లండన్‌ చేస్తామన్నారుగా ఏమైంది? | congress leader ponnam prabhakar slams telangana cm kcr | Sakshi
Sakshi News home page

లండన్‌ చేస్తామన్నారుగా ఏమైంది?

May 18 2017 11:51 AM | Updated on Aug 11 2018 7:06 PM

లండన్‌ చేస్తామన్నారుగా ఏమైంది? - Sakshi

లండన్‌ చేస్తామన్నారుగా ఏమైంది?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కరీంనగర్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 20 14లో కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన గురువారమిక్కడ సూటిగా ప్రశ్నించారు. కరీంనగర్‌ను లండన్‌గా మారుస్తామని కేసీఆర్‌ చెప్పారని, అయితే ఇప్పుడు ఎక్కడ చూసిన గుంతల రోడ్లే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ మాటల మనిషే కానీ, చేతల మనిషి కాదని అర్థం అవుతుందని పొన్నం విమర్శించారు. అలాగే మానేరు రివర్‌ ఫ్రంట్‌ పేరుతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. నిధులు రాకున్నా అత్యుత్సాహంతో ప్రారంభోత్సవాలు చేస్తున్నారని విమర్శించారు. రైతులు ధాన్యం అమ్ముకోలేక అవస్థలు పడుతున్నారని, మరోవైపు తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదని  పొన్నం అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement