breaking news
BCCI co-operate trophy
-
యువరాజ్ సింగ్ జోరు
బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో శతకం ముంబై: ఐపీఎల్ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికిన డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తన మునుపటి జోరును ప్రదర్శిస్తున్నాడు. బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో యువీ 74 బంతుల్లోనే 105 పరుగుల (12 ఫోర్లు; 5 సిక్స్లు)తో చెలరేగాడు. యువరాజ్ జోరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ (ఎస్బీఎం)తో జరిగిన మ్యాచ్లో ఎయిర్ ఇండియా (ఏఐ) 102 పరుగుల భారీ తేడాతో నెగ్గింది. గ్రూప్ ‘డి’లో భాగంగా వాంఖడే మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన ఏఐ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 327 పరుగులు చేసింది. 99 పరుగుల వద్ద ఓ భారీ సిక్స్తో యువీ తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్కు నమన్ ఓజా (41 బంతుల్లో 60; 7 ఫోర్లు; 2 సిక్స్లు)తో కలిసి 131 పరుగులు జోడించాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఎస్బీఎంను పేసర్ పంకజ్ సింగ్ (12/3) వణికించాడు. దీంతో 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 225 పరుగులు మాత్రమే చేసింది. అనిరుద్ధ జోషి (85 బంతుల్లో 72; 5 ఫోర్లు; 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
అనిరుధ్ సెంచరీ వృథా
వడోదర: బీసీసీఐ కార్పొరేట్ ట్రోఫీలో స్టేట్బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్)కు తొలి మ్యాచ్లో పరాజయం ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏడు వికెట్ల తేడాతో ఎస్బీహెచ్పై ఘన విజయం సాధించింది. ముందుగా ఎస్బీహెచ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. అనిరుధ్ సింగ్ (128 బంతుల్లో 110; 12 ఫోర్లు, 2 సిక్స్లు) చక్కటి సెంచరీ సాధించగా, మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. బీపీసీఎల్ బౌలర్లలో సౌరభ్ నేత్రావల్కర్ 33 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బీపీసీఎల్ 44.5 ఓవర్లలో 3 వికెట్లకు 220 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఉదయ్ కౌల్ (122 బంతుల్లో 105 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), సూర్య కుమార్ యాదవ్ (69 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్స్లు) మూడో వికెట్కు 132 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. అహ్మదాబాద్లో జరిగిన మరోమ్యాచ్లో ఆంధ్రాబ్యాంక్ ఐదు వికెట్ల తేడాతో కెమ్ప్లాస్ట్ చేతిలో ఓడిపోయింది. ఆంధ్రాబ్యాంక్ 44.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అమోల్ షిండే 42 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కెమ్ప్లాస్ట్ 36.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అధిగమించింది.