breaking news
one teacher schools
-
మూత‘బడి’..
డేరు మండలంలోని పనసపల్లి గ్రామంలోని జీపీఎస్ (టీడబ్ల్యూ) ఏకోపాధ్యాయ పాఠశాల ఇది. ఈ పాఠశాలలో 1 నుంచి 5 తరగతులున్నాయి. గతేడాది ఈ పాఠశాలలో పని చేసిన ఉపాధ్యాయిని పదవీ విరమణ చేశారు. దీంతో ఈ పాఠశాలకు టీచర్ కొర త ఏర్పడింది. వేసవి సెలవుల అనంతరం మంగళవారం పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాల కావడంతో ఉపాధ్యాయుడు లేక మంగళవారం ఈ పాఠశాల తెరుచుకోలేదు. ఈ పాఠశాలలో గతేడాది 16 మంది విద్యార్థులున్నారు. ఈ ఏడాది మరో ఆరుగురు బాలలు చేరవలసి ఉంది. పాఠశాల తెరుచుకోకపోవడంతో విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. సాక్షి, పాడేరు : గిరిజన ప్రాథమిక విద్యాభివృద్ధి కోసం ఏజెన్సీ 11 మండలాల్లో గిరిజన సంక్షేమశాఖ ద్వారా 670 (జీపీఎస్) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే మారుమూల గిరిజన గ్రామాల్లో బాలలకు ప్రాథమిక విద్యను అందించేందుకు 30 ఏళ్ల క్రితం గిరిజన సంక్షేమశాఖ ఏజెన్సీ 11 మండలాల్లో గిరిజన విద్యా వికాస కేంద్రాలు (జీవీవీకే) పేరుతో ఏకోపాధ్యాయ పాఠశాలలను ప్రారంభించింది. జీపీఎస్ పాఠశాలలుగా పేరుమార్చి నేటికీ ఏకోపాధ్యాయులతోనే ఈ పాఠశాలలను నిర్వహిస్తోంది. 1 నుంచి 5 తరగతులుంటున్న ఈ పాఠశాలల్లో 30 నుంచి 50 వరకూ విద్యార్థులుంటున్నారు. విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నా ఒక్క ఉపాధ్యాయుడే తరగతులలో బోధనతో నెట్టుకొస్తున్నారు. ఇదే మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో అయితే అదనంగా టీచర్లను నియమిస్తున్నారు. కానీ జీపీఎస్ పాఠశాలల్లో మా త్రం 2వ ఉపాధ్యాయుడు నియామకమన్న ప్రశ్నే లేకుండా పోయింది. ఈ జీపీఎస్ పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడి వల్ల విద్యాబోధన కుంటుపడుతోంది. ప్రస్తుతం ఏజెన్సీలో 77 జీపీఎస్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏటా ఈ పాఠశాలల్లో వలంటీర్లుగానీ, సీఆర్టీలను గాని నియమించే వరకూ ఈ పాఠశాలలు తెరుచుకోవడం లేదు. ప్రతి ఉపాధ్యాయుడికి ఏటా 22 వ్యక్తిగత సెలవులు ఉంటాయి. అదీగాక ప్రతీ నెల 2 రోజులు హెచ్ఎంల మీటింగ్, కాంప్లెక్స్ మీటింగ్లతోపాటు విద్యా ప్రణాళికలకు సం బంధించి అత్యవసర సమావేశాలు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సెలవులు అన్నీ కలిపి ఏడాదికి కనీసం 40 రోజులు పాఠశాల మూతపడుతున్నా యి. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతీ పాఠశాలకు ఇద్దరు టీచర్లు ఉండాలనే నిబంధన ఈ జీపీఎస్ పాఠశాలలకు వర్తిం చడం లేదు. తరచూ పాఠశాలలు మూతపడుతుం డటం వల్ల గిరిజన ప్రాథమిక విద్య గాలివాటంగా మారింది. నేడు పాఠశాలలు పునః ప్రారంభమైనా ఉపాధ్యాయుల కొరత ఉన్నచోట ప్రాథమిక పాఠశాలలు మూతపడివున్న పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏజెన్సీలోని 955 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 61 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు 175 ఉన్నాయి. ఏజెన్సీలో ఉపాధ్యాయుల కొరత వల్ల గిరిజన ప్రాథమిక విద్యాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. -
ఇంకానా.... ఏకోపా‘ధ్యాయం’
