breaking news
HPV
-
నేర్చుకోవాల్సిన కీలక టీకా పాఠాలు
మన దేశంలో కౌమారంలోకి ప్రవేశించిన బాలికలకు రానున్న వారాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) టీకాలు వేయనున్నారు. దీంతో జాతీయ టీకా కార్యక్రమాల కింద ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మొత్తం 13 రకాల టీకాలు వేయడాన్ని మన దేశం అమలుపరచినట్లు అవుతుంది. బాల్యంలో వేయవలసిన టీకాలు అన్నింటినీ పూర్తి చేయడం ద్వారా భారత్ ఒక మైలురాయిని సాధించినట్ల యింది. అనారోగ్య నివారణకు కౌమారాన్ని ముఖ్య దశగా గుర్తించ డంలో నిర్ణయాత్మకమైన అడుగు వేసినట్లు కూడా అవుతోంది. రోగ నిరోధక శక్తిని పెంచే సార్వత్రిక కార్యక్రమంలో ప్రత్యేకించి యువతులకు వేయనున్న మొదటి టీకాగా హెచ్పీవీ నమోదు కానుంది. ఇంతవరకు జాతీయ రోగ నిరోధక ప్రయత్నాలు శిశు వులు, చిన్న పిల్లలు, గర్భవతులను లక్ష్యంగా చేసుకుని సాగాయి. ఇప్పుడీ విధానపరమైన పరిణామం పరిణతితో కూడిన దార్శనికతకు సంకేతంగా నిలుస్తోంది. నివారణ యత్నాలు కేవలం చిన్న వయసు వారితోనే ఆగడానికి లేదనీ, ఆగకూడదనీ గుర్తించినట్లయింది. 18 ఏళ్ల నిరీక్షణఇది కేవలం పాలనాపరమైన పరిణామమే కాదు. ఈ అనివార్య నిర్ణయానికి దాదాపు 18 ఏళ్ళపాటు తర్జనభర్జనలు సాగాయి. ఈ విషయంలో ప్రాథమిక పరిశీలనకు, వాస్తవిక ఆచరణకు మధ్య జరి గిన కాలయాపన ప్రజారోగ్య కార్యక్రమాలన్నింటికీ ఒక పాఠంలా నిలుస్తోంది. మొదటి హెచ్పీవీ టీకాకు 2006లోనే లైసెన్సు లభించింది. అది 2008 ఆరంభం నుంచి మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు అంకురార్పణ పలకడం విశేషం. లాభాపేక్ష లేని ‘పాత్’ అనే అంతర్జాతీయ సంస్థ నేతృత్వంలో భారతీయ వైద్య పరిశోధనా మండలి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 2008–09లో హెచ్పీవీ టీకా పరిచయ కార్యక్రమం మొదలైంది. సాధ్యా సాధ్యాలు, ఆమోద యోగ్యత, విస్తృతి, భిన్న ప్రాంతాల్లో టీకా అందించడానికయ్యే ఖర్చు విషయంలో ప్రత్యక్ష ఫలితాల ఆధారాలను సేకరించడం వంటి వాటి లక్ష్యంతో ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమం కింద 10–14 ఏళ్ళ బాలికలకు ఖమ్మం జిల్లాలోనూ, గుజరాత్లోని వడోదరా జిల్లాలోనూ టీకాలు వేశారు. టీకా అందించడంలో వివిధ రకాల నమూనాలను పరీక్షించి చూశారు. అయితే, ఈ టీకా వేయించుకున్న బాలికలలో కొందరు మృత్యు వాత పడినట్లు 2009లో వార్తలు రావడంతో ఆందోళన చోటు చేసుకుంది. మరణాలకు ఆ టీకాతో సంబంధం లేదని తదనంతర దర్యాప్తులో తేలినప్పటికీ వేయించుకునే వారి నుంచి అనుమతి పొందడంలో విధానాలను అరకొరగానే అమలుపరిచారన్న ఆరోప ణలు వచ్చాయి. ముఖ్యంగా బలహీన, గిరిజన వర్గాల విషయంలో నైతికపరమైన లోటుపాట్లు బహిర్గతమయ్యాయి. ఈ విషయంపై పార్లమెంటులో కూలంకషంగానే చర్చ సాగింది. కేంద్ర ప్రభుత్వం 2010లో ఈ కార్యక్రమానికి తెరదించింది. ఔషధాల తయారీ సంస్థలు అమ్మకాలు పెంచుకునేందుకు దీన్ని ప్రోత్సహిస్తున్నాయంటూ నిందలు మోపడం ప్రారంభించారు. ఫలి తంగా, హెచ్పీవీ టీకా కార్యక్రమానికి గ్రహణం పట్టింది. రోగ నిరో ధకతపై ప్రభుత్వమే ఏర్పాటు చేసినవి అయినప్పటికీ స్వతంత్రమైన సాంకేతిక సలహా బృందాలు ఈ టీకా వేయాలని తరచూ సిఫా ర్సులు చేసినా, జాతీయ టీకా కార్యక్రమంలో హెచ్పీవీ వ్యాక్సిన్ను చేర్చడా నికి మన దేశం వెనుకాడుతూ వచ్చింది. ప్రజా విశ్వాసం కొరవడితే శాస్త్రీయ ఆధారాలు ఎంత బలంగా ఉన్నా అక్కరకు రావని ఈ ఉదంతం ద్వారా వెల్లడైంది. కోల్పోయిన అవకాశంఈ జాప్యానికి పెట్టిన పణాన్ని కోల్పోయిన కాలంతో లెక్కించ కూడదు. రోగనిరోధకతను పెంచుకునే అవకాశాలను బలపరచు కోలేకపోయామని వాపోవాలి. ఎప్పుడు టీకా బాగా పనిచేస్తుందో ఆ వయసు దాటి బాలికలు చాలా మంది బయటకొచ్చేశారు. మిగిలిన చాలా దేశాలు ఆ టీకాను సంతోషంగా అక్కున చేర్చుకుని ఆరోగ్య రక్షణను పెంచుకున్నాయి. దాదాపు 164 దేశాలు 2026 జనవరి నాటికే హెచ్పీవీ వ్యాక్సీన్ ప్రవేశపెట్టి, 50 కోట్లకు పైగా డోసులను అందించాయి. ఫలితంగా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాలు ఒక ప్రజారోగ్య సమస్యగా గర్భాశయ క్యాన్సర్ను ఇంచుమించుగా నిర్మూలించిన స్థితికి చేరుకోగలిగాయి. మన దేశంలో మహిళలకు వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ రెండవదిగా ఉంది. ఏటా దాదాపు 80 వేలకు పైగా మంది కొత్తగా దాని బారినపడుతున్నారు. సుమారుగా 42 వేల మందికి పైగా ఏటా ఈ క్యాన్సర్తో చనిపోతున్నారు. అత్యధి కులు హై–రిస్క్ హెచ్పీవీ రకాల (ముఖ్యంగా టైప్ 16, టైప్ 18) ఇన్ఫెక్షన్ వల్లనే గర్భాశయ క్యాన్సర్ బారినపడుతున్నారు. మన దేశంలో వేయనున్న గర్దాసిల్ వ్యాక్సిన్ ఈ హెచ్పీవీ టైపుల నుంచి బాలికలను రక్షిస్తుందని భావిస్తున్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్లు సజీవేత రమైనవి. ఇన్ఫెక్షన్ కలుగజేసే శక్తి వాటికి ఉండదు. ఏ రకాల పాపి లోమా వైరస్ వల్ల గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయని భావిస్తు న్నారో వాటిని నివారించడంలో ఆ వ్యాక్సీన్ అత్యంత ప్రభావశీల మైన రీతిలో 93 నుంచి 100 శాతం సఫలమైనట్లు వెల్లడైంది. 9 నుంచి 14 ఏళ్ళ వయసున్న బాలికలకు సింగిల్ డోసు వేయవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2022లో పేర్కొంది. సింగిల్ డోసు ఎక్కువ మంది వేయించుకోగలిగిన రేటుకు అందుబాటులో ఉంటుందనీ, కార్యక్రమం సఫలమవడానికి అవకాశాలు ఎక్కువనీ పేర్కొంది.నిరంతరం కార్యక్రమంహెచ్పీవీ వ్యాక్సినేషన్లో భారత్ ఏనాడో చేరవలసి ఉన్నా, ఇప్పటికైనా చేరడం మహత్తరమైనదే. టీకాపై రేగిన వివాదం వల్ల దాన్ని ప్రవేశపెట్టడంలో దాదాపు 15 ఏళ్ళు జాప్యమైంది. ఈ వ్యవ హారం కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్పుతోంది. టీకా కార్యక్రమాన్ని రూపొందించేటప్పుడే కమ్యూనికేషన్ దానిలో అంతర్భాగంగా ఉండాలి. దాని ఉపయోగాలను ప్రచారం చేయడం తదనంతర ఆలో చనగా ఉండకూడదు. టీకా ఎందుకు వేయబోతున్నారో, అది ఎలా పని చేస్తుందో, దానివల్ల దుష్ప్రయోజనాలు కలుగకుండా ఎలా జాగ్రత్తలు తీసుకున్నారో సమాజానికి తేలిగ్గా అర్థమయ్యే రీతిలో వివరించాలి. డేటా ఒక్కటే నమ్మకాన్ని కలిగించలేదు. సంస్థాగత స్పందనలు అస్పష్టంగా లేదా ఆత్మరక్షణ ధోరణిలో ఉంటే, కాకతా ళీయంగా సంభవించిన ప్రతికూల పరిణామాలు కూడా చక్కని కార్య క్రమాన్ని అస్థిర పరచగలవు. సత్వర, స్వతంత్ర దర్యాప్తులు జరపడం, నిగ్గుదేలిన విషయాలను పారదర్శకంగా వెల్లడించడం వల్ల విశ్వసనీ యతను నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది. ప్రజారోగ్య