ఎన్‌కౌంటర్లో మావోయిస్టు మృతి | mavoist killed in an encounter | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్లో మావోయిస్టు మృతి

Jul 29 2015 5:34 PM | Updated on Oct 16 2018 2:39 PM

ఎన్‌కౌంటర్లో మావోయిస్టు మృతి - Sakshi

ఎన్‌కౌంటర్లో మావోయిస్టు మృతి

ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లా అటవీప్రాంతంలో బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించాడు.

హైదరాబాద్: ఛత్తీస్ గఢ్ లోని దంతెవాడ జిల్లా అటవీప్రాంతంలో బుధవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావోయిస్టులు వారోత్సవాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో నిహాడి, మిర్చిపరా గ్రామాల మధ్య బుధవారం ఉదయం కూంబింగ్ కు వెళ్లిన పోలీసులకు.. ఓ మావోయిస్టు బృందం ఎదురుపడింది.

మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులకుదిగడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక మావోయిస్టు చనిపోగా, నలుగురు మహిళా నక్సల్స్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.  మావోయిస్టులకు చెందిన భారీ డంప్ ను కూడా స్వాధీనం చేసుకున్నామని, పరిసర ప్రాంతాల్లో మరికొన్న డంప్‌లు లభించే అవకాశం ఉండటంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement