breaking news
Economic Times Magazine survey
-
జీడీపీనా? ఉద్యోగాలా?
ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని ఐదేళ్లలో ఐదు ట్రిలియన్లకు చేర్చాలనేది ప్రధాని మోదీ కల. కానీ ఈ కల సాకారానికి ఎన్నో సవాళ్లు. ఇంకెన్నో సమస్యలు. కనుచూపు మేరలో పరిష్కారం కానరావడమే లేదు. ఆర్థిక వ్యవస్థ 20 త్రైమాసికాల కనిష్టానికి దిగజారింది. పెట్టుబడులు మందగించాయి. ఎకానమీలో కీలక సూచికలేవీ విశ్వాసం రేకెత్తించడం లేదు. ఉద్యోగాలు దొరకడం లేదు. వ్యవసాయ సంక్షోభం ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. కానీ అత్యధిక భారతీయులకు ఇవి ప్రాధాన్యతాంశాలుగా కన్పించడం లేదని, రుణమాఫీ గురించి సానుభూతితో యోచించే పరిస్థితి లేదని ఎకనామిక్స్ టైమ్స్ ముందస్తు బడ్జెట్ సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్న వారిలో 35.4 శాతం మంది ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, వృద్ధిరేటు పెంచడమే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు. 31.5 శాతం మంది వృద్ధి కంటే ఉద్యోగాల కల్పనకే పెద్దపీట వేయాలన్నారు. 19.7 శాతం మంది ఆదాయం పన్ను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. రైతాంగ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న వారు కేవలం 13.4 శాతం మంది మాత్రమే. మద్దతు ధర పెంచాల్సిందే.. కనీస మద్దతు ధర పెంచడమే వ్యవసాయ సంక్షోభానికి పరిష్కారమంటున్నారు 42.8 శాతం మంది. 29 శాతం మంది ఎకరానికి నిర్ణీత మొత్తం చొప్పున చెల్లింపులు జరపడం ఉత్తమమని భావిస్తున్నారు. రుణ మాఫీ వైపు మొగ్గు చూపుతున్న వారు 6.5 శాతం మంది మాత్రమే. 21.7 శాతం మంది ఉచిత విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించడంపై ఆర్థికమంత్రి దృష్టి పెట్టాలంటున్నారు. పన్నులు ఎలా? 38 శాతం మందికిపైగా ప్రజలు ఆదాయం పన్ను బేసిక్ స్లాబ్ను ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నారు. 80(సీ) కింద పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలంటున్న వారు 19.9 శాతం మంది. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి ఏదో ఒక రూపంలో రివార్డులు ఇవ్వాలనే ఆలోచనను 33 శాతం మంది సమర్థిస్తున్నారు. మిగిలిన వారు ప్రస్తుత పన్ను శ్లాబులు బాగున్నాయని, మార్పులు చేయాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. సంస్కరణలు అవసరమా? ప్రత్యక్ష పన్నుల విధానంలో మార్పులు చేయాలని 34 శాతం మంది కోరుతున్నారు. తక్షణమే ఈ మార్పులు అవసరమంటున్నారు. 25.7 శాతం మంది భూ సేకరణ చట్టంలో మార్పులు అవసరమని భావిస్తుండగా, 24.7శాతం మంది కార్మిక చట్టాలను సంస్కరించాలంటున్నారు. విద్యుత్ రంగ సంస్కరణల వైపు మొగ్గు చూపిన వారు 15.6శాతం మంది మాత్రమే. ఉద్యోగాలు ఎలా? ఉపాధి సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలి? ఈ ప్రశ్నకు విద్యా వ్యవస్థను ప్రక్షాళించడమే మార్గమని 40 శాతం మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. 21.9 శాతం మంది కార్మిక సంస్కరణలతో సమస్యను పరిష్కరించవచ్చునన్నారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం (27.5 శాతం మంది) ‘ముద్ర’తరహా పథకాలు మరిన్ని అమలు చేయడం (10.6 శాతం) ద్వారా ఉద్యోగాలు కల్పించవచ్చునన్నారు కొందరు. కేటాయింపులు ఎలా? బడ్జెట్ కేటాయింపుల్లో మౌలిక సదుపాయాల రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని 36.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. వ్యవసాయ రంగ కేటాయింపులకు పెద్ద పీట వేయాలంటున్నారు 29 శాతం మంది. మిగిలిన వారు నైపుణ్యాలు (18.7శాతం) పర్యావరణం (15.9శాతం) వైపు మొగ్గు చూపుతున్నారు. షేర్ల లాభాలపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల (ఎల్టీసీజీ) పన్నును రద్దు చేయడం ద్వారా మదుపర్లను ఆకట్టుకోవచ్చునని 27.4 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అంకుర పరిశ్రమలకు విధించే ఏంజెల్ ట్యాక్స్ను రద్దు చేయాలంటున్నారు 30 శాతం మంది. -
మోదీ ప్రజల ప్రధానే..!
