breaking news
Laxman Utekar
-
బిడ్డని కని వెంటనే స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. కానీ చివరి క్షణాల్లో డబ్బుల్లేక
బయోపిక్స్కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. సరిగా తీయలే గానీ సీజన్తో, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. లేటెస్ట్ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ 'ఈటా' పేరుతో ఓ సినిమా చేస్తోంది. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా ఆసక్తికరంగా అనిపించింది. తీరా చూస్తే ఇదో నిజజీవిత కథతో తీసిన మూవీ అని తెలిసింది. విఠాబాయి అనే ప్రసిద్ధ నృత్య కళాకారిణి జీవితాన్ని ఇప్పుడు వెండితెరపై చూపించబోతున్నారు. ఇంతకీ విఠాబాయి ఎవరు?(ఇదీ చదవండి: కమ్ బ్యాక్ అంటే ఇది.. ఓడిన చోటే సమంత గెలిచింది)'ఈటా' సినిమా మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా కళాకారిణి విఠాబాయి నారాయణ్గొంకర్ బయోపిక్. 1935లో మహారాష్ట్రలోని పంఢర్పూర్లో జానపద కళాకారుల కుటుంబంలో జన్మించిన ఈమె.. చిన్నప్పటి నుంచే కళావాతావరణంలో పెరిగారు. తండ్రితో పాటు కుటుంబ సభ్యులు ప్రసిద్ధ భౌ-బాపు మాంగ్ నారాయణ్గావంకర్ తమాషా బృందంతో పనిచేసేవారు. వీళ్లంతా మహారాష్ట్రలో సంప్రదాయ జానపద కళలని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించినట్లు చెబుతుంటారు.కళా సంప్రదాయాల మధ్య పెరిగిన విఠాబాయి.. లావణి, గవలన్, భేదిక్, తమాషా తదితర సంప్రదాయ కళారూపాలను నేర్చుకుని క్రమంగా మహారాష్ట్రలో అత్యంత ప్రజాదరణ పొందిన కళాకారిణులలో ఒకరిగా ఎదిగారు. ఈమె అసాధారణ ప్రతిభకు గుర్తింపుగా 'తమాషా సామ్రాజ్ఞి' అనే బిరుదు కూడా అందుకున్నారు. ఇంత ప్రసిద్ధ డ్యాన్సర్ అయినప్పటికీ ఈమె జీవితం ఏమంత సాఫీగా సాగలేదు. తండ్రి చనిపోవడంతో కుటుంబ తమాషా బృందం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవడంతో విఠాబాయిపైన కుటుంబ బాధ్యతలు పడ్డాయి. దీంతో కళారంగాన్ని విడిచిపెట్టకుండా మరింత అంకితభావంతో తమాషా ప్రదర్శనల్లో పాల్గొనేది. దశాబ్దాల పాటు మహారాష్ట్ర జానపద సంస్కృతిలో చెరగని ముద్ర వేసింది.విఠాబాయి ఎంత లెజెండ్ అనేది ఒక్క సంఘటనతో చెప్పొచ్చు. 'ఈటా' మూవీ టీజర్లో చూపించినట్లు తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కూడా ప్రదర్శనకు సిద్ధమైంది. ఫెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిన సమయంలో ఈమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అయినా సరే చలించిపోలేదు.స్టేజీ వెనక్కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చి.. బొడ్డుతాడు స్వయంగా కోసుకుని కాసేపటికే కాళ్లకు గజ్జెలు కట్టుకుని స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇలా కళాపట్ల ఈమెకు ఉన్న అంకితభావం ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురిచేసింది.(ఇదీ చదవండి: 'పెద్ది' సక్సెస్ ఈవెంట్.. జాన్వీతో పాటు వాళ్లెక్కడ?)అయితే భారత జానపద కళలకు చేసిన సేవలకుగాను విఠాబాయికి 1957, 1990లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారాలు లభించాయి. 2006లో మహారాష్ట్ర ప్రభుత్వం 'విఠాబాయి నారాయణ్గొంకర్ జీవిత సాఫల్య పురస్కారం'ని కూడా ప్రారంభించింది. తమాషా కళారంగానికి విశేష సేవలందించిన వారికి ఈ అవార్డు ప్రదానం చేస్తోంది.అయితే ఇంత ప్రసిద్ధ కళాకారిణి అయినప్పటికీ జీవితాంతం ఈమెని ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, వ్యక్తిగత కష్టాలు వెంటాడాయి. 2002లో విఠాబాయి చనిపోయే సమయంలో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో కన్నుమూసింది. తర్వాత ఆస్పత్రి సిబ్బంది, స్థానికులు సాయం చేయడంతో దాదాపు రూ.5000 మొత్తాన్ని ఆస్పత్రికి చెల్లించారు. ఇలాంటి విషాదకరమైన విఠాబాయి జీవితాన్ని వెండితెరపై ఎంత ప్రభావవంతంగా చూపిస్తారోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.'