breaking news
IAS trainee
-
పూజా ఖేడ్కర్ హంతకురాలో, తీవ్రవాదో కాదు: సుప్రీంకోర్టు
ఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్కు బెయిల్ మంజూరైంది. నకిలీ సర్టిఫికెట్ కేసులో బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు.. పూజ హంతకురాలో, తీవ్రవాదో కాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కేసు తీవ్రత, వాస్తవాలు, పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని.. పిటిషనర్కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసి ఉండాల్సిందంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.ఇప్పుడు పూజ అన్నీ కోల్పోయింది.. ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరికే అవకాశం కూడా లేదన్న ధర్మాసనం.. ఈ కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని సూచించింది. కాగా, నకిలీ సర్టిఫికెట్లతో ఐఏఎస్కు ఎంపికైన పూజ ఖేడ్కర్ను శిక్షణ నుంచి యూపీఎస్సీ తొలగించిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఖేద్కర్పై ఆరోపణలు ఉన్నాయి. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో గత ఏడాది ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పడింది. సివిల్ సర్వీసెస్కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది.అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
లంచం కొట్టా.. ఐడీ కార్డు పట్టా!
డెహ్రాడూన్: అది ఐఏఎస్లు, ఐపీఎస్లకు శిక్షణ ఇచ్చే సంస్థ.. కట్టుదిట్టమైన భద్రత గల ఆ ప్రతిష్టాత్మక సంస్థ ఉగ్రవాదుల హిట్ లిస్ట్లో కూడా ఉంది! అలాంటి సంస్థలోకి ఓ మహిళ.. ఐఏఎస్ ట్రెయినీనంటూ అక్రమంగా ప్రవేశించింది. ఒకట్రెండు రోజులు కాదు ఏకంగా ఆరు నెలలపాటు అందులోనే ఉండి ఇటీవలే ఉడాయించింది. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసును విచారించేకొద్దీ మరిన్ని విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు అకాడమీలోని ఓ డిప్యూటీ డెరైక్టరే నకిలీ ఐడీ కార్డు మంజూరు చేశారని సదరు మహిళ వెల్లడించింది. అందుకు ఆయనకు మూడు విడతల్లో రూ.5 లక్షలు లంచం ఇచ్చానంది. ఆ మహిళను ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన రూబీ చౌదరీగా గుర్తించిన పోలీసులు.. ప్రస్తుతం స్థానిక నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. అకాడమీలో లైబ్రేరియన్ ఉద్యోగం ఇప్పిస్తానని ఉన్నతాధికారి ఒకరు హామీ ఇచ్చారని, అందుకు రూ.20 లక్షల బేరం కూడా కుదిరిందని రూబీ తెలిపింది. ఇందులో భాగంగా ముందుగా రూ.5 లక్షలు ఇచ్చానని, మిగతా మొత్తం ఇచ్చేందుకు సిద్ధమయ్యానని వివరించింది. మార్చి 27న అకాడమీ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని, అందుకు తనకు భారీ మొత్తంలో సొమ్ము ఇవ్వజూపారన్నారు. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు ఉత్తరాఖండ్ డీజీపీ బీఎస్ సిద్ధు.. మహిళా ఐపీఎస్ అధికారి నేతృత్వలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్లు గురువారం వెల్లడించారు. -
ప్రొఫెషనల్స్ టు సివిల్స్
కష్టతరమైన లక్ష్యాలు సాధించాలి తద్వారా ఇతరుకు మేలు చేయాలి ఐఏఎస్గా సవకు అవకాశాలు ఎక్కువ జిల్లాకు వచ్చిన ట్రైనీ ఐఏఎస్ల మనోగతం వాళ్లంతా నవ యువత.. బీటెక్ కొందరు... ఎంటెక్ మరికొందరు... ఎంబీబీఎస్ ఇంకొందరు పూర్తి చేశారు. వారిలో చాలామంది నెలకు ఆరంకెల జీతం సంపాదిస్తున్న వారూ ఉన్నారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చునే సాఫ్ట్వేర్ రంగంకన్నా తాము కష్టపడుతూ ఇతరులకు చేసేసేవ దేశ భవిష్యత్కు పునాది వేస్తుం దని తలంచారు. అందుకే కఠోర శ్రమతో సివి ల్స్ రాసి మంచి ర్యాంకులతో ఎంపికయ్యారు. వారి శిక్షణ కాలం కొద్దిరోజుల్లో ముగియనుంది. ఆ తర్వాత అంతా ఐఏఎస్ హోదాతో విధుల్లో చేరుతారు. శిక్షణ చివరి అంకంలో భాగంగా భా రత్ దర్శన్ యాత్ర చేపట్టారు. అందులో భాగం గా గురువారం జిల్లాకు వచ్చారు. కలెక్టరేట్లో కలెక్టర్ కరుణ, జేసీ ప్రశాత్ పాటిల్తో సమావేశమయ్యారు. అనంతరం జిల్లాలో వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధిసంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ‘హరిత కాకతీయ’ హోటల్లో విడిది చేసిన వారు తమ లక్ష్యాలు.. ఆశయాలు.. కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత పాల నా వ్యవస్థ తీరు తదితర అశాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు వారి మాటల్లో.. - హన్మకొండ అర్బన్ ట్రైనీ ఐఏఎస్లకు స్వాగతం మట్టెవాడ : ముస్సోరి నుంచి గురువారం కోణార్క్ ఎక్స్ప్రెస్లో వరంగల్కు వచ్చిన 18 మంది ట్రెరుునీ ఐఏఎస్లకు వరంగల్ తహసీల్దార్ ఎన్.రవి రైల్వేస్టేషన్ వద్ద స్వాగతం పలికారు. ఈ నెల 8 వరకు స్టడీ టూర్లో భాగంగా వారు వరంగల్లో ఉంటారని తహసీల్దార్ వివరించారు. 18 మంది ఐఏఎస్లు ఒకేసారి వరంగల్కు రావడంంతో స్టేషన్ కళకళలాడింది. డాక్టర్గానే ఉండి పొమ్మన్నారు మాది కేరళ రాష్ట్రం ఐఏ ఎస్కు సెలక్ట్ కాక ముందు ఎంబీబీఎస్ పూర్తి చేశా. రెండేళ్లు ప్రాక్టీస్ కూడా చేశాను. నాన్న శ్రీహరికోటలో ఐబీఆర్ఓగా పనిచేశారు. ఇంట్లో మాత్రం డాక్టర్గా కంటిన్యూ కమ్మన్నారు. వాళ్లను కన్విన్స్ చేసి ఇటువైపు వచ్చాను. చిన్ననాటి నుంచి ఐఏఎస్ కావాలన్నది నాకలగా ఉండేది. నాకు చదువుతోపాటు పాటలు పాడటం, డ్యాన్స్ చాలా ఇష్టం. స్కూల్ స్థాయిలో పాల్గొన్న ప్రతి పోటీలో బహుమతులు గెలిచేదానిని. ఆ తర్వాత ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు ఇప్పించేవారు. అలాంటి ప్రముఖుల్లో ఎక్కువగా ఐఏఎస్ అధికారులే ఉండేవారు. అలా.. నేను కూడా ఓ ప్రముఖ స్థానంలో ఉండాలని. అందరికీ సేవ చేయాలని అనిపించేది. అందుకే ఎంబీబీఎస్ చదివినా ఐఏఎస్ లక్ష్యం మాత్రం మర్చిపోలేదు. యువత ఎవరైనా తమ ల క్ష్యాన్ని మరువొద్దు. - దివ్య అయ్యర్, కేరళ భారత్ దర్శన్ ఏన్నో నేర్పుతుంది క్లాస్ రూంలో ఉండి చదివే వాటికన్నా క్షేత్రస్థాయి పర్యటనలు చక్కని పాఠాలు నేర్పుతాయి. ప్రస్తుతం మాకు శిక్షణ కాలంలో భారత్ దర్శన్ యాత్ర చక్కటి అనుభూతిగా మిగులుతుంది. ఈ టూర్లో ఎన్నో నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా మన దేశంలో అవినీతి... బాధ్యతారాహిత్యం అన్నవి అతిపెద్ద సమస్యలు.. సవాళ్లుగా ఉన్నాయి. వాటిని ఏ ఒక్కరూ పూర్తిగా రూపుమాపలేరు. ఎవరికి వారు