-
స్వైన్ ఫ్లూ విజృంభణ.. వైఎస్సార్సీపీ ఆందోళన
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభించడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో గల వైద్య సదుపాయాలు, సౌకర్యాలపై వైఎస్సార్సీపీ ఆందోళన వ్యక్తంచేసింది. ఇప్పటికే 12 మంది చనిపోగా, మరికొంతమందికి వ్యాధి నిర్దారణ అయింది. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలపై వైఎస్సార్సీపీ నాయకులు ఆరా తీశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే స్వైన్ఫ్లూ మృతుల సంఖ్య పెరుగుతోందని ఎమ్మెల్యే గౌరు చరితా విమర్శించారు. పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య, కర్నూలు, కోడుమూరు నియోజకవర్గాల సమన్వయకర్తలు హఫీజ్ ఖాన్, మురళీకృష్ణ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. మందులు, ప్రత్యేక వార్డులు లేకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
చంద్రబాబు పనైపోయింది
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సీఎం చంద్రబాబునాయుడుకు ఉన్న రాజకీయ అనుభవం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడానికి పనికిరావడం లేదని, ఆయన అవుట్ డేడెట్ సీఎం అని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినా రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదన్నారు. శనివారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడూ ఆయన సొంత ప్రయోజ నాలు కోసమే ప్రయత్నించారన్నారు. ఆయన వేషాలు, డ్రామాలు ఏపీ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు మైండ్ బ్లాక్... ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంతో చంద్రబాబుకు దిక్కుతోచడం లేదన్నారు. వైఎస్ఆర్సీపీ పెట్టే తీర్మానానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన గంటల్లోనే తామే అవిశ్వాసం ప్రవేశపెడతున్నట్లు సీఎం చెప్పడం మాట మీద ఆయన నిలబడరనేందుకు ఉదాహరణ అన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ముఖ్యం కాదని ఎంత చిత్తశుద్ధి, విశ్వసనీయత, విలువలు ఉన్నాయన్నదే ప్రధానమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పరితపించే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరేనని చెప్పారు. ఇప్పటికైనా నాటకాలు మాని వైఎస్ఆర్సీపీ ఇచ్చిన అవిశ్వాసానికి టీడీపీ మద్దతు ఇవ్వాలని లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు జీవితాంతం జైలులోనే... సీఎం చంద్రబాబునాయుడు ఆర్థిక, రాజకీయ, సామాజిక నేరగాడు అని బీవై రామయ్య విమర్శించారు. 26 కేసుల్లో విచారణ ఎదుర్కోకుండా స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. ఆయనపై విచారణ జరిగితే జీవితాంతం జైళ్లో ఉండాల్సి వస్తోందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ చేస్తున్న అవినీతిని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆలస్యంగానైనా గుర్తించడం సంతోషమన్నారు. వైఎస్ఆర్సీపీ అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తున్న నేపథ్యంలో సోమవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మానవహారాలు నిర్వహిస్తామని చెప్పారు. గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులకు నిధులేవీ? ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో గుండ్రేవుల, వేదవతి, హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి 68 చెరువులకు నీటిని మళ్లింపు తదితర వాటికి బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించకుండా, ఆయా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ప్రకటించడంపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశం తప్ప ప్రాజెక్టులపై చిత్తశుద్ధిలేదన్నారు. కేసీ కెనాల్ కింద సాగు చేసిన పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మురళీకృష్ణ, రాష్ట్ర నాయకులు తెర్నేకల్ సురేందర్రెడ్డి, సీహెచ్ మద్దయ్య, అబ్దుల్ రెహమాన్, కర్నాటి పుల్లారెడ్డి, పర్లా శ్రీధర్రెడ్డి, దేవపూజ ధనుంజయాచారి, డి.రాజశేఖర్, నాయకులు రమణ, కరుణాకరరెడ్డి, శివరామిరెడ్డి, భాస్కరరెడ్డి, సాంబశివారెడ్డి, రవిబాబు, రఘు, మళ్లి, బుజ్జీ, శేషుబాబు చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే గౌరు చరితమ్మకు మాతృ వియోగం
– శోకసంద్రంలో ఎమ్మెల్యే చరితమ్మ – వైఎస్ జగన్ సంతాపం – నివాలర్పించిన ఎమ్మెల్యేలు నందికొట్కూరు: పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తల్లి సూదిరెడ్డి బాలనాగమ్మ(70) ఆదివారం అర్ధరాత్రి అనారోగ్యంతో కర్నూలు విశ్వభారతి వైద్యశాలలో మృతి చెందింది. 10 రోజుల నుంచి కర్నూలు విశ్వభారతి వైద్యశాలలో బాలనాగమ్మకు చికిత్సలు చేస్తున్నారు. ఆదివారం అర్ధరాతి మృతి చెందడంతో మృతదేహాన్ని నందికొట్కూరు మండలం కొణిదేల గ్రామంలోని స్వగృహానికి తరలించారు. చరితారెడ్డి తల్లి మృతదేహంపై పడి భోరున విలపించిన తీరు పలువురిని కంటతడి తెప్పించింది. బాలనాగమ్మకు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు సంతానం. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తల్లి బాలనాగమ్మ మృతి చెందడం పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. బాలనాగమ్మ మరణ వార్త తెలియగానే చరితారెడ్డికి ఫోన్ చేసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాలనాగమ్మ మృతి తీరని లోటు బాలనాగమ్మ మృతి వైఎస్ఆర్సీపీకి తీరని లోటు అని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆదివారం ఆమె మృతదేహానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు ఐజయ్య, సాయిప్రసాదరెడ్డి, బాలనాగిరెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మురళికృష్ణ, వైఎస్ఆర్సీపీ జిల్లా ఇన్చార్జ్ అనంత వెంకట్రామిరెడ్డి, నంద్యాల ఇన్చార్జ్ డాక్టర్ రాజగోపాల్రెడ్డి, గుంతకల్ ఇన్చార్జ్ వెంకట్రామిరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, టీడీపీ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మురళీరెడ్డి, ఎంపీపీ ప్రసాదరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ రమణారెడ్డి పూలమాల వేసి నివాళ్లులర్పించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- షుగర్ పేషెంట్స్ పళ్లు తినకూడదా? తింటే ఏవి తినాలి?
- పవన్ కల్యాణ్కి షాక్.. సినిమా నుంచి స్టార్ డైరెక్టర్ తప్పుకొన్నాడా?
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
Advertisement