breaking news
kalwakurthy Assembly constiuency
-
కల్వకుర్తి నియోజకవర్గంలో తదుపరి అధికారం ఎవరిది?
కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన జైపాల్ యాదవ్ మూడోసారి గెలిచారు. గతంలో రెండుసార్లు టిడిపి పక్షాన గెలిచిన యాదవ్, టిఆర్ఎస్ లో కి వచ్చి పోటీచేసి విజయం సాదించారు. జైపాల్ యాదవ్ తన సమీప బిజెపి ప్రత్యర్ది తల్లోజు ఆచారిపై 3447 ఓట్ల ఆదిక్యతతో గెలిచారు. ఇక్కడ 2014లో గెలిచి సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ ఐ అభ్యర్ది వంశీచంద్ రెడ్డి మూడోస్థానానికి పరిమితం అవడం విశేషం. ఆయన కు 46523 ఓట్లు వచ్చాయి. కాగా గెలిచిన జైపాల్ యాదవ్కు 62892 ఓట్లు రాగా, ఆచారికి 59445 ఓట్లు వచ్చాయి. జైపాల్ యాదవ్ సామాజికవర్గం పరంగా యాదవ వర్గానికి చెందినవారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 2014లో ఆసక్తికర ఘట్టం చోటు చేసుకుంది. ఇక్కడ కౌంటింగ్ ముగిసే సమయానికి వంశీచంద్రెడ్డి సుమారు 150ఓట్ల ఆధిక్యతలో ఉండగా, చివరన ఒక ఇవిఎమ్. మొరాయించింది. దాంతో ఆ పోలింగ్ బూత్ పరిదిలో ఎన్నికల సంఘం రీపోల్ నిర్వహించింది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆ రీపోల్ తర్వాత 72 ఓట్ల ఆధిక్యతతో యువజన కాంగ్రెస్ అద్యక్షుడుగా కూడా ఉన్న వంశీచంద్ రెడ్డి బిజెపి-టిడిపి కూటమి అభ్యర్ధి టి. ఆచారిపై గెలుపొందారు. కాని 2018లో ఓటమి చెందారు. 2014 ఎన్నికలకు ముందు టిడిపికి గుడ్ బై చెప్పి టిఆర్ఎస్లోకి మారి పోటీచేసిన అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 29844 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో మిగిలారు. 2018లో గెలవగలిగారు. కేంద్రమంత్రి ఎస్.జైపాల్రెడ్డి గతంలో నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన కల్వకుర్తి నియోజకవర్గానికి విశేష ప్రాధాన్యం ఉంది. తెలుగుదేశం పార్టీని స్థాపించి సంచలనం సృష్టించి, వందల మందికి రాజకీయ జీవితాన్ని అందించిన నందమూరి తారకరామారావు 1989లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోవడం ఒక పెద్ద విశేషం. ఎన్.టి.ఆర్.పై కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన జె.చిత్తరంజన్ దాస్ గెలిచారు. ఇక్కడ వై.కిష్టారెడ్డి రెండుసార్లు, గెలిచారు. జె. చిత్తరంజన్దాస్ రెండుసార్లు గెలిచారు. కేంద్రమంత్రి ఎస్.జైపాల్రెడ్డి రాజకీయ జీవితం ఇక్కడ నుంచే ఆరంభమైంది. ఆయన 1969లో జరిగిన ఉప ఎన్నిక ద్వారా తొలిసారి గెలిచి (సిట్టింగ్ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కోర్టు తీర్పురావడంతో ఉప ఎన్నిక జరిగింది) ఆ తర్వాత వరసగా మరోమూడుసార్లు గెలుపొందారు. జైపాల్రెడ్డి మహబూబ్నగర్, మిర్యాలగూడలలో రెండేసిసార్లు లోక్సభకు ఎన్నికై 2009లో చేవెళ్ళ నుంచి లోక్సభక ఎన్నికయ్యారు. కాని 2014లో మహబూబ్నగర్లో లోక్సభకు పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. 1980లో ఇందిరాగాంధీపై పోటీచేసి జైపాల్రెడ్డి, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఐలో చేరి కేంద్రమంత్రి కావడం విశేషం. అంతకుముందు యున్కెటెడ్ఫ్రంట్ హయాంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. కల్వకుర్తిలో మరోసారి కూడా ఎన్నిక చెల్లకుండా పోవడం వల్ల ఉప ఎన్నిక జరిగంది. కోర్టు తీర్పు కారణంగా 1962లో గెలిచిన అభ్యర్ధి వెంకటరెడ్డి ఎన్నిక చెల్లకుండా పోవడంతో జరిగిన ఉప ఎన్నికలో శాంతాబాయి గెలిచారు. శాంతబాయి ఇక్కడ రెండుసార్లు మక్తల్లో ఒకసారి, గగన్మహల్లో మరోసారి మొత్తం నాలుగుసార్లు గెలిచారు. 1989లో ఎన్.టి.ఆర్.ను ఓడిరచిన చిత్తరంజన్దాస్కు చెన్నారెడ్డి మంత్రివర్గంలో స్థానం లభించింది. కల్వకుర్తి నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ఐ జనతా పార్టీ రెండుసార్లు, టిడిపి రెండుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, ఇండిపెండెంట్లు మూడుసార్లు గెలిచారు. కల్వకుర్తిలో ఎనిమిదిసార్లు రెడ్డి సామాజికవర్గం, ఆరుసార్లు బిసి వర్గం నేతలు, రెండుసార్లు బ్రాహ్మణ నేత, రెండుసార్లు ఎస్.సి.నేతలు ఎన్నికయ్యారు. కల్వకుర్తి నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
