breaking news
NIT Engineering College
-
నేటి నుంచి నిట్ వజ్రోత్సవాలు
కాజీపేటలోని వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) వజ్రోత్సవాలకు సిద్ధమైంది. ఈ వేడుకలను సోమవారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను యాజమాన్యం పూర్తి చేసింది. పోలీసు విభాగం ఆధ్వర్యంలో 600 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ రవీందర్ తెలిపారు. కాజీపేట అర్బన్ (వరంగల్): కాజీపేటలోని వరంగల్ నిట్లో ఏడాది పొడవునా వజ్రోత్సవాలు నిర్వహించడానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు 1959 అక్టోబర్ 10న నాటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నేహ్రు శకుస్థాపన చేశారు. ఈ నెల 10వ తేదీ నాటికి 60వ వసంతంలోకి అడుగిడుతున్న నేపథ్యంలో వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలను ప్రారంభించేందుకు సోమవారం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచ్చేస్తున్నారు. ఇందుకు గాను ఇటీవల నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు ఉపరాష్ట్రపతికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఏడాది పొడవునా వజ్రోత్సవాలు ఏడాది పొడవున వజ్రోత్సవ వేడుకలు నిర్వహించేందుకు నిట్ యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 8 నుంచి 13వ తేదీ వరకు స్పిక్మేకే బృందంచేత విరాసత్ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు, నవంబర్ 10 నుంచి 12 వరకు ఎవెల్యూషన్ ఆఫ్ వరల్డ్ క్లాస్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్షన్స్–ఇష్య్సూ–కన్సరŠన్స్ అనే అంశంపై జాతీయ సదస్సు, డిసెంబర్ 18 నుంచి 21 వరకు 6వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ బిగ్డాటా, డిసెం బర్ 15, 16 తేదీల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డైనమిక్స్ ఆఫ్ ఇంటర్ఫేసేస్ ఇన్ మల్టీఫేస్ సిస్టమ్స్, జనవరి 18 నుంచి 20 వరకు నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ కాంపిటేషనల్ మోడలింగ్ ఆఫ్ ప్లూయిడ్స్ డైనమిక్ ప్రాబ్లెమ్స్, ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్›డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ అండ్ డివైసెస్లను నిర్వహించనున్నారు. వీటితోపాటు వివిధ కళాశాలలు, సంస్థల నుంచి ఎంఓయూలు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపరాష్ట్రపతి పర్యటన షెడ్యూల్.. నిట్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి సోమవారం ఉదయం 9.20 నిమిషాలకు చేరుకుంటారు. కళాశాల మైదానం నుంచి రోడ్డు మార్గంలో 9.30 నిమిషాలకు నిట్ వరంగల్లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్కు వచ్చాక తొలుత నిట్ వజ్రోత్సవ వేడుకల శిలాఫలకాన్ని, అల్యూమ్ని కన్వెన్షన్ సెంటర్ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. నాటి ఆర్ఈసీ ప్రిన్సిపాల్స్, నేటి నిట్ డైరెక్టర్లను సన్మానించి నిట్ వజ్రోత్సవ వేడుకలపై ఉపన్యసిస్తారు. తిరిగి 10.30 నిమిషాలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి బయల్దేరుతారు. 600 మంది పోలీసులతో బందోబస్తు వరంగల్ క్రైం: వజ్రోత్సవాలకు ముఖ్యఅతిథిగా వస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు పోలీసు ఉన్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఆదివారం రాత్రి సుమారు గంటపాటు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ రవీందర్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించా రు. అధికారులు ఎక్కడెక్కడ ఎవరుండాలనే విషయాలతోపాటు బందోబస్తు విషయంలో ఎక్కడా చిన్న పొరపాటు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించా రు. బందోబస్తు కోసం సుమారు 600 మంది సిబ్బంది, అధికారులను నియమించినట్లు సమాచారం. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు ట్రాఫిక్ నియంత్రణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సిబ్బందికి సూచించారు. -
జీవితం మీద ఆశలు వదులుకున్నాం..
