రైతు బలవన్మరణం | The farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు బలవన్మరణం

Sep 22 2015 1:28 PM | Updated on Oct 1 2018 2:36 PM

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పూసం భద్రయ్య (50)కు రెండెకరాల పొలం ఉంది. దీనికితోడు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. గతేడాది, ఈ ఏడాది కలిపి రూ.2 లక్షల మేర అప్పులు చేశాడు. వర్షాలకు పూత, పిందె రాలిపోవడంతో మనస్తాపం చెందిన భద్రయ్య సోమవారం రాత్రి పురుగుల ముందు తాగాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి ప్రాణాలు కోల్పోయి ఉన్నాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement