
యోగా సర్కస్ కాదు: మోదీ
శాంతి, సద్భావన కోసమే అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
న్యూఢిల్లీ: శాంతి, సద్భావన కోసమే అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో రాజ్ పథ్ లో ఆయన యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాజ్ పథ్ యోగా పథ్ అవుతుందని ఊహించారా అని అన్నారు. ఇవాళ కొత్త శకం ప్రారంభమైందన్నారు. యోగాతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
యోగా అంటే సర్కస్ కాదని, మానవ అంతఃసౌందర్య ఉత్ప్రేకం అని పేర్కొన్నారు. యోగా శారీరక వ్యాయామం కాదని, మానవ జీవన వికాస సాధనమన్నారు. మానవికాసానికి యోగా ఎంతో ఉత్కృష్టమైనదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యోగాభ్యాసం.. మానవాళికి భారత్ ఇస్తున్న కానుక అన్నారు.