-
వివాదాలకు వేదికగా..
తూర్పుగోదావరి, కాకినాడ: రాజకీయాలకు అతీతంగా ఏటా జరిగే కార్తిక సమారాధనలు గాడి తప్పుతున్నాయి. పార్టీలతో ప్రమేయం లేకుండా సామాజిక వర్గం ఐక్యతే లక్ష్యంగా జరగాల్సిన గార్డెన్ పార్టీలను రాజకీయ ప్రయోజనాలకు వేదికగా వాడుకుంటున్నారు కొందరు. తాజాగా ఆదివారం జరిగిన కాపు కులస్తుల కార్తిక వన సమారాధనలో కొంత మంది జనసైనికులు చేసిన హంగామా ఉద్రిక్తతకు దారి తీసింది. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది జనసేన పార్టీ నేతలు కొంత మంది కాపు యువతను రెచ్చగొట్టి వివాదాన్ని రేపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బయట జరిగే రాజకీయ విమర్శలు ఎత్తుగడలను సామాజిక వర్గ వేదికగా వివాదాస్పదం చేసిన తీరు కాపు వర్గీయులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. వారిస్తున్నా.. కాపు కల్యాణ మండపంలో జరుగుతున్న కాపు కార్తిక సమారాధనకు వైఎస్సార్ సీపీ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తన అనుచరులతో తరలివెళ్లారు. ఆయనను చూడగానే పవర్ స్టార్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ప్రారంభించారు. సామాజిక వర్గ వేదిక కావడంతో కన్నబాబుతో ఉన్న అనుచరులు జై కాపు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సభా వేదిక నినాదాలతో హోరెత్తింది. కొద్ది రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్ కన్నబాబుతోపాటు కొంతమంది వైఎస్సార్ సీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో కన్నబాబు ఘాటుగానే పవన్కు కౌంటర్ ఇచ్చారు. అప్పటి నుంచి కన్నబాబుపై గుర్రుగా ఉన్న జనసేన కార్యకర్తలు, నేతలు అవకాశం వచ్చిన ప్రతిసారీ ఆయనపై మాటల యుద్ధానికి తెరతీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కరపలో కన్నబాబుకు వ్యతిరేకంగా హడావుడి చేసిన వారు ఇప్పుడు కాకినాడ కాపుసమారాధన వేదికగా మరో సారి వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. కార్యకర్తలను సముదాయించాల్సిన ఒక జనసేన నాయకుడు తొడగొట్టి మరీ వారిని రెచ్చగొట్టి వివాదానికి మరింత ఆజ్యం పోయడంతో అక్కడ ఇరువర్గాల తోపులాటకు దారి తీసింది. సంయమనంతో వ్యవహరించాల్సిన నేతలు కొంత మంది కాపు యువతను రెచ్చగొట్టి మరీ వివాదాన్ని మరింత జటిలంచేయటంతోఅక్కడ ఉన్న కాపునేతలు ముక్కున వేలేసుకున్నారు. -
సందడే సందడి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement