breaking news
Crowded trains
-
ఏం టాలెంట్ సామీ నీది? బెర్త్ అదుర్స్!
‘నిదుర పోరా తమ్ముడా’ అని పాడింది లతా మంగేష్కర్. ‘కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది’ అన్నాడు ఆత్రేయ. ‘నిదర ముదర పోయాక పాడె వొక్కటే వల్లకాడు ఒక్కటే’ అన్నాడు జాలాది. నిజమే. నిద్ర పట్టాక, గాఢంగా నిద్ర కమ్ముకున్నాక మనం ఎక్కడ పడుకున్నామో ఎక్కడ తెలుస్తుంది? అందుకే నిద్ర సుఖమెరగదు అన్నారు పెద్దలు. అదేం ఖర్మోగాని రైలెక్కితే నిద్ర పోవాలనిపిస్తుంది. బెర్తులున్నవారు చక్కా తొమ్మిది దాటగానే దుప్పట్లు పరుచుకుని, కప్పుకుని గుర్రుపెడతారు. మరి జనరల్లో ఉన్నవారో?పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటుంటుంది. మన రైల్వే వారు జనరల్ కంపార్ట్మెంట్కు ఇదే సూత్రం అప్లై చేస్తారు. ఎంతమందెక్కినా ఏదో ఒక మూల కూలబడతారని టికెట్లు తెగ ఇస్తారు. ఎక్కాక బాత్రూమ్కు వెళ్లడానికి కూడా వీల్లేని తాకిడి. జనరల్లో ఎవరెక్కుతారు? బీదసాదలు. కాయకష్టం చేసి సొంత ఊరికో, ఏదో కొంపలంటుకు పోయే వర్తమానం అందినందుకో అప్పటికప్పుడు టికెట్ కొనుక్కుని ఎక్కుతారు. లేకపోయినా ఎక్కుతారు. నిద్రకు టికెట్తో పని లేదు. కిటికీల్లో నుంచి చల్లగాలి తగులుతుంటే, వెళ్లే రైలు ఊయల వలే ఊగుతుంటే ఎలాగైనా చోటు చూసుకుని పడుకో అంటుంది.రెండు బెర్తుల మధ్య కింద పడుకునేవారు ఎప్పుడూ కనపడతారు. లగేజ్ స్టాండ్ ఎక్కి నిద్రపోయేవారు కూడా మన దేశంలో విరివిగా విస్తృతంగా ఉన్నారు. అయితే ఈ కుర్రవాడు మాత్రం అసాధ్యుడు. పైన ఉన్న రెండు బెర్తులకు దుప్పటి కట్టి ఒక బెర్తు సృష్టించాడు. ఆ తర్వాత దానిలోకి జారి ఒళ్లెరగని నిద్రపోయాడు. హాతిమ్ ఇస్మాయిల్ అనే కేరళ ట్రావెలర్ ఈ వీడియో తీసి పోయిన నెల ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఇప్పటికి 10 లక్షల లైక్స్ వచ్చాయి. అంత మంచి సెటప్ చేసుకుని నిద్రపోతున్నవాణ్ణి చూసి కొందరు కుళ్లుకున్నారు. కొందరు దుప్పటి నాణ్యతను శ్లాఘించారు. మరికొందరు ఇకపైన స్లీపర్ బుక్ చేసుకోకుండా ఇదే ఫార్ములా వాడుతానని అన్నారు. ఆగ్రా రైలు ఇలాగే ఉంటుందని మరొకరు అన్నారు.ఈ మధ్య జనరల్ కంపార్ట్మెంట్లు పెరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. జనరల్ కంపార్ట్మెంట్లు ఎందుకు తక్కువ ఉంటాయో రైల్వేవారు ఎప్పుడూ చెప్పరు. ప్రభుత్వాలకు ఓట్లు కావాలి. వారి మాటలకు పగటి కలలు చూసే జనం బోగీల్లో ఇలాంటి నిద్రకే ఉపక్రమించాలి. (చదవండి: కళ్లు మూసుకొని... కళ్లు చెదిరే విజయం) -
సంక్రాంతికి రయ్.. రయ్...
