breaking news
Linemen job
-
7,966 లైన్మెన్ పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 7,966 మంది జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ఈ మేరకు ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. ఈ పోస్టులకు ఆగస్టు 17వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని గ్రామ సచివాలయాల్లో 2,177 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 682 పోస్టులున్నాయి. ఎస్పీడీసీఎల్ పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో గ్రామ సచివాలయాల్లో 3,866 పోస్టులు, వార్డు సచివాలయాల్లో 1,241 పోస్టులున్నాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలు ఉండీ ఈ ఏడాది జులై 1నాటికి 18 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సు ఉన్న పురుషులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఉంది. ఐటీఐ ఎలక్ట్రికల్, వైర్మేన్ ట్రేడ్ కోర్సుతో పాటు పదో తరగతి వారు అర్హులు. ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సస్ అండ్ రివైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ చేసిన వారు కూడా అర్హులే. రిజర్వేషన్లు, ఇతర వివరాలను ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్ వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. మొదటి 20 శాతం పోస్టులను ఓపెన్ క్యాటగిరీలో మెరిట్ ప్రకారం భర్తీ చేస్తారు. మిగిలిన 80 శాతం పోస్టులను లోకల్ కోటా ప్రకారం భర్తీ చేస్తారు. ఏ సర్కిల్(జిల్లా) పరిధిలోని వారు ఆ సర్కిల్(జిల్లా)లో పోస్టులకు లోకల్ అభ్యర్థులు అవుతారు. ఓ అభ్యర్థి గరిష్టంగా మూడు సర్కిళ్లలో పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పారదర్శకంగా పోస్టుల భర్తీ లైన్మెన్ పోస్టులను నిబంధనల మేరకు పారదర్శకంగా భర్తీ చేస్తాం. దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి అందులో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్ ప్రాతిపదికన పోస్టుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తాం. అక్టోబరు 2 నాటికి లైన్మెన్ విధుల్లో చేరుతారు. – ఎన్.శ్రీకాంత్, ట్రాన్స్కో సీఎండీ లైన్మెన్ పోస్టులకు www. apeasternpower. com, www. apspdcl. in, http:// gramasachivalayam. ap. gov. in, http://59.144.184.105/ jlm19 వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతమున్న పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. -
నయవంచకుడు
చేసేది ‘లైన్’మెన్ ఉద్యోగం.. సమాజంలో హుందాగా వ్యవహరిస్తూ.. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి అతను. పెళ్లై, పిల్లలున్న విషయాన్ని దాచి పెట్టి మరో అమ్మాయిని ‘లైన్’లో పెట్టాడు. లైన్ కనెక్ట్ కాగానే పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. ఆ తరువాత ‘దగ్గర’య్యాడు. ఎలాగోలా అతని విషయం ఆమెకు తెలిసింది. నిలదీస్తే.. మొదటి భార్యకు విడాకులిచ్చి, నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ క థలు చెప్పాడు. చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది. - ఉరవకొండ బూదగెవికు చెందిన శ్రీచరణ్ ఉరవకొండ ట్రాన్స్కో శాఖ పరిధిలో జూనియుర్ లైన్మెన్గా పని చేస్తున్నాడు. అతనికి పెళ్లై కొడుకు కూడా ఉన్నాడు. అయితే ఈ విషయం దాచి ఉంచి ఉరవకొండకు చెందిన మరో అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ‘నాకింకా పెళ్లి కాలేదు. నువ్వు ఓకే అంటే నిన్నే పెళ్లి చేసుకుంటానంటూ’ ఆమెను నమ్మించాడు. ఆ అభాగ్యురాలు నిజమేనని నమ్మింది. ఓకే అంది. మరింత చొరవ తీసుకున్న అతను ‘ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా’ అంటూ ఆమెకు దగ్గరయ్యాడు. ఆమె కూడా కాదంది. నిలదీస్తే.. బిత్తరపోయాడు పెళ్లై, కొడుకు ఉన్న విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు శ్రీచరణ్ను అడిగింది. ఊహించని ఈ పరిణామంతో అతని నోటి వెంట మాటలు తడబడ్డాయి. తనకింకా పెళ్లి కాలేదని మళ్లీ నమ్మించేం దుకు ప్రయత్నించాడు. గట్టిగా నిలదీసే సరికి అవునని అంగీకరించాడు. ఎందుకిలా చేశావంటే ‘నీకోసమే’నంటూ మళ్లీ బుకాయించాడు. ‘నా భార్యకు విడాకులిచ్చి, నిన్నే పెళ్లి చేసుకుంటా’నంటూ కాళ్లబేరానికి వచ్చాడు. అంతలోనే అభాగ్యురాలి కుటుంబ సభ్యులు, బంధువులు రంగంలోకి దిగి పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ అతనిపై ఒత్తిడి తీసుకురావడంతో ఆ నయవంచకుడు అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. చేసేది లేక బాధితురాలు న్యాయం కోసం ఎస్ఐ మోహన్కుమార్గౌడ్ను ఆదివారం కలసి రాతమూలకంగా ఫిర్యాదు చేసింది. నయవంచకుడిపై 417, 420 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.