breaking news
Group-C
-
నాకౌట్ దశకు ఆంధ్ర
చెన్నై: విజయ్ హజారే టోర్నీలో ఆంధ్ర క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. గుజరాత్తో సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ఆంధ్ర తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయం నమోదు చేసిన ఆంధ్ర 20 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ముంబై 16 పాయింట్లతో ఇదే గ్రూప్ నుంచి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో ఆంధ్ర 251 పరుగుల లక్ష్యాన్ని కేవలం వికెట్ నష్టపోయి 45.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ (132 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్లు) అజేయ సెంచరీ చేయగా... మరో ఓపెనర్ అశ్విన్ హెబర్ (108 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్లు) కేవలం పరుగు తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 192 పరుగులు జోడించడం విశేషం. అశ్విన్ ఔటయ్యాక కెప్టెన్ విహారి (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్లు)తో కలిసి భరత్ ఆంధ్ర విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు గుజరాత్ సరిగ్గా 50 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్ పటేల్ (39; 7 ఫోర్లు), రిజుల్ భట్ (74; 2 ఫోర్లు), పియూష్ చావ్లా (56; 6 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో కార్తీక్ రామన్ (4/32), బండారు అయ్యప్ప (2/68), నరేన్ రెడ్డి (2/35) ఆకట్టుకున్నారు. -
తపాలా ఉద్యోగుల 2 రాష్ట్రాల కమిటీల ఎన్నిక
ఒంగోలు సబర్బన్: అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం(ఎన్ఎఫ్పీఈ) గ్రూప్-సి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కమిటీలను ఎన్నుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత పోస్టల్ సర్కిళ్లను కూడా కేంద్ర ప్రభుత్వం విడగొట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్కు విజయవాడ కేంద్రంగా సర్కిల్ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి రాష్ట్రాల చివరి సమావేశం శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంఘం అధ్యక్షుడు కె.నారాయణరావు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్ఎఫ్పీఈ గ్రూప్-సి ఆల్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీ జనార్ధన్ మజుందార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల సంఘ కమిటీలకు ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడిగా ఎం.నాగేశ్వరరావు(అనకాపల్లి), ప్రధాన కార్యదర్శిగా కె.వెంకటేశ్వర్లు(ఒంగోలు), కోశాధికారిగా బి.మోహనరావు(ఒంగోలు)ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా వరంగల్కు చెందిన ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్కు చెందిన శ్రీధరస్వామి ఎన్నికయ్యారు. వీటితోపాటు జిల్లాల వారీగా కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నారు.