breaking news
Brown field units
-
మౌలికానికి రూ.60,000 కోట్ల రుణ వితరణ
ముంబై: మౌలిక రంగానికి రుణాలను మంజూరు చేసే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్ఫిడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023– 2024) రూ.60,000 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ.8,000 కోట్లను మంజూరు చేసినట్టు తెలిపింది. అలాగే, 2024 మార్చి నాటికి గ్రీన్ ఫీల్డ్, బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులకు రూ.లక్ష కోట్ల రుణాలను ఆమోదించనున్నట్టు నాబ్ఫిడ్ ఎండీ రాజ్కిరణ్ రాయ్ వెల్లడించారు. ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఏడాది కూడా పూర్తి కాకముందే భారీ లక్ష్యాల దిశగా అడుగులు వేస్తోంది. గత వారంలోనే ఈ సంస్థ రూ.10వేల కోట్లను సమీకరించగా, వీటికి సంబంధించిన బాండ్లను బీఎస్ఈలో సంస్థ మంగళవారం లిస్ట్ చేసింది. ఈ సందర్భంగా రాజ్కిరణ్ రాయ్ మీడియాతో మాట్లాడారు. సంస్థ ఇష్యూకి ఐదు రెట్ల స్పందన రావడం గమనార్హం. పదేళ్ల బాండ్పై 7.43 శాతం వార్షిక రేటును ఆఫర్ చేసింది. ‘‘గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.18,000 కోట్లను పంపిణీ చేశాం. ఈ ఏడాది రూ.60000 కోట్ల రుణ పుస్తకాన్ని సాధిస్తామని భావిస్తున్నాం. రుణ ఆమోదాలు మాత్రం రూ.లక్ష కోట్ల వరకు ఉండొచ్చు’’అని రాయ్ వివరించారు. ప్రైవేటు ప్రాజెక్టులకూ తోడ్పాటు ఈ సంస్థ 60 శాతం రుణాలను ప్రభుత్వరంగ ప్రాజెక్టులకే ఇస్తోంది. జూన్ త్రైమాసికంలో మాత్రం సంస్థ మంజూరు చేసిన రుణాలన్నీ కూడా ప్రైవేటు ప్రాజెక్టులకు సంబంధించినవే కావడం గమానార్హం. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రైవేటు రుణాల వాటా పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది. పర్యావరణ అనుకూల ఇంధనాలు, థర్మల్ ప్లాంట్లు, డేటా కేంద్రాలు, సిటీ గ్యాస్ పంపిణీ, రోడ్లు, ట్రాన్స్మిషన్ లైన్లకు నాబ్ఫిడ్ రుణాలను ఇస్తుంటుంది. ప్రస్తుతం 30 శాతం రుణాలను గ్రీన్ఫీల్డ్ ఆస్తులకు ఇస్తుంటే, 20 శాతం మానిటైజేషన్ ఆస్తులకు, మిగిలినది నిర్వహణలోని ఆస్తులకు ఇస్తోంది. ఎయిర్పోర్ట్ల రంగంపైనా ఆసక్తితో ఉన్నట్టు రాజ్కిరణ్రాయ్ తెలిపారు. రానున్న కొత్త విమానాశ్రయాలన్నీ కూడా ఆర్థికంగా సురక్షితమైనవేనన్నారు. రిటైల్ ఇన్వెస్టర్లకు పన్ను రహిత బాండ్ల గురించి అడగ్గా, సమీప కాలంలో ఈ యోచన లేదన్నారు. -
ఎంఎన్సీ టేకోవర్లతో దేశీ ఫార్మా కుదేలు
బ్రౌన్ఫీల్డ్ ఫార్మాలో ఎఫ్డీఐలను నిషేధించాలి పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులు న్యూఢిల్లీ: నగదు నిల్వలు పుష్కలంగా ఉన్న బహుళజాతి సంస్థలు (ఎంఎన్సీ) టేకోవర్లు చేస్తుండటంతో ప్రస్తుత విధానాలు ఇలాగే కొనసాగితే దేశీ ఫార్మా సంస్థలు కుదేలయ్యే ప్రమాదం ఉందని పార్లమెంటరీ స్థాయీ సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న ఫార్మా యూనిట్లలో (బ్రౌన్ ఫీల్డ్ యూనిట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై (ఎఫ్డీఐ) ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించాలని సూచించింది. లేని పక్షంలో జనరిక్ ఔషధాలను చౌకగా అందించడంలో దేశీ ఫార్మా సంస్థల సామర్ధ్యం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొంది. ఫార్మా ఎఫ్డీఐలపై గతంలో చేసిన సిఫార్సుల మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలకు సంబంధించి వాణిజ్యానికి సంబంధించి స్థాయీ సంఘం సమర్పించిన నివేదికను సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కేవలం ఎఫ్డీఐ గణాంకాలపైనే దృష్టి పెట్టిన పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ).. దేశీ ఫార్మా కంపెనీలను ఎంఎన్సీలు ఇష్టారీతిగా టేకోవర్ చే స్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని నివేదిక తూర్పారబట్టింది. చౌక జనరిక్స్కి కేంద్రంగా భారత్ను కేంద్రంగా తీర్చిదిద్దిన దేశీ దిగ్గజాలు కనుమరుగైపోతే విదేశీ కంపెనీల చేతిలో పడి భారత ఫార్మా పరిశ్రమ లాభాపేక్షే ధ్యేయంగా ముందుకు సాగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశీయంగా అందుబాటు ధరలో ఔషధాలు లభించడానికి ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా చూసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖతో డీఐపీపీ కలిసి పనిచేయాలని సూచించింది.