breaking news
Kyasanar Forest
-
గోవాను వణికిస్తున్న కోతి రోగం..
పనాజీ: గోవాని కోతి రోగం హడలెత్తిస్తోంది. గత సంవత్సర కాలంలో 35 మందికి ఈ వ్యాధి సోకినట్లు వాల్పోయ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధికారి తెలిపారు. క్యాసనూర్ ఫారెస్ట్ డీసీస్ (కేఎఫ్డీ)గా పిలబడే ఈ వ్యాధి బారిన పడి తీర ప్రాతం సత్తారి తాలుకాలో 2015లో ఒకరు, 2016 లో ఇద్దరు మరణించారు. ఏడాది కాలంలో కేఎఫ్డీ బారినపడ్డ 35 మంది సత్తారి తాలుకా కు చెందిన వారేనని ఆయన వెల్లడించారు. అయితే ఆరోగ్య శాఖ చేపట్టిన వ్యాక్సినేషన్ చర్యల వల్ల వ్యాధికి గురైన ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అన్నారు. కోతుల శరీరం పైన ఉండే సూక్ష్మ క్రిముల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని ఆయన తెలిపారు. కోతులతో సావాసం చేయడం వల్ల ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కర్ణాటకలోని క్యాసనూర్ అడవిలో 1957లో ఈ వ్యాధిని గుర్తించారని వివరించారు. అందువల్లే ఈ వ్యాధిని ‘క్యాసనూర్ ఫారెస్ట్ డిసీస్’ గా పిలుస్తున్నారని అన్నారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, రక్తస్రావం ఈ వ్యాధి లక్షణాలు. డెంగ్యూని పోలిన లక్షణాలతో కేఎఫ్డీ మరణానికి దారితీస్తుందని చెప్పారు. -
కోతుల నుంచి వచ్చే జ్వరం... ‘మంకీ ఫీవర్’!
మెడి క్షనరీ వాడుకభాషలో ‘కోతుల జ్వరం’ లేదా క్యాసనర్ ఫారెస్ట్ డిసీజ్ (కేఎఫ్డీ) అని పిలిచే ఈ జబ్బు కోతుల మీద నివసించే పేల వంటి ఒక రకం క్రిముల ద్వారా మనుషులకు వస్తుంది. కోతులపై ఉండే ఈ క్రిములు మనుషుల్ని కుట్టడం వల్ల ఇది మనుషులకు వస్తుంది. దీన్ని మొట్టమొదటిసారి 1957లో కర్ణాటకలోని ‘క్యాసనర్ ఫారెస్ట్’ అనే అడవిలో కనుగొన్నారు. కాబట్టి దీన్ని క్యాసనర్ ఫారెస్ట్ డిసీజ్ అంటారు. ఈ జ్వరాన్ని తెచ్చే వైరస్ కూడా డెంగ్యూను వ్యాపింపజేసే ‘ఫ్లావివిరిడే’ కుటుంబానికి చెందినదే. కర్ణాటకలోని షిమోగా ప్రాంతంలో మంకీ ఫీవర్ వ్యాప్తి ఉంది. ఇక కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో గల అటవీ ప్రాంతంలో గత మూడేళ్ల నుంచి వరసగా ఈ వ్యాధి కనిపిస్తోంది.