-
చలో..పల్లె‘టూరు’
సంక్రాంతి సెలవులతో నగర వాసుల పల్లెబాట బస్సులు, రైళ్లలో రద్దీ తొలి రోజు 500 ప్రత్యేక బస్సులు ‘పల్లెకు పోదాం... పండగ చేద్దాం’ అంటూ జనం స్వగ్రామాల వైపు కదులుతున్నారు. పిల్లా పాపలతో హుషారుగా పరుగులు తీస్తున్నారు. ఇలా బయలుదేరిన జనాలతో రైల్వే స్టేషన్లు...బస్ స్టేషన్లు...కళకళలాడుతున్నాయి. ఎటొచ్చీ ప్రయాణికుల సంఖ్యకు సరిపడే స్థాయిలో రైళ్లు... బస్సులు లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. ఆర్టీసీ ‘ప్రత్యేకం’ పేరుతో టిక్కెట్ చార్జీల్లో 50 శాతం అదనపు దోపిడీకి దిగితే... ప్రైవేటు ఆపరేటర్లు రెట్టింపు స్థాయిలో వసూలు చేసి ఏడాది మొత్తం ఆదాయాన్ని పది రోజుల్లోనే పోగే సే పనిలో పడ్డారు. సిటీబ్యూరో: సంక్రాంతి సెలవులు వచ్చేశాయి. పండుగ సంబరాలకు నగర వాసులు సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. దీంతో శుక్రవారం జంట నగరాల నుంచి బయలుదేరిన ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు రద్దీగా కనిపించాయి. ప్రయాణికుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ వివిధ ప్రాంతాలకు 500 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. గుంటూరు, విజయవాడ, విశాఖ, తిరుపతి, కాకినాడ, కర్నూలు, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్ , నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, మహాత్మా గాంధీ, జూబ్లీ బస్స్టేషన్లలో సందడి నెలకొంది. ఈసారి సంక్రాంతి, అయ్యప్ప భక్తుల శబరిమలై దర్శనాన్ని దృష్టిలో ఉంచుకొని దక్షిణమధ్య రైల్వే సుమారు 130 అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది. మరో వైపు నిత్యం హైదరాబాద్ నుంచి ఉభయ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాలకు రాకపోకలు సాగించే 3,500 బస్సులకు తోడు అదనంగా 5,560 బస్సులను ప్రత్యేకంగా నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. వాటిలో 2835 ప్రత్యేక బస్సులు ఆంధ్ర వైపు, మరో 2720 బస్సులు తెలంగాణ వైపు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిలో శుక్రవారం రాత్రి 10 గంటల వరకు రెగ్యులర్తో పాటు 500 ప్రత్యేక బస్సులు బయలుదేరాయి. ప్రైవేట్ బస్సులూ కిటకిటలాడుతున్నాయి. మరో రెండు రోజుల్లో రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా బస్సులను పెంచుతామని ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వినోద్కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. తప్పని నిరీక్షణ సంక్రాంతి రద్దీ నేపథ్యంలో అన్ని ప్రధాన రైళ్లలో చాంతాడంత వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. గోదావరి, గరీబ్థ్,్ర నర్సాపూర్, పద్మావతి, నారాయణాద్రి, విశాఖ, ఫలక్నుమా, తదితర ఎక్స్ప్రెస్ రైళ్లలో ‘నో రూమ్’ బోర్డులు వెలుస్తున్నాయి. ప్రత్యేకరైళ్లలో వెయిటింగ్ లిస్టు 150 దాటిపోయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 130 ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ వాటిలో ఎక్కువ శాతం శబరికి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ఏర్పాటు చేసినవే. సంక్రాంతికి అందుబాటులోకి తెచ్చిన వాటి సంఖ్య చాలా స్వల్పం. మరోవైపు కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లకు ఒకటి, రెండు సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్క్లాస్ బోగీలను అదనంగా ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికుల డిమాండ్కు తగ్గ స్థాయిలో లేవు. సాధారణ రోజుల్లో సుమారు 2.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా... సంక్రాంతి సందర్భంగా మరో లక్ష మంది వరకు రైళ్లలో తరలివెళ్లే అవకాశం ఉంది. ఈ డిమాండ్కు అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో ప్రయాణికులు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఆశ్రయించవలసి వస్తోంది. బస్సుల్లో చార్జీల మోత ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అదనుగా ప్రైవేటు ఆపరేటర్లు చార్జీల మోత మోగిస్తున్నారు. సాధారణం కంటే ఒకటి, రెండు రెట్లు అదనపు చార్జీలు విధించి నిలువుదోపిడీ కి పాల్పడుతున్నారు. మరోవైపు ఏటీబీ ఏజెంట్లు, ప్రైవేట్ ట్రావెల్ ఏజెంట్లు సీట్లను బ్లాక్ చేసి అద నపు వసూళ్లకు దిగుతుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. దారి మళ్లింపు సంక్రాంతి సందర్భంగా నడుపనున్న ప్రత్యేక బస్సుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహాత్మాగాంధీ బస్ స్టేషన్కు రావాల్సిన వాటిని నగర శివార్ల నుంచే నడుపుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు వెళ్లే బస్సులు జూబ్లీ బస్స్టేషన్, పికెట్ల నుంచి బయలుదేరుతాయి.కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు వైపు వెళ్లే బస్సులను సీబీఎస్ హేంగర్ (గౌలిగూడ) నుంచి నడుపుతున్నారు. నల్గొండ, మిరియాలగూడ వైపు వెళ్లే బస్సులు దిల్సుఖ్నగర్ బస్స్టేషన్, ఎల్బీనగర్ల నుంచి బయలుదేరుతాయి. వరంగల్, యాదగిరి గుట్ట, హన్మకొండ, జనగామ బస్సులు ఉప్పల్ రింగురోడ్డు నుంచి నడుస్తాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి తదితర రూట్ల బస్సులు మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి నడుస్తాయి.ఎల్బీనగర్, ఉప్పల్ రింగు రోడ్డు వద్ద ప్రయాణికుల కోసం ప్రత్యేక అనౌన్స్మెంట్ ఏర్పాటు చే స్తున్నారు. గౌలిగూడ, ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లలో అనౌన్స్మెంట్తో పాటు, హెల్ప్డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు.