breaking news
Hindi newspaper journalist
-
జర్నలిస్టు ఉరి.. మృతిపై అనుమానాలు
అమ్రోహ/లక్నో : ఉత్తరప్రదేశ్లో ఓ జర్నలిస్టు మృతి కలకలం రేపుతోంది. ఓ జాతీయ హిందీ దినపత్రికలో విలేకరిగా పనిచేసే రాజేష్ అగర్వాల్ చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. ఈ ఘటన అమ్రోహ జిల్లాలో సోమవారం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, రాజేష్ది ఆత్మహత్య కాదని అతని కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రైవేటు స్కూల్ మేనేజర్ అయిన శ్యామ్ గిరి రాజేష్ని చంపి హత్యగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. శ్యామ్కు రాజేష్ లక్ష రూపాయలు బాకీ ఉన్నాడని.. ఆ నేపథ్యంలోనో ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన రాజేష్ చివరగా శ్యామ్తో కనిపించినట్టు స్థానికులు చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా.. మృతుని వద్ద నుంచి సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు వెల్లడించారు. రాజేష్ది ఆత్మహత్యగా భావిస్తున్నామని తెలిపారు. అయితే, మృతుని కుటుంబ సభ్యుల ఆరోపణలను కూడా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేపడతామని పోలీస్ అధికారి అజయ్కుమార్ అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు అనంతరం కేసులో పురోగతి ఉంటుందని వెల్లడించారు. -
యూపీలో మరో దారుణం
పాత్రికేయుడి తల్లికి నిప్పంటించిన పోలీసులు బారాబంకీ: ఉత్తరప్రదేశ్లో మరో ఘోరం! జితేంద్రసింగ్ అనే పాత్రికేయుడిని పోలీసులు సజీవదహనం చేసిన ఉదంతం మరువకముందే అలాంటిదే మరో దారుణం చోటు చేసుకుంది. భర్తను విడిపించుకునేందుకు పోలీసుస్టేషన్కు వెళ్లిన ఓ పాత్రికే యుడి తల్లికి పోలీసులు నిప్పంటించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం తెల్లవారుజామున మరణించింది. బారాబంకీ జిల్లా కోథీ పోలీసు స్టేషన్ పోలీసులు స్థానిక హిందీ దినపత్రిక జర్నలిస్టు సంతోష్ తండ్రి అయిన రామ్ నారాయణ్ను ఈవ్టీజింగ్ కేసులో విచారించాలంటూ శనివారం తీసుకె ళ్లారు. భర్తను విడిపించుకునేందుకు స్టేషన్కు వచ్చిన నీతూను పోలీసులు రూ. లక్ష డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వనని చెప్పడంతో ఆమెను అవమానించి, దుర్భాషలాడి గెంటేశారు. తర్వాత పెట్రోల్ చల్లి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన బాధితురాలు లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. పోలీసు స్టేషన్ ఇన్చార్జి రామ్ సాహెబ్ సింగ్ యాదవ్, ఎస్ఐ అఖిలేశ్ రాయ్లే తన కు నిప్పంటించారని బాధితురాలు మేజిస్ట్రేట్, మీడియా ముందు వాంగ్మూలం ఇచ్చింది. ‘అందరూ చోద్యం చూస్తున్నారు. నాకెవరూ సాయం చేయలేదు. నాపై పెట్రోల్ చల్లి, అగ్గిపుల్ల వెలిగించి నిప్పంటించారు’ అని చెప్పింది. అయితే, బాధితురాలే నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు. తన తల్లికి పోలీసులే నిప్పంటించారని సంతోష్ చెప్పారు. పోలీసులపై మోపిన అభియోగాలపై అసంతృప్తి వ్యక్తంచేశారు. తన తండ్రిని అక్రమంగా 24 గంటలు నిర్బంధంలో ఉంచుకున్నారన్న కారణంతోనే ఇద్దరు పోలీసు అధికారులనూ సస్పెండ్ చేశారన్నారు. వారిపై హత్య కేసు పెట్టి తక్షణమే అరెస్టు చేయాలన్నారు. ఈ ఉదంతంపై మెజిస్టీరియల్ దర్యాప్తునకు ఆదేశించామని సీఎం అఖిలేశ్ వెల్లడించారు.