breaking news
-
జవాన్లను అవమానిస్తారా..!?
సిరిసిల్ల/కరీంనగర్టౌన్: కరీంనగర్లో ముస్లిములంతా ఒక్కటై తనను ఓడించాలని కేసీఆర్ అన్నారని, ‘నేను హిందువుల ఓటు బ్యాంకుతో బంపర్ మెజార్టీతో గెలుస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే పార్టీ దుకాణం బంద్ చేస్తావా? మగాడివైతే, హిందువైతే నీ శరీరంలో మందు కాకుండా రక్తమే ప్రవహిస్తే నా సవాల్ను స్వీకరించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.దేశ రక్షణ కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన జవాన్లను అవమానించిన కాంగ్రెస్కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం బీజేపీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల గాం«దీచౌక్లో ఆయన మాట్లాడుతూ..సర్జికల్ స్ట్రయిక్స్ను సమర్థించే వారంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలన్నారు. గాడిద గుడ్డూ పెట్టదు..కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలూ చేయదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు సర్వనాశనం చేసేస్తారు మోదీ ప్రధాని కాకపోతే కాంగ్రెస్ వాళ్లు దేశాన్ని సర్వనాశనం చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ 12ఎంపీ సీట్లు గెలవబోతోందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో సంజయ్కు మద్దతుగా ‘మహా బైక్ ర్యాలీ’నిర్వహించగా, ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతారనే భయంతో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను ధ్వంసం చేశారని, అలాంటి కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమారెడ్డి, మట్ట వెంకటేశ్వర్రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి వస్తే ప్రధాని ఎవరు?
వికారాబాద్/ సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ‘‘ఒకవేళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని ఎవరవుతారో ఎవరైనా చెప్పగలరా? మమతా బెనర్జీయా, శరద్ పవారా? స్టాలినా? ఉద్దవ్ ఠాక్రేనా? లేక రాహుల్ బాబా ప్రధాని అవుతారా? అది వారికే తెలియదు. అలాంటి వారితో దేశమేం బాగుపడుతుంది..’’అని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. సర్జికల్ స్ట్రైక్తో మోదీ క్రూర ఉగ్రమూకలను మట్టుబెడితే.. ఈ రేవంత్రెడ్డి, రాహుల్ బాబాలు కాకులను కూడా కాల్వలేరని విమర్శించారు.లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్, వనపర్తిలలో నిర్వహించిన బీజేపీ సభల్లో ఆయన ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ నాయకులు ప్రియాంక, రాహుల్ బాబాలకు మైనార్టీల ఓట్లు కావాలి.. అందుకే వారి భజన చేస్తున్నారు. అందుకే బీజేపీ వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని అవాస్తవ ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీయే. ముస్లింలకు మతపరంగా నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిది. బీజేపీని గెలిపిస్తే ఆ రిజర్వేషన్లను తీసేస్తాం. హైదరాబాద్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం. కాంగ్రెస్ది చైనీస్ గ్యారంటీ! నరేంద్ర మోదీ గ్యారంటీ అంటే.. అది పూర్తి చేసే గ్యారంటీ.. కాంగ్రెస్ గ్యారంటీ అంటే చైనీస్ గ్యారంటీ. అది ఉత్త డొల్ల, పూర్తికాదు. సీఎం రేవంత్రెడ్డి తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంగా మార్చారు. కాంగ్రెస్ దళిత, ఆదివాసీ, ఓబీసీల సంపదను దోచుకుంటోంది. ఈ అవినీతిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో రైతులకు ఏటా రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12వేలు, మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. ఆ హామీలేవీ నెరవేర్చలేదు. రేవంత్రెడ్డి ఫేక్ వీడియోలతో తప్పుడు స్థలంలో చేయి పెట్టారు. దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసింది. కేంద్ర నిధులతోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోంది. పీఓకేను స్వా«దీనం చేసుకుంటాం కశ్మీర్ భారత్ సొంతం. 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ అంశాన్ని ఏనాడూ పట్టించుకోలేదు. మోదీ వ చ్చిన పదేళ్ల పాలనలో జమ్మూకశ్మీర్ను భారత్ వశం చేశారు. ఈసారి అధికారమిస్తే పాక్ ఆక్రమిత కశీ్మర్ను స్వా«దీనం చేసుకుంటాం. ఈసారి ఎన్నికల్లో బీ జేపీ గెలుపు ఖాయం. రాహుల్గాంధీ కొంత కా లం కింద భారత్ జోడో యాత్ర చేశారు. మరికొద్ది నెల ల్లో మాయమైపోయే కాంగ్రెస్ పార్టీని వెతికే యాత్ర చేయాలి..’’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. -
