breaking news
Marketing strategies
-
పది దేశాలకు మరింతగా ఎగుమతులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ తోడ్పాటు, పటిష్టమైన మార్కెటింగ్ వ్యూహాలతో పది దేశాలకు ఎగుమతులను పెంచుకునేందుకు మరింతగా అవకాశాలు ఉన్నాయని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో ఒక నివేదికలో పేర్కొంది. అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు 112 బిలియన్ డాలర్ల మేర పెంచుకోవచ్చని వివరించింది. సదరు దేశాల్లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో దేశీ సంస్థలు పాల్గొనేందుకు, విక్రేతలు–కొనుగోలుదారుల సమావేశాలు మొదలైన వాటిని నిర్వహించడంలో పరిశ్రమకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఒక స్కీమును రూపొందించవచ్చని ఎఫ్ఐఈవో తెలిపింది. అలాగే, విదేశాల్లోని దిగుమతి సంస్థలు, దేశీ ఎగుమతి సంస్థల మధ్య సమావేశాలు నిర్వహించడంలో ఆయా దేశాల్లోని భారతీయ మిషన్లు పరిశ్రమకు తోడ్పాటు అందించవచ్చని పేర్కొంది. తయారీ రంగంలో భారత్ సామర్థ్యాలను సదరు దేశాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసే అవకాశాలను కూడా పరిశీలించవచ్చని ఎఫ్ఐఈవో వివరించింది. ‘112 బిలియన్ డాలర్ల మేర మరింతగా ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశాలున్న 10 దేశాల్లో అమెరికా (31 బిలియన్ డాలర్లు), చైనా (22 బిలియన్ డాలర్లు), యూఏఈ (11 బిలియన్ డాలర్లు), హాంకాంగ్ (8.5 బిలియన్ డాలర్లు), జర్మనీ (7.4 బిలియన్ డాలర్లు), వియత్నాం (9.3 బిలియన్ డాలర్లు), బంగ్లాదేశ్ (5 బిలియన్ డాలర్లు), బ్రిటన్ (5.4 బిలియన్ డాలర్లు), ఇండొనేషియా (6 బిలియన్ డాలర్లు), మలేషియా (5.8 బిలియన్ డాలర్లు) ఉన్నాయి‘ అని ఎఫ్ఐఈవో తెలిపింది. 2030 నాటికి ఉత్పత్తులు, సేవల ఎగుమతులను 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్లకు పెంచుకోవాలని భారత్ నిర్దేశించుకుంది. 2022–23లో ఇవి 776 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. నివేదికలోని మరిన్ని వివరాలు.. ► నివేదిక ప్రకారం పది దేశాలకు ఎగుమతులను పెంచుకునేందుకు అవకాశాలున్న ఉత్పత్తుల జాబితాలో వజ్రాలు, వాహనాలు, ఆభరణాలు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, మెరైన్ ఉత్పత్తులు, దుస్తులు, క్రిమిసంహాకరాలు, ఇనుము .. ఉక్కు, టీ, కాఫీ మొదలైనవి ఉన్నాయి. ► అమెరికాకు డైమండ్లు (3.7 బిలియన్ డాలర్లు), మోటర్ వాహనాలు (2.2 బిలియన్ డాలర్లు), ఆభరణాలు (1.4 బిలియన్ డాలర్లు), టెలిఫోన్ సెట్లు, ఇతరత్రా వాయిస్/ఇమేజ్ ట్రాన్స్మిషన్ పరికరాలు (1.3 బిలియన్ డాలర్లు) మొదలైన వాటి ఎగుమతులను పెంచుకోవడానికి అవకాశం ఉంది. ► చైనాకు మోటర్ వాహనాలు, ఆటో విడిభాగాలు, ఆభరణాలు, పశుమాంసం, రొయ్యలు, మిరియాలు, గ్రానైట్, ఆముదం, అల్యూమినియం వంటి ఉత్పత్తుల ఎగుమతులు పెంచుకోవచ్చు. ► జర్మనీకి అల్యూమినియం, కాఫీ, దుస్తులు, జీడిపప్పు, మోటర్ వాహనాలు, ఆభరణాలు ఎగుమతి చేయొచ్చు. ► బ్రిటన్కు వజ్రాలు, ఆభరణాలు, రొయ్యలు, కలప ఫరి్నచరు, బియ్యం, బ్లాక్ టీ, టర్బోజెట్లు, ఆటో విడిభాగాలు, శాండ్స్టోన్, పిల్లల దుస్తుల ఎగుమతులను పెంచుకోవచ్చు. ► ఇండొనేషియా, మలేíÙయాకు ఇనుము..ఉక్కు ఐటమ్లు, ఆటో విడిభాగాలు, క్రిమిసంహారకాలు, అల్యూమినియం మిశ్రమ లోహాలు, రాగి క్యాథోడ్లు, రొయ్యలు, ఫార్మా ఉత్పత్తులను మరింతగా ఎగుమతి చేయొచ్చు. ► ఎగుమతులు పెరగడం వల్ల దేశీయంగా ఉద్యోగాల కల్పనకు, తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. విదేశీ మారకాన్ని ఆర్జించేందుకు వీలవుతుంది. -
