breaking news
OALP
-
40వేల కోట్ల పెట్టుబడులు!!
న్యూఢిల్లీ: ఓపెన్ ఏకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్పీ) కింద తలపెట్టిన రెండో విడత చమురు, గ్యాస్ బ్లాక్ల వేలం ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా వేస్తున్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. గతేడాది నిర్వహించిన తొలి విడతలో 55 బ్లాక్లు వేలం వేయగా రూ. 60,000 కోట్ల మేర పెట్టుబడులకు కమిట్మెంట్ లభించినట్లు ఆయన తెలియజేశారు. రెండో విడతలో 14 బ్లాక్లు ఉన్నట్లు సోమవారం వేలం ప్రక్రియ ప్రారంభించిన > మంత్రి చెప్పారు. మూడో విడత కింద 12 చమురు, గ్యాస్ బ్లాక్లు, అయిదు కోల్ బెడ్ మీథేన్ బ్లాక్ల వేలం వేయనున్నామని, ఈ ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభం కాగలదని ఆయన చెప్పారు. ఓఏఎల్పీ–2 కింద వేలం వేసే 14 బ్లాక్ల విస్తీర్ణం 29,333 చ.కి.మీ. ఉంటుందని, బిడ్ల దాఖలుకు మార్చి 12 తుది గడువుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. 12,600 మిలియన్ టన్నుల నిక్షేపాలు.. కేజీ బేసిన్లో ఒక డీప్ వాటర్ బ్లాక్తో పాటు అండమాన్, కచ్ బేసిన్లో చెరి రెండు, మహానది బేసిన్లో ఒక బ్లాక్ వేలం వేస్తున్న వాటిలో ఉన్నాయి. ఈ 14 బ్లాక్లలో దాదాపు 12,609 మిలియన్ టన్నుల చమురు, తత్సమాన గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా. ఓఏఎల్పీ –1 లో మొత్తం 55 బ్లాకులు వేలం వేయగా వేదాంత సంస్థ 41 బ్లాకులు దక్కించుకుంది. మిగతావాటిలో ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ ఇండియా తొమ్మిది, ఓఎన్జీసీ కేవలం రెండు మాత్రమే దక్కించుకున్నాయి. ఈ 55 బ్లాక్ల విస్తీర్ణం 59,282 చ.కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం ఉత్పత్తి, అన్వేషణ లైసెన్సు పరిధిలో లేని చిన్న స్థాయి చమురు, గ్యాస్ బ్లాక్లను తీసుకునేందుకు కంపెనీలు ఓఏఎల్పీ కింద తమ ఆసక్తిని (ఈవోఐ) వ్యక్తం చేయాల్సి ఉంటుంది. ఈ ఈవోఐల ఆధారంగా కేంద్రం ఏటా రెండు విడతలుగా వేలం నిర్వహిస్తుంది. ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్లో ప్రభుత్వానికి అత్యధిక వాటా ఇచ్చే సంస్థకు బ్లాక్లు దక్కుతాయి. విదేశీ భాగస్వాములకు ఓకే.. సంక్లిష్ట క్షేత్రాల్లో ఇంధన ఉత్పత్తి పెంపునకు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా సంస్థలు ప్రైవేట్, విదేశీ సంస్థలను భాగస్వాములుగా చేసుకునేందుకు అనుమతించనున్నట్లు ప్రధాన్ వివరించారు. -
చమురు ఉత్పత్తికి బూస్ట్
►హైడ్రోకార్బన్స్ అన్వేషణకు కొత్త లైసెన్సింగ్ విధానం ►ఏటా రెండుసార్లు గ్యాస్, చమురు బ్లాక్ల వేలం ►జూలైలో తొలి విడత నిర్వహణ హ్యూస్టన్: దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తికి ఊతమిచ్చే దిశగా కేంద్రం కొత్త లైసెన్సింగ్ విధానాన్ని ప్రకటించింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ విధానం (ఓఏఎల్పీ) కింద చమురు, గ్యాస్ బ్లాక్ల వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తొలి విడత వేలం ఈ ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంధన పరిశ్రమ దిగ్గజాల సదస్సు సీఈఆర్ఏవీక్లో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటిదాకా ఉన్న పాలసీ ప్రకారం లాభాల్లో వాటాల విధానం పాటిస్తుండగా.. ఓఏఎల్పీ కింద ఆదాయాల్లో వాటాల విధానం అమల్లోకి వస్తుంది. అలాగే, ఆపరేటర్లకు ధర, మార్కెటింగ్ పరమైన స్వేచ్ఛ లభిస్తుంది. హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ విధానం (హెల్ప్) కింద ఇటీవలే 31 చిన్న క్షేత్రాలను కేటాయించినప్పటికీ.. జులైలో పెద్ద క్షేత్రాలను వేలం వేయనుండటం 2010 తర్వాత తొలిసారి కానుంది. వ్యాపారాలకు, ఇన్వెస్టర్లకు అనువైన కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని 2020 నాటికి పది శాతం మేర తగ్గించుకునేందుకు తలపెట్టిన వ్యూహంలో భాగంగా కొత్త విధానాన్ని రూపొందించినట్లు ప్రధాన్ చెప్పారు. ‘కొత్త విధానంలో ఉత్పత్తిదారులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం పర్యవేక్షించబోదు. కేవలం ఆదాయాల్లో వాటాలు మాత్రమే పంచుకుంటుంది‘ అని ఆయన వివరించారు.