-
ఇది కదా ఆవిష్కరణ అంటే.. కాగితం బ్యాటరీ తయారు చేసిన ఆ దేశ సైంటిస్టులు!
మామూలుగా బ్యాటరీలను లిథియం, నికెల్, కోబాల్ట్తో పాటు ఇంకా రకరకాల రసాయనాలు వాడి తయారు చేస్తారు. అలాంటి రసాయనాలతో మున్ముందు మనుషులకు ప్రమాదమే. అలా కాకుండా పర్యావరణానికి హాని చేయని పదార్థాలతో బ్యాటరీ చేస్తే. మనకు బాగా పరిచయమున్న కాగితంతోనే తయారు చేస్తే. వావ్.. సూపర్ అంటారా. అనాల్సిందే. ఎందుకంటే సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఇలాంటి బ్యాటరీనే రూపొందించింది మరి. 4 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు ఉండే ఈ బ్యాటరీ చిన్న ఫ్యాన్ను 45 నిమిషాలపాటు తిప్పగలదు. అరె.. కాగితంతో చేశారుగా.. మడిచేస్తే, కత్తిరిస్తే ఎలా? బ్యాటరీ పనిచేయదుగా అనుకునేరు! మడతేసినా, మెలితిప్పినా, ముక్కలు చేసినా విద్యుత్ ప్రవాహం ఆగదు. ఎలా తయారు చేశారబ్బా! కాగితంలో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. ఈ సెల్యులోజ్లోని సూక్ష్మ స్థాయి గ్యాప్ను హైడ్రోజెల్తో పూడ్చేసి స్క్రీన్ ప్రింట్ చేసిన ఎలక్ట్రోడ్లు(క్యాథోడ్, ఆనోడ్)లను అతికించి ఈ బ్యాటరీని తయారు చేశారు. యానోడ్ తయారీకి జింక్, కార్బన్లను ఉపయోగిస్తే మాంగనీస్, నికెల్లతో క్యాథోడ్ను ముద్రించారు. ప్రింటింగ్ తరువాత రెండింటినీ ఒక ఎలక్ట్రోలైట్ ద్రావణంలో పెట్టి పలుచటి బంగారపు పూత పూస్తారు. ఈ బ్యాటరీ 0.4 మిల్లీమీటర్ల మందమే ఉంటుంది. ఒకసారి వాడాక ఈ బ్యాటరీల్లోని రసాయనాలన్నీ సహజసిద్ధంగా నశిస్తాయి. కాలుష్యం లేకుండా మాంగనీస్, నికెల్లు హైడ్రాక్సైడ్లుగా మారిపోతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఫాన్ హాంగ్జిన్ తెలిపారు. ప్రస్తుతం వాడుతున్న బ్యాటరీలకు ఇవి మంచి ప్రత్యామ్నాయం కాగలవన్నారు. (చదవండి: దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు!) -
భారత్, చైనాలు కలసి పనిచేస్తే ఆసియాకు మేలు
సింగపూర్: భారత్, చైనాలు పరస్పర విశ్వాసంతో కలసి పనిచేస్తే ఆసియాకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొనేలా సమస్యలు పరిష్కరించుకోవడంలో ఇరు దేశాలు గొప్ప పరిపక్వత, విజ్ఞానాన్ని ప్రదర్శించాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం ‘షాంగ్రి–లా’ సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. 28 ఆసియా–పసిఫిక్ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక అయిన ఈ కార్యక్రమాన్ని 2002 నుంచి సింగపూర్లోని షాంగ్రి–లా అనే హోటల్లో ఏటా నిర్వహిస్తున్నారు. విభేదాలు, స్పర్థలను పక్కనపెట్టి ఈ ప్రాంత దేశాలన్నీ కలసి పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రాంతీయ సముద్ర తీర వివాదాలను ప్రస్తావిస్తూ..ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ ఓ వ్యూహంగానో, కొందరి సభ్యుల క్లబ్గానో చూడదని ఉద్ఘాటించారు. ‘చర్చలు, ఉమ్మడి నిబంధనల ఆధారిత విధానాల ఆధారంగానే ఈ ప్రాంత అభివృద్ధి, భద్రత సాధ్యమని విశ్వసిస్తున్నాం. స్థిరమైన, వివక్షలేని అంతర్జాతీయ వాణిజ్య విధానాలకే భారత్ మద్దతిస్తుంది. పోటీ ఎక్కడైనా ఉంటుంది. కానీ పోటీ ఘర్షణగా, విభేదాలు వివాదాలుగా మారకూడదు’ అని వాణిజ్యంలో పెరిగిపోతున్న రక్షణాత్మక ధోరణులను పరోక్షంగా ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్ ప్రాంత భవిష్యత్తుకు ఆసియాన్ కేంద్ర బిందువుగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. ప్రాంతీయ అనుసంధానత వ్యాపారాభివృద్ధిని మించి వేర్వేరు దేశాలను చేరువ చేస్తోందని అన్నారు. అంతకు ముందు, మోదీ సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతరాలను చెరిపేస్తున్న సాంకేతికత: మోదీ సాంకేతికత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి గొంతుకగా మారి, సామాజిక అడ్డంకులను తొలగిస్తోందని మోదీ అన్నారు. సృజనాత్మకతకు మానవీయ విలువలు జోడించి ఈ శతాబ్దపు సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చారు. సింగపూర్లోని ప్రతిష్టాత్మక నన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ)లో నిర్వహించిన ట్రాన్స్ఫార్మింగ్ ఆసియా త్రూ ఇన్నోవేషన్’ అనే సదస్సులో మోదీ ప్రసంగించారు. మార్పును వినాశకారిగా చూడొద్దని, సాంకేతికత ఆధారిత సమాజం వల్లే అంతరాలు నశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం 300 ఏళ్ల నుంచే.. ‘21వ శతాబ్దం ఆసియాదే. మరి మనకు ఈ సెంటిమెంట్ ఉందా అన్నదే అతిపెద్ద సవాలని అనుకుంటున్నా. ప్రతి సృజనాత్మకత తొలుత అవాంతరంగా కనిపిస్తుంది. సమాజంలోని అంతరాలను సాంకేతికత సాయంతో పారదోలొచ్చు. సాంకేతికత అందరికీ అందుబాటులో ఉంటూ వినియోగదారుడికి అనుకూలంగా ఉండాలి. డిజిటల్ యుగానికి తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీరు, గాలి కాలుష్యం, శరవేగంగా పెరుగుతున్న పట్ణణీకరణ, వాతావరణ మార్పులు, ఎక్కువ కాలం నిలిచే మౌలిక వసతుల నిర్మాణం, సముద్ర వనరుల పరిరక్షణ తదితరాలు నేడు మనకు సవాళ్లు విసురుతున్నాయి. సుమారు 1600 ఏళ్ల పాటు ప్రపంచ జీడీపీలో భారత్, చైనాల వాటానే 50 శాతంగా ఉండేది. గత 300 ఏళ్ల నుంచే పాశ్చాత్య దేశాల ఆధిపత్యం మొదలైంది. సాంకేతికతను ఆయుధాల తయారీకి వినియోగిస్తే ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు తప్పవు’ అని మోదీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్టీయూ, భారత వర్సిటీల మధ్య విద్య, పారిశ్రామిక భాగస్వామ్యానికి సంబంధించి ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్కు హాజరైన మోదీ..మనుషులతో సంభాషించే ఓ రోబోతో మాట్లాడారు. లూంగ్కు బౌద్ధ జ్ఞాపిక ప్రదానం.. చర్చల సందర్భంగా లూంగ్కు మోదీ 6వ శతాబ్దం నాటి బౌద్ధగుప్త జ్ఞాపిక నమూనాను కానుకగా ఇచ్చా రు. బౌద్ధమతం భారత్ నుంచి ఆగ్నేయాసియాకు వ్యాపించిందనడానికి సాక్ష్యంగా భావిస్తున్న ఈ జ్ఞాపికపై సంస్కృత వాక్యాలున్నాయి. అలాగే, సింగపూర్ మాజీ రాయబారి టామీ కోహ్(80)కు ప్రధాని మోదీ పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు. ఈ ఏడాది పద్మశ్రీ పొందిన ఆసియాన్ దేశాలకు చెందిన 10 మందిలో కోహ్ ఒకరు. కోహ్ గతంలో అమెరికా, ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా చేశారు. 8 ఒప్పందాలపై సంతకాలు ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. నావికా దళాల మధ్య రవాణా సహకారం సహా ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని లూంగ్తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ)పై రెండో సమీక్ష సమావేశం విజయవంతమైందని మోదీ తెలిపారు. లూంగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు పటిష్టమయ్యాయని అన్నారు. సింగపూర్ కంపెనీల సహకారంతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పుణే విమానాశ్రయ అభివృద్ధిని ప్రస్తావించారు. -
సెల్ఫీలు మన గురించి చెప్పేస్తాయి!
సెల్ఫీలంటే సరదాగా తీసుకునే స్వీయ చిత్రాలు మాత్రమే కాదు. అవి మన వ్యక్తిత్వాన్ని గురించి మనకు చెబుతాయి అంటోంది తాజా అధ్యయనం ఒకటి. మనలోని అంతర్ముఖత్వం, అంకితభావం, స్వార్థం, నిస్వార్థం, ధైర్యం, పిరికితనం...ఇలా ఎన్నో లక్షణాలను సెల్ఫీలు చెబుతాయి. ‘‘ఫోటో మాత్రమే అనుకుంటాంగానీ అది మన వ్యక్తిత్వంలోని ఎన్నో కోణాలను మనకు చెబుతుంది’’ అంటున్నారు సింగపూర్లోని నన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. సెల్ఫీ కోసం ఎంచుకున్న ప్రదేశం, భంగిమ, కెమెరాకు సంబంధించిన సాంకేతిక అంశాలు... మొదలైనవి మన వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయట. ఇతర వ్యక్తులు తీసే ఫోటోల కంటే సెల్ఫీలే వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో సూచికలుగా పనిచేస్తాయంటున్నారు పరిశోధకులు. పుస్తకాలుగా వచ్చిన ప్రముఖుల సెల్ఫీలను కూడా తమ అధ్యయనానికి పరిశోధకులు ఉపయోగించుకున్నారు. రెండు ఉదాహరణలు సంతోషంగా, నవ్వు ముఖంతో కనిపించడం అనేది సిగ్నేచర్ సెల్ఫీ లుక్! ఇలాంటి సెల్పీలు మనలోని సానుకూల దృక్పథాన్ని చాటడంతో పాటు ఇతరులకు సహాయం చేసే మనస్తత్వాన్ని తెలియజేస్తాయట. ముఖం కింది నుంచి సెల్ఫీ తీసుకోవవడం పట్టు విడుపులు లేని ధోరణిని, సరికొత్త ప్రయోగ దృక్పథాన్ని తెలియజేస్తుందట. ప్రైవేటు ప్లేస్లలో సెల్ఫీలు తీసుకోకవపోవడం అనేది మనస్సాక్షి విలువనిచ్చే వైఖరికి అద్దం పడుతుంది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement