breaking news
implementation problem
-
బ్యాంకుల్లో గవర్నెన్స్ లోపాలు
ముంబై: కార్పొరేట్ గవర్నెన్స్కి సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలు ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకుల్లో వాటి అమలు తీరులో మాత్రం లోపాలు ఉన్నట్లు తేలిందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. వాటిని అధిగమించగలిగామని, లేకపోతే ఎంతో కొంత ఒడిదుడుకులు తలెత్తేవని ఆయన పేర్కొన్నారు. ‘కార్పొరేట్ గవర్నెన్స్పై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, బ్యాంకింగ్ రంగంలో ఒడిదుడుకులకు దారి తీసేలా కొన్ని బ్యాంకుల్లో గవర్నెన్స్పరమైన లోపాలు బైటపడటం ఆందోళనకరమైన విషయం‘ అని బ్యాంక్ బోర్డుల డైరెక్టర్లతో సోమవారం జరిగిన సమావేశంలో దాస్ పేర్కొన్నారు. బ్యాంకుల బోర్డులు, యాజమాన్యాలు ఇలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ మోసాలు.. మొండిపద్దులపరమైన ఒత్తిళ్లను దాచి పెట్టేందుకు, కృత్రిమంగా ఆర్థిక పనితీరును గొప్పగా చూపించుకునేందుకు బ్యాంకులు ‘స్మార్ట్ అకౌంటింగ్’ విధానాలను ఆశ్రయించడాన్ని దాస్ తీవ్రంగా తప్పు పట్టారు. ఇందుకోసం బ్యాంకులు పాటిస్తున్న విధానాలను ప్రస్తావించారు. ఖాతాల్లో మొండిబాకీల భారాన్ని తగ్గించుకునేందుకు ఒక బ్యాంకు మరొక బ్యాంకుకు సందర్భాన్ని బట్టి తమ రుణాలను విక్రయించి, తిరిగి బైబ్యాక్ చేయడం .. రుణగ్రహీత చెల్లించాల్సిన రీపేమెంట్లను అంతర్గతంగా ఖాతాల్లో సర్దుబాటు చేయడంలాంటివి వీటిలో ఉన్నట్లు దాస్ పేర్కొన్నారు. -
సంస్కరణల అమలు పెద్ద సమస్య
ముంబై: సంస్కరణల అమలు భారత్కు ప్రధాన సవాల్ అని అంతర్జాతీయ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పింకస్ సీఈవో చార్లెస్ కేయ్ తెలిపారు. సహజంగా అవకాశాలతోపాటే సవాళ్లూ ఉన్నాయని చెప్పారు. వ్యవసాయం, కార్మికులకు సంబంధించి భారత్ చేపట్టిన సంస్కరణల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బుధవారం జరిగిన గ్లోబల్ బిజినెస్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. ‘అధిక వృద్ధి కలిగిన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు భారత్కు జనాభా వంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు జనాభా ఒక్కటే సరిపోదు. ఈ స్థాయి వృద్ధికి నిరంతర చర్యలు, నిఘా ఉండాలి. 1995లో భారత్లో తొలిసారిగా హెచ్డీఎఫ్సీలో పెట్టుబడి చేశాం. నాటి నుంచి పోలిస్తే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది పరిస్థితి. అయితే సంస్కరణల అమలే సవాల్. సవాళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అవి భారత్కు బహిరంగ ప్రశ్నలు. ప్రస్తుత మహమ్మారి విస్తృతి నేపథ్యంలో ప్రభుత్వం స్పందించిన తీరు ఆహ్వానించదగ్గది. ప్రభుత్వం సరిగా స్పందించలేదంటూ దేశీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను బ్యాంకింగ్ రంగానికి వదిలేశారు. ఆర్బీఐ, మారటోరియం ద్వారా వ్యవస్థకు మద్ధతు ఇచ్చారు. దీని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి’ అని అన్నారు. ‘‘లాక్డౌన్ ముందుగానే విధించడం వల్ల ఆరోగ్య రంగం బలపడింది. దీంతో కేసులు పెరుగుతున్నా ఈ రంగం నిలబడింది’’ అని ఆయన విశ్లేషించారు. -
ఆకర్షించని నగరాలు