భువనగిరి : ‘వరదనీటితో క్యాంపస్ గదులు నిండిపోయాయి.. కరెంట్ లేదు.. తాగడానికి మంచినీళ్లు లేవు.. తినడానికి తిండిలేదు.. ఇంటికి ఫోన్ చేద్దామంటే కలవడం లేదు.. మా ‘నిట్’ కళాశాల విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నా ఎలా చేరుకోవాలో తెలియదు.. జీవితం మీద ఆశలు వదులుకున్నాం.. ఇక మమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి అనుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపాం.. శనివారం యూనివర్సిటీ అధికారులు ఒక ట్రక్లో విమానాశ్రయానికి పంపిన తర్వాత జీవితంమీద ఆశలు చిగురించాయి.. బతికి బయట పడ్డామన్న ఆనందం కలిగింది.. ఇంటికి వస్తున్నానని ఇక అక్కడి నుంచే ఫోన్ చేసిచెప్పా’ అని జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్ వరదల్లో చిక్కుకున్న భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన విద్యార్థి గోగు మధుసూదన్ తెలిపారు. ఆదివారం రాత్రి స్వగ్రామానికి చేరుకున్న ఆయన అక్కడి పరిస్థితులను వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. నేను శ్రీనగర్లోని హజరత్బాల్లో ఉన్న ఎన్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మూడవ సంవత్సరం చదువుతున్నా. కాగా ఈ నెల4 వతేదీ నుంచి జమ్మూకాశ్మీర్లో కనీవిని ఎరుగని రీతిలో వర్షాలు కురిశాయి. 7వ తేదీన రాత్రి కురిసిన భారీ వర్షాలకు మా కళాశాల పై భాగంలో గల దల్లేక్(సరస్సు) నిండి వరద నీరు పొంగి పొరలింది. దాంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న మా క్యాంపస్లోకి వరద నీర ంతా వచ్చి చేరింది. క్రమంగా పెరుగుతున్న వరద నీటితో మా తరగతి గదిలో ఉన్న సామగ్రిని కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. క్యాంపస్లోకి నీరు వస్తుండడాన్ని గమనించిన సిబ్బంది మమ్మల్ని కాశ్మీర్లోని కాశ్మీర్ యూనివర్సిటీకి తరలించారు. మా క్యాంపస్లో 1500 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. ఫుడ్, మంచినీరు లేదు. ఎవరికైనా ఫోన్చేద్దామనుకుంటే ఎయిర్సెల్ సిమ్ మాత్రమే పనిచేస్తుంది. అది కూడా పై అంతస్తుకు వెళ్తే కొంతమేర సిగ్నల్ మాత్రమే వస్తోంది. దీంతో చాలా టెన్షన్ పడ్డాం. కుటుంబ సభ్యులకు ఇతరులకు ఫోన్లు కలవక పోవడంతో చాలా ఇబ్బంది పడ్డాం. వర్షం తగ్గిన తర్వాత నాలుగైదు అంతస్తులపై నుంచి చేస్తే అప్పుడు ఫోన్ కలుస్తుందని మిత్రుడు ఒకరు తెలిపాడు. అప్పుడు పై అంతస్తులోకి వెళ్లి ఇంటికి ఫోన్ చేశా. కాగా ఈ కళాశాలలో నాతో పాటు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 24 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 16 మంది అబ్బాయిలం, 8 మంది అమ్మాయిలు ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కె రామ్మోహన్రావు, తెలంగాణ ప్రతినిధి సముద్రాల వేణుగోపాలచారిలు మాతో పలు మార్లు ఫోన్లో మాట్లాడారు. స్థానిక ప్రభుత్వం , కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయమూ చేయలేదు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణానికి సంబంధించిన టికెట్టు ఏర్పాటు చే యడం ద్వారా శనివారం శ్రీనగర్ నుంచి ఢిల్లికి, ఢీల్లి నుంచి హైదరాబాద్కు విమానంలో వచ్చాం. నేను సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో మా కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారు. నన్ను చూసేందుకు బంధువులు వస్తున్నారు. మాకు అన్ని విధాలా సహకరించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు.