-
ఇందిరమ్మ పాలనంటే ఇదేనా?: సబిత
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ హామీలను నమ్మి ఆడబిడ్డలు ఓటేశారని.. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే సీఎం మాట్లాడటం లేదు.. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? అంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.‘‘అసెంబ్లీలో మాట్లాడటానికి మైక్ ఇవ్వడం లేదు. నాలుగున్నర గంటలు అసెంబ్లీలో నిలబడ్డా మైక్ ఇవ్వలేదు. ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేస్తామని చెప్పినా మాట్లాడనివ్వలేదు. శాడిస్ట్లాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తమంటుంది. నోటి మాటల్లో కాదు నిజంగా చేసే దమ్ముందా?’’ అని సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు.ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, నాలుగు గంటలు నిలబడ్డా కనీసం మాకు మైక్ ఇవ్వలేదంటూ మండిపడ్డారు. జూనియర్ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించటం బాధగా ఉంది. ఇద్దరు మహిళ మంత్రులు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదు? మేము మాట్లాడి రెండు రోజులు అవుతుంటే ఎందుకు స్పందించటం లేదు.మహిళా మంత్రులు బాధ్యత కాదా?’’ అంటూ సునీతా లక్ష్మారెడ్డి మండిపడ్డారు. -
దొర పన్నిన కుట్రలో మా అక్కలు బందీ అయ్యారు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలుచేశారు. తనను నమ్ముకున్న అక్కలు (సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్ధేశించి)మంత్రులయ్యారని.. వారిని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. వాళ్ల మాటలు నమ్మవద్దని అక్కలకు చెబుతున్నానని తెలిపారు. వాళ్లను నమ్మిన చెల్లెలు తీహార్ జైలులో ఉందని, సొంత చెల్లినే జైలుకు పంపిన వాళ్లను నమ్మవద్దని సీఎం పేర్కొన్నారు. సొంత చెల్లి జైల్లో ఉంటే దాని గురించి మాట్లాడలేదని, మైక్ ఇస్తే శాపనార్ధాలు, లేకుంటే పోడియం ముందుకు.. వాళ్ల పనే అంత అంటూ మండిపడ్డారు. తనను అయిదేళ్ల పాటు సభలోకి రానివ్వలేదని, వచ్చినా మార్షల్స్ను పెట్టి బటయకు గెంటారని గుర్తు చేశారు.చెల్లి జైల్లో ఉంటే బజార్ల రాజకీయాలు చేసే నీచుడిని కాదని సీఎం తెలిపారు. మంత్రి సీతక్కపై అవమానకరమైన పోస్టులు పెడుతున్నారని, ఆదివాసీ ఆడబిడ్డను అవమానించినట్లు కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కూడా సొంత అక్కల్లాగే భావించానని అన్నారు. అయితే ఒక అక్క నన్ను నడిరోడ్డు మీద వదిలేసి వెళితే.. మరో అక్క కోసం ప్రచారానికి వెళ్తే తనపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. దొర పన్నిన కుట్రలో మా అక్కలు చిక్కుకున్నారన్న సీఎం.. దొర కుట్రలను తెలుసుకుని అక్కలు బయటకు రావాలని సూచించారు.కాగా అసెంబ్లీలో ఆడబిడ్డలను అవమనించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బుధవారం మీడియాతో మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తనను టార్గెట్ చేసిన రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. రేవంత్ను కాంగ్రెస్లోకి తానే ఆహ్వానించానని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా? అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
తెలంగాణలో జాబ్ క్యాలెండర్, స్కిల్ వర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దీని ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే, ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.కాగా, తెలంగాణ అసెంబ్లీలో నేడు ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించినా.. ఇంకా లక్షలాది మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయి. వారిలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించాం.ఇందులో భాగంగానే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నాం. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి. నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుంది. 2024-25 సంవత్సరంలో 2వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10వేల మందికి శిక్షణ ఇస్తాం. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు.ఇక, మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీధర్ బాబు ప్రసంగం ఆపాలని కామెంట్స్ చేశారు. దీంతో, బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీరియస్ అయ్యారు. సభలో గందరగోళం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యుల తీరు సరికాదు. పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ సభ్యులకు సభ రూల్స్ తెలియవా?. నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సిద్దాంత పరంగా వేరు అయినా బిల్లుకు మద్దతు ఇచ్చారు. స్లోగన్స్ ఇవ్వడానికి అసెంబ్లీ ఫ్లాట్ ఫాం కాదు. యువతకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరుగుతుంటే సహకరించాలి కదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ కూడా మండిపడ్డారు. -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. మళ్లీ కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్లో చేరుతున్నట్టు తెలుస్తోంది. మంత్రి జూపల్లి కృష్ణారావుతో భేటీ తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.కాగా, గురువారం ఉదయం మంత్రి జూపల్లి.. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారిద్దరూ తాజా రాజకీయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో, మళ్లీ కాంగ్రెస్లో చేరేందుకు ఆయన సిద్ధమైనట్టు సమాచారం. కాగా, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కృష్ణమోహన్ ఇటీవలే కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే.అయితే, మొన్న అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. దీంతో, మంత్రి జూపల్లి రంగ ప్రవేశం చేసి ఆయనతో చర్చలు జరిపారు. ఇక, బండ్ల కృష్ణమోహన్తో నిన్న జీఎంఆర్ కూడా భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ హస్తం గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. -
తెలంగాణ అసెంబ్లీ.. మహిళా ఎమ్మెల్యేలపై రేవంత్ ఎమోషనల్ కామెంట్స్
Updates..తెలంగాణ శాసనసభ శుక్రవారం ఉదయం 10 గంటలకు వాయిదా.👉స్కిల్ యూనివర్సిటీపై చర్చ..సీఎం రేవంత్ ఎమోషనల్ కామెంట్స్..నన్ను నమ్ముకున్న అక్కలు మంత్రులయ్యారు.అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారా?.వాళ్ల మాటలు నమ్మవద్దని అక్కలకు చెబుతున్నాను.సొంత చెల్లినే జైలుకు పంపిన వాళ్లను నమ్మవద్దు.వాళ్లను నమ్మిన చెల్లెలు తీహార్ జైలులో ఉంది.సీతక్కపై అవమానకరమైన పోస్టులు పెడుతున్నారు.వాళ్లను సొంత అక్కల్లాగే భావించాను.ఒక అక్క నన్ను నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లింది.మరో అక్క కోసం ప్రచారానికి వెళ్లే నాపై కేసులు నమోదయ్యాయి.దొర పన్నిన కుట్రలో మా అక్కలు చిక్కుకున్నారు.దొర కుట్రలను తెలుసుకుని అక్కలు బయటకు రావాలి.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు.సీఎం ఛాంబర్ ముందు నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను ఎత్తుకొని బయటకు తీసుకువచ్చి అరెస్ట్ చేసిన పోలీసులుసీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.కేటీఆర్ కామెంట్స్..సీఎం మొండి వైఖరీ అహంకార వైఖరీ మార్చుకోవాలి.వెంటనే మహిళా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి సీఎం ఛాంబర్ ముందు నిలబడి నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలుసబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, కోవా లక్ష్మి.మహిళ ఎమ్మెల్యేలను లిఫ్టింగ్ చేస్తున్న మహిళ పోలీసులు.వెహికల్ సిద్దంగా ఉంచిన పోలీసులు.కాసేపట్లో సబిత ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మీ, సునీతా లక్ష్మారెడ్డి అరెస్ట్.తెలంగాణ భవన్కు తరలించనున్న పోలీసులు. సీఎం రేవంత్ కామెంట్స్..ఐటీ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది.ఏ దేశానికైనా సాంకేతిక నిపుణులు కావాలి.హైదరాబాద్లో ఐటీ రంగానికి రాజీవ్గాంధీ పునాదులు వేశారు.రాజీవ్ హయాంలోనే మాదాపూర్లో ఐటీ సంస్థలు ప్రారంభమయ్యాయి.దేశ, విదేశాల్లో యువత ఐటీ రంగంలో సత్తా చాటుతున్నారు.అత్యున్నత సంస్థల్లో తెలుగువారు ఉండటం గర్వకారణం.స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఎంతో గొప్ప ఆలోచన.గత కాంగ్రెస్ ప్రభుత్వాలు జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేశాయి.అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీనే.గాంధీజీ స్పూర్తితోనే స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించుకుంటున్నాం.విద్యకు పెద్దపీట వేస్తున్నాం.గ్రామీణ ప్రాంతాల్లో యువతకు వృత్తి నైపుణ్యంపై శిక్షణ ఇవ్వనున్నాం. 👉అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ.👉 అసెంబ్లీ వద్ద గందరగోళం.. అసెంబ్లీ గేట్ నెంబర్ వన్ లోపలికి వచ్చే ప్రాంతంలో మోహరించిన పోలీసులుబీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బైటాయింపు.సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 👉సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానిస్తామంటున్న నేతలు..👉హరీష్ రావు కామెంట్స్.. ప్రతిపక్షం తరుపున ఎవరు మాట్లాడాలనేది మేము నిర్ణయించి చెప్తాం.అందుకు అనుగుణంగా సభలో మీరు అవకాశం ఇవ్వాలి.కానీ మీరు కొత్త సంప్రదాయం నెలకొల్పుతున్నారు.ఇది కౌరవ సభ లాగా నడుస్తుంది.అంతిమంగా పాండవులే గెలుస్తారు.కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ది చెప్తారు.నిన్న, ఈరోజు సభ జరిగిన తీరు మా హృదయాలను కలిచి వేసింది.ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలపై సీఎం మాటలు బాధరకం 👉సభలో కొనసాగుతున్న గందరగోళం.ఉదయం నుంచి సభలో కింద కూర్చొని నిరసన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.ఎస్సీ వర్గీకరణపై మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నాం.: సీఎం రేవంత్ఇది ప్రధానమైన అంశం.ఇంత పెద్ద అంశం మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఉండి మాట్లాడాలి.లేదంటే వారి వారసులు ఎవరు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు: సీఎం రేవంత్. 👉కేటీఆర్ కామెంట్స్..ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాంమొదటి నుంచి ఈ అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది.ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం.మా పార్టీ అధినేత కేసీఆర్ సీఎం హోదా వర్గీకరణకు మద్దతుగా ప్రధాని లేఖ ఇచ్చారు 👉సీపీఐ శాసన సభా పక్ష నేత కూనంనేని సాంబశివరావు కామెంట్స్..రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పరిపాలించిన బీఆర్ఎస్ సభ్యులు సభలో కింద కూర్చోవడం బాధాకరంసీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రా రెడ్డికి అక్క, తమ్ముళ్ల అనుబంధం ఉందిసమస్యను స్పీకర్ దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటే మంచిదిసభ్యుడిగా నేను సూచన చేస్తున్నమహిళలను గౌరవించే వ్యక్తులలో మొదటి వ్యక్తిని నేనుఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాంఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగకు అభినందనలు అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన.ఎమ్మెల్యే సబితకు సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్.బీఆర్ఎస్ ఆందోళన వర్గీకరణకు వ్యతిరేకంలా ఉంది: కడియం శ్రీహరిప్రతీ ఒక్కరూ తీర్పును గౌరవించాలి.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ ఆగ్రహం.మీ పద్దతి సరిగా లేదు. 👉సీఎం రేవంత్ కామెంట్స్..సుప్రీంకోర్టు తీర్పుపై సభలో స్పందించిన సీఎం రేవంత్ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణపై ముందుకెళ్తాం.తెలంగాణలో వర్గీకరణను అమలు చేస్తాం.ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో వర్గీకరణ అమలుపరుస్తాం. 👉అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్స్..ప్రధాన ప్రతిపక్షం ఆందోళన చేస్తుంది.వారికి మైక్ ఇవ్వండి.వాళ్ళు ఆందోళన, నినాదాలు చేస్తుంటే అసెంబ్లీ కొనసాగడం ప్రజాస్వామ్య విధానం కాదు.వాళ్లకు మైక్ ఇవ్వండి.. లేదా సస్పెండ్ చేయండి 👉మంత్రి శ్రీధర్ బాబు సీరియస్సభలో గందరగోళం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యుల తీరు సరికాదు.పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ సభ్యులకు సభ రూల్స్ తెలియవా?.నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నారు..కాంగ్రెస్, బీజేపీలు సిద్దాంత పరంగా వేరు అయినా బిల్లుకు మద్దతు ఇచ్చారు.స్లోగన్స్ ఇవ్వడానికి అసెంబ్లీ ఫ్లాట్ ఫాం కాదు.యువతకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరుగుతుంటే సహకరించాలి కదా.👉 బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కామెంట్స్..స్కిల్ యూనివర్శిటి బిల్లును స్వాగతిస్తున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలిస్కిల్ యూనివర్సిటీని గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలికాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా SC, ST లకు 12 లక్షలు, BCలకు పది లక్షల రూపాయలు ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలి. 👉సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ సభ్యుల నినాదాలు. 👉 బీఆర్ఎస్ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం 👉స్పీకర్ బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చినందుకు ధన్యవాదాలు.👉మా ఆవేదనను అర్దం చేసుకున్నారు స్పీకర్.👉మేము నల్ల బ్యాడ్జీలు ధరించాం.👉మీరు నల్ల డ్రెస్సు వేసుకొని వచ్చారంటూ సభలో మాట్లాడిన హరీష్ రావు👉సభలో బీఆర్ఎస్ నేతల నినాదాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ 👉బీఆర్ఎస్ సభ్యులకు స్పీకర్ హెచ్చరిక.👉అన్ పార్లమెంటరీ పద్దతిలో వ్యవహరిస్తే మైక్ ఇవ్వను..👉ఇష్టారీతిన వ్యవహరిస్తే నా నిర్ణయం నేను తీసుకుంటా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్బీఆర్ఎస్ సభ్యులకు రాజకీయాలు తప్ప.. సభ నడవాలని లేదు.నిరుద్యోగుల గురించి ఏనాడూ కేటీఆర్ ఆలోచించలేదు.ప్రభుత్వ ఉధ్యోగాలే కాదు.. ప్రైవేటు రంగంలో స్థిరపడేందుకు స్కిల్ యూనివర్సిటీ.కేసీఆర్ మహిళా వ్యతిరేకినిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే.. ఇలాంటి రాజకీయాలు మానుకోండి. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదు. ఐదేళ్ల పాటు బీఆర్ఎస్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేరు. 👉ఎనిమిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం👉సభలో బీఆర్ఎస్ నేతల నినాదాలు.👉బీఆర్ఎస్ నేతలపై స్పీకర్ ఆగ్రహం.👉సభా నాయకుడి రాగానే ఆందోళన చేయడం సరికాదన్న స్పీకర్ 👉స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు.👉రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీని ప్రారంభించామన్న శ్రీధర్ బాబు. 👉సభ ముందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు.👉నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ వాయిదా తీర్మానంనిన్న శాసనసభలో సీఎం రేవంత్.. బీఆర్ఎస్ మహిళా శాసన సభ్యుల పట్ల అనుచిత వ్యాఖ్యలు.గౌరవ సభ్యులు, గౌరవసభ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా ఉన్నాయి.ఈ అంశంపై చర్చకి వాయిదా తీర్మానంబీఆర్ఎస్ ఎమ్మెల్యే సబిత కామెంట్స్..మా వాళ్ళని ఉదయం 5 గంటల నుంచి అరెస్టులు చేస్తున్నారు.ఇదేనా మీరు తెచ్చిన ప్రజాపాలన.ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటే మేము ఎందుకు ఆపుతాం.వారిలాగా సంస్కారం లేని వాళ్లం కాదు.మాకు ఎలాగూ అసెంబ్లీలో మైక్ ఇవ్వరు మాట్లాడటానికి.ఇక్కడ కూడా మాట్లడినివ్వరా?.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..రైతు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా?.ప్రజలకు సంక్షేమం చేయడం బీఆర్ఎస్కు ఇష్టం లేదా?.సభను తప్పుదారి పట్టించే విధంగా సబితా ఇంద్రారెడ్డి వ్యవహరించారు.వ్యక్తిగత విషయాలు సభలో మాట్లాడకూడదని సబితకు తెలియదా?.రాష్ట్ర మహిళలను అగౌరపరిచినట్లుగా బీఆర్ఎస్ చిత్రీకరిస్తోంది.ప్రతీ మహిళలను ఇందిరమ్మలా కాంగ్రెస్ చూస్తుంది.గతంలో కేసీఆర్ను విమర్శించిన విషయాన్ని సబిత మర్చిపోయారా?.మహిళలను ముందు పెట్టి బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారు. కాసేపట్లో ఎనిమిదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.నల్లబ్యాడ్జీలతో నిరసన చెబుతూ లాబీ నుంచి అసెంబ్లీలోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మేల్యేలుబీఆర్ఎస్ వాయిదా తీర్మానంబుధవారం శాసనసభలో సీఎం రేవంత్రెడ్డి బీఆర్ఎస్ మహిళ శాసన సభ్యుల పట్ల చేసిన అనుచిత వాఖ్యలుగౌరవ సభ్యుల, గౌరవసభ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా వున్నాయని చర్చకి వాయిదా తీర్మానం ఈరోజు సభలో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది. కాగా, నేటి సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఏడో వార్షిక రిపోర్టు సాంప్రదాయ ఇంధనం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నివేదికను టేబుల్ చేయనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. తెలంగాణ స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండో వార్షిక నివేదికను టేబుల్ చేయనున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.ఈరోజు మూడు బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం.1. తెలంగాణ సివిల్ కోర్టు అమెండ్మెంట్ బిల్లు.2. తెలంగాణ లా డిపార్ట్మెంట్ (ఛేంజ్ ఆఫ్ ఆక్రోనేమ్స్)బిల్లు.3. తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లు-2 -
మహిళల పట్ల రేవంత్, భట్టి ప్రవర్తన అవమానకరం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ప్రవర్తనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. రాష్ట్ర అసెంబ్లీలో సీఎం, డిప్యూటీ సీఎంల ప్రవర్తన అత్యంత అవమానకరమైంది. మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి వీరు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలి. వారిపట్ల గౌరవంగా ఉండాలి. ఈ రకమైన ప్రవర్తన సరికాదు. కాంగ్రెస్ నేతల నుండి ఈ రకమైన వ్యాఖ్యలు కేవలం మన నాయకులపైనే కాకుండా మహిళలందరి పట్ల వారి ధిక్కారాన్ని, అగౌరవాన్ని తెలియజేస్తున్నాయి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. Highly shameful and disgraceful behaviour of CM and Deputy CM in the state assembly We demand their unconditional apology to both Smt @BrsSabithaIndra Garu and Smt @sunitavakiti Garu. Both of them are senior legislators and former ministers, known for their dignified behaviour… https://t.co/HXuCP9f9Bv— KTR (@KTRBRS) August 1, 2024 -
కేటీఆర్ది రెచ్చగొట్టే కుట్ర
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ సూచనల ముసుగులో శాసనసభను తప్పుదోవ పట్టించేందుకు, మోసమనే ప్రణాళికను ప్రజల మెదళ్లలో చొప్పించేందుకు ప్రయతి్నస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. పదేళ్లు ఏలినవారు పది నెలలు కూడా పూర్తి చేసుకోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద వందల ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఎప్పుడు చూసినా రాజకీయాలేనా? ప్రభుత్వంగా మా పాత్ర మేం పోషిస్తాం. ప్రతిపక్షంగా వారి పాత్ర వారు పోషించాలి. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు. ఎందుకు రాజకీయాలు?’’అని కేటీఆర్ను ప్రశ్నించారు. బుధవారం ఉదయం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ సమయంలో మధ్య మధ్యలో సీఎం రేవంత్ జోక్యం చేసుకున్నారు.ముచ్చర్ల భూములను ఫార్మాసిటీ కోసం తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్ ఇచ్చారని, ఇప్పుడా భూముల వినియోగం మారిస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని కేటీఆర్ సూచించడంపై విరుచుకుపడ్డారు. ఆ వివరాలు రేవంత్ మాటల్లోనే.. ‘‘ముచ్చర్ల వద్ద భూసేకరణకు సంబంధించి సొంతంగా ఎందుకు ఊహాగానాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత ముచ్చర్ల నాలుగో సిటీగా.. మన భవిష్యత్తు సిటీగా అవతరించబోతోంది. అంతర్జాతీయ స్థాయి వైద్యం కావాలంటే అక్కడికి రావాలి. స్కిల్ నేర్చుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా యువత అక్కడికి రావాలి. అంతర్జాతీయ క్రీడాకారులు అక్కడికి రావాలి. అలా అన్ని రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్గా మార్చబోతున్నాం. స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తాం..: ముచ్చర్లలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. గురువారం సాయంత్రం జరిగే శంకుస్థాపనకు ప్రతిపక్ష నేతలు కూడా రావాలి. మాదాపూర్లోని న్యాక్ను అక్కడికి మార్చి పెద్ద వ్యవస్థగా ఏర్పాటు చేస్తున్నాం. ఒకప్పుడు ఆఫ్రో ఏషియన్ గేమ్స్ను ఘనంగా నిర్వహించుకున్న ఘనత హైదరాబాద్ది. దానికి ఉపయోగించిన గచి్చ»ౌలి స్టేడియం సముదాయాన్ని నిరుపయోగంగా, తాగుబోతులకు అడ్డాగా చేశారు. ఇప్పుడు ముచ్చర్లలో ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అంతర్జాతీయ స్టేడియం నిర్మించబోతున్నాం. అంతర్జాతీయ స్థాయి శిక్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం బీసీసీఐతో మాట్లాడాం దీంతోపాటు 200 ఎకరాల్లో ఆర్టిఫిíÙయల్ ఇంటెలిజెన్స్ హబ్ను అంతర్జాతీయ సంస్థలతో ఏర్పాటు చేయబోతున్నాం. ఆ ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు..: క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్కు విద్యార్హతల్లో మినహాయింపులు ఇచ్చి గ్రూప్–1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాం. ఒలింపిక్స్లో పతకం తెచి్చన బాక్సర్ నిఖత్ జరీన్కు గత ప్రభుత్వం ఉద్యోగం ఇస్తానని ఇవ్వలేదు. ఇప్పుడు ఆమెకు కూడా గ్రూప్–1లో డీఎస్పీ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాం.బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొచ్చా.. ‘‘కేసీఆర్ సభకు వస్తారేమోనని ఎదురుచూశా రాలేదు. ఆయన ఇటీవల చీల్చి చెండాడుతానని ప్రకటించడంతో.. ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చా’’అని రేవంత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇక ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కేటీఆర్కు సంబంధం ఏమిటన్న విషయంలో నేను, మంత్రులు మాట్లాడుకుంటుండగా చర్చకు వచి్చంది. కేటీఆర్ 100 శాతం ఆరి్టఫిíÙయల్, జీరో శాతం ఇంటెలిజెన్స్æ అని ఒకరు తేల్చారు’’అని ఎద్దేవా చేశారు. -
రైతులకు కాంగ్రెస్ దగా!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏవేవో ఆంక్షలు పెట్టి రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకుండా రైతులను దగా చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. అధికారం కోసం ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఆరు గ్యారంటీలు అమలు చేయడం లేదని విమర్శించారు. రుణమాఫీ కాని రైతులకు అండగా నిలుస్తామన్నారు. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో టోల్ఫ్రీ నంబర్ను ప్రారంభిస్తున్నట్టు కిషన్రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.‘‘రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దగా చేస్తోంది. రైతులకు ఏ ప్రతిపాదికన రుణమాఫీ చేస్తున్నారన్న అంశాన్ని స్పష్టం చేయాలి. చాలా మంది రైతులు రుణమాఫీ జరగక బ్యాంకుల్లో డీఫాల్టర్గా మారే దుస్థితి ఏర్పడింది’’అని కిషన్రెడ్డి మండిపడ్డారు. మోసపూరిత హామీలిచి్చ, అధికారంలోకి వచ్చాక దగా చేయడంలో అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ ఒకటేనని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం.. గ్రామస్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి, రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరిస్తామని.. ఆ వివరాలను ప్రభుత్వానికి పంపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని కిషన్రెడ్డి చెప్పారు. రైతులు, యువత, బీసీలు, మైనారిటీలు, మహిళలు.. ఇలా అన్ని వర్గాలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యారంగానికి 14 శాతానికిపైగా బడ్జెట్ కేటాయిస్తే.. అది తెలంగాణలో 7.60 శాతమేనన్నారు. మాటలు కోటలు దాటినా.. కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దా టుతున్నా.. చేతలు సెక్రటేరియట్ దాటడం లేదని కిషన్రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి పంటలకు మద్దతు ధర పెంపు, నిరుద్యోగులకు జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామన్న హామీలు ఏమైపోయాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మ ద్యం అమ్మకాలు, భూముల అమ్మకాలతోనే ఆదాయం పెంచుకోవాలని ఆలోచిస్తోందే తప్ప.. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం గురించి ఏమాత్రం ఆలోచించడం లేదన్నారు.ఇదీ బీజేపీ హెల్ప్లైన్ నంబర్రుణమాఫీకాని రైతులకు అండగా నిలిచేలా, ‘రైతుల పక్షాన కాంగ్రెస్ సర్కారును ప్రశి్నస్తున్న తెలంగాణ’ పేరుతో బీజేపీ పోస్టర్ను కిషన్రెడ్డి విడుదల చేశారు. అనంతరం హెల్ప్లైన్ నంబర్ 8886 100 097ను ప్రారంభించారు. కాగా.. ఈ టోల్ ఫ్రీ నంబర్కు విశేష స్పందన వస్తోందని బీజేపీ నేతలు చెప్తున్నారు. -
విపక్ష నేతగా నిలబెట్టాల్సింది పోయి మోసం చేశారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తనకు 2018లో సీఎల్పీ నేతగా, ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించిందని, ఒక దళితుడికి సీఎల్పీగా అవకాశం లభించడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్లో దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి తన వెనక ఉండి ప్రతిపక్ష నేతగా నిలబెట్టాల్సింది పోయి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది నేతలతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి పార్టీ విడిచి వెళ్లవద్దని, మీరు వెళ్తే సభ్యుల సంఖ్య తగ్గి ప్రతిపక్ష నేత హోదాను కోల్పోతానని, కాంగ్రెస్ పరువుపోతుందని ఆవేదన పడినా ప్రయోజనం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి మధ్య జరిగిన వాగ్వాదానికి స్పందిస్తూ ఆయన మాట్లాడారు. ‘అధికారం, స్వార్థం కోసం కాంగ్రెస్ వదిలి టీఆర్ఎస్లో చేరిన మీరు బాధపడుతూ మాట్లాడుతున్నా అంటున్నారు. అసలు బాధ పడాల్సింది నేనా? కాంగ్రెస్ పార్టీనా? మీరా? ఇంకా ఏం ముఖం పెట్టుకుని సీఎం రేవంత్రెడ్డి గురించి మాట్లాడతా రు? పార్టీలు మారి పరువు తీసి మొత్తం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు’ అని భట్టి విక్రమార్క తీవ్ర స్వరంతో మాట్లాడారు. వేరే పార్టీలో ఉన్న సబితను 2004లో కాంగ్రెస్లో చేర్చుకుని టికెట్ ఇచ్చి ఐదేళ్లు మంత్రిగా చేసినట్టు గుర్తు చేశారు. 2009లో మళ్లీ టికెట్ ఇచ్చి మళ్లీ ఆమెను మంత్రిని చేసి అత్యంత ముఖ్యమైన శాఖలు అప్పగించారన్నారు. 2014లో పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చిందని, వాళ్ల అబ్బాయికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చిందని భట్టి చెప్పారు.మోసం చేశారు: మంత్రి సీతక్క కాంగ్రెస్లో చేరిన (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ.. కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలతో గవర్నర్కు ఫిర్యాదు చేయించారని బీఆర్ఎస్పై మంత్రి సీతక్క మండిపడ్డారు. వారితో రాజీనామా చేయించి బీఆర్ఎస్లోకి తీసుకున్నారా? సబితతో రాజీనామా చేయించారా? అని నిలదీశారు. మీతో వస్తామని చెప్పి ఒకరిద్దరు మహిళలు ఏం చేశారో తనకు తెలుసని, ఆ బాధను సీఎం అనుభవించారని చెప్పారు.(కాంగ్రెస్లో చేరేందుకు) ఢిల్లీకి వస్తున్నామని వారు చెప్పడంతో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ వద్ద సమయాన్ని తీసుకున్నారని, ఆ తర్వాత రాకుండా మోసం చేశారన్నారు. ఆ బాధ అనుభవించిండు కాబట్టే కేటీఆర్కు సీఎం సూచన చేశారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెను ఉద్దేశించి నీకేం తెలియదు అనగా, నీ దురహంకారాన్ని బంద్ చేసుకో అని సీతక్క తీవ్ర స్వరంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వారికి ఎంతో చేసిందని, అదే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వారిద్దరు చప్పట్లు కొట్టడం సబబేనా? అని సబిత, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు. ఆసక్తి లేకుంటే వెళ్లిపోవచ్చు: మంత్రి శ్రీధర్బాబు సభా నాయకుడు సీఎం మాట్లాడుతున్నప్పుడు సభ్యులందరూ సభలో కూర్చొని ఉండాలనే సంప్రదాయం ఉందని, కూర్చునే ఆసక్తి లేని వాళ్లు వెళ్లిపోవచ్చని శాసనసభ వ్యవహారాల మంత్రి డి.శ్రీధర్బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ వెల్ వద్ద చేరి ఆందోళన చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా తనకున్న అధికారాలను సైతం ప్రశ్నిస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపారని మండిపడ్డారు. తీరు మారకపోతే సభలో (సస్పెన్షన్ తరహా) తీర్మానం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీ రామారావు డిమాండ్ చేశారు. ఈ అవమానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిలది మాత్రమే కాదని.. మొత్తం తెలంగాణ ఆడబిడ్డలకే అవమానకరమని పేర్కొన్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. ‘‘మహిళా ఎమ్మెల్యేలను అకారణంగా, అసభ్యంగా హీనాతిహీనంగా సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు అవమానించారు.మహిళా ఎమ్మెల్యేలు ఎంతో కష్టపడి రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు. అంతేతప్ప రేవంత్ మాదిరిగా విన్యాసాలు చేస్తూ రాజకీయాల్లోకి రాలేదు. వాళ్ల కుటుంబాలకు ఉన్న ఆదరణతో స్వశక్తితో రాజకీయాల్లో రాణిస్తున్నారు. అలాంటి మహిళలను పట్టుకుని నోటికి వచ్చినట్టు వాగడం సీఎం రేవంత్కు తగదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలి..’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందన్నట్టుగా సీఎం మాట్లాడటం హేయమని మండిపడ్డారు. సీఎం కుర్చీలో కూర్చునేందుకు రేవంత్ అనర్హుడని, ఆయనకు ఆడబిడ్డల ఉసురు తగులుతుందని వ్యాఖ్యానించారు.భట్టికి ఎంత గుండె ధైర్యం?‘‘ముఖ్యమంత్రి ఇట్లా ఉంటే.. ఉప ముఖ్యమంత్రి మమ్మల్ని ఏ ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చినవ్ అంటారా? మీరు ఏ ముఖం పెట్టుకుని వచ్చారో మేము కూడా అదే విధంగా అసెంబ్లీకి వచ్చాం. మా ఆడబిడ్డలతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడటానికి డిప్యూటీ సీఎం భట్టికి ఎంత గుండె ధైర్యం?’’ అని కేటీఆర్ నిలదీశారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చినది ఇష్టమొచ్చినట్టు మాట్లాడటానికా అని ప్రశ్నించారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నా ఎప్పుడైనా ఇలా మహిళలను అవమానించామా అని పేర్కొన్నారు. సీఎంను ఏకవచనంతో సంబోధిస్తే వెంటనే సరిచేసుకు న్నానని, అది కేసీఆర్ తమకు నేర్పిన సంస్కారమని చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. -
ఇక్కడ ముంచి.. అక్కడ తేలిండ్రు