ఆర్భాటమేగానీ... కానరాని ఆచరణ స్మార్ట్ సిటీలపై చిత్తశుద్ధి కరువు ఒక్కవార్డులోనూ అమలుకు నోచుకోని పథకం వనరులు, నిధులు విడుదలపై ఊసెత్తని పాలకులు విజయనగరం మున్సిపాలిటీ : ప్రతి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దుతామని ఆర్భాటంగా పాలకులు చేసిన ప్రకటన ఇప్పటికీ కార్యరూపం దాల్చడంలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రకటించిన కార్యక్రమం జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు పట్టణ ప్రాంతాల్లోని ఒక్క వార్డులోనూ అమలుకునోచుకోలేదు. ఏడాదిన్నర క్రితం మున్సిపల్ పాలకవర్గాలు స్మార్ట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు కేవలం బూటకమని తేలిపోయింది. దత్తత విధానం కాదని.... రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన చిన్న పాటి పట్టణాల నుంచి పెద్ద నగరాలను సైతం స్మార్ట్ సిటీలుగా తయారు చేయాలనే భావనతో ఆరునెలల క్రితం స్మార్ట్ వార్డుల పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. గతంలో ఆయా ప్రాంతాలను, పట్టణాలను స్మార్ట్గా తీర్చిదిద్దేందుకు దత్తత విధానాన్ని తెరపైకి తీసుకురాగా.. ఏ ఒక్క శ్రీమంతుడూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రాలేదు. ఇక తప్పదని రాష్ట్ర ప్రభుత్వమే కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగరపంచాయతీల్లో మొత్తం వార్డుల్లో 20 శాతం వార్డులను 2016 మార్చి నెలాఖరులోగా స్మార్ట్గా తీర్చిదిద్దాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పలు నిబంధనలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇలా దశల వారీగా స్మార్ట్ వార్డులను తీర్చిదిద్దూతూ స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగానే విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో వైస్ చైర్మన్ కనకల మురళీమోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్న 9వ వార్డుతో పాటు 3, 5, 13, 15, 22, 24, 32 వార్డులను ఎంపిక చేశారు. తరువాత బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో వార్డులను ఎంపిక చేస్తారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ వార్డు ప్రజలకు కష్టాలు తీరినట్లేనన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఐదు పట్టణప్రాంతాల్లో ఎంపిక చేసిన ఏ ఒక్క వార్డులోనూ ఈ పథకం అమలుకు నోచుకోలేదు. పైగా గతంలో కన్నా పరిస్థితులు దయనీయంగా మారిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్మార్ట్ వార్డుగా మారాలంటే... ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం పట్టణప్రాంతాల్లో వార్డులు స్మార్ట్గా రూపుదిద్దుకోవాలంటే ప్రధానంగా ఐదు అంశాలు అమలు చేయాల్సి ఉంది.వార్డు పరిధిలో గల గృహాలన్నింటికీ శతశాతం మంచి నీటి కుళాయి కనెక్షన్లు కల్పించాలి. నిరంతరం వాటి ద్వారా నీటి సరఫరా చేయాలి.శతశాతం వార్డులోని గృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ఇంటింట చెత్త సేకరణ పక్కాగా నిర్వహించటంతో పాటు సేకరించిన చెత్తను కుప్పలుగా వదిలేయకుండా ఎప్పటికప్పుడు డంపింగ్యార్డుకు తరలించాలి. తడి పొడిచెత్తలను వేరు చేయాలి. స్మార్ట్కు ఎంపిక చేసిన వార్డుల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలి. వార్డు పరిధిలో ప్రధాన జంక్షన్లు ఉంటే అక్కడ మొక్కలు నాటాలి. నీటి సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు నిర్మించాలి. వీటితో పాటు జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో అమలు చేయాల్సిన 20 అంశాల్లో ప్రగతి సాధించాలి.