనివ్వడా నికీ పన్నులు చెల్లించమని(మినహాయింపులు కోరవద్దని కూడా) భారతదేశం కార్పొరేట్ రంగాన్ని ఎందుకు అడగ లేకపోతోందోనని అప్పుడప్పుడూ నాకు ఆశ్చర్యం కలు గుతూ ఉంటుంది. దేశాభివృద్ధి కోసం త్యాగం చేయడం ధనికుల, బాగా స్థిరపడిన వారి బాధ్యత కాదా? ఆఖరికి ఈ ఆర్థిక సంవత్సరంలో మినహాయించిన రూ. 5.9 లక్షల కోట్లను చెల్లించమనైనా కార్పొరేట్ రంగాన్ని అడగ వచ్చు. దీనితో మనను కలతకు గురి చేస్తున్న రూ. 5.25 లక్షల కోట్ల ఆర్థిక లోటునైనా భర్తీ చేసుకోవచ్చు. ఈ మొత్తాన్నే తరువాత దేశాభివృద్ధికి ఉపయోగించవచ్చు. (దేవీందర్శర్మ, వ్యాసకర్త వ్యవసాయరంగ నిపుణులు ఈమెయిల్: hunger55@gmail.com) -
వెంకటగిరితో నెహ్రూ అనుబంధం
నేడు చాచా నెహ్రూ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం వెంకటగిరిటౌన్ దేశ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూకు వెంకటగిరితో అనుబంధం ఉంది. చాచా నెహ్రూ జయంతిని శుక్రవారం జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం. స్వాతంత్య్ర కోసం ముమ్మరంగా ఉద్యమం సాగుతున్న తరుణమది. 1936, అక్టోబర్ 18న జవహర్లాల్ నెహ్రూ వెంకటగిరిలో కాంగ్రెస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభకు హాజరయ్యారు. నెహ్రూ సభ కోసం స్థానిక రాజా నివాస్ భాగ్ ప్రాంతంలో వేదిక ఏర్పాటు చేశారు. నెహ్రూ సభావిశేషాలు వెంకటగిరిలో 1936లో నెహ్రూ పాల్గొన్న సభ జోరువానలో సాగింది. ఆ రోజుల్లో సుమారు 10 వేల మంది హాజరయ్యారు. సభాస్థలానికి నెహ్రూ కారులో వచ్చారు. అప్పటి వరకూ మబ్బులు కమ్ముకున్న వాతావరణం ఒక్కసారిగా జోరువాన కురిసింది. దీంతో సభావేదిక మీద ఉన్న పెద్దలు నెహ్రూ వస్తూ కారులో వర్షాన్ని తీసుకొచ్చారని చమత్కరించారు.