breaking news
BSP MLAs
-
ఆ రెండూ టీఆర్ఎస్కే..!
- కాంగ్రెస్ ఆధిక్యమున్న మంచిర్యాల, బెల్లంపల్లిపైనా కన్ను - చేతులెత్తేసిన కాంగ్రెస్ ముఖ్య నేతలు - భైంసా మినహా ఐదింటినీ కైవసం చేసుకునే యత్నం సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వరుస విజయాలు.. పార్టీలో చేరికలతో జోరుమీదున్న అధికార టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఆధిక్యమున్న బల్దియాలపై కూడా కన్నేసింది. కేవలం హంగ్ ఫలితాలొచ్చిన మండల పరిషత్ల్లోనే కాకుండా, నామమాత్ర కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్న మున్సిపాలిటీలపైనా గులాబీ జెండా ఎగురవేసేందుకు పావులు కదుపుతోంది. ఈ మేరకు క్యాంపుల నిర్వహణతోపాటు, ఇతర పార్టీల కౌన్సిలర్లను తమవైపు లాక్కుని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు సామ, ధాన, బేధ దండోపాయాలను ప్రయోగిస్తోంది. ఆరు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో మంచిర్యాల, బెల్లంపల్లి బల్దియాల్లో కాంగ్రెస్కు అత్యధిక కౌన్సిలర్ స్థానాలు దక్కాయి. ముఖ్యంగా మంచిర్యాల మున్సిపాలిటీలో 32 వార్డులున్నాయి. చైర్మన్ స్థానానికి అవసరమైన మెజారిటీ 18 కౌన్సిలర్ స్థానాలు కాంగ్రెస్కు దక్కాయి. టీఆర్ఎస్ 14 స్థానాలకు పరిమితమైంది. కానీ.. ఇక్కడ మెజారిటీ లేని టీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే క్యాంపునకు తరలివెళ్లిన టీఆర్ఎస్ కౌన్సిలర్లు.. మరో నలుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లను తమవైపు తిప్పుకున్నట్లు స్పష్టమవుతోంది. శనివారం కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా క్యాంపునకు వెళ్లినా.. ఈ క్యాంపులో కేవలం 14 మంది కౌన్సిలర్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ క్యాంపు నుంచి వెళ్లిపోయిన కౌన్సిలర్లు టీఆర్ఎస్కు మద్దతు పలికే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బెల్లంపల్లిలోనూ.. బెల్లంపల్లి బల్దియాలో 34 వార్డులుండగా, కాంగ్రెస్ 14 కౌన్సిలర్ స్థానాలను, టీఆర్ఎస్ పది గెలుచుకుం ది. టీడీపీకి ఐదు దక్కగా, రెండు చోట్ల సీపీఐ, ముగ్గు రు స్వతంత్రులు గెలుపొందారు. చైర్మన్ స్థానం దక్కాలంటే 18 మంది కౌన్సిలర్ల మద్దతు అవసరం. అయి తే.. ఎక్కువ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్కే ఈ చై ర్మన్ పదవి దక్కాల్సి ఉండగా, పది స్థానాలకు పరిమితమైన అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ స్థానం కైవసం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. స్థానిక ఎ మ్మెల్యే దుర్గం చిన్నయ్య పర్యవేక్షణలో టీఆర్ఎస్ కౌ న్సిలర్లతో క్యాంపు కొనసాగుతుండగా, టీడీపీ, సీపీఐ కౌన్సిలర్ల మద్దతుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. టీఆర్ఎస్సే అధికారంలో ఉండటంతో ఇతర పార్టీల కౌన్సిలర్లు కూ డా టీఆర్ఎస్కు మద్దతిచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. చేతులెత్తేసిన కాంగ్రెస్ నేతలు.. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ ఉద్ధండులు బల్దియా ఎన్నికల విషయంలో చేతులెత్తేశారు. వారి నియోజకవర్గాలకు సంబంధించిన మున్సిపాలిటీలను కూడా ఆ నేతలు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ కౌన్సిలర్లు అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. మంచిర్యాలలో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ కౌన్సిలర్లను ఏకతాటిపై నిలపడంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అరవింద్రెడ్డి దాదాపు చేతులెత్తేశారు. అలాగే బెల్లంపల్లి చైర్మన్ స్థానాన్ని ‘హస్త’గతం చేసుకునేందుకు ఆ నియోజకవర్గంలో ఇన్నాళ్లు కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్రావు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ కౌన్సిలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భైంసా మినహా.. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, మందమర్రి మినహా ఆరు బల్దియాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఆరింటిలో ఐదు మున్సిపాలిటీలపై గులాబీ జెండాలు ఎగుర వేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్మన్ స్థానానికి సరిపడా మెజారిటీ రావడంతో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఈ బల్దియా గులాబీ వశం అవుతోంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు ఐకే రెడ్డి, కోనప్ప టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో నిర్మల్, కాగజ్నగర్ మున్సిపాలిటీలు అధికార పార్టీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. ఒక్క భైంసా పట్టణంలో విజయం సాధించిన ఎంఐఎం చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమైంది. -
ఇక నిర్మాణంపై నజర్
కేడర్ను పెంచుకునే దిశగా టీఆర్ఎస్ అడుగులు ఇప్పటికే ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించి సర్కారును ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు కేడర్ను బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బీఎస్పీ ఎమ్మెల్యేలు ఐకే రెడ్డి, కోనప్పను పార్టీలో చేర్చుకున్నారు. అలాగే ద్వితీయ శ్రేణి ాయకత్వంపై దృష్టి సారించింది. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీ కేడర్ను పూర్తి స్థాయిలో టీఆర్ఎస్లోకి లాగేందుకు పావులు కదుపుతోంది. ఇతర పార్టీలతో పోల్చితే టీఆర్ఎస్కు క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరగలేదనే అభిప్రాయం ఉంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఏడు అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. తాజాగా బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్లో చేరగా, మిగిలిన ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.విఠల్రెడ్డితో కూడా సన్నిహిత సంబంధాలు పెంచుకునే దిశగా ఆ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది. పార్టీలో ఉన్న పాత నాయకులను, కార్యకర్తలను కలుపుకుని పోవడంతోపాటు, కొత్త వారికి పార్టీ పదవులను ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఒకరు అభిప్రాయ పడ్డారు. ద్వితీయ శ్రేణి నాయకులకు మార్కెట్ కమిటీ డెరైక్టర్లు వంటి నామినేట్ పదవులను ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. జెడ్పీతోపాటు మండల పరిషత్లపై కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ రాని మండలాల్లో ఎంపీపీ పదవులను కైవసం చేసుకునేలా పావులు కదుపుతున్నారు. ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాగా, టీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఇతర పార్టీలకు చెందిన వారు ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. అధికార పార్టీలో ఉంటే పనులు చేసుకోవచ్చనే యోచనలో ఉన్నవారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావచ్చనే భావనలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు. -
యుపి అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీజేపీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. అఖిలేష్ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ముజఫర్నగర్ అల్లర్లకేసులో బీజేపీ, బీఎస్సీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఒక బీఎస్పీ ఎంపీతోపాటు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపైనా కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసినవారిలో బీఎస్పీ ఎమ్పీ ఖాదిర్ రానా, బీజేపీ ఎమ్మెల్యేలు సంగీత్ సోమ్, భరతేందు సింగ్, బీఎస్పీ ఎమ్మెల్యేలు నూర్ సలామ్, మౌలనా జమీల్ ఉన్నారు. అందరిపై నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. రెండురోజుల్లో వారిని అరెస్టు చేస్తామని ముజఫర్నగర్ పోలీసులు చెప్పారు. ఉద్రేక ప్రసంగాల ద్వారా వారు హింసను ప్రేరిపించినట్టు అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం 16 మందిపై అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి. రెండు రోజుల్లో నిందితులపై చర్యలు తీసుకోనున్నట్టు సీనియర్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఈ కేసులో ముగ్గురు నలుగురు రాజకీయ నాయకుల్ని అరెస్ట్ చేశామని, కీలక ఆధారాలు సేకరించామని చెప్పారు. మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందన్నారు. తొందర్లోనే ఇతర నిందితుల్ని అరెస్ట్ చేస్తామని ప్రవీణ్ కుమార్ చెప్పారు. ముజఫర్నగర్లో ఇటీవల జరిగిన మత ఘర్షణల్లో దాదాపు 47 మంది చనిపోయిన విషయం తెలిసిందే.