* జిల్లాలో 407 ఏకోపాధ్యాయ పాఠశాలలు * ఉపాధ్యాయులే లేని బడులు 31 * విలీనం చేసినా... పెరగని విద్యార్థుల సంఖ్య విజయనగరం అర్బన్:ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు, బోధన సిబ్బంది ఉండరనేది జగమెరిగిన సత్యం. అందుకే అందరూ తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారన్న దిఅందరికీ తెలిసిందే. ప్రధానంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సమస్యలను పట్టించుకోకుండా మోడల్ ప్రాధమిక పాఠశాలల పేరుతో విలీన చర్యలు చేపడుతోంది. జిల్లాలో గత ఏడాది 232 మోడల్ పాఠశాలల కోసం 117 ప్రాధమిక పాఠశాలలను విద్యాశాఖ విలీనం చేసింది. ఇంకా జిల్లాలో 407 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది యూ-డైస్ నివేదిక ఆధారంగా చూస్తే ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఈ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. అత్యధికంగా మెరకముడిదాం మండలంలో 35 టీచర్ పోస్టులతో కళకళలాడే 20 పాఠశాలలు ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. అదే విధంగా జీఎల్పురం మండలంలో 33 పోస్టులతో ఉన్న 29 పాఠశాలలు, పాచిపెంట మండలంలో 32 పోస్టులతో ఉన్న 22 స్కూళ్లు, మక్కువ మండలంలో 30 పోస్టులతో ఉన్న 22 స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా గత ఏడాది మారాయి. గత ఏడాది 117 పాఠశాలలు (వీటిలో 80 శాతం ఏకోపాధ్యాయపాఠశాలున్నాయి) విలీనం చేసప్పటికీ ఈ సంఖ్య తగ్గలేదు. ఏడాదికేడాది వీటి సంఖ్య పెరుగుతున్నా విద్యార్థులతో బలోపేతం చేయడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు విద్యావేత్తల నుంచి వస్తున్నాయి. జిల్లాలో అసలు ఉపాధ్యాయుడు లేనిపాఠశాలలు 31 ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇలాంటివి అత్యధికంగా 14 స్కూళ్లు సాలూరు మండలంలో ఉన్నాయి. అత్యల్పంగా దత్తిరాజేరు, గరుగుబిల్లి, వేపాడ మండలాల్లో ఒక్కొక్కటి ఉన్నాయి. ఆంగ్లమాధ్యమమే పరిష్కారం ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలి. పిల్లల తల్లిదండ్రుల ధోరణికి అనుగుణంగా మార్పు తీసుకురావాలి. విద్యార్థి చదువుకు అవసరమైన సౌకర్యాలను, బోధనా సిబ్బందిని కల్పించాలి. ప్రభుత్వ బడులపై ఉన్న అపోహలను పోగొట్టి నమ్మకాన్ని కలిగేలా చేయాలి. తక్కువ విద్యార్థులున్న బడులను సమీపపాఠశాలల్లో విలీనం చేయడం వల్ల సర్కారు బడులకు మరింత దూరమయ్యే అవకాశం ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోపు చర్యలు పూర్తి చేయాలి. -అడ్డూరి పైడితల్లి, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎస్టీయూఏ. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సమస్యలివే..? * ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులు బోధించడం కష్టంగా మారింది. * ఒక తరగతికి పాఠశాలు చెబుతున్న సమయంలో మిగిలిన విద్యార్థులు నరీక్షించాల్సి ఉంటుంది. వారి చదువుకు కూడా ఇది ప్రతిబంధకం అవుతోంది. * ఒకే ఉపాధ్యాయుడు అవడంతో మిగిలిన తరగతుల్లో విద్యార్థులే ఉపాధ్యాయ అవతారం ఎత్తాల్సి వస్తోంది. * సమావేశాలు, వ్యక్తిగత సెలవు పెడితే ఆ రోజు పాఠశాల మూతపడాల్సిందే. * ఒక్క ఉపాధ్యాయుడు అవడంతో ఎక్కువ మంది విద్యార్థులకు సరిగా బోధించలేకపోతున్నారు. ఫలితంగా ఆ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. * ఉన్న ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం పర్యవేక్షణ, నివే దికలు సిద్ధం చేసుకోవడం, అధికారులు అడిగిన సమాచారం ఇవ్వడం తదితర పనులకే సమయం సరిపోతోంది.