అప్పుల బాధతో రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన ఆశయ్య(45)అనే రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అప్పుల బాధతో రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బంట్వారం మండలం సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన ఆశయ్య(45)కు రెండున్నర ఎకరాల పొలం ఉంది. దాంట్లో ఆయన మినుము, కంది సాగు చేశాడు. కుటుంబపోషణ కోసం, పంటల సాగు కోసం రూ.2 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలు సరిగా లేకపోవటంతో అప్పు తీరేదెలాగని కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్నాడు. మంగళవారం ఉదయం పొలంలోని చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. ఆశయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.