కార్యక్రమా లలో ముఖ్యంగా యువత, బలహీన వర్గాల విషయంలో, నైతిక ప్రమాణాలను పాటిస్తున్నట్లు కనిపించడం కూడా చాలా అవసరం. త్వరలోనే హెచ్పీవీ టీకాలను ఉచితంగా వేయడం వల్ల వివిధ సామాజిక ఆర్థిక వర్గాలలో సమానత్వాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. గర్భాశయ క్యాన్సర్ను రూపుమాపడానికి టీకా వేయించు కోవడం ఒక్కటే సరిపోదని కూడా మనం గుర్తుంచుకోవాలి. పాప్ స్మియర్లు లేదా హెచ్పీవీ పరీక్షలు కొనసాగించడం ద్వారా జల్లెడ పట్టడం సాగాలి. ముఖ్యంగా, వ్యాక్సిన్లు వేయించుకోని వృద్ధ మహిళ లకు ఆ పరీక్షలు నిర్వహించాలి. టీకాలు వేయడంతోపాటు, పరీక్షలు నిర్వహించడం, సకాలంలో చికిత్సలు అందించడంతో కూడిన సమగ్ర వ్యూహాన్ని అనుసరించినప్పుడే మార్గం మెరుగుపడుతుంది. డా‘‘ చంద్రకాంత్ లహరియావ్యాసకర్త ప్రముఖ వైద్యుడు–ఆరోగ్య విధాన నిపుణుడు -
దేశవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలకు HPV టీకాలు : ప్రధాని మోదీ
రాజస్థాన్లోని అజ్మీర్లో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV vaccination) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్తోపాటు, నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. NDA ప్రభుత్వం అన్ని స్థాయిలలో అభివృద్ధిని నిర్ధారించాలని నిశ్చయించుకుందని, HPV టీకా ప్రారంభం దానికి నిదర్శనమని పేర్కొన్నారు.అన్ని రాష్ట్రాలు .కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతీ ఏడాది 14 ఏళ్ల సుమారు 1.15 కోట్ల మంది బాలికలకు ‘గార్డాసిల్’ అనే టీకాను ఉచితంగా అందించాలనేది లక్ష్యం. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఈ వ్యాక్సిన్ ఉచితంగా అందించబడుతుంది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు), కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ఉప-జిల్లా ,జిల్లా ఆసుపత్రులు, అలాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులలో ఈ టీకాలు అందుబాటులో ఉంటాయి.ఇదీ చదవండి: Liquor Policy: కేజ్రీవాల్కు క్లీన్ చిట్, అన్నా హజారే కీలక వ్యాఖ్యలుభారతదేశంలో 80 కంటే ఎక్కువ గర్భాశయ క్యాన్సర్ కేసులకు కారణమైన హై-రిస్క్ రకాల హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), గర్భాశయ క్యాన్సర్, (ముఖ్యంగా హెచ్పీవీ టైప్ 16, 18) ప్రముఖ క్యాన్సర్లలో ఒకటిగా ఉంది. ఈ వ్యాక్సిన్ హెచ్పీవీ టైప్ 16, 18తోపాటు టైప్ 6, 11 రకాల నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని కేంద్రం తెలిపింది. ఇదీ చదవండి: ప్రియుడి మోసం: ఇదే అదునుగా అగంతకుడి దారుణ హత్యాచారం -
28 నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్
సాక్షి, అమరావతి: గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ నివారణకు దేశంలో 14 ఏళ్లు నిండిన బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ పంపిణీని ఈ నెల 28న దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యశాఖ ప్రారంభించనుంది. రాష్ట్రంలోని 3.45 లక్షలమంది బాలికలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. గ్రామ/వార్డు సచివాలయాల శాఖ సమాచారం ప్రకారం అత్యధికంగా కర్నూలు జిల్లాలో 23,957 మంది, అత్యల్పంగా పోలవరం జిల్లాలో 2,777 మంది బాలికలు ఉన్నారు. 1,683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 0.5 ఎంఎల్ వ్యాక్సిన్ను ఇంజక్షన్ రూపంలో ఇస్తారు. సుమారు మూడు నెలలు జరిగే వ్యాక్సిన్ డ్రైవ్కు తొలివిడత కింద కేంద్రం నుంచి 1,90,890 డోసుల వ్యాక్సిన్ వెయిల్స్ రాష్ట్రానికి చేరుకున్నాయి. వ్యాక్సిన్ ఇచ్చే ముందు తల్లిదండ్రుల్లో ఒకరి సమ్మతి తప్పనిసరి అని నిబంధన ఉంది. పీహెచ్సీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ పంపిణీ వివరాలను యూవిన్ డిజిటల్ పోర్టల్లో నమోదు చేస్తారు. వైఎస్ జగన్ హయాంలో కీలక ముందడుగు రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే కీలక ముందడుగు పడింది. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను తెచ్చారు. క్యాన్సర్ను ప్రారంభదశలోనే గుర్తించి ప్రాణాపాయాన్ని తప్పించడంతో పాటు, చికిత్స వ్యయాలకు అడ్డుకట్ట వేసేదిశగా అడుగులు వేశారు. ఇందులో భాగంగా సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి అప్పట్లో శ్రీకారం చుట్టారు. పైలెట్ ప్రాజెక్టుగా పలు జిల్లాల్లో స్క్రీనింగ్ కూడా చేశారు. 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేపట్టేందుకు విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఆస్పత్రితో ఎంవోయూ కుదుర్చుకుని వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే గ్రామాల్లో వైద్యసేవలు అందించే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వైద్యులకు శిక్షణనిచ్చారు. సామూహిక క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రారంభించడానికి సర్వం సన్నద్ధం చేసిన సమయంలోనే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో స్క్రీనింగ్ వాయిదా పడింది. ఎన్నికల తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (సీడీ–ఎన్సీడీ–3.0) సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అంటూ హడావుడి చేసింది. స్క్రీనింగ్ నిర్వహణలో ఘోరంగా విఫలం అయింది. వైద్యశాఖ తప్పులతడకగా స్క్రీనింగ్ చేపట్టడంతో మరోమారు స్క్రీనింగ్ చేయాల్సి వచ్చింది. -
14 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సిన్
న్యూఢిల్లీ: భారత్లో 14 ఏళ్ల వయసు పైబడిన బాలికల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాక్సిన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే ఉచితంగా హ్యూమన్ పపిలోమావైరస్(హెచ్పీవీ) వ్యాక్సిన్ను దేశవ్యాప్తంగా 14 ఏళ్లు పైబడిన బాలికలకు అందజేయనున్నట్లు మంగళవారం అధికార వర్గాలు ప్రకటించాయి. క్వాడ్రీవాలెంట్ హెచ్పీవీ వ్యాక్సిన్ ఉన్న గార్డాసిల్ టీకాను ఒక డోసులో అందించనున్నారు. ఇది సర్వైకల్ క్యాన్సర్కు దారితీసే హెచ్పీవీ టైప్ 16, టైప్ 18 రకాల నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుంది. దీంతోపాటు టైప్ 6, టైప్ 11ల నుంచీ రక్షణ కల్పిస్తుంది. యూనివర్సిటీ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ కిందకాకుండా విడిగా ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద ఈ గార్డాసిల్ టీకాలను వేయనున్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)సహా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ టీకాను వేస్తారు. సరై్వకల్ క్యాన్సర్ను రూపుమాపే అంతర్జాతీయ వ్యూహంలో హెచ్పీవీ వ్యాక్సిన్ది కీలకపాత్ర అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సూచనల మేరకు మోదీ సర్కార్ ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించబోతోందని తెలుస్తోంది. అయితే సొంతంగా కొనుగోలుచేయాలనుకునే వాళ్లకు ఇప్పటికే భారతీయ మార్కెట్లో గార్డాసిల్–4 టీకా అందుబాటులో ఉంది. కానీ దాని ఒక్క డోస్ ధర ఏకంగా రూ.3,927. దీనిని 15 ఏళ్లలోపు బాలికలకు ఇవ్వవచ్చు.వీళ్లు రెండు డోస్లు తీసుకోవాల్సి ఉంటుంది. అదే 15 ఏళ్ల పైబడిన వాళ్లకయితే మూడు డోస్లు ఇవ్వాల్సి ఉంటుంది. గార్డాసిల్–4ను ఎంఎస్డీ ఇండియా సంస్థ తయారుచేస్తోంది. ‘‘దేశవ్యాప్త వ్యాక్సినేషన్లో బాలికలు టీకా తీసుకోవడం అనేది స్వచ్ఛందమే. బలవంతం ఏమీ లేదు. దీనిని ఉచితంగా ఇస్తారు. సరైన వయసులో టీకా తీసుకుంటే భవిష్యత్తులో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారినపడే ప్రమాదం నుంచి బయటపడొచ్చు’’అని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ టీకా 2006 ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది.గత పదేళ్లలో 160 ప్రపంచదేశాల్లో 50 కోట్ల డోస్ల టీకాలను వేశారు. సింగిల్ డోస్ విధానంలో టీకా కార్యక్రమం 90 దేశాల్లో అమల్లో ఉంది. వ్యాక్సిన్ వేసుకుంటే టైప్ 6, 11, 16, 18 వైరస్ల నుంచి దాదాపు 93–100 శాతం రక్షణ ఉంటుందని అంతర్జాతీయంగా పలు పరిశోధనలు, అధ్యయనాల్లో తేలింది. భారతీయ మహిళలకు సోకుతున్న రెండో అతిపెద్ద క్యాన్సర్గా సర్వైకల్ క్యాన్సర్ పరిణమించింది. ఏటా భారత్లో 80,000 కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఏటా 42,000 మంది చనిపోతున్నారు. -
హెచ్పీవీ–ఫ్రీ ఇండియా
సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా, భవిష్యత్ సురక్షితంగా ఉండేలా అట్టడుగు వర్గాల బాలికలకు ఉచిత హెచ్పీవి వ్యాక్సిన్ అందించే లక్ష్యంగా సుదీర్ఘ కారు యాత్ర ప్రారంభించారు ప్రియా రాజ్గోపాల్, మీనాక్షి సాయి. ‘హెచ్పీవీ–ఫ్రీ ఇండియా’ నినాదంతో ముంబైలో మొదలైన ఈ కారు యాత్ర 40 రోజుల్లో 15 రాష్ట్రాలను చేరుతుంది. తాము వెళ్లిన ప్రాంతాలలో గర్భాశయ క్యాన్సర్, నివారణ గురించి పేదింటి మహిళలకు అవగాహన కలిగిస్తున్నారు ప్రియా, మీనాక్షి. ప్రస్తుతం వారి యాత్ర తమిళనాడుకు చేరింది. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది. చెన్నైలోని అడయార్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లో డా.జయశ్రీ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేద బాలికలు ఉచిత హెచ్పీవి టీకా తీసుకున్నారు. హెచ్పీవీ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్కు మాత్రమే కాకుండా వెజైనల్ క్యాన్సర్, వల్వర్ క్యాన్సర్లను కూడా నివారిస్తుంది. లక్షమంది నిరుపేద బాలికలకు హెచ్పీవీ టీకా వేయించాలనేది ప్రియా రాజ్గోపాల్, మీనాక్షి సాయిల లక్ష్యం. మనోబలం మూర్తీభవించిన ఈ మహిళలకు అదేమీ పెద్ద కష్టం కాబోదు. -
HPV వ్యాక్సిన్ అంటే ఏంటి ..? ఇది బాలికలకి వేయవచ్చా?