సాక్షి, హైదరాబాద్: ‘మేము కలిసి వస్తాం. ప్రభుత్వానికి సహకరిస్తాం అని కేటీఆర్ పదే పదే చెప్తున్నారు. మీరు కలిసి వస్తారా?! అన్నం ఉడికిందా లేదా? అన్నది ఒక్క మెతుకు పట్టి చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు (కేసీఆర్) సభకే రారు. వీరు కలిసి వస్తా అంటే నమ్మేది ఎవరు? నేను అందుకే వారికి (కేటీఆర్) సూచన చేస్తున్నా. నీ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (కాంగ్రెస్లో) ఉండి చెప్పి చెప్పి, ఇక్కడ ముంచి అక్కడ (బీఆర్ఎస్)తేలిండ్రు.. ఆ అక్కల మాటలు విన్నడు అనుకో, జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సి వస్తది..’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.శాసనసభలో బుధవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ మాట్లా డారు. ఆయన ప్రసంగం ముగించగానే ఆయన వెనకాల ఉన్న బీఆర్ఎస్ సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు గట్టిగా బల్లలు చరుస్తూ మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే సీఎం మాట్లాడుతూ.. ‘వెనకాల ఉండే అక్కలు..’ అనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అరుపులు, నినాదాలు, కాంగ్రెస్ సభ్యుల ప్రతి నినాదాలతో గందరగోళం మధ్యే రేవంత్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అండగా నిలబడతానని చెప్పి మోసం చేశారు: రేవంత్ ‘ప్రజాజీవితంలో ఉన్నప్పుడు వ్యక్తిగత, ప్రజాజీవితానికి సంబంధించిన చర్చ ఉంటుంది. నాకు, సబితక్కకి మధ్య జరిగిన వ్యక్తిగత చర్చను ఆమె సభలో చెప్పారు. కాబట్టి దానికి కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలను నేను సభలోనే చెప్పాల్సిన అసవరముంది. కాంగ్రెస్ పారీ్టలోకి నన్ను సబిత ఆహ్వానించడం, పెద్ద లీడర్ అవుతావని చెప్పడం వాస్తవమే. నేను ఆమె మాటను విశ్వసించి, సొంత అక్కగా భావించి, కుటుంబ సంబంధాలు, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆనాడు కాంగ్రెస్లో చేరా. 2019లో కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమంది.అప్పుడు సబితక్క నన్ను పిలిచి మల్కాజిగిరి నుంచి పోటీ చెయ్యి.. ఎన్నికల్లో అండగా నిలబడతానని మాట ఇచ్చారు. కానీ నన్ను పార్టీ ఎంపీ అభ్యరి్థగా ప్రకటించిన మరుక్షణమే ఆమె టీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ మాయమాటలను నమ్మి అధికారం కోసం కాంగ్రెస్ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముడిని మోసం చేశారు. (ఇది నిజమా? కాదా? అని సబితారెడ్డినుద్దేశించి ప్రశ్నించారు) కాబట్టే ఆమెను నమ్మవద్దని కేటీఆర్కు సూచించా. బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవులు పొంది ఈ రోజు వచ్చి మాకు నీతులు చెబితే మేము ఏమైనా అమాయకులమా?..’ అంటూ సీఎం ప్రశ్నించారు. ‘మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వలేదని కేటీఆర్ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. 2014–19 మధ్యకాలంలో ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపించారు. ప్రభుత్వానికి సహకరించేది ఉంటే ప్రతిపక్ష నాయకుడిని సభలో కూర్చోమని చెప్పండి..’ అని రేవంత్ అన్నారు. తాను కొత్త గవర్నర్కు ఆహా్వనం పలకడానికి విమానాశ్రయానికి వెళ్తున్నానని, తిరిగి వచి్చన తర్వాత అందరికీ సమాధానమిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి సభ నుంచి వెళుతుండగా బీఆర్ఎస్ సభ్యులు ‘షేమ్ ..షేమ్’ అంటూ నినాదాలు చేశారు. దీనికి ముందు బీఆర్ఎస్ సభ్యుల నిరసనల నేపథ్యంలో స్పీకర్ అవకాశం ఇవ్వడంతో సబిత గద్గద స్వరంతో మాట్లాడారు. ఏం మోసం చేశాం: సబితా ఇంద్రారెడ్డి ‘రేవంత్రెడ్డి కాంగ్రెస్ పారీ్టలో చేరినప్పుడు నేను అక్కగా ఆశీర్వదించా. నువ్వు చాలా ఎదుగుతావు.. ఈ రాష్ట్రానికి సీఎం అవుతావు..అంటూ పారీ్టలోకి ఆహా్వనించా. సీఎం గుండెల మీద చెయ్యి వేసుకుని ఇది నిజమా? కాదా? చెప్పాలి. ఈ రోజు నాపై ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడో అర్థం కావడం లేదు. ప్రతిసారీ అసెంబ్లీలో ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండ్రు. నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు.. మోసం చేస్తరని అన్నడు? ఏం మోసం చేశాం? ఏం ముంచినం? వీళ్లను ముంచినమా? ఎన్నికల సమయంలో కూడా నా నియోజకవర్గంలో మాట్లాడుతూ సబితక్క పొద్దునొక్క మాట, రాత్రి ఒక్క మాట మాట్లాడతది అన్నాడు.పొద్దునొక్క మాట, రాత్రి ఒక్క మాట ఏం మాట్లాడిన? ఎవరిని, ఎందుకు అవమానిస్తున్నవు? ఎందుకీ కక్ష ? ప్రతిసారీ టార్గెట్ చేస్తున్నరు. ఏం చేసినం మేము ఆడబిడ్డలం. సీఎం తన మాటలను ఉపసంహరించుకోవాలి..’ అని సబిత డిమాండ్ చేశారు. సబిత ఆ మాట అనగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. అంతకు ముందు ‘సీఎం రేవంత్ ఏ పార్టీలో నుంచి వచ్చారు? కేసీఆర్ ఇంటిపై వాలిన కాకి నా ఇంటిపై వాలినా కాలి్చవేస్తా అని గతంలో అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి అంత మందిని ఎందుకు చేర్చుకున్నారు..’ అని సబిత నిలదీశారు. -
కొందరు ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేయొచ్చు!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కొందరు సభ్యుల శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే అవకాశం లేకపోలేదని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో కోమటిరెడ్డి, సంపత్ ల సభ్యత్వాలు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. గతంలో కొన్ని సాంప్రదాయాలు నెలకొల్పారని, తనను ఏ రోజు అసెంబ్లీలో కూర్చోనివ్వలేదని ప్రస్తావించారు. తన వద్దకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిసి వెళ్లినట్లు సీఎం పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ గురువారానికి వాయిదా పడిన తర్వాత రేవంత్రెడ్డి మీడియాతో చిట్చాట్తో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బడ్జెట్పై ఇంత చర్చ జరగలేదన్నారు సీఎం రేవంత్. ప్రజాస్వామ్య బద్దంగా సభ నడుస్తుందని అన్నారు. ఒక్క రోజు 17 గంటల పాటు సభ నడిచిందని తెలిపారు. కేంద్ర బడ్జెట్కు అనుబంధంగా రాష్ట్ర బడ్జెట్ పెట్టామని. నేడు మొత్తం బడ్జెట్కు ఆమోదం తెలిపామని చెప్పారు.మోసం అనే పదానికి సబితా ప్రత్యామ్నాయం‘మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి చెప్పారు.అంతకుమించి సమాధానం ఏముంటుంది. సునితా లక్ష్మారెడ్డి కోసం ప్రచారం చేస్తే నాపై రెండు కేసులు పెట్టారు.తరువాత ఆమె బీఆర్ఎస్లోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్పర్సన్ అయ్యారు. నేను కేసుల చుట్టూ తిరుగుతున్నాను. నేను ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. సబితా ఇంద్రారెడ్డి పేరు ఎక్కడా తీయలేదు. ఆమెను సొంత అక్కలా భావించా. వాళ్లు ఎందుకు బాధపడ్డారు. రియాక్ట్ అయ్యారు.అక్క అనే అన్నాను.. వేరే భాషలో మాట్లాడలేదునన్ను కాంగ్రెస్లోకి ఆహ్వానించిన అక్క.. నాకు తోడుండాలి కదా. కానీ ఆమె బీఆర్ఎస్లోకి వెళ్లారు. మల్కాజిగిరి ఎంపీ టికెట్ తీసుకో నేను పనిచేస్తా అని చెప్పి.. టికెట్ రాగానే సబిత పార్టీ మారారు. సభలో హరీష్ రావు 2 గంటల 11 నిమిషాలు మాట్లాడారు. జగదీశ్రెడ్డి గంటా 10 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్ 2 గంటల 36 నిమిషాలు మాట్లాడారు. ఇంతకంటే ఎక్కువ సేపు మాకు ఎప్పుడైనా మైక్ ఇచ్చారా? మాకంటే వాళ్లే ఎక్కువ సేపు మాట్లాడారు.రాజకీయంగా వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు. సబితకు మాట్లాడే అవకాశం ఇచ్చాం. ఆమె వ్యక్తిగత ప్రస్తావన తెస్తే.. ఆ తరువాత నేను మాట్లాడాను. సబితక్క ఆవేదనకు కేటీఆర్, హరీశ్ ఎందుకు అండగా లేరు? కేటీఆర్,హరీష్లు తాము సభలో సరిపోతామని చెబతున్నారు. అలాంటిప్పుడు కేసీఆర్ను ఫ్లోర్ లీడర్గా తీసేయండి. సభలో గందరగోళం చేసేందుకే కేటీఆర్ సభకు వస్తున్నారు.’ అని సీఎం రేవంత్ మండిపడ్డారు. -
సబితపై రేవంత్ వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహిళలను సీఎం రేవంత్ అవమానించారని.. వారంటే సీఎంకు గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు బాధాకారం.. ‘అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని అంటారా?’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ, తమ మహిళా శాసనసభ్యులపైన అకారణంగా సీఎం నోరు పారేసుకున్నారన్నారు.ఈ అవమానం కేవలం సబితక్క, సున్నితక్కకు జరిగింది కాదు.. తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో సీఎం ఆడబిడ్డలను అవమానించారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తది. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్లు కారు.. సీఎం గుర్తుంచుకోవాలి’’ అని కేటీఆర్ హితవు పలికారు.‘‘ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని... బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉప ముఖ్యమంత్రి అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత దారుణంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు భట్టి. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా. సీఎంను ఏకవచనంతో మాట్లాడానని అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం.. అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం’’ అని కేటీఆర్ చెప్పారు. -
అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలతో సబిత కన్నీరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై కామెంట్స్ నేపథ్యంలో ఆమె కన్నీరుపెట్టుకున్నారు. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..కాంగ్రెస్లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.బీఆర్ఎస్ నేతల వెనుక ఉన్న అక్కలను నమ్మితే అంతే..వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్లో నిలబడాల్సి వస్తుంది.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.సబితను సొంత అక్కగానే భావించాను.కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కన్నీరు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి.అసెంబ్లీలో సబిత భావోద్వేగం.నన్ను ఎందుకు టార్గెట్ చేశారు.రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారు.కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.పార్టీ మార్పులపై చర్చ జరగాలి.రేవంత్ను కాంగ్రెస్లోకి నేనే ఆహ్వానించాను.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా?అక్కడున్న కాకి మా ఇంటి మీద వాడితే కాల్చుతా అన్నారు రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా?సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?వెనక కూర్చున్న అక్కలు ఎవరిని మోసం చేశారు?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి భవిష్యత్తు చూపించాం.ముఖ్యమంత్రి ఎవరిని అవమానిస్తున్నారు ఆలోచన చేసుకోవాలి?ఆడిబిడ్డలాగా ఉన్న మేము ఎవరిని మోసం చేసాము?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్.. అక్కగా నేను సబితా ఇంద్రారెడ్డిని నమ్మాను.నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని చెప్పి.. కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లోకి వెళ్లారు.ఒకవైపు నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని.. మరోవైపు కేసీఆర్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరారు.మల్కాజ్గిరిలో పోటీ చేయమని, బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందారు.రాజ్ భవన్ వెళ్లి వచ్చాక అన్ని అంశాలపై సమాధానాలు చెప్తా అన్ని విషయాలు బయటపెడతాను. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చింది.పదేండ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు.కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా ఉన్న నాకు సీఎల్పీ, ఎల్ఓపీగా బాధ్యతలు ఇచ్చారు.సబితా ఇంద్రారెడ్డి రెడ్డి నా వెనుక ఉండి నన్ను సీఎల్పీ, ఎల్ఓపీగా కాకుండా అధికారం కోసం పార్టీ మారారు.సబితా ఇంద్రారెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు సబితా ఇంద్రారెడ్డి.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మరోసారి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్స్పీకర్ పోడియం ముందు వచ్చి నిరసన చేస్తున్న ఎమ్మెల్యేలు.మహిళా నాయకురాళ్లపై మంత్రులుగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటున్న బీఆర్ఎస్. బీఆర్ఎస్ నేతల నిరసన..స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం.రెండు గంటలు సమయం ఇచ్చిన చైర్కు బీఆర్ఎస్ మర్యాద ఇవ్వడం లేదు.మహిళలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదుఎంత అవకాశం ఇచ్చిన నిరసన చేయడం సరైన పద్ధతి కాదు. -
రేవంత్ Vs కేటీఆర్: ‘సీఎం ఏం చదివారో నాకు తెలియదు’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కేటీఆర్కు అనుకోకుండా పదవి వచ్చిందన్నారు రేవంత్.. ఆయనకు వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానమిస్తూ నేను కష్టపడ్డాను, ఉద్యోగం చేశాను. ప్రజల మధ్యలో ఉన్నాను అంటూ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ చదివారో.. ఆయన గతమెంటో బయట వేరే మాట్లాడుకుంటున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సీఎం రేవంత్ కామెంట్స్..చీల్చి చెండాడుతా అని కేసీఆర్ అంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాకేటీఆర్కి ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్లకు పోలిక ఉందికేటీఆర్ వంద పర్సెంట్ ఆర్టిఫీషియల్, సున్న పర్సెంట్ ఇంటిలిజెన్స్కేటీఆర్కి ఓపిక, సహనం ఉండాలికేటీఆర్కు అనుకోకుండా పదవి వచ్చిందిసూచనల రూపంలో మోసాన్ని ప్రజల మెదళ్లలో కుక్కే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారుపది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారుకేటీఆర్ సూచనల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.పదేళ్ల పాలన చేసిన వారు పదినెలలు పూర్తి చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నాం.బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించాం.బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారు.సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారు.బతుకమ్మ చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేశారా? సూరత్ నుండి తెచ్చారా?దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందిరికీ తెలియాలి.మేము ఎప్పుడూ మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదు.ఎంఎంటీఎస్ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదు.స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం.హుస్సేన్సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదు.ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, కరీంనగర్ న్యూయార్క్ చేస్తామన్నారు.గతంలో కేసీఆర్ చెప్పినట్టు మేము చెప్పలేదు.ఎంఎంటీస్ పనులు చేపట్టకపోవడం వెనుక కుట్ర ఉంది.ముచ్చర్ల భూసేకరణపై కేటీఆర్ రెచ్చగొడుతున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలను నిర్మిస్తాం.సిరాజ్, నిఖత్ జరీన్కు గ్రూప్-1 జాబ్ ఇవ్వాలని నిర్ణయించాం.నిఖత్ జరీన్కు ఉద్యోగం ఇస్తానని జాబ్ ఇవ్వలేదు.నేత కార్మికులకు పని కల్పించామని అబద్ధాలు చెప్పారు.పాలసీలు మార్చింది గత ప్రభుత్వమే.ముచ్చర్లలో గొప్ప నగరం నిర్మిస్తాం.పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారుమహేశ్వరంలో భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇప్పటికే వచ్చాయి.ఆజామాబాద్లో రేపు ఇన్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ప్రారంభమవుతుంది.హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు చేస్తామని అన్నాము.తాగుబోతులకు అడ్డాగా ఉన్న స్టేడియంలో మారుతున్నాయి.అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ధరణిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురాబోతుంది.కేటీఆర్ రెండు గంటలు మాట్లాడి రాజకీయ కోణంలో విషం చిమ్ముతున్నారు.గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కొనసాగిస్తాం.పదేళ్లు పాలించారు కాబట్టి తెలంగాణపై ఒక అభిప్రాయం ఉంటుంది. కేటీఆర్ కౌంటర్..పాలసీలు తెస్తాము అంటుంది.. కానీ, కేసీఆర్పై ఝలసీ పాలసీ తప్ప ఏమీ కనిపించడం లేదు.నా ఇంటలిజెన్స్ ఏంటో ప్రజలకు తెలుసు.నేను చదువుకున్నాను. పోటీ పరీక్షలు రాశాను.హైదరాబాద్, గుంటూరులో చదువుకున్నా.విదేశాల్లో కూడా చదివాను.ఉద్యోగం కూడా చేశానుఅమెరికాలో ఉద్యోగం చేసిన అదే ఉద్యోగం పేరుతో హైదరాబాద్ వచ్చాను.ముఖ్యమంత్రి ఎక్కడ చదివారో.. ఆయన గతమెంటో బయట వేరే మాట్లాడుకుంటున్నారు.ఆయన చదువు గురించి నాకు తెలియదు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 17 సంవత్సరాలుగా నాకు తెలుసు.పదిహేళ్లుగా కొంత చెడింది అంతే తప్ప నాకు మంచి మిత్రుడు.సౌత్ తెలంగాణ అభివృద్ధి జరిగితే సంతోషం.ప్రోటోకాల్ పాటిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటాము.రాష్ట్రంలో పొలిటికల్ దాడులు జరుగుతున్నాయి.సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాడి చేస్తున్నారు.దావోస్కు వెళ్తున్న సీఎం రేవంత్కు అభినందనలు.పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను.బోగస్ పెట్టుబడులను నమ్మకూడదని సూచిస్తున్నాను.అదానీని రాహుల్ వ్యతిరేకిస్తుంటే రేవంత్ వెల్కమ్ చెబుతున్నారు. రేవంత్ కౌంటర్..నేను ప్రభుత్వ స్కూళ్లలో మా జిల్లా, హైదరాబాదులోనే చదువుకున్నాను.గుంటూరు పోలేదు అక్కడ చదువుకోలేదు.నేను ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు కూడా అర్హుడేని. -
కేటీఆర్ Vs సీతక్క.. ఓయూకు ఎందుకు పోలేదు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం నడుస్తోంది. ఉద్యోగాల విషయంలో మంత్రి సీతక్క, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య వాడీవేడి చర్చ నడిచింది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం ఇస్తే తాను రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ చేశారు.సభలో ఉద్యోగాలపై కేటీఆర్ కామెంట్స్..ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారు.ఇప్పటికే 34వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పారు.బడ్జెట్ సమావేశాల్లో కూడా ఇదే చెప్పారు.కాంగ్రెస్ నేతలకు ఇదే నేను సవాల్ చేస్తున్నారు.మా ప్రభుత్వంలో ఇచ్చిన నియామకాలకు సంబంధించి కాకుండా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.మా ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలను తాము ఇచ్చినట్టు చెప్పుకున్నారు.నేను ఇప్పుడే సవాల్ చేస్తున్నారు.సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి.. నేను ఇప్పుడు నిరుద్యోగుల వద్దకు పోదాం.అశోక్ నగర్, సెంట్రల్ లైబ్రరీ, ఓయూకు వెళ్దాం.ఈ కాంగ్రెస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరుద్యోగులు చెబితే నేను అక్కడే రాజీనామా చేస్తాను.ఏ ఒక్కరు ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు చెప్పినా.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను.ఇదే సమయంలో సీఎం రేవంత్, భట్టి విక్రమార్కకు లక్ష మందితో పౌర సన్మానం చేస్తాను అంటూ సవాల్ విసిరారు.అలాగే, ఎన్నికల సందర్భంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు.ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి.కేటీఆర్కు మంత్రి సీతక్క కౌంటర్..ఉద్యోగాల విషయంలో కేటీఆర్కు మంత్రి సీతక్క కౌంటర్..అహనా పెళ్లాంటా అనే సినిమా అందరికీ గుర్తు ఉంటుంది. నటుడు కోటా శ్రీనివాస్ రావు కోడి కథ గుర్తుకు వస్తుంది. ఎన్నికల సమయంలో ఉద్యోగాలు అంటూ ఆశ పెట్టారు. ఎన్నికలు అయిపోగానే మళ్లీ దాని గురించి మాట్లాడరు. మళ్లీ ఎన్నికల అనగానే నోటిఫికేషన్లు అని ఊరించి ఉసూరుమనిపించారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులను బీఆర్ఎస్ మోసం చేసింది.ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇంటికో ఉద్యమం అన్నారు.గత పదేళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.ఉద్యోగాలు ఇవ్వకలేపోగా బీఆర్ఎస్ నేతలు ఓయూకు వెళ్లేందుకు భయపడ్డారు.34వేల ఉద్యోగాలు పదేళ్లలో ఎందుకు ఇవ్వలేకపోయారు.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో పరీక్షల పేపర్లు లీకయ్యాయి.పేపర్ లీకేజీలతో నిరుద్యోగులకు తీవ్ర నష్టం జరిగింది.మేము ఇప్పుడే అధికారంలోకి వచ్చాం.తప్పకుండా నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. -