తమవంతుగా కృషి చేయాలి. ఈ అవకాశం పరిపాలనాపరంగా ఐఏఎస్ స్థాయి వారికి ఎక్కువగా ఉంటుంది. అందుకే అండమాన్, నికోబార్ వంటి ప్రాంతాల్లో సాఫ్ట్వేర్ రంగంలో కొంతకాలం పనిచేశాక ఈ రూట్ ఎంచుకున్నా. ఏడేళ్ల కిత్రం రోడ్డు ప్రమాదంలో నాన్న చనిపోయారు. అన్నయ్య మా బాధ్యతలు తీసకుని దిశానిర్ధేశం చేశారు. అన్ని పరిస్థితులు చూసి లక్ష్యం సాధించాలని ముందుకు సాగా. - లోకేష్, బీటెక్ కంప్యూటర్స్, మధ్యప్రదేశ్ క్యాడర్ దేశం గొప్పగా ఉంది..పేదల పరిస్థితి దారుణంగా ఉంది మన దేశానికి ఘనమైన చరిత్ర ఉంది. ఇతర దేశా ల్లో మనవాళ్లే ఎక్కు రంగా ల్లో సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్నారు. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతా ల్లో.. మారుమూల పల్లెల్లో పరిస్థితులు, ప్రజల జీవన స్థితిమరీ దారుణంగా ఉంది. ఇంత తేడా ఉండటానికి బలమైన కారణం వ్యవస్థలో ఎక్కడో లోపం జరుగుతోంది. ఆ లోపం సరిచేయగలిగితే అభివృద్ధి అందరికీ సమానంగా అందుతుంది. ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం పరిపాలనాపరంగా ఐఏఎస్ల చేతిలో చాలా వరకు ఉంటుం ది. నేను ఎంటెక్ ఖరగ్పూర్ ఐఐటీలో చదివా. నాన్న రైల్వేస్లో పని చేసేవారు. మాది రాజస్థాన్ రాష్ట్రంలో ఒక చిన్నగ్రామం. అందుకే పేదలు, పేదరికం గురించి బాగా తెలుసు. మనం ఎంచుకున్న లక్ష్యం ముందు ఎలాంటి సమస్యలైనా చిన్నవే. లక్ష్యాన్ని సాధిస్తే మిగ తా సమస్యలన్నీ వాటంతటవే దూరమవుతాయి. - కులదీప్చౌదరి, రాజస్థాన్(జార్ఖండ్ క్యాడర్) గుడ్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటే.. సమస్యలు ఎత్తి చూపడం కన్నా... ఒక మంచి పరిపాలన అధికారిగా ఉంటే మన మే వాటిని సరిదిద్దే అవకాశం ఎక్కువగా ఉంటుం ది. ముఖ్యంగా ప్రస్తుత సమాజంలో యూత్ ఎవరికివారు. సేఫ్ సైడ్ చూసుకుని వెళితే చివరికి మిగిలేది ఎవరు.. ఐఏఎస్ కన్నా ఎక్కువ సంపాదించాలంటే చాలా మార్గాలు.. రంగాలున్నాయి. కష్టపడకుండా కూడా సంపాదించే అవకాశాలు కాకుండా మనం కష్టపడుతూ సంపాదించే దాంట్లో సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా దేశ స్థితిని మార్చేందుకు తోడ్పడే మార్గాలు ఎన్నుకోవాలి. మన యూత్ ఏంటో ఇతర దేశాల వాళ్లకి కూడా తెలుసు. అలాంటిది మన దేశ దిశ మార్చాలంటే అంకిత భావంతో పనిచేసే పాలనా యంత్రాంగం అవసరం యువత అవినీతరహితంగా పని చేసేందుకు ముందుకు రావాలి. అప్పుడే ఆశించిన మార్పును కాస్త ఆల్యంగా అయినా చూడగలం. - అమిత్ కుమార్పాండే, యూపీ(రాజస్థాన్ క్యాడర్) ప్రభుత్వ పాలసీలు మారాల్సి ఉంది డాక్టర్గా పని చేస్తే సామాజిక సేవ ఎంత చేయాలని ఉన్నా పరిమితులుంటాయి. ముఖ్యంగా హౌస్సర్జన్ చేసే సమయంలో చాలామంది పేషెంట్ల పరిస్థితి చూస్తే బాధగా అనిపించేది. డాక్టర్కు ఇచ్చే ఫీజు ఉండదు.. మందులు కొనే స్థోమత ఉండదు. ఒక డాక్టర్గా నేను వారికి ఉచితంగా వైద్యం, మందులు మాత్రమే అందించగలను. కానీ అదే ఒక ఐఏఎస్ అధికారిగా అయితే అంకిత భావంతో పనిచేసేవారికి చాలా అవకాశాలుం టాయి. ప్రభుత్వాలు పేదల కోసం చాలా రాష్ట్రాల్లో కొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నాయి. అయితే వాటిని అమలు చేసే విధానాల్లో మార్పు రావాల్సి ఉందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే పేదలకు కేటాయించిన పథకాలు, నిధులు వారిని పూర్తిగా చేరడంలేదు. పరిపాలనాపరమైన లోపాలను సరి చేస్తే.. ఆశిం చిన లక్ష్యాలు నెరవేరుతాయి.మా నాన్న బీఎస్ఎన్ఎల్ త్రివేడ్రంలో ఉద్యోగి. అమ్మ హౌస్వైఫ్. - డాక్టర్ విలియం, కేరళ త్రివేడ్రం(గుజరాత్ క్యాడర్) ఐపీఎస్ శిక్షణ నుంచి వచ్చా మా ఇంట్లో నాన్న ప్రొఫెసర్. అమ్మ టీచర్. చదువు విషయంలో పూర్తి ప్రోత్సాహం ఉండేది. అందుకే ఆడపిల్లనైనా.. ముందు ఐపీఎస్కు ప్రిపేర్ అయి ఎంపికయ్యా. కేరళ క్యాడర్ ఐపీఎస్గా ఎంపికై కేరళలో 8 నెలలు శిక్షణ పొందా. ఇదే సమయంలో ఒకసారి ఐఏఎస్ కోసం ఇంకాస్త కష్టపడాలని నిర్ణయానికి వచ్చి ప్రయత్నించా. నా శ్రమ వృథా కాలే దు. అందుకే ఉన్నదాంతో తృప్తి పడకుండా యువత ఆశించింది సాధించే వరకు పట్టుదలతో కృషియాలి. ముఖ్యంగా సమాజానికి అందించాల్సింది విద్యా, ఆరోగ్యం ఈ రెండూ నాణ్యమైనవి అందిస్తే మిగతావాటిని ఆవే సృష్టిస్తాయి. దేశంలో పేదలకు ఆహార భద్రత అతిముఖ్యమైంది. ఈ విషయంలో ప్రభుత్వాలు కొన్ని మెరుగైన పాలసీలు తీసుకొస్తే పేదలకు మేలు జరుగుతుంది. ప్రసుత్తం మాకు భారత్ దర్శన్ ఒక మంచి అనుభూతిగా మిగులుతుంది. - శుభం చౌదరి, ఢిల్లీ(రాజస్థాన్ క్యాడర్), ఎంఏ(ఎకనామిక్స్) భారత్ దర్శన్తో దేశ పరిస్థితులు తెలుస్తాయి మాది కేరళ రాష్ట్రం. నేను కేరళ క్యాడర్ ఐఏఎస్గా ఎంపిక కావడం నిజంగా అదృష్టంగా భావిస్తాను. నాన్న ఆరోగ్యశాఖలో అధికారి. అమ్మ టీచర్గా పనిచేస్తుంది. ప్రస్తుతం మా స్టడీ లో భారత్ దర్శన్ పేరుతో ప్రస్తుతం చేస్తున్న యాత్ర కేరీర్కు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా క్షేత్రస్థాయి పరిస్థితులు ఏమిటో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సమస్యలు తెలిస్తే వాటికి పరిష్కారాలు చూడొచ్చు. ప్రస్తుతం దేశంలో నక్సలిజం కొంత సమ్యగా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు చేడపతున్న కార్యక్రమాల వల్ల నక్సలిజం కొంత తగ్గుముఖం పట్టింది. అయితే ఈ దిశగా మరింత ప్రయత్నాలు జరగాలి. అందులో భాగంగా ప్రజల సమస్యపరిష్కరించేందకు మంచి వేదిక ఐఏఎస్ హోదా. అందుకే ఉన్నత లక్ష్యాలతో ప్రయత్నించి ఈ రూట్కు వచ్చా. అంకిత భావంతో పనిచేస్తా. - చిత్ర, కేరళ(కేరళ క్యాడర్) ఫిబ్రవరి 20 నాటికి శిక్షణ పూర్తి ఎంతో ఉన్నత ఆశయాలు, లక్ష్యాలతో ఈ రూట్ ఎంచుని కష్టపడి ముందుకు వెళుతున్నాం. మా శిక్షణ ఫిబ్రవరి 20తో పూర్తవుతుంది. ఆ సమయం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ఐఏఎస్ అధికారికి పరిపాలనాపరంగా సేవకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా ఉద్యోగాల్లో ఆదాయం ఉన్నా.. సమాజానికి పెద్దగా చేసేది ఉండదు. అందుకోసమే ఈ రూట్ను ఎంపిక చేసుకుని వచ్చా. బీటెక్ కంప్యూటర్స్ చదివా. ఉద్యోగ వేటలో కాకుండా సివిల్స్ ప్రిపేర్ అయ్యా. అనుకున్నట్లు సెల క్ట్ య్యా. ఇక చేయాల్సిందంతా ముందుంది. యువత తమకున్న లక్ష్యాలు సాధించేందుకు ఎంత కష్టాన్నయినా భరించి ముందుకు సాగాలి. అప్పుడే విక్టరీ విలువ తెలుస్తుంది. యశ్పాల్ మీనా, రాజస్థాన్ (బీమార్ క్యాడర్)