రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో ఓ మహిళ డెంగ్యూ వ్యాధి సోకి మృతిచెందింది.
మేడ్చల్ (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో ఓ మహిళ డెంగ్యూ వ్యాధి సోకి మృతిచెందింది. కుటుంభసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మూర్తి, అనంతలక్ష్మీ(40) దంపతులు పూడూర్ గ్రామంలో నివాసముంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా అనంతలక్ష్మి గత మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో భాదపడుతోంది. దీంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె శనివారం మృతిచెందింది.