Gas reserves
-
ఇంధన భద్రతలో భారత్ ముందున్న సవాలు
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్ను కుదిపేస్తున్నాయి. చమురు ధరల పెరుగుదల, సరఫరా గొలుసులో అంతరాయాలు భారత్ వంటి భారీ వినియోగ క్రూడ్ దేశాలకు హెచ్చరిక లాంటిది. ఈ నేపథ్యంలో దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలవాల్సిన వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు భారత్లో ఏ స్థాయిలో ఉన్నాయి? మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది.వ్యూహాత్మక నిల్వలు ఎందుకు కీలకం?ఇంధన నిల్వలను ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరిస్తారు. ప్రభుత్వం నిర్వహించే వ్యూహాత్మక నిల్వలు, రిఫైనరీలు నిర్వహించే వాణిజ్య నిల్వలు. వీటి ప్రాముఖ్యత ఆర్థిక పరంగానే కాకుండా దేశ రక్షణకు కూడా సంబంధించింది కావడం గమనార్హం.భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు నిరంతర ఇంధన సరఫరాకు ఇవి అండగా నిలుస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు అకస్మాత్తుగా పెరిగినప్పుడు ఈ నిల్వలు ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయి. ఇంధనాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగించే దేశాల ముందు భారత్ తలవంచకుండా ఉండేందుకు ఈ బఫర్ స్టాక్ రక్షణ కవచంగా పనిచేస్తుంది.ఆందోళనకరంగా ఎల్పీజీ నిల్వలుభారత్ వంటగ్యాస్ పంపిణీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్నప్పటికీ, నిల్వ సామర్థ్యం విషయంలో మాత్రం వెనుకబడి ఉంది. విశాఖపట్నం కేవర్న్(హెచ్పీసీఎల్, టోటల్ఎనర్జీస్ జేవీ) సామర్థ్యం 60,000 టన్నులు, మంగళూరు కేవర్న్(హెచ్పీసీఎల్) 80,000 టన్నులతో మొత్తం సామర్థ్యం 1,40,000 టన్నులుగా ఉంది.దేశవ్యాప్తంగా రోజువారీ ఎల్పీజీ డిమాండ్ సుమారు 90,000 టన్నులు అని అంచనా. అంటే మన దగ్గర ఉన్న వ్యూహాత్మక నిల్వలు కనీసం రెండు రోజులకు కూడా సరిపోవు. ప్రస్తుతం మన మౌలిక సదుపాయాలన్నీ గ్యాస్ను పోర్టుల నుంచి నేరుగా వినియోగదారులకు చేరవేసే ‘ఆపరేషనల్ ఫ్లో’ మోడల్లోనే ఉన్నాయి తప్ప దీర్ఘకాలిక నిల్వ కోసం ఉద్దేశించినవి కావని కొందరు నిపుణులు చెబుతున్నారు.ఎందుకీ పరిస్థితి?ముడి చమురు నిల్వల విషయంలో భారత్ ఇప్పటికే భారీ వ్యూహాత్మక నిల్వలను నిర్మించుకుంది. కానీ గ్యాస్ విషయంలో మాత్రం ఆ పురోగతి కనిపించలేదు. దీనికి కొన్ని కారణాలున్నాయి.గతంలో గ్యాస్ సరఫరా సులభంగా, తక్కువ ధరకే లభించడంతో నిల్వల కంటే సరఫరా వ్యవస్థపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.గ్యాస్ను భూగర్భంలో నిల్వ చేయడానికి తగిన సహజ కేవర్లు గుర్తించడం సాంకేతికంగా సంక్లిష్టమైన ప్రక్రియ.గ్యాస్ స్టోరేజ్ టెర్మినల్స్ నిర్మాణం భారీ వ్యయంతో కూడుకున్నది.కొత్త వ్యూహం: ప్రభుత్వం ఏం చేస్తోంది?పశ్చిమాసియా సంక్షోభం తర్వాత కేంద్ర ప్రభుత్వం గ్యాస్ భద్రతపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. వ్యూహాత్మక గ్యాస్ నిల్వల నిర్వహణ కోసం ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు పెట్రోలియం శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఎల్ఎన్జీ/ఎల్పీజీ టెర్మినల్స్లో అదనంగా 10 శాతం నిల్వ సామర్థ్యాన్ని తప్పనిసరి చేసే నిబంధనను సమీక్షిస్తున్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) ఆరు కొత్త ప్రాంతాల్లో నిల్వ కేంద్రాల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాల నివేదికను రూపొందిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో ఉన్న ‘సాల్ట్ కేవర్లు’ గ్యాస్ నిల్వకు అత్యంత అనువైనవిగా భావిస్తున్నారు.అంతర్జాతీయ అనిశ్చితిని తట్టుకోవాలంటే భారత్ కేవలం సరఫరాపైనే కాకుండా నిల్వపై కూడా దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. విధానపరమైన వేగం, సాంకేతిక తోడ్పాటు తోడైతేనే ఇంధన భద్రతలో భారత్ స్వయంసమృద్ధి సాధించగలదు.ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి! -
‘మహా’ మునక
భూమి లోపల ఉన్న శిలాజ ఇంధన నిల్వలను పూర్తిగా తోడేసినట్లయితే ఒక రోజున మనం అంటార్కిటికా హిమఖండానికి గుడ్బై చెప్పక తప్పదని తేలుతోంది. అదే జరిగినట్లయితే ప్రపంచ మహానగరాలు చాలావరకు మునిగిపోయే ప్రమాదం పొంచుకుని ఉంది. కోట్లాది సంవత్సరాల క్రమంలో భూ అంతర్భాగంలో పేరుకుపోయిన బొగ్గు, చమురు, గ్యాస్ నిల్వలను పూర్తిగా దహించివేసినట్లయితే అంటార్కిటికా హిమఖండ ం పూర్తిగా కరిగిపోయి సముద్ర మట్టం 50 నుంచి 60 మీటర్లు (160 నుంచి 200 అడుగులు) పెరుగుతుందని, దీంతో తీర ప్రాంతంలో ఉన్న విశ్వ మహానగరాలు మునిగిపోతాయని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇలా సముద్రంలో కలిసిపోనున్న మహానగరాల్లో టోక్యో, హాంగ్కాంగ్, షాంఘై, హాంబర్గ్, న్యూయార్క్తో పాటు మన కోల్కతా, చెన్నై, ముంబై కూడా ఉన్నాయని అంచనా. ఇప్పటికే సముద్ర మట్టానికి సమాన స్థాయిలో ఉంటున్న వందకోట్ల జనాభా కలిగిన తీరప్రాంత నగరాలు ఉనికిని కోల్పోనున్నాయి. అంటార్కిటికా ఆ స్థాయిలో కరిగిపోకూడదంటే శిలాజ ఇంధనం జోలికి వెళ్లకూడదని, వాతావరణంలోకి కార్బన్ను వదలకూడదని విజ్ఞుల ఉవాచ. -
గోదావరీ తీరంలో గ్యాస్ నిక్షేపాల గుర్తింపు
అమలాపురం టౌన్: తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని ముమ్మిడివరం మండలం లంకాఫ్ ఠానేల్లంక సమీపంలో గోదావరి తీరాన కొండుకుదురులంక ద్వీపంలో గ్యాస్ నిక్షేపాలు విరివిగా ఉన్నట్లు ఆయిల్ ఇండియా సంస్థ తన అన్వేషణలో గుర్తించింది. గ్యాస్ నిక్షేపాలు వెలికి తీసేందుకు నాబార్స్ అనే అంతర్జాతీయ డ్రిల్లింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే కృష్ణా గోదావరి బేసిన్లో ఓఎన్జీసీ, రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ, గెయిల్, గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి కంపెనీలు ఆన్షోర్, ఆఫ్ షోర్ కార్యకలాపాల ద్వారా చమురు, సహజ వాయువులను వెలికితీస్తున్న సంగతి తెలిసిందే. -
రెండు విడతలుగా ఓఎన్జీసీ డిజిన్వెస్ట్మెంట్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజాలు ఓఎన్జీసీ, కోల్ ఇండియాలో వాటాల విక్రయాన్ని రెండు విడతలుగా చేపట్టాలని కేంద్రం యోచిస్తోన్నట్లు సమాచారం. సరైన విలువను రాబట్టాలనే ఉద్దేశమే ఇందుకు కారణమని అధికార వర్గాలు తెలిపాయి. మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత డిజిన్వెస్ట్మెంట్ తేదీలను ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించాయి. ఓఎన్జీసీలో 5 శాతం, కోల్ ఇండియాలో 10 శాతం వాటాల విక్రయానికి క్యాబినెట్ ఆమోద ముద్రవేసిన సంగతి తెలిసిందే. ఓఎన్జీసీ ద్వారా రూ. 11,477 కోట్లు, కోల్ ఇండియా ద్వారా రూ. 15,740 కోట్లు రావొచ్చని అంచనా. అయితే డిజిన్వెస్ట్మెంట్ విషయంలో ఇంకా చాలా ఆటంకాలు ఉండొచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఓఎన్జీసీకి చెందిన కేజీ-డీ5 బ్లాకులో గ్యాస్ నిక్షేపాల అభివృద్ధిలో జాప్యం వెనుక కారణాలపై విచారణ జరుపుతున్న కమిటీ డిసెంబర్ 24 నాటికి నివేదిక సమర్పించగలదని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పొరుగునే ఉన్న కేజీ-డీ6 బ్లాకులో రిలయన్స్ సంస్థ చమురు, గ్యాస్ ఉత్పత్తి దాదాపు నాలుగయిదేళ్ల క్రితమే ప్రారంభించేసింది. కానీ, కేజీ-డీ5లో ఓఎన్జీసీ కనుగొన్న 11 చమురు, గ్యాస్ నిక్షేపాల నుంచి ఉత్పత్తి ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. కంపెనీ అంచనాల ప్రకారం 2018 నుంచి గ్యాస్, 2019 నుంచి చమురు ఉత్పత్తి ప్రారంభం కావొచ్చు. ఈ నేపథ్యంలోనే జాప్యంపై హైడ్రోకార్బన్స్ రంగ నియంత్రణ సంస్థ డీజీహెచ్ సారథ్యంలోని కమిటీ విచారణ చేపట్టింది.