మహిళలకు భద్రత ఉందా?.. సర్కార్పై మాజీ మంత్రి సబిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహిళల భద్రతపై ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. రాష్ట్రంలో వరుసగా అత్యాచార ఘటనలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, మాజీ మంత్రి సబిత ట్విట్టర్ వేదికగా.. తెలంగాణలో ఏం జరుగుతోంది. అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కూడా కాలేదు. రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు జరగడం బాధాకరం. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరం. మహిళలకు భద్రత కరువైంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరిగిన ఘటనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు.1. వనస్థలిపురం పీఎస్ పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్పై సామూహిక అత్యాచారం2. ఓయూ పీఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం3. నల్లగొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళపై అత్యాచారం4. నిర్మల్ నుండి ప్రకాశం వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మహిళపై అత్యాచారం చేసిన డ్రైవర్. pic.twitter.com/reV7o3MB8o— Sabitha Reddy (@BrsSabithaIndra) July 31, 2024 -
సీఎం రేవంత్ కామెంట్స్.. అసెంబ్లీలో గందరగోళం
Live Updates..శాసనసభ రేపు ఉదయం10 గంటలకు వాయిదాద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన శాసనసభద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమాధానంబీఆర్ఎస్ నిరసనల మధ్యలోనే ద్రవ్య వినిమయ బిల్లుపై సమాధానం ఇస్తున్న డిప్యూటీ సీఎం. బీఆర్ఎస్ నిరసన కరెక్ట్ కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వైఖరి అవలంబించలేదు.బీఆర్ఎస్ నిరసనల మధ్యలోనే ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేసిన ప్రభుత్వంబీఆర్ఎస్ నిరసనల మధ్య కొనసాగుతున్న తెలంగాణ శాసనసభ.ద్రవ్య వినిమయ బిల్లుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో మాట్లాడిస్తున్న ప్రభుత్వం.స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనసభా నాయకుడు ఎవరి పేరును ప్రస్తావించలేదు-మంత్రి శ్రీధర్ బాబు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేయడం కరెక్ట్ కాదు.ఎంఐఎం, బీజేపీ మాట్లాడకపోతే తర్వాత వారికి అవకాశం ఇవ్వాలని కోరిన మంత్రి.మాట్లాడే అవకాశం నేను ఇస్తాను నిరసన ఆపాలి: స్పీకర్మాట్లాడే అవకాశం ఇస్తా అన్నా కూడా ఎందుకు ఆందోళన చేస్తున్నారు.సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇస్తాను.వివేక్ వెంకటస్వామి మాట్లాడిన తర్వాత అవకాశం ఇస్తాను.అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రుల భేటీ సీఎం భేటీ కంటే ముందు ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబుస్పీకర్ గడ్డం ప్రసాద్తో భేటీ అయిన సీఎం రేవంత్, మంత్రులు.. సభలో BRS ఆందోళన చేయనున్న నేపథ్యంలో స్పీకర్తో భేటీ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డికి సీఎం క్షమాపణ చేప్పే వరకు నిరసన చేయాలని బీఆర్ఎస్ పట్టు👉సభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ..👉సీఎం రేవంత్ కామెంట్స్లో సభలో గందరగోళం నెలకొంది. 👉బీఆర్ఎస్ నేతలు స్పీకర్ వెల్లోకి దూసుకొచ్చారు. 👉బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 👉సభ నుంచి ముఖ్యమంత్రి వెళ్లిపోవడంపై బీఆర్ఎస్ నిరసన.👉ప్రతిపక్ష పార్టీ తలపై ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసి సభ నుంచి వెళ్లిపోయారంటూ టిఆర్ఎస్ నిరసన.👉అధికార విపక్షాల నిరసనల మధ్య శాసనసభ 15 నిమిషాలు వాయిదా👉అసెంబ్లీ లాబీలో సబిత ఇంద్రారెడ్డి చిట్ చాట్రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.ఈరోజు సీఎం సీట్లో కూర్చోబెట్టాను.ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి , రేవంత్ రెడ్డి నా కుమారుడికి టికెట్ రానివ్వలేదు.మహిళలను ఇలానేనా అవమానించేది.లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని మాట్లాడితే, నన్ను టార్గెట్ చేశారు.👉అసెంబ్లీ లాబీలో కేటీఆర్ చిట్ చాట్సబిత ఇంద్రారెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాంఅక్కలను నమ్ముకుంటే ముంచుతారు అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడుసబిత ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి.భట్టి విక్రమార్క కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తునట్లు అనిపిస్తుంది 👉డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్స్..కాంగ్రెస్ పార్టీ సబితా ఇంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇచ్చింది.పదేండ్లు మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది.2014లో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు.కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా ఉన్న నాకు సీఎల్పీ, ఎల్ఓపీగా బాధ్యతలు ఇచ్చారు.సబితా ఇంద్రారెడ్డి రెడ్డి నా వెనుక ఉండి నన్ను సీఎల్పీ, ఎల్ఓపీగా కాకుండా అధికారం కోసం పార్టీ మారారు.సబితా ఇంద్రారెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇప్పుడు రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నారు.కాంగ్రెస్ పార్టీ పరువు తీసి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు సబితా ఇంద్రారెడ్డి.డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై మరోసారి ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్స్పీకర్ పోడియం ముందు వచ్చి నిరసన చేస్తున్న ఎమ్మెల్యేలు.మహిళా నాయకురాళ్లపై మంత్రులుగా ఉండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా అంటున్న బీఆర్ఎస్. 👉కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కన్నీరు పెట్టిన సబితా ఇంద్రారెడ్డి.అసెంబ్లీలో సబిత భావోద్వేగం.నన్ను ఎందుకు టార్గెట్ చేశారు.రేవంత్ ఏ పార్టీ నుంచి వచ్చారు.కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.పార్టీ మార్పులపై చర్చ జరగాలి.రేవంత్ను కాంగ్రెస్లోకి నేనే ఆహ్వానించాను.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లు పార్టీలు మారి రాలేదా?అక్కడున్న కాకి మా ఇంటి మీద వాడితే కాల్చుతా అన్నారు రేవంత్ రెడ్డి.రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించింది నేనే.ఒక ఆడబిడ్డకు బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా?సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు టార్గెట్ చేశారు?వెనక కూర్చున్న అక్కలు ఎవరిని మోసం చేశారు?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి భవిష్యత్తు చూపించాం.ముఖ్యమంత్రి ఎవరిని అవమానిస్తున్నారు ఆలోచన చేసుకోవాలి?ఆడిబిడ్డలాగా ఉన్న మేము ఎవరిని మోసం చేసాము?ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి? 👉రేవంత్ రెడ్డి కామెంట్స్..అక్కగా నేను సబితా ఇంద్రారెడ్డిని నమ్మాను.నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని చెప్పి.. కాంగ్రెస్ను వదిలి బీఆర్ఎస్లోకి వెళ్లారు.ఒకవైపు నన్ను మల్కాజిగిరిలో పోటీ చేయమని.. మరోవైపు కేసీఆర్ మాటలు నమ్మి ఆ పార్టీలో చేరారు.మల్కాజ్గిరిలో పోటీ చేయమని, బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందారు.రాజ్ భవన్ వెళ్లి వచ్చాక అన్ని అంశాలపై సమాధానాలు చెప్తా అన్ని విషయాలు బయటపెడతాను.👉 బీఆర్ఎస్ నేతల నిరసన..స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనపై స్పీకర్ ఆగ్రహం.రెండు గంటలు సమయం ఇచ్చిన చైర్కు బీఆర్ఎస్ మర్యాద ఇవ్వడం లేదు.మహిళలను రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదుఎంత అవకాశం ఇచ్చిన నిరసన చేయడం సరైన పద్ధతి కాదు. 👉సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..కేటీఆర్ మేము కలసి వస్తాం అని చెప్తున్నారు.కానీ ప్రతిపక్ష నేత సభకు రావడం లేదు..కాంగ్రెస్లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.మీ వెనుకాలా కూర్చున్న అక్కలను నమ్ముకుంటే అంతే సంగతి.వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్లో నిలబడాల్సి వస్తుంది.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.ప్రభుత్వానికి సహాకరించేది ఉంటే ప్రతిపక్ష నేత సభకు రావాలి.మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని మమ్మల్ని అంటున్నారు.2014 నుంచి 19 వరకు ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు.కాంగ్రెస్లో ఉండి ఇక్కడ ముంచి అక్కడి వెళ్లారు.బీఆర్ఎస్ నేతల వెనుక ఉన్న అక్కలను నమ్మితే అంతే..వాళ్ల మాటలు వింటే జూబ్లీ బస్టాండ్లో నిలబడాల్సి వస్తుంది.బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు.సబితను సొంత అక్కగానే భావించాను. 👉 సీతక్క కామెంట్స్..మీతో వస్తాం తమ్ముడు అని చెప్పి మోసం చేశారు.రాహుల్ గాంధీ దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు.పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని సబితా ఇంద్రారెడ్డితో ఫిర్యాదు చేయించారు.ఒక్కరిద్దరు మహిళా సభ్యులు మీతో వస్తామని చెప్పి మోసం చేశారు.ఆమెను చేర్చుకున్నప్పుడు రాజీనామా చేశారు.అందుకే బాధతో సీఎం ఇలా మాట్లాడారు.👉కేటీఆర్ కామెంట్స్..కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి.కేసీఆర్ పథకాలు పేర్లు మార్చినా పర్లేదు కానీ కొనసాగించాలి.పెండింగ్ బకాయిలను వెంటనే క్లియర్ చేయాలి.ఎన్నికలకు ఆరు నెలల ముందు రాజకీయాలు చేద్దాం.. ఇప్పుడు అభివృద్ధి చేద్దాం.మాపై కోపం ఉంటే మమ్ములను తిట్టండి.. కానీ ఉద్యమం కోసం పుట్టిన పార్టీని తిట్టకండి.ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మౌనంగా భరించం.ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతాం అని కాళోజి వ్యాఖ్యలను కొనసాగిస్తాం. 👉కేటీఆర్ మాజీ మంత్రిరాష్ట్రంలో లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదు.48 గంటల్లో నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయి.అదానీ కంపెనీ పై కేంద్ర కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే.. అదే అదానీ కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నారు.ఆటో కార్మికులు రైతులు 383, ఆటో కార్మికులు 53, నేతనులు 15 మంది మరణించారు వాళ్లను ప్రభుత్వం ఆదుకోవాలిమూసి నది అభివృద్ధి కోసం లక్షన్నర రూపాయలతో ప్రణాళికలు అని ప్రచారం జరుగుతోంది.నా ప్రభుత్వంలో మూసీ నది అభివృద్ధి పనులను మొదలుపెట్టాం. మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్.. మూసీ నది పై ఖర్చుల విషయంలో తప్పుడు ప్రచారాలను నమోదుమూసీ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.ఇప్పుడు డిపిఆర్ పరిధిలోనే ఉన్నాయి.అభివృద్ధి చేస్తాం.. అని తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్..మూసీ అభివృద్ధి కోసం అందరం కలిసి పని చేద్దాం.