breaking news
one day cricket good bye
-
వన్డేలకు గుడ్బై చెప్పనున్న ఆస్ట్రేలియా కెప్టెన్!
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ సంచలన నిర్ణయం తీసుకుబోతున్నట్లు తెలుస్తోంది. వన్డే క్రికెట్కు వీడ్కోలు పలకాలని ఫించ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కెయిర్న్స్ వేదికగా ఆదివారం (సెప్టెంబర్ 11) న్యూజిలాండ్తో జరగనున్న మూడో వన్డే ఫించ్కు అఖరి వన్డే కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ఒక్క రోజు ముందు (శనివారం) ఫించ్విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు. ఈ సమావేశంలో ఫించ్ తన తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. కాగా కెప్టెన్గా జట్టును విజయాల బాటలో నడిపిస్తున్న ఫించ్.. వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం దారుణంగా విఫలమవతున్నాడు. ఫించ్ గత తన ఏడు వన్డే ఇన్నింగ్స్లలో 26 పరుగులు మాత్రమే చేశాడు. వాటిలో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి. ఇక ఫించ్ సారథ్యంలోనే ఆస్ట్రేలియా జట్టు తమ తొలి టీ20 ప్రపంచకప్ టైటిల్ను కూడా కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్-2021ను ఆసీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Asia Cup 2022: కింగ్ కోహ్లి అద్భుతమైన సెంచరీ.. పాక్ ఆటగాళ్ల ప్రశంసల జల్లు! -
సింగమలింగై
ఇటీవలి వన్డే ప్రపంచ కప్లో స్టార్క్, బుమ్రా, బౌల్ట్లు యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్పై విరుచుకుపడ్డారు. కానీ ఫలితం వద్దకు వచ్చేసరికి మాత్రం యార్కర్లకు ‘తాత’లాంటివాడే అగ్రస్థానంలో నిలిచాడు. అవును, ఈ మెగా టోర్నీలో యార్కర్ల ద్వారా ఎక్కువ (ఐదు) వికెట్లు తీసిన బౌలర్ 38 ఏళ్ల లసిత్ మలింగ. ఎక్కడా తగ్గని వేగం, కొంచెం కూడా అటూ ఇటూ కాకుండా ‘బ్లాక్హోల్’లో బంతిని విసరగల కచ్చితత్వం, తనకే సాధ్యమైన ప్రత్యేక యాక్షన్తో కలిసొచ్చే అదనపు ప్రయోజనంతో మలింగ యార్కర్లు బ్యాట్స్మెన్ను ప్రమాద స్థితిలోకి పడేశాయి. ఇప్పుడు ఈ యార్కర్లకు వన్డే వేదికపై విశ్రాంతినిచ్చే సమయం వచ్చింది. బంగ్లాదేశ్తో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్ తర్వాత వన్డే క్రికెట్కు గుడ్బై చెబుతున్నట్లు మలింగ ప్రకటించడంతో ఒక అధ్యాయం ముగుస్తున్నట్లయింది. సాక్షి క్రీడా విభాగం ‘శుక్రవారం నేను ఆఖరి వన్డే ఆడబోతున్నాను. మీకు వీలైతే వచ్చి మ్యాచ్ చూడండి’... అంటూ లసిత్ మలింగ తన అభిమానులను ప్రేమదాస స్టేడియానికి ఆహ్వానించాడు. వన్డేల్లో శ్రీలంక తరఫున మురళీధరన్ (523 వికెట్లు), చమిందా వాస్ (399 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మలింగ తన కెరీర్ను ముగించబోతున్నాడు. బంగ్లాదేశ్తో సిరీస్ మొత్తానికి అతడిని ఎంపిక చేసినా ఒక్క వన్డేకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి వరల్డ్కప్తోనే రిటైర్ అవుతాడని అంతా భావించినా... 13 వికెట్లతో అతను లంక జట్టు టాపర్గా నిలవడంతో సెలక్టర్లు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. టి20 క్రికెట్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు మలింగ చెప్పాడు. టెస్టులతో మొదలు... బౌలర్ వేస్తున్న బంతి అర్థం కాక అంపైర్ల టై, ప్యాంట్లు మార్చమని ఆటగాళ్లు అడిగే పరిస్థితి మైదానంలో తలెత్తిందంటే అందుకు మలింగనే కారణం! 