కల్వకుర్తి ఫలితానికి బ్రేక్
పాలమూరు, న్యూస్లైన్: ఆ కౌంటింగ్ హాల్ వద్ద ఉదయం 7 గంటల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పడిగాపులు కాశారు.. ‘మా పార్టీ అభ్యర్థి గెలుపు సాధిస్తారంటే.. కాదు మా పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అవుతారంటూ ’ పోటా పోటీ గా నినాదాలు చేస్తూ ఉత్కంఠతో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూశారు. చివరి రౌండ్ రానే వచ్చింది.. ఆ రౌండ్ పూర్తయితే.. 633 ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం బయటపడేది.. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలోని 119 నంబర్ పోలింగ్ బూత్కు చెంది న ఈవీఎం సాంకేతికలోపం కారణంగా పనిచేయలేదు. దీంతో ఓట్ల లెక్కింపు నిలిచిపోయిం ది. నిపుణులు వచ్చి బాగుచేస్తే ఫలితాలు వెల్లడిస్తారేమోనని.. అం తా రాత్రి 9.30 గంటల వరకు ఎదురు చూపులు చూశారు. కౌటింగ్ కేం ద్రం నిర్వహణాధికారులు ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అవకాశం లేదని చెప్పడంతో ఉసూరంటూ అన్ని పార్టీలకు చెందిన వారు ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. కల్వకుర్తి 1వ రౌండ్ నుంచి 28వ రౌండ్ వర కు నువ్వా.. నేటా అన్న ట్లు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్రెడ్డి, బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి మధ్య తీవ్రపోటీ ఏర్పడింది. కొన్ని రౌండ్లలో ఒకరు ముందంజలో నిలిస్తే.. అతర్వాత రౌండ్లలో మరొకరు మరొకరు ఆధిక్యతను ప్రదర్శించారు. ఆతర్వాత 32వ రౌండ్ వరకు ఆచారి ఆధిక్యతను ప్రదర్శించగా.. ఆతర్వాతి రౌండ్లలో వంశీచందర్ ఓటుశాతాన్ని పెంచుతూ వచ్చారు. చివరిరౌండ్ వచ్చేటప్పటికి 32 ఓట్ల ఆధిక్యతతో వంశీచందర్కు 42229 ఓట్లు నమోదయ్యాయి. ఆచారికి 42,197 ఓట్లు పోలయ్యాయి. చివరి రౌండ్ పూర్తయితేగాని వీరిద్దరిలో విజయం ఎవరిని వరించేదో తేటతెల్లమయ్యేది. చివరన ఈవీఎం పనిచేయకపోవడంతో ఫలితాలు నిలిచిపోయి. వీరితోపాటు కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పోటీ చేసిన వారిలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుర్క జైపాల్ యాదవ్కు 29,687 ఓట్లు, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎడ్మకిష్టారెడ్డికి 13,734 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి కె.నారాయణరెడ్డికి 23,999 ఓట్లు పోలయ్యాయి. బీఎస్పీ అభ్యర్థి కె.జంగయ్యకు 1892, ఆర్ఎల్డీ అభ్యర్థి వి.హుస్సేన్కు 916, స్వతంత్ర అభ్యర్థులు బాలాజీ సింగ్ ఠాకూర్కు 3,212, దోనాల క్రిష్ణారెడ్డికి 687, ఎత్తం శ్రీనివాస్కు 651 ఓట్లు దక్కాయి. ఇక పోతే నోటాకింద 1132 ఓట్లు పోలైనట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈసీ ఆదేశిస్తే..! ప్రెసెంట్ ఎక్సీడెడ్ సాంకేతిక లోపం కారణంగా.. ఈ వీఎం మొరాయించింది. కల్వకుర్తి నియోజకవర్గం జూపల్లి గ్రామానికి చెందిన 119 నంబర్ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక ఈవీఎం మెషిన్ మొరాయించడంతో కౌంటింగ్ నిలిచిపోయింది. ఈ పోలింగ్ బూత్ పరిధిలో 633 ఓట్లు పోలయ్యాయి. ఈ మొత్తాన్ని లెక్కించాల్సి ఉండగా.. సాంకేతిక లోపం ఏర్పడటంతో తాత్కాలికంగా నిలపాల్సి వచ్చింది. ఈ సాంకేతిక లోపం నిపుణుల ద్వారా సరిదిద్దగలిగితే కౌంటింగ్ పూర్తిచేసి ఫలితాలు ప్రకటిస్తాం, ఒక వేళ ఈవీఎం పనిచేయకుంటే ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే.. ఆమేరకు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. - కలెక్టర్ ఎం.గిరిజాశంకర్