ఎన్ని వేల కోట్లు అయినా అభివృద్ధి అనేది మంచిదే.అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు సహకరించాలి. 👉కేటీఆర్ కామెంట్స్..పాలసీలు తెస్తాము అంటుంది.. కానీ, కేసీఆర్పై ఝలసీ పాలసీ తప్ప ఏమీ కనిపించడం లేదు.నా ఇంటలిజెన్స్ ఏంటో ప్రజలకు తెలుసు.నేను చదువుకున్నాను. పోటీ పరీక్షలు రాశాను.హైదరాబాద్, గుంటూరులో చదువుకున్నారు.విదేశాల్లో కూడా చదివాను.అమెరికాలో ఉద్యోగం చేసిన అదే ఉద్యోగం పేరుతో హైదరాబాద్ వచ్చాను.ముఖ్యమంత్రి ఎక్కడ చదివారో.. ఆయన గతమెంటో బయట వేరే మాట్లాడుకుంటున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 17 సంవత్సరాలుగా నాకు తెలుసు.పదిహేళ్లుగా కొంత చెడింది అంతే తప్ప నాకు మంచి మిత్రుడు.సౌత్ తెలంగాణ అభివృద్ధి జరిగితే సంతోషం.ప్రోటోకాల్ పాటిస్తే ప్రభుత్వ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటాము.రాష్ట్రంలో పొలిటికల్ దాడులు జరుగుతున్నాయి.సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాడి చేస్తున్నారు.దావోస్కు వెళ్తున్న సీఎం రేవంత్కు అభినందనలు.పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాను.బోగస్ పెట్టుబడులను నమ్మకూడదని సూచిస్తున్నాను.అదానీని రాహుల్ వ్యతిరేకిస్తుంటే రేవంత్ వెల్కమ్ చెబుతున్నారు. రేవంత్ కౌంటర్..నేను ప్రభుత్వ స్కూళ్లలో మా జిల్లా, హైదరాబాదులోనే చదువుకున్నాను.గుంటూరు పోలేదు అక్కడ చదువుకోలేదు.నేను ఇక్కడ ఉద్యోగాలు చేసేందుకు కూడా అర్హుడేని. 👉సీఎం రేవంత్ కామెంట్స్..కేటీఆర్ సూచనల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.పదేళ్ల పాలన చేసిన వారు పదినెలలు పూర్తి చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.టూరిజం హబ్ క్రియేట్ చేస్తామంటున్నాం.బతుకమ్మ చీరల డబ్బులు బకాయి పెడితే మేం చెల్లించాం.బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ బినామీలకు అప్పగించారు.సూరత్ నుంచి కిలోల చొప్పున చీరలు తెచ్చి కమీషన్ కొట్టేశారు.దీనివెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందిరికీ తెలియాలి.మేము ఎప్పుడూ మీలాగా పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తామని చెప్పలేదు.ఎంఎంటీఎస్ను విమానాశ్రయం వరకు వేస్తామంటే అనుమతి ఎందుకివ్వలేదు.స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నాం.హుస్సేన్సాగర్ నీళ్లను కొబ్బరినీళ్లలాగా మార్చుతామనలేదు.ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, కరీంనగర్ న్యూయార్క్ చేస్తామన్నారు.గతంలో కేసీఆర్ చెప్పినట్టు మేము చెప్పలేదు.ఎంఎంటీస్ పనులు చేపట్టకపోవడం వెనుక కుట్ర ఉంది.ముచ్చర్ల భూసేకరణపై కేటీఆర్ రెచ్చగొడుతున్నారు.అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియంలను నిర్మిస్తాం.సిరాజ్, నిఖత్ జరీన్కు గ్రూప్-1 జాబ్ ఇవ్వాలని నిర్ణయించాం.నిఖత్ జరీన్కు ఉద్యోగం ఇస్తానని జాబ్ ఇవ్వలేదు.నేత కార్మికులకు పని కల్పించామని అబద్ధాలు చెప్పారు.పాలసీలు మార్చింది గత ప్రభుత్వమే.ముచ్చర్లలో గొప్ప నగరం నిర్మిస్తాం.పది నెలలు నిండని ప్రభుత్వంపై వందల ఆరోపణలు చేస్తున్నారుమహేశ్వరంలో భూసేకరణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇప్పటికే వచ్చాయి.ఆజామాబాద్లో రేపు ఇన్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన ప్రారంభమవుతుంది.హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ యూనివర్సిటీలు చేస్తామని అన్నాము.తాగుబోతులకు అడ్డాగా ఉన్న స్టేడియంలో మారుతున్నాయి.అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ధరణిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకురాబోతుంది.కేటీఆర్ రెండు గంటలు మాట్లాడి రాజకీయ కోణంలో విషం చిమ్ముతున్నారు.గత ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజలకు ఉపయోగపడే పాలసీలను కొనసాగిస్తాం.పదేళ్లు పాలించారు కాబట్టి తెలంగాణపై ఒక అభిప్రాయం ఉంటుంది. 👉కేటీఆర్పై సీతక్క ఫైర్గత పదేండ్లు బీఆర్ఎస్ పాలన కోట శ్రీనివాస్ కోడి కూర కథలాగా ఉంది.లక్షలాది పేదలు ఇండ్లు లేక బాధపడుతున్నారుబీఆర్ఎస్ పదేండ్లలో ఎవరికి ఇండ్లు ఇచ్చారుబంగారు తెలంగాణ, ధనిక రాష్ట్రం అని చెప్తుంటే నిజమని అన్నారుఉద్యోగాల విషయంలో కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వొస్తుందిమేం ప్రకటించిన పథకాలకు కొంత పెంచి ప్రకటించారు. అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?మా పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి మాత్రం బాధ కలుగుతుందిఇచ్చిన ప్రతి మాట కచ్చితంగా చేస్తాంఅబద్ధాలు అద్భుతంగా చెప్పడంలో కేటీఆర్ దిట్ట..పదేళ్లలో ఉద్యోగాలు ఇస్తే.. ఉస్మానియా యూనివర్శిటీకి ఎందుకు వెళ్ళలేదు.డబుల్ పెన్షన్ తీసుకుంటున్న లక్ష్మమ్మ నుంచి రికవారి చేశారు.. మా దృష్టికి రాలేదు.మీ ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్లు కూడా పెన్షన్ తీసుకున్నారు.సాగు చేసుకుంటున్న రైతులకు ధరణిలో లేదని రైతుబంధు రాకుండా చేశారు.ప్రతి రోజూ ధనిక రాష్ట్రం.. బంగారు తెలంగాణ అంటే.. బయట ఉన్న మేము నిజమే అనుకున్నాం.మరీ మా మానిఫెస్టో చూసి.. గ్యాస్ సిలిండర్ మేము 500 అంటే.. మీరు నాలుగు వందలకే అన్నారు.ఇలా ఎన్నో పథకాలు పెంచి ప్రజలను మోసం చేద్దాం అనుకున్నారా?.అద్భుతంగా ధనిక రాష్ట్రాల్లో రైతులు, ప్రజలకు పథకాలు అందిద్దాం అనుకున్నాం.కానీ పదేళ్లు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు.తప్పకుండా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తాం. 👉మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మలేదు.కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టింది అయినా ప్రజలు నమ్మలేదు.మేము 2000 అంటే 2016లో అన్నారు అయినా ప్రజలు నమ్మలేదు.2018లో బీఆర్ఎస్ను నమ్మి ప్రజలు మోసపోయారు.అందుకే 2023లో బీఆర్ఎస్ను ప్రతిపక్షంలో కూర్చుని పెట్టారు.కేటీఆర్ సభలో సత్యదూరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.కాంగ్రెస్ మొదటి బడ్జెట్కే ప్రతిపక్ష బీఆర్ఎస్ భయపడుతోంది.ఇప్పుడే ఇంత భయపడితే ఇంకా నాలుగు సంవత్సరాలు మిగిలి ఉంది. 👉 కేటీఆర్ కామెంట్స్..రైతు భరోసా బీఆర్ఎస్ 10,000 అంటే కాంగ్రెస్ 15,000 అన్నది.బడ్జెట్లో రైతు భరోసాకు నిధులు ఎందుకు కేటాయించలేదు?రైతులకు 72 వేల కోట్లు రైతుబంధు వేస్తే.. 25000 దుర్వినియోగం అని గగ్గోలు పెడుతున్నారు.కౌలు రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.కౌలు రైతులు కళ్ళల్లో వత్తులు పెట్టుకొని చూస్తున్నారు.అన్ని వడ్లకు 500 బోనస్ అన్నారు.. ఇస్తామనేది సన్న ఒడ్లు మాత్రమే అంటున్నారు.ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ ఫసల్ బీమా యోజన బెకార్ అన్నది.సొంత రాష్ట్రం గుజరాత్ ఫసల్ బీమా యోజనలోకి వెళ్లలేదు.ఫసల్ బీమా యోజన మంచిది కాదు అందుకే మేము వెళ్ళలేదు.కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో ఎందుకు చేరుతుందో సమాధానం చెప్పాలి.కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తే 16,000 కోట్లు అయ్యాయి.లక్షన్నర వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే 12,000 కోట్లు ఎందుకు అవుతుంది?రుణమాఫీ లబ్ధిదారుల కోతలు కాంగ్రెస్ ప్రభుత్వం కోస్తోంది.ప్రతి విషయంలో కేంద్రంతో తలపడతారు.పీఎం కిసాన్ కండిషన్ పెట్టి రుణమాఫీ ఎలా చేస్తారు?కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది.కోటి మందిని కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది చేసి తీరాల్సిందే.ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇవ్వాలి వాళ్లంతా ఎదురుచూస్తున్నారు.కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలి.ప్రతి ఆడబిడ్డకు స్కూటీ ఇస్తా అన్నారు కానీ వాళ్లపై లాఠీలు జులిపిస్తున్నారు.జేఎన్టీయూ హాస్టల్ లో తయారుచేసిన సాంబార్లో ఎలుకలు ఈతలు కొడుతున్నాయి. 👉 కేటీఆర్ కామెంట్స్..రాష్ట్రాన్ని అప్పులపాలు చేశామని తప్పుడు ప్రచారం చేశారు. రాష్ట్రాన్ని క్యాన్సర్, ఎయిడ్స్ పేషంట్లా పోల్చడం సరికాదు. ఓట్లకు ముందు అభయహస్తం, ఓట్ల తర్వాత శూన్యహస్తం. హామీల పత్రాలకు పాతర.. శ్వేతపత్రాల జాతర. గ్యారెంటీలకు టాటా, లంకెబిందెల వేటవిపక్షంలో ఉండగా తెలంగాణ అభివృద్ధిని భట్టి ప్రశంసించారు.ముఖ్యమంత్రి సీట్లోకి భట్టి వెళ్లాలని కోరుకుంటున్నాను.కాంగ్రెస్ నాయకులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.ఎన్నో రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగ్గా ఉంది. మా హయాంలో సంపదను పెంచాం.కరోనా లాంటి సమయంలోనూ జీతాలు ఆపలేదు.మా పాలనలో రాష్ట్ర సంపద, జీఎస్డీపీ పెరిగింది.తెలంగాణ అభివృద్ధి గురించి సోషియో ఎకానమీ అవుట్ లుక్లో ప్రభుత్వమే చెప్పింది.తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుతమే చెప్పింది.దేశ జీడీపీలో తెలంగాణ రాష్ట్ర పాత్ర పెరిగిందని మీరే చెప్పారు. మంత్రులు సభలో చెప్పిన మాటలు తప్పా?బడ్జెట్లో ఉన్న లెక్కలు తప్పా చెప్పాలి.లెక్కలతో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు.నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం.ఎన్నో రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అభివృద్ధి అద్భుతం.తెలంగాణ దివాళా తీసిందని అనటం ఎంతవరకు సమంజసం. భట్టి కామెంట్స్..గత ప్రభుత్వంపై సెటైర్లు.రెవెన్యూ రిస్పిట్స్ అద్భుతంగా ఉన్నాయి.2021 నుంచి 2023-24 వరకు ఒకటో తేదీన ఇచ్చే జీతాలు 15వ తేదీ వరకు ఎందుకు జీతాలు ఇవ్వలేదు?ఎందుకు పెండింగ్ పెట్టారు?.ఆ నిధులన్నీ ఎటు వెళ్లాయి. 👉 ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. నేటి సమావేశాల్లో ప్రభుత్వం మరికొన్ని బిల్లులను ప్రవేశపెట్టనుంది.👉నేడు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ అనంతరం శాసనసభ బిల్లును ఆమోదించనుంది. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరం కోసం ప్రభుత్వం 2,91,159 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది.👉డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ప్రారంభిస్తారు.👉బడ్జెట్పై పూర్తిస్థాయిలో వివరణను ఆర్థిక మంత్రి భట్టి సభకు తెలియజేస్తారు.👉ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రతిపక్ష పార్టీల సభ్యులు చర్చించనున్నారు. అలాగే, ప్రభుత్వ వివరణ ఇవ్వనుంది.👉అనంతరం ద్రవ్య వినిమయ బిల్లు 2024-25ను సభ ఆమోదించనుంది. -
బీఆర్ఎస్కు నేను చాలు..
