breaking news
iwmc
-
ఇలా పెంచారు..అలా తగ్గించేశారు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రకటించిన మేరకు తమకూ 30% వేతనం పెరిగిందన్న సంతోషం.. ఆ ఉద్యోగులకు మూడునాళ్ల ముచ్చటే అయింది. 2 నెలల పాటు వేతనాన్ని పెంచినట్లే పెంచిన ఉన్నతాధికారులు.. కొత్త సంవత్సరం రోజున గతంలో పెంచిన మొత్తాన్ని కూడా ఈ నెల వేతనం నుంచి మినహాయిం చడం వారికి ఎంతమాత్రం మింగుడు పడటం లేదు. వేతన బకాయిలు రాక, ఈ నెల వేతనంలో భారీగా కోత పెట్టడంతో ఉద్యోగుల కుటుం బాలు పస్తులుండా ల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని ఇంటిగ్రేటెడ్ వాటర్షెడ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ (ఐడబ్ల్యూఎంపీ)లో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ప్రాజెక్ట్ ఆఫీసర్ల దుస్థితి ఇది. మూడేళ్లుగా ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని (ఐటీడీఏ)గిరిజన ప్రాంతాల్లో కాంట్రాక్ట్ పద్ధతిన ప్రాజెక్ట్ అధికారులుగా సేవలందిస్తున్న వీరిని నిబంధనల ప్రకారం రెండేళ్ల అనంతరం హెచ్ఆర్ పాలసీలోకి తీసుకోవాల్సి ఉంది. ఆ మేరకు వీరంద రికి ఫిక్స్డ్ టెన్యూర్ ఎంప్లాయీస్ (ఎఫ్టీఈస్)గా గ్రామీణాభివృద్ధి శాఖ గుర్తింపు లభించాల్సి ఉంది. పీవోలను ఎఫ్టీఈస్గా మార్చడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిం చడంతో ప్రభుత్వం వేతనాలను పెంచినా, వీరికి అందు కునే యోగ్యత లేకుండా పోయింది. గత అక్టోబర్ నెలలో గ్రామీణా భివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), ఉపాధిహామీ పథకాలలో పనిచేస్తున్న 8 వేల మంది ఉద్యోగులకు 30% మేర వేతనాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు ఇతర ఉద్యోగులతో పాటుగా ఐడబ్ల్యూఎంపీలో ప్రాజెక్ట్లో పనిచేస్తున్న పీవోలకు కూడా 30% చొప్పున వేతనాన్ని (రూ.20 వేల నుంచి రూ.26 వేలకు) పెంచిన ఉన్నతాధి కారులు.. రెండు నెలల తర్వాత ప్రభుత్వమిచ్చిన వేతన పెంపు మీకు వర్తించ దంటూ రెండు నెలల్లో అదనంగా వచ్చిన రూ.12 వేల మొత్తాన్ని వెనక్కి తీసుకున్నారు. పాత బకాయిలను పట్టించుకోరాయె.. ఐడబ్ల్యూఎంపీ ప్రాజెక్ట్కు నిధుల కొరత ఉందంటూ గతేడాది మే, జూన్ నెలల్లో పీవోలకు వేతనాన్ని ఇవ్వని ఉన్నతాధికారులు, ఆరు నెలలు దాటినా బకాయిల గురించి పట్టించుకోవడం లేదని కాంట్రాక్ట్ ఉద్యోగులు వాపోతున్నారు.. ఓ వైపు వేతన బకాయిలు ఇవ్వకుండా, మరోవైపు పెంచిన వేతనాన్ని ఈ నెల వేతనం నుంచి కట్ చేయడంతో నెలరోజుల పాటు తమ కుటుంబాలు ఎలా గడవాలని వారంతా ప్రశ్నిస్తున్నారు. వాటర్ షెడ్ ప్రాజెక్ట్ను కూడా ఉపాధిహామీ పథకంలో భాగంగా ప్రభుత్వం చేపట్టినందున తమకు వెంటనే వేతన పెంపును వర్తింప జేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
తెలంగాణకు 50 మెగా వాటర్షెడ్ ప్రాజెక్టులు
తెలంగాణకు 50 మెగా వాటర్షెడ్ ప్రాజెక్టులు ఎనిమిది జిల్లాల్లోని రెండు లక్షల హెక్టార్లకు ప్రయోజనం సాక్షి, హైదరాబాద్: సమీకృత వాటర్షెడ్ నిర్వహణ కార్యక్రమం(ఐడబ్ల్యూఎంపీ) కింద తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 50 మెగా వాటర్షెడ్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ (వాటర్షెడ్స్) 2014-15 సంవత్సరానికి సంబంధించి పంపిన ప్రతిపాదనలకు ఐడబ్ల్యూఎంపీ స్టీరింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర భూవనరుల శాఖ నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. దీంతో ఈ ప్రాజెక్టులకు పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేస్తూ శనివారం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి జె.రేమండ్ పీటర్ ఉత్తర్వులిచ్చారు. కొత్తగా మంజూరైన ప్రాజెక్టుల వల్ల ఎనిమిది జిల్లాల పరిధిలోని రెండు లక్షల హెక్టార్ల భూమికి ప్రయోజనం కలగనుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఏమిటీ డ్రామా..?
సాక్షిప్రతినిధి, నల్లగొండ :జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) పరిధిలో అమలవుతున్న సమగ్ర నీటి యాజమాన్య ప్రాజెక్టు (ఐడబ్ల్యూఎంపీ) అవినీతికి చిరునామాగా మారుతోంది. ఉన్నతాధికారుల పట్టింపులేనితనం... ద్వితీయ శ్రేణి అధికారుల కుమ్మక్కు ఫలితంగా ప్రాజెక్టు అధికారుల్లో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అధికారులు కొందరు తమ సొంత వాహనాల్లోనే తిరుగుతూ బినామీ పేర్లపై బిల్లులు ఎత్తుతున్నారు. ఒకవేళ వాహనం ఎవరిదైతేనేమి, ఎలాగూ ఏదో ఒక వాహనాన్ని అద్దెకు తీసుకోవాల్సిందే కదా అని సమాధానపరిచే మాటలు మాట్లాడినా.. తిరుగుతున్న కిలోమీటర్లలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. చూడడానికి చిన్నవిషయంగా కనిపిస్తున్నా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమవుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. డ్వామా పరిధిలో అమలవుతున్న సమగ్ర నీటి యాజమాన్య ప్రాజెక్టులో భాగంగా వాటర్షెడ్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. వీటి పర్యవేక్షణకు జిల్లాలో 9 ప్రాజెక్టులున్నాయి. ఈ తొమ్మిది ప్రాజెక్టుల్లో ప్రాజెక్టు అధికారుల (పీఓ)కు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. నెలకు 2500 కిలోమీటర్ల పరిమితితో రూ.24వేలు అద్దె చెల్లించేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే వీరిలో అత్యధికులు తమ సొంతూళ్ల నుంచి పనిచేసే చోటుకు నిత్యం వస్తూ పోతున్నారు. వాస్తవానికి పనిచేసే చోటే నివాసం ఉండాలి. కానీ, నిత్యం తిరగడం వల్ల వాహనాలు తిరిగే కిలోమీటర్లు పెరిగిపోతున్నాయి. తమ సొంత వాహనాలకు బినామీ పేర్ల మీద కొందరు బిల్లులు ఎత్తేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో పీఓలకు డ్వామాలోని ఓ ద్వితీయశ్రేణి అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయని సమాచారం. నల్లగొండ పీఓ వినియోగిస్తున్న వాహన యజమాని పేరు జలందర్రెడ్డి కాగా, అద్దె మాత్రం పి.కృపాదానం అనే వ్యక్తి పేరున చెల్లించారు. ఆరా తీస్తే సదరు కృపాదానం అనే వ్యక్తి కూతురే నల్లగొండ పీఓ అని తేలింది. ఈ వాహనం తిరిగిన కిలోమీటర్ల రీడింగుల్లోనూ అన్నీ తప్పులే. నల్లగొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఎదురు సందులో ఉన్న పీఓ కార్యాలయం నుంచి తెలుగు మహిళా ప్రాంగణ సమీపంలోని డ్వామా ఆఫీసులో అడిషనల్ పీడీ సమావేశానికి వెళ్లి రావడానికి 30 కిలోమీటర్లు తిరిగినట్లు ఒక రోజు, మరో రోజు ఏకంగా 45 కిలోమీటర్లు చూపించారు. నల్లగొండ నుంచి కనగల్ ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి రావడానికి 72 కిలోమీటర్లు, అదే తహసీల్దార్ కార్యాలయానికి అయితే ఏకంగా 98 కిలోమీటర్ల రీడింగ్ చూపించారు. ఒకే ఊళ్లో ఉన్న రెండు ఆఫీసుల మధ్య దూరం 26 కిలోమీటర్లు ఉంటుందా అన్నది అధికారులకే తెలియాలి. కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పర్తికి మన టీవీ కార్యక్రమం కోసం వెళ్లి రావడానికి 68 కిలోమీటర్లు అయ్యిందట. దేవరకొండ పీఓ వాహన రీడింగుల్లోనూ కావాల్సినన్ని తప్పులు ఉన్నాయి. దేవరకొండ నుంచి నల్లగొండ ఆఫీసుకు మీటింగ్కు వచ్చిపోతే ఏకంగా 210 కిలోమీటర్లు తిరిగినట్లు రీడింగ్ చూపించారు. కానీ దేవరకొండ నుంచి నల్లగొండకు మహా అయితే 55 కిలోమీటర్లు మాత్రమే. ఇక, దేవరకొండ నుంచి హైదరాబాద్ ఆఫీసుకు సమావేశాల నిమిత్తం వెళ్లి వస్తే 350 కిలోమీటర్ల రీడింగ్ రాశారు. వాస్తవానికి దేవరకొండ నుంచి హైదరాబాద్ కేవలం 107 కిలోమీటర్లు. అప్ అండ్ డౌన్, లోకల్గా తిరిగినా 250కిలోమీటర్లు దాటకూడదు. నాంపల్లి పీఓ సైతం ఒకే గ్రామాలకు వేర్వేరు తేదీల్లో ప్రయాణించి కిలోమీటర్లు వేర్వేరుగా చూపించారు. తేదీలు మారితే, నెల మారితే తిరిగిన దూరం కూడా మారిపోయింది. కుర్మేడు, వింజమూరుకు వె ళ్లి నాంపల్లికి తిరిగి రావడానికి ఒకసారి 126 కి.మీ., ఇవే గ్రామాలకు మరో రోజు 195 కి.మీ.గా పేర్కొన్నారు. అదే మాదిరిగా, తక్కల్లపల్లి, కుర్మేడుకు పోయిరావడానికి ఒకసారి 2కి.మీ, ఇదే గ్రామాలకు మరోసారి 194కి.మీగా చూపించారు. ఇదేలా సాధ్యమో వారికే తెలియాలి..ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. కోట్లాది రూపాయల వ్యయంతో చేపడుతున్న వాటర్ షెడ్ కార్యక్రమాల్లో నిధుల దుర్వినియోగం దండిగా జరుగుతోం దన్న ఆరోపణలకు వాహనాల అద్దె చెల్లింపులు, సొంత వాహనాల్లో తిరుగుతూ ఇష్టానుసారం రాస్తు న్న రీడింగులు ఓ ఉదాహరణగా నిలుస్తున్నాయి. పనిచేసేది ఒకచోట... ఉండేది మరోచోట నల్లగొండ ప్రాజెక్టు అధికారి హైదరాబాద్ నుంచి నల్లగొండకు రాకపోకలు సాగిస్తున్నారు. తిప్పర్తి ప్రాజెక్టు అధికారి మోత్కూరు నుంచి నిత్యం వచ్చి పోతున్నారు. దేవరకొండ పీఓ సైతం మోత్కూరు నుంచి దేవరకొండ షటిల్ సర్వీసు చేస్తున్నారు. నాంపల్లి ప్రాజెక్టు అధికారి హైదరాబాద్ నుంచి అప్డౌన్ చేస్తున్నారు. ఇలా నిత్యం తిరగడానికి వారు వాడుతోంది అద్దె (సొంత) వాహనాలే. క్షేత్ర స్థాయి పర్యటనలకు మాత్రమే వినియోగించాల్సిన వాహనాలను సొంతానికి వాడుతూ వేలాది రూపాయలు బిల్లుల రూపం లో తీసుకుంటున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన సమాచారం మేరకు ఐడబ్ల్యూఎంపీ పీఓల చేతివాటం ఔరా అనిపిస్తోంది.