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు (మే13)న అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలుంటాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ హెచ్చరించారు. జూన్ 1న సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం ఉందని తెలిపారు.బందోబస్తు కోసం కేంద్ర బలగాలతో పాటు, 60 వేల మంది రాష్ట్ర పోలీసులు విధుల్లో ఉంటారని వికాస్రాజ్ వెల్లడించారు. తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల విలువైన సొత్తు సీజ్ చేశామని, తనిఖీలకు సంబంధించి 8 వేలకు పైగా కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.88 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్న సీఈవో వికాస్రాజ్.. పోలింగ్ సమయం దగ్గర పడటంతో నిఘా మరింత పెంచామని తెలిపారు. -
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది.ఏపీ, తెలంగాణలో మైక్లు మూగబోయాయి. ఎల్లుండి(సోమవారం) పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏపీవ్యాప్తంగా 26 జిల్లాల్లో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ విధుల్లో 5,26,010 మంది సిబ్బంది పాల్గొంటారు. పోలింగ్ కోసం 1.60 లక్షల ఈవీఎంలను వినియోగించనున్నారు.ఏపీలో పోలింగ్ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. 74. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ నిర్వహించనున్నారు. 25 లోక్సభ నియోజకవర్గాలకు 454 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు.417 మంది పురుష, 37 మంది మహిళా అభ్యర్థులు పోటీ పడనున్నారు.175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,387 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ పడనున్నారు.ఏపీ: రేపు పోలింగ్ కేంద్రాలకు చేరనున్న ఈవీఎంలు26 జిల్లాల్లో 46,389 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ కి ఏర్పాట్లు12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తింపురాష్ట్ర వ్యాప్తంగా 34,651 పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలతో వెబ్ కాస్టింగ్ కి ఏర్పాట్లుసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా74.70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్25 లోక్ సభ నియోజకవర్గాల్లో 454 మంది ఎంపీ అభ్యర్థుల పోటీ417 మంది పురుష, 37 మంది మహిళా అభ్యర్థులు పోటీ175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2387 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పోటీ2,154 మంది పురుష అభ్యర్థులు, 231 మహిళా అభ్యర్థులు పోటీఏపీలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 4 కోట్ల 14 లక్షల 1887 మంది ఓటర్లుఏపీలో మహిళా ఓటర్లే అధికంఓటు హక్కు వినియోగించుకోనున్న 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మహిళా ఓటర్లుఓటు హక్కు వినియోగించుకోనున్న 2 కోట్ల 3 లక్సల 39వేల మంది పురుష ఓటర్లుఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లుసోమవారం 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగింపురంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో 4 గంటలకు ముగియనున్న పోలింగ్ఎన్నికల విధులకు 5 లక్షల 26 వేల మంది సిబ్బందిని నియమించిన ఎన్నికల కమిషన్పోలింగ్ నాడు ఉదయం 7 గంటలలోపు మాక్ పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలుఅన్ని నియోజకవర్గాల్లోనూ అమలులోకి వచ్చిన 144 సెక్షన్48 గంటల పాటు మద్యం షాపులు, బార్లు మూసివేతరాజకీయ పార్టీల బల్క్ మెసేజ్ ల ప్రచారాన్ని నిషేధించిన ఈసీప్రచారానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు వెల్లిపోవాలని పోలీసుల ఆదేశంపోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు భారీగా బందోబస్త్ ఏర్పాటు చేసిన ఈసీఏపీ పోలీస్ తో పాటు తమిళనాడు, కర్నాటక, ఏపీఎస్పీ, ప్రత్యేక దళాలు మోహరింపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన ప్రచార పర్వంరాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్ సభ, కంటోన్మెంట్ ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి17 పార్లమెంటు స్థానాలకు బరిలో నిలిచిన 525 మంది అభ్యర్థులురేపు రాత్రి 10 గంటల వరకు డోర్ టు డోర్ ప్రచారం చేసుకోవచ్చని అనుమతిచ్చిన ఈసీ13న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకే ముగియనున్న పోలింగ్పోలింగ్ పెంచేందుకు 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటించిన ప్రభుత్వంతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 525 మంది అభ్యర్థులు, 475మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులుసికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 45 మంది అభ్యర్థులుఎన్నికల విధుల్లో 2లక్షల 80వేల మంది సిబ్బంది విధుల నిర్వహణ160 కేంద్ర కంపెనీల CAPF బలగాలు రాష్ట్రంలో మోహరింపుఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి 20వేల మంది పోలీస్ బలగాలురాష్ట్ర వ్యాప్తంగా 3కోట్ల 32లక్షల 32వేల మంది ఓటర్లుపురుష ఓటర్లు-1కోటి 65లక్షల 28వేలు, 1కోటి 67లక్షల మహిళా ఓటర్లు18-19 ఏళ్ల వయసు కలిగిన యువ ఓటర్లు 9లక్షల 20వేలు, వికలాంగులు 5లక్షల 27వేలుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35వేల 808 పోలింగ్ కేంద్రాలుఅత్యధికంగా మల్కాజ్గిరిలో 3226 పోలింగ్ కేంద్రాలు1లక్ష 9వేల 941 బ్యాలెట్ యూనిట్లు, 44906 కంట్రోల్ యూనిట్లుతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 9900 ఉన్నట్లు గుర్తించిన ఈసీజూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు -
‘బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తారు’
సాక్షి, కరీంనగర్: హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేసే ఆలోచనలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో చంద్రబాబు గెలిస్తే.. బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేస్తారని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతోంది. నేను గెలిస్తే వాటిని కొట్లాడి అడ్డుకుంటా. హైదరాబాద్ నుండి కరీంనగర్కు రైలు రాబోతుంది.. అది నేను చేసిన పని.. గెలిస్తే వస్తుంది. తెలంగాణా నిధుల కోసం మోదీని నేను కలిసినన్ని సార్లు బండి సంజయ్ కలిశాడా?. కరీంనగర్ స్మార్ట్ సిటీకి వేయి కోట్లు తెచ్చిన. యువకుల్లరా మీకు ఉద్యోగాలు కావాలా.. విధ్వంసాలు కావాలా? అభివృద్ధి కోసం నా వెంట రండి.ప్రజా స్పందన చూస్తే భారీ మెజరిటితో గెలువబోతున్నానన్న ధీమా కలుగుతోంది.పాంప్లెంట్లులో మోదీ బొమ్మ పెట్టకుండానే సంజయ్ ప్రచారం చేసిండు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రతి మంత్రిని కలిసినా నేను. బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధి కోసం మోదీని ఏనాడూ కలువలేదు. కేబుల్ బ్రిడ్జిపైన నేడు చెత్త పేరుకు పోయింది.. అభివృద్ధి ఎటు పోతుంది? నా కళ్ళకు నీళ్లు వస్తున్నాయి. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్న నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. కరీంనగర్ను వైబ్రెంట్ కరీంనగర్గా మార్చి చూపిస్తా’’ అని వినోద్ కుమార్ అన్నారు. -
బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోంది: కేసీఆర్
సాక్షి,హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించబోతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం(మే11) తెలంగాణభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు.‘ప్రజాగ్రహం కాంగ్రెస్ను ముంచేయబోతోంది. కరెంటు విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. రెండు జాతీయ పార్టీలను మించి సీట్లు గెలవబోతున్నాం. చిల్లర రాజకీయాల కోసం టైమ్ వేస్ట్ చేశారు. కరెంట్ను ఎందుకు దెబ్బతీశారో అర్థం కావడం లేదు. నేనుండే చోట 7-8సార్లు కరెంటు పోయింది.పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాం గ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వస్తారా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళతారా చూద్దాం. పైన తథాస్తు దేవతలు ఉంటారు. ఏదైనా జరగొచ్చు. కేసులు అటు ఇటైతే రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళతాడు. 26 నుంచి 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా వాళ్లతో టచ్లో ఉన్నారు. ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫాం చేద్దామంటున్నరు.వైఎస్ రాజశేఖర్రెడ్డి కొన్ని అద్భుత పథకాలు తీసుకొచ్చారు. మహానుభావుడు చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో తెలియదు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, సీఎం రిలీఫ్ ఫండ్ పథకాలను ప్రవేశ పెట్టారు’ అని కొనియాడారు. -
తెలంగాణలో రాహుల్, కాంగ్రెస్కు ఇచ్చిపడేసిన అమిత్ షా
సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్కు సర్జికల్ దాడులు చేసే ధైర్యం లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అలాగే, బీజేపీకి ఓటేస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్నారు. ఇక, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. మజ్లిస్ ఓటు బ్యాంకుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడుని సంచలన ఆరోపణలు చేశారు.కాగా, అమిత్ షా శనివారం వికారాబాద్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ..‘పాకిస్తాన్ దగ్గర ఆటమ్ బాంబ్ ఉందని కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ భయపడుతున్నారు. బాంబ్ ఉందని పీవోకేని పాకిస్తాన్కు అప్పగిస్తామా?. బీజేపీ ఉన్నంత కాలం పీవోకేను పాకిస్తాన్కు అప్పగించడం ఎవరికీ సాధ్యం కాదు. కశ్మీర్ మనదేనా కాదా?.. తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పాలి. సర్జికల్ దాడులు చేసి పాకిస్తాన్లో దాక్కున్న ఉగ్రవాదులను మట్టుబెట్టాం. సర్జికల్ దాడులు చేసే ధైర్యం కాంగ్రెస్కు లేదు.రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డుపడింది. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాహుల్, ఖర్గే, ప్రియాంక ఎందుకు రాలేదు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వెళ్తే.. తమ ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందో అని కాంగ్రెస్ నేతలు భయపడ్డారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే ప్రధాని కావాలా?.. వాళ్లను రక్షించే వాళ్లు కావాలా?. నరేంద్ర మోదీపై ఒక్క అవినీతి మరక కూడా లేదు. కొంచెం వేడి ఎక్కువైతే ఫారిన్ టూర్లకు వెళ్లే రాహుల్ ఒకవైపు.. దీపావళి రోజు కూడా సెలవు తీసుకోని వ్యక్తి మోదీ మరోవైపు. మోదీ, రాహుల్లలో ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి.బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. బీజేపీకి ఓటేస్తే ముస్లిం రిజర్వేష్లను తొలగిస్తాం. కాళేశ్వరం అవినీతికి అడ్డాగా మారింది. ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్. సర్జికల్ దాడుల గురించి రేవంత్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడుతున్నారు. కశ్మీర్ మనదేనా కాదా?.. తెలంగాణ ప్రజలు స్పష్టంగా చెప్పాలి. మజ్లిస్ ఓటు బ్యాంకుకు రేవంత్ రెడ్డి భయపడుతున్నాడు. బుల్లెట్ ట్రైన్ తొలి స్టాప్ వికరాబాద్లో రాబోతోంది. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపాలా?. వద్దా?. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. తెలంగాణలు డబ్బులు ఢిల్లీకి చేరుతున్నాయి’ అని వ్యాఖ్యలు చేశారు. -
27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని సీఎం రేవంత్రెడ్డి తన భుజాలపై వేసుకొని తెలంగాణ అంతా చుట్టివచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగిన జన జాతర సభతో ఆ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచా రం మొదలవగా 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలలో రేవంత్ పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి ముఖ్యమంత్రి పలు సభల్లో పొల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదే శాల మేరకు కర్ణాటక, కేరళలలోనూ పర్యటించి బహిరంగ రోడ్ షోలలో ప్రచారం చేపట్టారు.ఈ ప్రచారంలో సీఎం ప్రధానంగా బీజేపీని, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతుందని ఆయన వ్యాఖ్యనించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆయన చేసిన ప్రసంగాలు జాతీయ స్థాయిలో కాంగ్రెస్కు కలిసి వచ్చాయని ఆ పార్టీ భావిస్తోంది. రేవంత్ వ్యాఖ్యలపై మోదీ, అమిత్ షా మొదలు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వరకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని పార్టీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. అదేవిధంగా రాష్ట్రానికి బీజేపీ ‘గాడిద గుడ్డు’ తప్ప ఏమిచ్చిందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీఎం విజయం సాధించారని పేర్కొన్నారు. తమ ప్రచారానికి అనూహ్య రీతిలో ప్రజా స్పందన వచ్చిందని.. అందువల్ల 14 సీట్లలో గెలుస్తామన్న ధీమాలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. -
బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ’’బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దవుతుంది.. ప్రజాస్వామ్యా నికి ముప్పు ఏర్పడుతుంది.. రిజర్వేషన్లు పోతా యి, ప్రజల ప్రాథమిక హక్కులనూ తొలగిస్తా రు’’ అని ఆఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దేశంలో ప్రజల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాడుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి, మోదీకి ఒక్కసీటు కూడా రావద్దని, వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్టేనన్నారు.శుక్రవారం నల్లగొండ జిల్లా నకిరేకల్లో జరిగిన కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డి ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగం రక్షించే కాంగ్రెస్ పార్టీకి, రాజ్యాంగం రద్దు చేయాలని చూసే బీజేపీకి మధ్య ఈ ఎన్నికలు జరుగుతు న్నాయన్నారు. పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలగించేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుతంత్రాలు పన్నుతాయని ధ్వజమెత్తారు.అదానీ, అంబానీలపై ఐటీ దాడులు చేయించగలరా?మోదీ దేశాన్ని ధనవంతులైన తన మిత్రులకు ప్రభుత్వరంగ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నా రని ఖర్గే ఆరోపించారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెట్టి తిరిగి కాంగ్రెస్పైనే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అదానీ, అంబానీ ట్రక్కులు, టెంపోలలో డబ్బులు పంపుతున్నా రని అమిత్షా, మోదీ మాట్లాడుతున్నారని, వా రు డబ్బులు పంపిస్తుంటే మరి మోదీ, అమిత్షా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ధైర్యముంటే అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ దాడులు చేయించాలని ఖర్గే సవాల్ విసిరారు. ఆటో డ్రైవర్లుకు ఏటా రూ.12 వేలిస్తాంతెలంగాణలో కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అన్ని గ్యారంటీలు అమలవుతున్నాయని ఖర్గే వెల్లడించారు. ఉచిత బస్ప్రయాణం, ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్నామ ని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. ఆగస్టు 15వ తేదీన రూ.2 లక్షల రుణ మాఫీ చేసి తీరుతా మన్నారు. ఆటో వారికి ఏటా రూ.12 వేలు ఇస్తామని స్పష్టం చేశారు. కులగణన తరువాత కుటుంబ యజమాని అయిన మహిళల ఖాతాలో ఏటా రూ.లక్ష జమ చేస్తామన్నారు.ఇవన్నీ నెరవేరాలంటే హస్తం గుర్తుకు ఓట్లు వేసి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, నకిరేకల్, తుంగతుర్తి ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల సామేలు పాల్గొన్నారు.ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదుఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బంద్ కావడం ఖాయమని ఖర్గే జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు పలుకుతున్న విషయం ప్రజలకు అర్థమైందని, అందుకే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. మోదీ రాజ్యాంగాన్ని మారు స్తామని చెప్పినా దానిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆయన నిలదీశారు. -
నా గడ్డపైకొచ్చి నన్నే అవమానిస్తావా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా, సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్, అబిడ్స్‘నల్లమల మట్టిలో పుట్టిపెరిగాను. సాధారణ కార్యకర్తగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశా. ఒక్కో మెట్టు ఎదుగుతూ స్వశక్తితో నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నా. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నా. ప్రధాని మోదీ నన్ను అభినందించాల్సింది పోయి అక్రమార్కులను, అవినీతి పరులను పక్కన పెట్టుకుని, నాపై అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు.ఎవరు అవినీతి పరులో, అక్రమార్కులో చర్చకు సిద్ధమా? నేను అక్రమ వసూళ్లకు, అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే షాద్నగర్ అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం. ఒక వేళ నిరూపించకపోతే.. ప్రధాని మోదీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పగలరా?’ అని సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం మహబూబ్నగర్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డికి మద్దతుగా రోడ్షో అనంతరం షాద్నగర్ అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో, నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన జనజాతర బహిరంగసభల్లో సీఎం మాట్లాడారు.