ఛావా' ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'ఈటా'లో 1940ల నుంచి 1990 వరకు విఠాబాయి జీవితాన్ని చూపించబోతున్నారు. శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ చేయగా రణదీప్ హుడా, నానా పాటేకర్, మహ్మద్ జీషాన్ అయ్యూబ్, సిద్ధార్థ్ జాధవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనూ డబ్బింగ్ చేస్తారేమో తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఒక్క స్పీచ్.. చిరంజీవిపై ట్రోలింగ్) -
ఛావా డైరెక్టర్ మరో సినిమా.. టీజర్ రిలీజ్
బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కీలక పాత్రలో వస్తోన్న లేటేస్ట్ మూవీ ఈత. స్త్రీ-2 బ్లాక్బస్టర్ హిట్ తర్వాత ఆమె పీరియాడికల్ స్టోరీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఛావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రణ్దీప్ హుడా కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ మేకర్స్ రిలీజ్ చేశారు.టీజర్ చూస్తుంటే విఠాబాయి భావు మాంగ్ నారాయణ్గావ్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిననట్లు తెలుస్తోంది. బ్రిటీష్ కాలం నుంచే డ్యాన్సర్గా ఆమె ఎలాంటి పరిణామాలు ఎదుర్కొందనే కోణంలో ఈ మూవీ ఉండనుందని అర్థమవుతోంది. ఈ టీజర్లో నిండు గర్భిణిగా ఉన్న ఆమె డ్యాన్స్ చేయడం అంచనాలు పెంచుతోంది. ఈ టీజర్ చూస్తుంటే ఛావా మూవీలాగే మరో బ్లాక్బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగష్టు 28, 2026న థియేటర్లలో విడుదల కానుంది. -
క్లాసికల్ డ్యాన్సర్గా...
‘స్త్రీ 2’ వంటి బ్లాక్బస్టర్ సినిమా తర్వాత బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటించనున్న సినిమాపై అతి త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. విక్కీ కౌశల్తో ‘ఛావా’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో శ్రద్ధా కపూర్ నటించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఈ ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయని, ఈ చిత్రంలో క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో శ్రద్ధా కపూర్ నటించనున్నారని టాక్. నవంబరులో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట దర్శకుడు లక్ష్మణ్. మరోవైపు ఈ సినిమా కోసం ప్రస్తుతం శ్రద్ధగా క్లాసికల్ డ్యాన్స్లో ప్రత్యేక శిక్షణ తీసుకునే పనిలో ఉన్నారట శ్రద్ధా కపూర్. మహారాష్ట్ర చరిత్ర, సంస్కృతిని చాటి చెప్పేలా ఈ సినిమా కథనం ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని ఈ చిత్రనిర్మాత దినేష్ విజన్ ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ప్రీప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత ఈ సినిమాను అధికారికంగా ప్రకటించాలని యూనిట్ ప్లాన్ చేస్తోందనే టాక్ బాలీవుడ్లో వినిపిస్తోంది. -
రోడ్డుపై 'వడాపావ్' అమ్మే వ్యక్తి ఏకంగా రూ. 800 కోట్ల సినిమాతో రికార్డ్
చిత్ర దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) జీవితం నేటి యువతరానికి రోల్ మోడల్ అని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని మారుమూల గ్రామమైన సమర్పూర్లో జన్మించిన ఆయన సినిమా మీద ఆసక్తితో ముంబై చేరుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటుకుని ఫైనల్గా స్టార్ డైరెక్టర్గా బాలీవుడ్లో పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్లో ఒక్క సినిమా అయినా చేయాలని చాలామంది హీరోలు ఆశిస్తున్నారు.'ఛావా'(Chhaava) సినిమాతో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే, ఈ సినిమాకు ముందు ఆయన కష్టాలు చాలానే ఉన్నాయి. సినిమా మీద ఆసక్తితో తన గ్రామం నుంచి ముంబైకి వచ్చిన లక్ష్మణ్కు మొదట ఎలాంటి అవకాశాలు దక్కలేదు. ఏలాగైనా విజయం సాధించిన తర్వాతే తన గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన ఖర్చుల కోసం వడాపావ్ అమ్మె షాపులో పనిచేశాడు. ఆపై కొద్దిరోజుల్లోనే ఒక సినిమా స్టూడియోలో ఫ్లోర్స్ క్లీన్ చేసే పనికి కుదిరాడు. అక్కడ సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాడు. ఇలా ఒక్కో అడుగు వేస్తూ వెళ్తున్న ఆయనకు 2007లో ఖన్నా & అయ్యర్ సినిమాతో ఫోటోగ్రఫీ డైరెక్టర్గా ఛాన్స్ వచ్చింది. అలా ఇండస్ట్రీలో తన కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా పలు సినిమాలకు పనిచేయడంతో పాటు కొన్ని యాడ్స్ కోసం కూడా వర్క్చేశాడు. ఆ తర్వాత మరాఠీ భాషలో కొన్ని సినిమాలు తెరకెక్కించినా ఆయనకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. అయితే, 2019లో హిందీ సినిమా 'లూకా చుప్పి'తో భారీ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత మిమి( కృతి సనన్), జరా హట్కే జరా బచ్కే(విక్కీ కౌశల్) చిత్రాలతో దర్శకుడిగా బాలీవుడ్లో మరింత పాపులర్ అయ్యాడు. అయితే, రీసెంట్గా ఛావా సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 805 కోట్లతో రాబట్టి తన సత్తా ఏంటో ఈ ప్రపంచానికి లక్ష్మణ్ ఉటేకర్ చాటాడు. అలా వడాపావ్ బండి నుంచి బాలీవుడ్లో టాప్ డైరెక్టర్గా ఎదిగిన ఆయన జీవితం ఎంతోమంది యువకులకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ సుమారు రూ. 50 కోట్లు పైమాటే అని సమాచారం. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన 'మిమి' చిత్రం రెండు జాతీయ అవార్డులను(National Film Awards) దక్కించుకుంది. ఉత్తమ నటి (కృతి సనన్), ఉత్తమ సహాయ నటుడు (త్రిపాఠి) అవార్డ్స్ అందుకున్నారు. ఆపై ఈ చిత్రం 3 ఫిల్మ్ఫేర్ అవార్డులను కూడా దక్కించుకుంది. -
క్షమాపణలు చెప్పిన 'ఛావా' డైరెక్టర్.. ఎందుకంటే?
కొన్ని కథలు వినోదాన్ని పంచితే మరికొన్ని హృదయాలను బరువెక్కిస్తాయి. కొన్ని మాత్రమే మన రక్తం మరిగేలా చేస్తూనే కన్నీళ్ల వరద పారిస్తాయి. అలాంటి సినిమాయే ఛావా (Chhaava Movie). బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ (Vicky Kaushal) ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీగా నటించాడు. ఆయన భార్య ఏసుబాయిగా హీరోయిన్ రష్మిక మందన్నా యాక్ట్ చేసింది. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది.ద్రోహులుగా చిత్రీకరించారుఇక ఈ సినిమాలో తన పూర్వీకులను తప్పుగా చూపించారంటూ మరాఠా యోధులు గానోజీ, కాన్హోజి షిర్కే వారసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రను ఉటంకిస్తూ తమ పూర్వీకులను శంభాజీ మహారాజ్కు ద్రోహం చేసినవారిగా చిత్రీకరించారని మండిపడ్డారు. ఆయా సన్నివేశాల ద్వారా తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించినందుకుగానూ చిత్రయూనిట్పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar)కు నోటీసులు పంపించారు.అసౌకర్యానికి గురైతే క్షమించండిఈ వివాదంపై డైరెక్టర్ లక్ష్మణ్ స్పందిస్తూ ఛావాలో గానోజి, కన్హోజీల పేర్లు మాత్రమే ఉపయోగించామన్నాడు. వారి ఇంటిపేరు, ఏ ప్రాంతానికి చెందినవారు వంటి వివరాలను వెల్లడించలేదన్నాడు. షిర్కే కుటుంబసభ్యుల మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చాడు. ఛావా వల్ల వారు అసౌకర్యానికి గురైతే తనను క్షమించాల్సిందిగా కోరాడు.చదవండి: కావాలనే రాంగ్ మెడిసిన్ ఇచ్చారు.. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో నటుడు