2005లో స్వదేశంలో లంకతో జరిగిన టెస్టులో న్యూజిలాండ్కు ఈ సమస్య ఎదురైంది. మలింగకే సొంతమైన ‘రౌండ్ ఆర్మ్ యాక్షన్’లో బంతి మరీ కిందనుంచి వస్తుంది. అది అంపైర్ల దుస్తుల్లో కలిసిపోయి బ్యాట్స్మెన్కు కనిపించకపోయేది. దాంతో వారు ఒకసారి టై రంగు మార్చమని, రెండోసారి ప్యాంట్లనే మార్చమని కూడా కోరారు. ఈ టెస్టులో మలింగ తీసిన 9 వికెట్లలో 7 బౌల్డ్ లేదా ఎల్బీ కావడం విశేషం. అప్పుడే తొలిసారిగా ప్రపంచ క్రికెట్ దృష్టి మలింగపై పడింది. అతని ఇన్స్వింగింగ్ యార్కర్లు, స్లో బాల్, బౌన్సర్లు ప్రమాదకరంగా మారి బ్యాట్స్మెన్ను వణికించాయి. గాయాలతో టెస్టు కెరీర్ 30 మ్యాచ్లకే పరిమితం కాగా, అతనిలోని అసలు ప్రతిభ వన్డే క్రికెట్లో పదునెక్కింది. ఒంటి చేత్తో... సరిగ్గా 15 ఏళ్ల క్రితం తొలి వన్డే ఆడిన మలింగ వచ్చీ రాగానే అద్భుతాలేమీ చేయలేదు. అయితే 2006లో లీడ్స్లో ఇంగ్లండ్పై అద్భుత బౌలింగ్తో జట్టును గెలిపించడంతో అతని సత్తా అందరికీ తెలిసింది. 2007 ప్రపంచ కప్ నుంచి 2015 ప్రపంచ కప్ వరకు శ్రీలంక జట్టు నిలకడగా సాధించిన విజయాల్లో బౌలర్గా మలింగదే కీలక పాత్ర. సంగక్కర, జయవర్ధనేవంటి దిగ్గజాలతో పాటు దిల్షాన్ ఎక్కువ భాగం బ్యాటింగ్ భారం మోయగా... మ్యాచ్ ఆరంభంలోనే మలింగ అందించిన వికెట్లు లంక విజయానికి బాటలు వేసేవి. మలింగ వన్డే ప్రదర్శన అనగానే అందరికీ గుర్తొచ్చేది 2007 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్. ఇందులో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి ‘హ్యాట్రిక్ ప్లస్’ నమోదు చేసిన అతను క్రికెట్ ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు. 2007, 2011 రెండు ప్రపంచ కప్ ఫైనల్లు కూడా ఆడి ఓటమి పక్షానే నిలిచిన మలింగ 2015 వరల్డ్ కప్కు వచ్చేసరికి ఫిట్నెస్ కోల్పోయి రాణించలేకపోయాడు. ఆ తర్వాతా కొనసాగిన ఫిట్నెస్ సమస్యలు, బోర్డుతో వివాదం నేపథ్యంలో చాలా రోజుల క్రితమే మలింగ కెరీర్ ముగిసినట్లే అనిపిం చింది. అయితే లంక జట్టులో అనుభవలేమి, వరుస వైఫల్యాల తర్వాత సీనియర్ మార్గనిర్దేశనం అవసరమై అతను మరో ప్రపంచ కప్ వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించగలిగాడు. కెప్టెన్గా శ్రీలంకకు 2014 టి20 ప్రపంచ కప్ను అందించిన ‘స్లింగ’పొట్టి ఫార్మాట్లో కూడా ఎంత కాలం ఆడగలడో చూడాలి. ‘రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం. చాలా సంతోషంగా నిష్క్రమిస్తున్నా. కుర్రాళ్లకు ఇది చక్కని అవకాశంగా భావిస్తున్నా. నా వీడ్కోలుపై రెండేళ్లక్రితం సెలక్టర్లకు సమాచారమిచ్చాను. ఈ ప్రపంచకప్ కోసమే కష్టపడ్డాను. వన్డేలకు గుడ్బై చెబుతున్నప్పటికీ పొట్టి ఫార్మాట్లో కొనసాగుతాను. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్ దాకా క్రికెట్ ఆడతా’ – మలింగ -
సచిన్ను రిటైరయ్యేలా చేశా!
కరాచీ: వన్డే క్రికెట్కు గుడ్బై చెప్పిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... ఆ ఫార్మాట్లో చివరి బంతిని పాక్ బౌలర్ అజ్మల్ బౌలింగ్లో ఆడాడు. 2012 ఆసియాకప్లో పాకిస్థాన్తో లీగ్ మ్యాచ్లో సచిన్... అజ్మల్ దూస్రాకు అవుటయ్యాడు. ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్యూలో పాక్ స్పిన్నర్ దీని గురించి ప్రస్తావించాడు. ‘సచిన్ ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్. కాబట్టి తన వికెట్ సహజంగానే సంతోషం కలిగిస్తుంది. దూస్రా ఆడటంలో తను ఇబ్బందిపడతాడు. దీంతో ప్రణాళిక ప్రకారం స్లిప్లో ఫీల్డర్ను ఉంచి, దూస్రాతోనే మాస్టర్ను అవుట్ చేశాం. ఆ తర్వాత తాను మళ్లీ వన్డే ఆడలేదు. ఆ బంతితోనే సచిన్ రిటైరయ్యేలా చేశా (నవ్వుతూ సరదాగా)’ అని అజ్మల్ చెప్పాడు. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య రాజకీయ కారణాల వల్ల క్రికెట్ జరగకపోవడం దురదృష్టకరమని అన్నాడు. టెస్టుల్లో సంగక్కర మినహా... ప్రపంచంలో ఏ ఫార్మాట్లోనూ తనని ఏ బ్యాట్స్మన్ ఇబ్బందిపెట్టలేదని అన్నాడు.