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డి విదేశాలకు వెళ్తే చూసుకోవడానికి తానున్నానని, బీఆర్ఎస్కు తాను చాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులు ముగ్గురూ కలిసి రేవంత్రెడ్డిని ఓడించలేకపోయారని, ఆయనకు వాళ్లు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి ఎక్కడకూ వెళ్లడని, చాంబర్కు వెళ్లినంత మాత్రాన పారీ్టలో చేరినట్టా అని అన్నారు.మంగళవారం అసెంబ్లీ లాబీల్లో కోమటిరెడ్డి విలేకరులతో చిట్చాట్ మాట్లాడారు. కేటీఆర్ కూడా తన చైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారని, అంతమాత్రాన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు అవుతుందా అని చెప్పారు. ‘కేసీఆర్ సభకు ఎందుకు రావడంలేదు. సభలో ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్షనేత కూడా అలాగే.. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదంటే రాజకీయాలు వదులుకున్నట్లే.ఆయన వైఖరి చూస్తోంటే త్వరలోనే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేలా కనిపిస్తోంది’అని కోమటిరెడ్డి అన్నారు. అసెంబ్లీలో తాను చెప్పిన మాటలను జగదీశ్రెడ్డి అంగీకరించారన్నారు. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని చెప్పిన కోమటిరెడ్డి.. బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్కు త్వరలోనే రీటెండర్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. -
మళ్లీ బీఆర్ఎస్ గూటికి..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్లో చేరి కనీసం నెల రోజులు తిరగకమునుపే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తిరిగి సొంత పార్టీ బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో మంగళవారం కృష్ణమోహన్రెడ్డి లాబీలోని బీఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయానికి వచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో భేటీ అయిన కృష్ణమోహన్రెడ్డి తాను పారీ్టలో కొనసాగాలనుకుంటున్న విషయాన్ని వెల్లడించారు. ఎమ్మెల్యేలు పద్మారావుగౌడ్, శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, ప్రశాంత్రెడ్డి తదితరులు కృష్ణమోహన్రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించారు.తాను త్వరలో పార్టీ అధినేత కేసీఆర్ను కలుస్తానని ఆయన వెల్లడించారు. జూలై 6న సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కృష్ణమోహన్రెడ్డి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఈ ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా మంగళవారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డితో ఆయన కొద్దిసేపు ముచ్చటించారు. అయితే బీఆర్ఎస్లో తిరిగి చేరే అంశంపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.‘బీఆర్ఎస్లో కొందరు అల్ప సంతోషులు ఉన్నారు. నా ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టి పార్టీ మారతారని ప్రచారం చేస్తున్నారు. అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రుల చాంబర్లలోకి వెళ్లి కలుస్తున్నారు. వారంతా పార్టీ మారేవారేనా?’ అని వెంకటరావు మీడియాతో అన్నారు. తాను టీ తాగేందుకు బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయానికి వచి్చనట్లు స్పష్టం చేశారు. అయితే, బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకే రోజు పార్టీ శాసనసభాపక్షం కార్యాలయానికి రావడంతో ఒక్కసారి గా రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కృష్ణమోహన్రెడ్డి బాటలో తిరిగి సొంత గూటికి చేరుకుంటారని సమాచారం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్ (జగిత్యాల), గూడెం మహిపాల్రెడ్డి (పటాన్చెరు), కాలే యాదయ్య (చేవెళ్ల) తిరిగి అదే పార్టీలో చేరతారని సమాచారం. అయితే తాను కాంగ్రెస్లోనే కొనసాగుతానని కాలే యాదయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక్కొక్కరిదీ ఒక్కో పరిస్థితి పార్టీ వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఓ వైపు బీఆర్ఎస్ హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత వేటు కోసం దాఖలైన కేసులో మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. తదుపరి విచారణ ఆగస్టు 1కి వాయిదా పడగా, సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన తీర్పు మేరకు తమపై అనర్హత వేటు పడుతుందనే ఆందోళనలో బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన పలువురు ఎమ్మెల్యేలున్నారు.మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాను కనీసం 26 మంది కాంగ్రెస్లో చేరితేనే ఆ పార్టీ శాసనసభాపక్షం అధికార పక్షంలో విలీనమవుతుంది. అయితే ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ శాసనసభా పక్షం విలీనానికి అవసరమైన మేజిక్ ఫిగర్ ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించకపోవడం ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతోంది. తమపై అనర్హత వేటు పడితే జరిగే ఉప ఎన్నికలో తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో వారున్నారు.ఇదిలాఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ స్థానిక శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పారీ్టలో చేరిక సందర్భంగా ఇచి్చన హామీలు అమలు కావడం లేదని, పారీ్టలో ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరికొందరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరికి వారే యమునా తీరే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభ్యుల మ«ధ్య సమన్వయలోపం బయటపడింది. పార్టీ పక్షాన గెలుపొందిన 8 మంది ఎమ్మెల్యేలు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కొంతకాలంగా ఉంది. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండోవిడత రుణ మాఫీ కార్యక్రమానికి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం చర్చనీయాంశమయ్యింది.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని ఒకపక్క పార్టీ డిమాండ్ చేస్తూ ఉంటే.. మంగళవారం నాటి కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎలా పాల్గొంటారనే ప్రశ్నలు ఇటు పార్టీలో అటు శాసనసభాపక్షంలో వినిపిస్తున్నాయి.శాసనసభా సమావేశాల తొలిరోజునే లిబర్టీ అంబేడ్కర్ విగ్రహం నుంచి అసెంబ్లీ దాకా రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ వైఖరికి భిన్నంగా ప్రభుత్వం నిర్వహించిన రుణమాఫీ కార్యక్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలు పాల్గొంటే ఎలాంటి సంకేతాలు వెలువడతాయనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర పార్టీ నాయకత్వం స్పష్టతనివ్వకపోవడం వల్లే..!అసెంబ్లీలో బీజేఎల్పీ వివిధ ముఖ్యమైన అంశాలపై ఎలాంటి వైఖరి అనుసరించాలనే దానిపై రాష్ట్రపార్టీ నాయకత్వం స్పష్టతనివ్వక పోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమౌ తోంది. అసెంబ్లీలో కేటాయించిన గదికి సభలోంచి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వచ్చేటప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, రామారావు పటేల్ రుణమాఫీ కార్యక్రమానికి వెళ్లిపోయారు.దీంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. ఇలా చేస్తే పార్టీ కేడర్కు ఎలాంటి సంకేతాలు వెళతాయంటూ ఆ కార్యక్రమానికి హాజరుకాని ఓ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఎవరికి తోచినట్టుగా వారు పెద్దసంఖ్యలో వాయిదా తీర్మానాలను ప్రతిపాది స్తున్నారనే అంశంపై కూడా పార్టీవర్గాల్లో చర్చ జరుగుతోంది.సీనియర్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ అప్పుడప్పుడు మాత్రమే సమావేశాలకు హాజరవుతున్నారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంతోనూ ఆయన అంత సఖ్యతగా లేరనే అభిప్రాయం ఇప్పటికే పార్టీవర్గాల్లో ఉంది. మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారుగా తమ సొంత ఇమేజీని పెంచుకునే ప్రయత్నాల్లో మునిగినందునే సమన్వయలేమి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. -
తెలంగాణ కాంగ్రెస్కు మరో బిగ్ షాక్.. బీఆర్ఎస్ టచ్లోకి మరో ఎమ్మెల్యే
సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రతిపక్షనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఛాంబర్కి వెళ్లారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేక్, మల్లారెడ్డిలు ఉన్నారు. కేసీఆర్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. అనంతరం తెల్లం వెంకటరావు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు కలిసి బయటకు వెళ్లడంతో..తెల్లం వెంకట్రావు సైతం తిరిగి బీఆర్ఎస్ చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.జులై మొదటి వారంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ ఉదయం అసెంబ్లీ ఎల్వోపీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆయన కేటీఆర్తో చెప్పినట్లు సమాచారం. సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి మళ్లీ గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో భేటీ అవ్వడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. -
తెలంగాణ: కాంగ్రెస్కు షాకిచ్చిన ఎమ్మెల్యే
హైదరాబాద్, సాక్షి: కాంగ్రెస్ పార్టీకి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణామోహన్రెడ్డి షాకిచ్చారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఆయన.. యూటర్న్ తీసుకున్నారు. తిరిగి బీఆర్ఎస్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం అసెంబ్లీ ఎల్వోపీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కృష్ణమోహన్రెడ్డి. ఇది ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆయన కేటీఆర్తో చెప్పినట్లు సమాచారం. సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్ను కలిసి మళ్లీ గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.గద్వాల బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల.. ఈ నెల మొదట్లో పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. -
TG: రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీ రెండో విడత నిధులను సీఎం రేవంత్రెడ్డి విడుదల చేశారు. అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యే లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వ్యవసాయం దండుగ కాదు.. పండగ అని నిరూపిస్తున్నామన్నారు. ‘‘లక్షల మంది రైతుల ఇళ్లలో సంతోషంతో మా జన్మ ధన్యమైంది. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం. నిలబెట్టుకుంటున్నాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘రాజకీయం ప్రయోజనం కాదు.. రైతు ప్రయోజనమే ముఖ్యమని వచ్చిన ప్రజాప్రతినిధులకు అభినందనలు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు పాల్గొనడం సంతోషకరం. ఆనాడు నిధులు ఉన్నా గత ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయలేదు. ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. విత్తనాలకు సబ్సిడీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పంటకు గిట్టుబాటు ధర తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే’’ అని రేవంత్ పేర్కొన్నారు.అనుమానాలను పటాపంచలు చేశాం: డిప్యూటీ సీఎండిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నామన్నారు. మిగిలిన బడ్జెట్తో కేసీఆర్కు రాష్ట్రాన్ని అప్పగిస్తే రుణమాఫీ చేయలేకపోయారని.. మాకు 7 లక్షల కోట్లతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పగిస్తే రుణమాఫీ చేసి చూపిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ సాధ్యమా అని అందరూ అనుమానం వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ రుణమాఫీ చేస్తున్నాం. రైతు భీమా, పంట బీమాను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు.అదే మా టార్గెట్: మంత్రి తుమ్మలమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆగస్టు నెల నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని.. ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్నామన్నారు. నేటితో లక్షన్నర రూపాయల రుణమాఫీ జరగబోతుందన్నారు. ఆర్థిక వనరులు సమకూర్చిన ఆర్థిక శాఖ కు కృతజ్ఞతలు. ఆయిల్ ఫాం సాగును పెంచుతాం.. కనీసం 5 లక్షల ఎకరాలలో సాగు టార్గెట్ పెట్టుకున్నాం’ అని తుమ్మల అన్నారు. -
అసెంబ్లీలో తీర్మానానికి సిద్ధమా..!
ఆదిలాబాద్: సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానించి ఢిల్లీలో ధర్నా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సవాల్ విసిరారు. సోమవారం సింగరేణి పరిరక్షణ కోసం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్రను బెల్లంపల్లి లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంటా చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో వీరభద్రం మాట్లాడారు. సింగరేణి సంస్థలో 51శాతం వాటా కలిగిన రాష్ట్ర ప్రభుత్వం, 49శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూనే చాపకింద నీరులాగా బొగ్గు సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కుయుక్తులు పన్నుతున్నాయని విమర్శించారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనకు అంత్యత సన్నిహితుడైన అదానికి దేశంలోని కోలిండియా, సింగరేణి సంస్థల్లోని బొగ్గు బ్లాక్లను అప్పగించడానికి పావులు కదుపుతున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణపై సీఎం రేవంత్రెడ్డి ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నారని అన్నా రు. శ్రావణ్పల్లి బొగ్గు బ్లాక్ను కేంద్రమంత్రి కిషన్రెడ్డి వేలం పాట నిర్వహిస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క పాల్గొనడం వెనుక మర్మమేంటో స మాధానం చెప్పాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్ర భుత్వాల చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు, ఇతర వర్గాల శ్రేణులు పో రాటంలో కలిసి రావాలని కోరారు. అంతకుముందు బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి సీపీఎం నాయకులు పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.వీరయ్య, చుక్క రామయ్య, భూపాల్, రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిబాబు, పైళ్ల ఆశయ్య, సీఐటీయూ సింగరేణి విభాగం డెప్యూటీ కార్యదర్శి నాగరాజ్గోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ప్రకాష్, నాయకులు రాజన్న, శ్రీనివాస్, రమణ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.ఐక్యంగా ఉద్యమించాలి..రామకృష్ణాపూర్: ప్రైవేటీకరణ బారి నుంచి సింగరే ణి సంస్థను కాపాడుకునేందుకు అన్ని రాజకీయ ప క్షాలు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య అన్నారు. బస్సుయాత్ర సోమవారం సాయంత్రం ఆర్కేపీకి చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ పరిరక్షణకు చేపట్టిన బస్సుయాత్రకు అన్ని వర్గాల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు భూపాల్, ఆశన్న, శంకర్, రవి, వెంకట స్వామి, శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.సింగరేణికే కేటాయించాలి..మందమర్రిరూరల్: రాష్ట్రంలోని నూతన బొగ్గు గనులను సింగరేణికి కేటాయించి సంస్థను కాపాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ల ఆశయ్య డిమాండ్ చేశారు. సోమవారం బస్సుయాత్ర మందమర్రికి చేరుకోగా.. ఏరియాలోని కేకే–5గనిపై ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన బొగ్గు గనులు వస్తేనే సింగరేణికి భవిష్యత్ ఉందని తెలిపారు. అనంతరం మార్కెట్, పలు వీధుల గుండా బస్సుయాత్ర సాగింది.ఇవి చదవండి: ఏపీకి కేంద్ర నిధులపై బీజేపీ నేత జీవీఎల్ క్లారిటీ