ఘనంగా బతుకమ్మ సంబరాలు
చేగూరు(కొత్తూరు): మండల పరిధిలోని చేగూరులో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు స్వయంగా వివిధ రకాల పూలతో అందంగా తయారు చేసిన బతుకమ్మలకు ఉపాధ్యాయులు పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మలను ఆట పాటల అనంతరం నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు బతుకమ్మ విశిష్టత గురించి విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం కిష్టాచారి, రాజయ్య, నయూమ్, రవీందర్రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.