భవిష్యత్తుకు రాచబాట
విశాఖపట్నం : ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఎంతో కీలకం. ఇందులో చూపిన ప్రతిభ భవిష్యత్తులో ఉపాధికి ఉపకరిస్తుంది. ఆయా అంశాలపై విద్యార్థులకు ఉన్న పట్టు, పరిశీలనను తెలియజేస్తాయి. నవంబరు నెలాఖరు నుంచి డిసెంబరు, జనవరి మాసాల్లో విద్యార్థులు ఎక్కువగా ప్రాజెక్ట్ వర్కులు చేస్తారు. ఇందుకోసం విద్యార్థులు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రొఫెషనల్ కోర్సుల ఇన్స్టిట్యూట్స్కు ముఖ్యకూడలిగా ద్వారకానగర్ కేంద్రీకృతంగా మారింది. ఇక్కడ వృత్తివిద్య, డిప్లొమా, ఉన్నత విద్యకు సంబంధించిన ప్రతిభావంతమైన ప్రయివేట్ ఇన్స్టిట్యూట్స్ అధికంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులు ఇక్కడి ఇనిస్టిట్యూట్స్లో అధికంగా ప్రాజెక్టు వర్క్లు చేస్తున్నారు. నగరంలో థియిరీ ప్రాజెక్ట్, పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల ప్రాక్టికల్ వర్క్లు చేయడానికి ఉపక్రమించారు. ఐటీ, ఈసీఈ, ఈఈఈ ఇంజినీరింగ్ విద్యార్థులు నగరలో పేరుగాంచిన శాస్త్ర, సాంకేతిక సంస్థల్లో ప్రాజెక్ట్ వర్కులు ప్రారంభించారు. మరికొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంసీఏ, ఎంబీఏ తదితర కోర్సులకు కూడా ప్రాజెక్టు వర్క్లు ప్రారంభమయ్యాయి. అవగాహన కోసమే... ఒక విషయాన్ని ఒకరు చెబితే వినడం కంటే..ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటే పూర్తి అవగాహన వస్తుంది. ఆ విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అందుకే వృత్తివిద్యా కోర్సుల్లో ప్రాజెక్ట్ వర్క్లు కీలకంగా మారాయి. విద్యార్థులు కూడా ప్రెజెంటేషన్లోప్రత్యేకత చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ తదితర కోర్సులకు సంబంధించిన విద్యార్థులు చివరి ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. విజ్ఞాన సముపార్జనే ప్రధాన ధ్యేయం. కళాశాలల్లో నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రాక్టికల్గా అన్వయించటం కోసం సంస్థలు, కంపెనీలకు విద్యార్థు లు వెళ్తారు. అక్కడ పనితీరు, మార్కెటింగ్ విధానాలు, అమ్మకాలు, కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజా ్ఞనం, ఉత్పత్తుల తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి... ఈ పరిశీలన అనంతరం విద్యార్థులు నివేదికను రూపొందిస్తారు. విద్యార్థి ఆలోచనా తీరు, పరిశీలన, కొత్త విషయాల గ్రహింపు, అనుమానాలు అన్నీ ఇందులో ఉంటాయి. తద్వారా విద్యార్థుల ఆలోచననా శైలి తెలియడంతోపాటు వారిని ఏ అంశంలో మెరుగుపర్చాలో అధ్యాపకులకు తెలుస్తుంది. వారు పరిశీలించిన కంపెనీల నిర్వహణలో తీసుకోవాల్సిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన తీరుపైనా విద్యార్థులు సూచనలు చేయవచ్చు. కాలానుగుణంగా పరిశ్రమల్లో చేపట్టాల్సిన మార్పులపై విద్యార్థులకు అవగాహన రావటానికి ప్రాజెక్టు వర్కు ఉపకరిస్తుందని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఎన్.వి. రవికుమార్ తెలిపారు. -
మార్కెటింగ్ పాఠాలు నేర్చుకుంటున్న సీమాంద్ర కాంగ్రెస్ నేతలు