breaking news
Ayush medicine
-
National Siddha Day: ద్రవిడుల ప్రాచీన శాస్త్రీయ వైద్యం
భారతీయ వైద్యవిధానాలలో ‘సిద్ధ’ ఒకటి. ఇది ప్రభుత్వ ఆయుష్ వైద్య శాఖలో ఒక భాగం. దాదాపు 4,000 సంవత్సరాల పురాతనమైనది. దీనికి ప్రాచుర్యం కల్పించిన వారిని ‘సిద్ధార్దులు’ లేక శైవ భక్తులైన ఋషులు అంటారు. వీరు 18 మంది. వీరిలో అగస్త్యుడు ముఖ్యమైనవాడు. ఆయన రాసిన వైద్య గ్రంథాలు ప్రామాణికం. అందుకే అగస్త్య మహర్షిని సిద్ధ వైద్య పితామహుడిగా పరిగ ణిస్తున్నారు. ఈ సిద్ధ విజ్ఞానాన్ని మెుట్టమెుదట శివుడు, పార్వతిదేవికి ఉపదేశించాడనీ, ఆమె దీనిని నందిదేవునికి అందించిందనీ, నందికేశుడు దీనిని సిద్ధులకు అందజేశాడనీ తమిళ గ్రంథాలు చెబుతాయి. ‘అగస్తియార్’ రాసిన గ్రంథాలు సిద్ధవైద్యంలో అనేక చికిత్స పద్ధతులైన వరమమ్ (ప్రెజర్ చికిత్స), తక్కానమ్ (మసాజ్ చికిత్స), నాటి (నాడీ పరీక్ష), శస్త్ర చికిత్స, రస వైద్యం, ఆవిరి చికిత్స, యోగ, ముద్ర, ప్రాణాయామం వంటి 99 రకాల పద్ధతులు ఉన్నట్లు తెలియ చేస్తున్నాయి. నేటికీ ఇవి సిద్ధ వైద్యులకు మార్గదర్శకం అవుతున్నాయి. ప్రాచీన గ్రంథం ‘తొలకప్పియం’ అనేక సిద్ధ వైద్య విషయాలను అందిస్తుంది. క్రీ.పూ 2వ శతాబ్దపు ‘తిరుక్కురై’ సిద్ధ విలువల గురించి చెబుతుంది. ‘మణిమేఖలై’ త్రిదోషాల గురించి చెబుతుంది. 13వ శతాబ్దంలో రాణి ‘కుందవై నాచియార్’ తన తండ్రి ‘కుంత్రకోజన్’ పేరు మీద ఉచిత వైద్యశాల నిర్వహించిందని తెలుస్తోంది. ఈ విధానంలోని సూత్రాలు, సిద్ధాంతాలు ఆయుర్వేదంతో సారూప్యతను కలిగి ఉంటాయి. క్రీ.పూ. 2వ శతాబ్దంలోనే వాలి (వాత), అజల్ (పిత్త), అయమ్ (కఫ) దోషాలుగా ఉంటాయనీ, వీటిని బట్టే ఔషధాలు నిర్ణయిస్తారనీ రాశారు. సిద్ధ వైద్య విధానంలో రస ఔషధాలు ప్రాముఖ్యత వహిస్తాయి. మెుక్కల వేర్లు, బెరడులు, ఆకులు, రత్నాలు, పశు ఉత్పత్తులతో ఔషధాల తయారీ ఉంటుందని ‘ఆయుష్’ ప్రచురించిన ‘హాలిస్టిక్ హెల్త్’ పుస్తకం ద్వారా తెలుస్తుంది. ఈ విధానం శ్రీలంక, సింగపూర్, మలేషియా, చైనా, తైవాన్ వంటి అనేక దేశాలలోనూ ఆదరణ కలిగివుంది. కరోనా సమయంలో కబాసురనీర్ ఔషధం తమిళనాడులో అనేక కేసులను తగ్గించడం వలన ప్రత్యేక ప్రజాదరణ పొందింది. – డాక్టర్ బాలాజీ దీక్షితులు పి.వి. (జనవరి 9 అగస్త్య మహర్షి జయంతి, జాతీయ సిద్ధ దినోత్సవం) -
ఇక జెనరిక్ షాపుల్లో ఆయుర్వేద మందులు
న్యూఢిల్లీ: ఆయుష్ మందులు ఇకమీదట జెనరిక్ మెడికల్ షాపుల్లో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఆయుర్వేద మందులను ఆరోగ్యమంత్రిత్వ శఖ ఆధ్వర్యంలో నిర్వహించే జెనరిక్ మెడికల్ షాపుల్లో విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ లోక్సభలో వెల్లడించారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రిత్వశాఖతో చర్చలు జరుపుతున్నట్టు అని శుక్రవారం లోక్సభకు అందించిన సమాచారంలో తెలిపారు. పురాతన ఆయుర్వేద నాడీ వ్యాధి నిర్ధారణ కోర్సును కూడా వైద్య విద్య జాబితాలో చేర్చనున్నట్టు కూడా ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. ఈ పురాతన నైపుణ్యాన్ని అందించే దిశగా ఆయుర్వేద కౌన్సిల్ తో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే ప్రజారోగ్య కేంద్రాల్లోనూ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ వైద్యులు కూడా ఉండనున్నారని ఇందుకు సంబంధించిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించినట్టు తెలిపారు. ఇప్పటికే "డేంజర్ జోన్" లోఉన్న ఔషధ మొక్కలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.