-
జండర్ న్యూట్రల్ వ్యాక్సిన్ వచ్చేసింది
న్యూఢిల్లీ: జండర్ న్యూట్రల్(ఆడా, మగా అందరూ తీసుకోదగిన) హెచ్పీవీ టీకా గార్డ్సిల్9ను ఎంఎస్డీ ఫార్మా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. 9 వాలెంట్ హెచ్పీవీ వైరస్ టీకా హెచ్పీవీ టైప్స్ 6, 11,16, 18, 31, 33, 45, 52, 58 రకాలపై పనిచేస్తుందని తెలిపింది. హెచ్పీవీ కారణంగా వచ్చే పులిపర్లలాంటివాటి నిరోధంలో, ఈ వైరస్ల కారణంగా కలిగే క్యాన్సర్ల నిరోధంలో టీకా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపింది. మగ(9–15 సంవత్సరాలు), ఆడ(9–26 సంవత్సరాలు)వారికి ఈ టీకాను ఇవ్వవచ్చని, గార్డ్సిల్9 విడుదల ఆరోగ్యవంతమైన భారత నిర్మాణంలో కీలక మలుపని కంపెనీ డైరెక్టర్ రెహాన్ ఖాన్ చెప్పారు. ఈ వైరస్లు ఆడవారికి, మగవారికి సోకుతాయి, అందువల్లనే జెండర్ న్యూట్రల్(ఎవరైనా తీసుకోగలిగేది) టీకా తెచ్చామన్నారు. పిల్లల్లో, వారి తల్లిదండ్రుల్లో ప్రివెంటివ్ కేర్ గురించి, హెచ్పీవీ దానివల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన పెంచేందుకు చర్యలు అవసరమన్నారు. (కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది!) -
ఆమెకు రక్ష
సాక్షి, హైదరాబాద్: సర్వైకల్ కేన్సర్ నివారణకు రాష్ట్రవ్యాప్తంగా బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో కేన్సర్ విస్తరణ, అరికట్టాల్సిన అవసరంపై ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రి డాక్టర్లు ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో హెచ్పీవీ వ్యాక్సిన్ చేర్చాలని సూచించారు. అంతేకాదు, ప్రభుత్వ డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలకు సర్వైకల్ కేన్సర్ స్క్రీనింగ్పై తరగతులను నిర్వహించనున్నారు. కేన్సర్ను సులభంగా గుర్తించే (డయాగ్నైజ్) పద్ధతులపై నిపుణులతో శిక్షణ ఇప్పించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలను బాధిస్తున్న రోగాల్లో సర్వైకల్ కేన్సర్ ఒకటి. మన దేశంలో ప్రతి సంవత్సరం 60 వేల మందికి పైగా ఈ కేన్సర్తో మరణిస్తున్నారు. ఏటా సగటున 97 వేల మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. మన రాష్ట్రంలోనూ సర్వైకల్ కేన్సర్ ప్రభావం ఉంది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్లో భాగంగా చేపడుతున్న సర్వేలో సర్వైకల్ కేన్సర్ స్క్రీనింగ్ కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు 7 వేల అనుమానిత కేసులను గుర్తించారు. దీనిపై గతంలో ఎంఎన్జే కేన్సర్ ఆస్పత్రి బృందాలు పలు ప్రాంతాల్లో స్క్రీనింగ్ నిర్వహించి, వ్యాధి విస్తరిస్తున్నట్లు గుర్తించాయి. సెక్సువల్ ఇన్ఫెక్షన్తో సోకే హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్పీవీ) సర్వైకల్ కేన్సర్కు దారితీస్తుంది. ఈ వైరస్ను టీకాలతో కంట్రోల్ చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా సర్వైకల్ కేన్సర్ను ఎదుర్కోవాలని భావిస్తున్నారు. ఈ టీకాపై ఉన్న అపోహతో ఇప్పటివరకు ఇండియాలో ప్రవేశపెట్టలేదు. ఇటీవల ఈ టీకాను మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో చేర్చింది. త్వరలోనే అక్కడ వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. -
మహిళల పునరుత్పత్తి వ్యవస్థ క్యాన్సర్లు
గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ను పూర్తిగా నివారించే హెచ్.పి.వి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. క్యాన్సర్లలో మనదేశపు స్త్రీలలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఈ క్యాన్సర్ను పూర్తిగా నివారించే హెచ్.పి.వి. వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో వైఫల్యం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీనిపై అమ్మాయిలకు అవగాహన లేక వేయించుకోక పోవడం ఒక కారణమైతే, పరిశుభ్రత తక్కువగా ఉండటం, కాన్పులు ఎక్కువ కావటం, గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులోనే పెళ్లిళ్లు కావడం, గ్రామీణ నేపథ్యంలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హెచ్.పి.వి. వైరస్ ఎక్కువగా ఉండటం వంటివి మరిన్ని ఇతర కారణాలుగా చెప్పుకోవచ్చు. అందుకే పెళ్లి కాని అమ్మాయిలూ లేదా పెళ్లి అయినా ఈ క్యాన్సర్ లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకున్న తర్వాత మూడు డోసులు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే సెర్విక్స్ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోగలగుతాము. ప్రపంచ వ్యాప్తంగా ఈ క్యాన్సర్ స్త్రీలలో ప్రధానంగా ఉన్నా వ్యాక్సిన్స్ వేయించుకోవటం వల్ల, పాప్స్మియర్ పరీక్ష చేయించుకుని ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి చికిత్స తీసుకోవటం వల్ల ఈ క్యాన్సర్ బారిన పడకుండా, ఒకవేళ గురయినా చికిత్సతో బయటపడే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం కొంతవరకు మంచిపరిణామం అని చెప్పుకోవచ్చు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ హెచ్.పి.వి. వైరస్లో 16, 18 రకాలు, అవి సోకకుండా వ్యాక్సిన్స్. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అరుదుగా ఇతర కారణాలవల్ల ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకనే డాక్టర్ సలహా మేరకు అప్పుడప్పుడు పాప్స్మియర్స్ చేయించుకుంటూ ఉంటే గర్భాశయ ముఖ ద్వారంలోని కణాల మార్పును ముందే పసిగట్టగలం. ఇంకా స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి ఏయే క్యాన్సర్స్ ఉన్నాయి, వాటి లక్షణాలు ఏమిటి? ఒకసారి తెలుసుకుందాం. అండాశయాల (ఒవేరియన్) క్యాన్సర్ స్త్రీలలో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్స్ తర్వాత ఈ క్యాన్సరే ఎక్కువ. అండాశయం పొట్టలో ఉండటం వల్ల లక్షణాలు చాలా లేటుగా గుర్తించగలుగుతాం. అందుకే ఈ క్యాన్సర్ను సైలెంట్ కిల్లర్గా పేర్కొంటారు. పిల్లలు కలగని స్త్రీలలో, బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ వచ్చిన వారిలో, దీర్ఘకాలం పాటు హార్మోన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకునే వారిలో ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఎక్కువ. మొదట్లో లక్షణాలు అజీర్తి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అని పొరబడటం వల్ల తొలిదశలోనే ఈ క్యాన్సర్ ను గుర్తించలేకపోవచ్చు. లక్షణాలు: ∙పొత్తి కడుపు ఉబ్బి, నొప్పిగా ఉండటం అజీర్తి, వికారం, తేన్పులు వంటి జీర్ణ సంబంధ లక్షణాలు యోని స్రావాలు అసాధారణంగా, మూత్రం ఎక్కువగా రావటం అలసట, జ్వరం, సీఏ 125 రక్త పరీక్ష, అల్టాస్రౌండ్ స్కానింగ్లతో ఈ క్యాన్సర్ ను నిర్ధారణ చేయవచ్చు. యుటెరైన్ లేదా ఎండోమెట్రియల్ లేదా గర్భాశయ క్యాన్సర్ గర్భసంచిలో ఉండే లైనింగ్ ఎండోమెట్రియవ్ు, ఈ పొర మరీ పలుచగానూ లేదా 14 మి.మీ. కంటే ఎక్కువగా మందంగా ఉండటం మంచిది కాదు. పిల్లలు కలగని స్త్రీలు, శరీరంలో ఈస్ట్రోజెన్ లెవల్స్ ఎక్కువ కాలం పాటు ఉండటం, రొమ్ము క్యాన్సర్ వచ్చి ఉండటం, నెలసర్లు 9 ఏళ్ల కంటే ముందు ప్రారంభం కావడం, మెనోపాజ్కు చేరుకున్న స్త్రీలు, అధిక బరువు ఉన్నవారిలో ఈ క్యాన్సర్ కు గురయ్యే ముప్పు ఎక్కువ. 50 నుండి 64 మధ్య వయస్సు స్త్రీలలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కన్పిస్తోంది. అందుకనే మెనోపాజ్ దశకు చేరుకున్న స్త్రీలకు నెలసర్లు పూర్తిగా ఆగిపోయిన ఒక ఏడాది తర్వాత రక్తస్రావం అప్పుడప్పుడు అయినా, తరచుగా అయినా లేక చాలా కొద్దిగా రక్తం కన్పించినా నిర్లక్ష్యం చేయకూడదు. స్త్రీలు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘‘ఏంటి? మళ్లీ ఈ వయస్సులో నెలసర్లు మొదలయ్యాయి, ఎవ్వరితో చెప్పుకోను’’ అని మొహమాట పడుతూ ఉంటారు. కానీ అది మొహమాటపడి నిర్లక్ష్యం చేయాల్సిన సందర్భం కానే కాదు. బ్రెస్ట్ క్యాన్సర్కు టొమాక్సిఫెన్ మందు వాడిన స్త్రీలు, పెల్విస్కు రేడియేషన్ తీసుకున్నవారు, హార్మోన్ థెరపీ దీర్ఘకాలంపాటు తీసుకున్నవారు, 55 ఏళ్లు పైబడినా నెలసర్లు ఆగని స్త్రీలలో ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ. నెలసరి మధ్యలో, మెనోపాజ్ దశ దాటాక రక్తస్రావం కన్పిస్తే అల్టాస్రౌండ్, హిస్టిరోస్కోపి, బయాప్సీ వంటి పరీక్షలు తప్పనిసరి. వెజైనల్ అండ్ వల్వా క్యాన్సర్ ఇది స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థకు సంబంధించి బయటకు కన్పించే అవయవం, యోని, యోని పెదాలకు సంబంధించిన క్యాన్సర్ అరుదుగా కన్పించేవే కాని ఈ అవయవాలు క్యాన్సర్కు గురయితే ట్రీట్మెంట్ ఇవ్వటం మరింత కష్టతరం, క్యాన్సర్ను అదుపులో పెట్టి జీవితకాలం పెంపొందించటమూ అంత సులువేమి కాదు. మెనోపాజ్ వయస్సులో థైరాయిడ్ హార్మోన్ సమస్య ఉన్నవారిలో, హెచ్.పి.వి. వైరల్, హెపటైటిస్ సి వైరల్ ఇన్ఫెక్షన్ లేదా కచ్చితమైన కారణం తెలియకుండా వచ్చే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అయిన ‘‘లైకస్ స్లీ్కరోసిస్’’ అనే చర్మవ్యాధి వల్ల స్త్రీలకు యోని ప్రాంతంలో తెల్లటి మచ్చలు, దురదలతో కూడిన మచ్చలు పడతాయి. ఆ మచ్చలు ‘వల్వార్ కార్సినోమా’ అనే చర్మ సంబంధ క్యాన్సర్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. ‘లైకస్ స్లీ్కరోసిస్’ చర్మ వ్యాధి ఉన్న స్త్రీలు చికిత్స తీసుకోవటంతో పాటు తప్పనిసరిగా క్యాన్సర్ వంటి మార్పులు ఏమైనా చోటు చేసుకుంటున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. గైనిక్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే స్త్రీలు పాప్స్మియర్ పరీక్షలు చేయించుకుంటూ ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ∙పొత్తికడుపు బరువుగా, పెరుగుతున్నట్లు ఉండటం అసాధారణమైన యోనిస్రావాలు, రక్తస్రావం ∙కలయిక సమయంలో రక్తం కన్పించడం ∙నెలసర్లు ఆగిపోయిన కొంతకాలం తర్వాత రక్తస్రావం ∙అలసట, జ్వరం, బరువు తగ్గటం. గైనకాలజికల్ క్యాన్సర్లు ఇతర శరీర భాగాలకు వ్యాపించక ముందే గుర్తిస్తే హిస్టరెక్టమి లేదా ఊఫరెక్టమిలను చిన్నకోతతో చేసే సర్జరీలద్వారా చేయించుకున్న వెంటనే కీమో, రేడియోథెరపీలను తీసుకోవటంతో ఈ క్యాన్సర్లను అదుపులో ఉంచటం సాధ్యమే. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు
టీ మిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ వాణిజ్య పత్రికలో ఫ్రంట్ పేజి పై ఒక చేత్తో బూటు పట్టుకొని విష్ణు మూర్తి అవతారం లో ఉన్న ధోనీ ఫోటో ముద్రించారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ.. గత ఫిబ్రవరిలో విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాం సుందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు ధోనితో పాటు.. పత్రిక ఎడిటర్ కు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తాజాగా.. నవంబర్ 7న ధోనీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని జిల్లా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే వివాదానికి దారితీసిన ఈ పత్రిక 2013 ఏప్రిల్ లో విడుదల అయ్యింది. ఇక మరో వైపు ఇదే ఫోటో పై కర్ణాటకలోని ఓ సంఘ సేవకుడు జయకుమార్ హిరామత్ సైతం కోర్టులో కేసు వేసాడు.