అసంతృప్తి ఉన్నా తరగని మోదీ వన్నె: సర్వేల్లో వెల్లడి మోదీ సర్కారు ఎన్నికల హామీల అమలు విషయంలో వెనుకబడినప్పటికీ.. ప్రజామోదం విషయంలో ముందంజలోనే ఉందన్నది ఇటీవల వివిధ జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో వెల్లడైంది. ప్రభుత్వం పట్ల ప్రజలు ఎంత సంతృప్తికరంగా ఉన్నారనేది అంచనా వేసేందుకు చేసిన ఈ సర్వేలు.. ఒకవైపు తాము కోరుకున్న ఫలితాల కోసం నిరీక్షణతో ప్రజల్లో అసహనం పెరుగుతున్నప్పటికీ.. మోదీ మీద ప్రజాభిమానం తరగలేదని చెప్తున్నాయి. ఆయన ప్రజల మనసులకు దూరం కాలేదని లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో కేంద్ర ప్రభుత్వ పనితీరుపై దాదాపు 61 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఎకానమిక్ టైమ్స్ పత్రిక సర్వేలో.. మోదీ పనితీరు ఆశించినదానికన్నా బాగుందని సుమారు 45 శాతం మంది హర్షం వ్యక్తం చేస్తే, దాదాపు 40 శాతం మంది సంతృప్తికరంగా ఉందని చెప్పారు. ధరల పెరుగుదల: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయని లోకల్ సర్కిల్స్ సర్వేలో 66 శాతం మంది బదులిచ్చారు. అయితే.. జీవన వ్యయాన్ని తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎకానమిక్ టైమ్స్ సర్వేలో 58 శాతం మంది పేర్కన్నారు. శాంతి భద్రతలు: ఇక శాంతిభద్రతలు, మహిళలపై నేరాల పెరుగుదల విషయంలో జనంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నేరాల రేటు తగ్గలేదని లోకల్సర్కిల్స్సర్వేలో దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడడం లేదని గత ఏడాది అసంతృప్తి వ్యక్తంచేసిన వారి సంఖ్య 38 శాతం మాత్రమే. అలాగే.. ఎకానమిక్టైమ్స్తాజా సర్వేలో ‘మహిళలు, పిల్లలపై నేరాలు తగ్గాయని భావిస్తున్నారా?’ అన్న ప్రశ్నకు ‘లేద’ని సమాధానం ఇచ్చిన వారు 60 శాతం మంది ఉన్నారు. ఇక అసహనం పెరుగుతుందన్న ప్రశ్నలకు.. అత్యధికులు అటువంటిదేమీ తమకు కనిపించలేదని జవాబు ఇచ్చారు. ఉపాధి కల్పన: మోదీ సర్కారుకు అతి తక్కువ మార్కులు వచ్చింది ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయంలోనే. లోకల్సర్కిల్స్సర్వేలో 63 శాతం మంది ఉద్యోగ కల్పనలో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది గత ఏడాది 43 శాతంగా మాత్రమే ఉంది. ఎకానమిక్టైమ్స్సర్వేలోనూ నిరుద్యోగిత తగ్గలేదని ప్రజాభిప్రాయం బలంగా వ్యక్తమైంది. పెద్ద నోట్ల రద్దు: దేశ ప్రజలను రోజుల తరబడి బ్యాంకుల ముందు క్యూల్లో నిల్చోబెట్టిన పెద్ద నోట్ల రద్దు వల్ల అవినీతిని అరికట్టే విషయంలో ఒరిగిందేమీ లేదని లోకల్సర్కిల్స్సర్వేలో 49 శాతం మంది అభిప్రాయపడితే.. ఈ చర్య సరైన దిశలో చేపట్టినదేనని 51 శాతం మంది సమర్థించారు. జీఎస్టీ: మోదీ సర్కారు అతి త్వరలో అమలులోకి తెస్తున్న వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) వల్ల తమ వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలపై సానుకూల ప్రభావం ఉంటుందని ఎకానమిక్టైమ్స్సర్వేలో 60 శాతం మంది ఆశాభావం వ్యక్తంచేశారు. (మరిన్ని వివరాలకు చదవండి) (ఇండియా ఫస్ట్) (కొంచెం మోదం! కొంచెం ఖేదం!!) (మోదీ మ్యానియా) (57 విదేశీ పర్యటనలు) – సాక్షి నాలెడ్జ్సెంటర్