వినాయక చవితి సందర్భంగా వొడాఫోన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని తన మొబైల్ వినియోగదారులకు వెండి నాణెం గెలుచుకునే ఆఫర్ను అందిస్తోంది.
వొడాఫోన్ కస్టమర్లకు వినాయక చవితి ఆఫర్
Sep 9 2013 1:12 AM | Updated on Sep 1 2017 10:33 PM
హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా వొడాఫోన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని తన మొబైల్ వినియోగదారులకు వెండి నాణెం గెలుచుకునే ఆఫర్ను అందిస్తోంది. ఈ నెల 9-19 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని, ప్రి పెయిడ్, పోస్ట్ పెయిడ్ యూజర్లందరికీ ఇది వర్తిస్తుందని వొడాఫోన్ ఇండియా బిజినెస్ హెడ్(ఆంధ్రప్రదేశ్) మన్దీప్సింగ్ భాటియా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమ లైవ్ హారతికి సబ్స్క్రైబ్ చేసే కస్టమర్లు రోజువారీ పోటీలో పాల్గొనే అవకాశం పొందుతారని, ఇందులో గెలుపొందిన వారికి 10 గ్రాముల వెండి నాణెం, ప్రసాదం బాస్కెట్ అందిస్తామన్నారు. రూ.30 విలువుండే వొడాఫోన్ గణేష్ చతుర్ధి లైవ్ హారతి ప్యాక్ అక్టోబర్ 4 వరకూ అందుబాటులో ఉంటుందని చెప్పారు.
Advertisement
Advertisement