మద్యపాన నిషేధం కోసం రెండురోజుల దీక్ష | DK Aruna Two Days Deeksha For Liquor Ban | Sakshi
Sakshi News home page

ఇలాంటి ఘటనలు జరగకూడదంటే..

Dec 10 2019 4:14 PM | Updated on Dec 10 2019 4:28 PM

DK Aruna Two Days Deeksha For Liquor Ban - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. మద్యం కారణంగానే మనుషులు మృగాలుగా మారుతున్నారన్నారని అన్నారు. మద్యం తాగిన మత్తులో అనాగరికంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో దిశ ఘటనతోపాటు మరో రెండు ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. ఈ కేసుల్లో నిందితులపై చర్యలు తీసుకోడానికి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో బాధితులైన సమత, మానస కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మద్యం అమ్మకాలు నిషేధించాలని డిమాండ్‌ చేశారు. దీనికోసం గురు, శుక్రవారాల్లో రెండురోజుల దీక్ష చేపడతానన్నారు. ఈ దీక్షను విజయవంతం చేసేందుకు అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు మద్దతు తెలపాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement