breaking news
Bengal chief minister
-
అమిత్ షా భోజనం ఫొటోపై మమత ట్వీట్
కోల్కతా: బెంగాల్లో కొన్ని సంవత్సరాలుగా అధికార పార్టీ టీఎంసీ, ప్రతిపక్షం బీజేపీ మధ్య రాజకీయాలు రగులుతున్నాయి. రెండు పార్టీలు దూకుడుతో అక్కడి రాజకీయం రణరంగాన్ని తలపిస్తోంది. ఇన్ని రోజులుగా బీజేపీ ప్రధాన నాయకులు బెంగాల్లో అడుగుపెట్టలేదు అందుకే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అమిత్ షా ఈ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. బిహార్ విజయంతో బీజేపీ మంచి జోరు మీద ఉంది. ఇదే అదునుగా చూసుకొని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అమిత్ షాపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ రాష్ట్రంలోని బంకురా జిల్లాలో ఒక గిరిజన పార్టీ కార్యకర్త ఇంట్లో అమిత్షా భోజనం చేస్తుండగా తీసిన ఫోటోను ఆయన తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన మమత తీవ్రంగా విమర్శించారు. బయట నుంచి తెచ్చిన భోజనం తింటూ గిరిజన కార్యకర్త ఇంట్లో తింటున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఉచిత రేషన్ పంపిణీ జూన్ వరకు ఇచ్చామని దానిని ఇంకా పెంచుతామని మమత ప్రకటించారు. అమిత్ షా రాకతో బెంగాల్ రాజకీయాలు కొత్త మలుపులు తిరగనున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ మే మధ్య ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తాయి. ఎలా అయిన బెంగాల్లో మకాం వెయ్యాలని బీజేపీ చూస్తోంది. అందుకే ఇప్పటి నుంచే పర్యటనల పేరుతో ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. వారికి శుభ సూచికంగా మమత శిబిరంలో చీలికలు మొదలైనట్లు కనిపిస్తుంది. బీజేపీ బలం పెంచుకోవడానికి ఇదే మంచి సమయం అని భావించి అమిత్ షాను రంగంలోకి దించింది. కానీ ఈ పర్యటనలో స్వలాభం ఉందని మమతఎద్దేవా చేయడంతో ప్రజలలో కొంతమేర వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తుంది. (గ్రేటర్ హైదరాబాద్ పోరు.. రంగంలోకి అమిత్ షా) Had amazing Bengali food at Shri Vivishan Hansda ji’s home in Chaturdhi village. No words can express their warmth and hospitality. চতুরডিহি গ্রামে শ্রী বিভীষণ হাঁসদা জীর বাড়িতে চমৎকার বাঙালী খাবার খাওয়ার সুযোগ পেলাম। কোনো শব্দই তাদের আতিথেয়তা বর্ণনা করতে পারবেনা। pic.twitter.com/pdeMCEa6Xp — Amit Shah (@AmitShah) November 5, 2020 -
సీపీఎం ‘మాస్టర్’ ప్లాన్!
* దీదీని ఢీకొనేందుకు సరికొత్త ఎత్తుగడ * ఉపాధ్యాయ అభ్యర్థుల్ని దించిన సీపీఎం * ఆరుగురు తృణమూల్ ఎంపీలకు సవాలు రాజశేఖర్, సాక్షి-న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఢీకొనేందుకు సీపీఎం ఈసారి ‘మాస్టర్’ ప్లాన్ వేసింది. తృణమూల్కు గట్టి ప్రాబల్యమున్న స్థానాల్లో ఉపాధ్యాయ నేపథ్యం గల అభ్యర్థులను బరిలోకి దించింది. ఆరుగురు తృణమూల్ సిట్టింగ్ ఎంపీలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులను రంగంలోకి దించిన సీపీఎం, మరో నాలుగు స్థానాల్లోనూ ‘మాస్టర్స్’నే పోటీకి నిలిపింది. వారి వివరాలు ఓసారి చూద్దాం.. నియోజకవర్గం: బంగావ్ దేబాశీష్ దాస్ (సీపీఎం) జాదవ్పూర్ వర్సిటీ నుంచి టెలీ కమ్యునికేషన్, ఇంజనీరింగ్ విభాగంలో పీహెచ్డీ చేసిన ఈయన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అధ్యాపకునిగా పనిచేశారు. తర్వాత సీపీఎంలో చేరి, 1991, 2001, 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కపిల్కృష్ణ ఠాకూర్ (తృణమూల్) మతువా సామాజికవర్గానికి చెందిన కపిల్ తండ్రి గురుచంద్ ఠాకూర్కు దళిత నేతగా మంచి పేరు ఉంది. కపిల్ తల్లి మంజులాకృష్ణ ఠాకూర్ ఇదివరకు ఎమ్మెల్యేగా, మమత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గం: కంతి తపస్ సిన్హా (సీపీఎం) విద్యాసాగర్ వర్సిటీలో పట్టభద్రుడైన తపస్ సిన్హా రంగస్థల నటుడిగా ప్రసిద్ధుడు. థియేటర్ ఆర్ట్సలో అధ్యాపకుడిగా వ్యవహరించారు. శిశిర్ అధికారి (తృణమూల్) మన్మోహన్ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా పనిచేశారు. గతంలో కంతి మునిసిపాలిటీ చైర్మన్గా పాతికేళ్లు కొనసాగారు. ప్రస్తుతం కంతి ిసిటింగ్ ఎంపీ. నియోజకవర్గం: దక్షిణ కోల్కతా నందినీ ముఖర్జీ (సీపీఎం) ఈమె జాదవ్పూర్ వర్సిటీ నుంచి ఎంఈ, మాంచెస్టర్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం నందినీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. సుబ్రతా బక్షీ (తృణమూల్) సుబ్రతా బక్షీ ఇది వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం దక్షిణ కోల్కతా సిటింగ్ ఎంపీగా ఉన్నారు. నియోజకవర్గం: డమ్డమ్ దాస్గుప్తా (సీపీఎం) కోల్కతా వర్సిటీ నుంచి ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన అసీమ్కుమార్ దాస్గుప్తా.. అమెరికాలోని ఎంఐటీ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. సౌగతారాయ్ (తృణమూల్) ఇదివరకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మన్మోహన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గం: కృష్ణానగర్ శంతన్ ఝా (సీపీఎం) బిధాన్చంద్ర వర్సిటీ నుంచి వ్యవసాయశాస్త్రంలో పీహెచ్డీ చేశారు. అదే వర్సిటీలో ఫ్రొఫెసర్గా పనిచేశారు. కళ్యాణి మున్సిపాలిటీకి చైర్మన్గా పనిచేశారు. తపస్ పాల్ (తృణమూల్) ప్రఖ్యాత నటుడు. దాదాపు యాభైకి పైగా సినిమాల్లో నటించారు. ఇదివరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. నియోజకవర్గం: రాణాఘాట్ అర్చనా బిశ్వాస్ (సీపీఎం) హోమియోపతిలో డిప్లొమా చేసిన అర్చనా బిశ్వాస్, చాలాకాలం బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. గతంలో ఐద్వాలో పనిచేసిన ఆమె 2011లో సీపీఎంలో చేరారు. సౌగత బర్మన్(తృణమూల్) ఇక్కడి నుంచి సిటింగ్ ఎంపీగా ఉన్న సుచల్రంజన్ స్థానంలో మమత సౌగతను ఎంపిక చేశారు. స్థానిక పార్టీ బలం, ఆర్థిక బలం సౌగతకు సానుకూలాంశాలు. మరికొందరు... వీరితో పాటే అధ్యాపక వృత్తిలో కొనసాగిన మరికొందరిని కూడా సీపీఎం ఈ ఎన్నికల్లో బరిలోకి దించింది. జాల్పాయిగుడి స్థానం నుంచి మహేంద్రకుమార్ రాయ్, పురులియా నుంచి నరహరి మెహతా, జర్ద్వాన్పుర్జా నుంచి ఈశ్వరచంద్ర బోస్, బర్ద్వాన్-దుర్గాపూర్ నుంచి సైదల్ హఖీ పోటీ చేస్తున్నారు. వీరంతా ఇదివరకు ఉపాధ్యాయులు.