అదేవిధంగా శుక్రవారం రాత్రి హైదరాబాద్ బేగంబజార్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. ఆయా సభల్లో రేవంత్ మాట్లాడుతూ.. ’’బీజేపీ అభ్యర్థి డీకే అరుణ కుటుంబం దొంగసార అమ్మింది. భూములు కొల్లగొట్టింది. కల్లు దుకాణాల నుంచి వసూళ్లకు పాల్పడింది. ఇసుకు దందా చేసింది. అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని, నా గడ్డకు వచ్చి నన్ను అవమానిస్తావా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు?’’ అని మోదీని నిలదీశారు.బీజేపీ వస్తే వందేళ్లు వెనక్కి..పొరపాటున బీజేపీకి ఓటేస్తే మతాల మధ్య చిచ్చు, మనుషుల మధ్య పంచాయితీలు పెట్టి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తుందని, అభివృద్ధి వందేళ్లు వెనక్కి వెళుతుందని రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. ‘బీజేపీ గెలిస్తే ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టి పెట్టుబడులు రాకుండా చేస్తారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్నా ఎందుకు పెట్టుబడులు పోతలేవు. నిత్యం పంచాయితీలు, విషం చిమ్ముతూ ఆ రాష్ట్రాన్ని నాశనం చేశారు.పార్లమెంట్ నుంచి 30 నిమిషాల దూరంలోనే నోయిడా సిటీ ఉన్నా బీజేపీ నేతలకు చిత్తశుద్ధి లేక అభివృద్ధికి నోచుకోలేదు. తప్పిపోయి బీజేపీ కేంద్రంలో మళ్లీ వస్తే అభివృద్ధి వందేళ్లు వెనక్కు పోతుంది.’ అని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్కు ఎయిర్పోర్టు, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, గోదావరి జలాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.బీజేపీకి 400 సీట్లు కలేకేంద్రంలో 400 సీట్లు రావాలని కలలు కంటున్న బీజేపీకి అవి పగటి కలలుగానే మిగిలిపోతాయని రేవంత్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ బీజేపీకి అమ్ముడు పోగా, బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో బీజేపీ, మజ్లిస్లు గొడవలకు దిగి హైదరాబాద్లో శాంతిభద్రతల సమస్యను సృషించాలని చూస్తున్నాయన్నారు. హైదరాబాద్లో శాంతిభద్రతల సమస్యలు ఏర్పడితే రాష్ట్రానికి వచ్చే మలీ్టనేషనల్ కంపెనీలను గుజరాత్కు తరలించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని విమర్శించారు. -
ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం ముగిసింది. గత నెల 24న ప్రారంభమైన బస్సు యాత్ర 16 రోజులపాటు 13 లోక్సభ సెగ్మెంట్ల మీదుగా సాగింది. హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, చేవెళ్ల మినహా రాష్ట్రంలోని మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. మెదక్, కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాలపై ఎక్కువగా దృష్టిపెట్టేలా ఆయన రోడ్ షోలు జరిగాయి. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ రోడ్ షోల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చివరి రోజు శుక్రవారం కరీంనగర్ నుంచి బయలుదేరిన కేసీఆర్... సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన రోడ్ షోలలో పాల్గొని ప్రచారాన్ని ముగించారు. చివరి రోజు సిద్దిపేటలో భారీ బహిరంగ సభ అనంతరం ప్రచారాన్ని ముగించాలని భావించారు. అయితే వర్ష సూచన నేపథ్యంలో సిద్దిపేటలోనూ కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఓవైపు బస్సు యాత్ర ముగియడం, మరోవైపు శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెర పడుతుండటంతో కేసీఆర్ తెలంగాణ భవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈసీ కొరడాతో 48 గంటలపాటు ప్రచారానికి దూరం..బస్సు యాత్ర ఎనిమిదో రోజు మహబూబాబాద్ రోడ్ షోలో పాల్గొన్న సమయంలోనే కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 5న సిరిసిల్లలో జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన ప్రచారంపై ఈసీ ఆంక్షలు విధించింది. దీంతో మే ఒకటో తేదీ రాత్రి 8 గంటల నుంచి మే 3న రాత్రి 8 గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ప్రచార షెడ్యూల్లో కొద్దిపాటి సవరణలు చేసుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీజేపీ విధానాలపై వాక్బాణాలుపక్షం రోజులకుపైగా సాగిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సీఎం రేవంత్ భాష, పనితీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో వైఫల్యాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ విధానాలు, ప్రధానిగా మోదీ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బస్సు యాత్రలో కేసీఆర్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.ప్రచారంలో విశ్రమించని కేటీఆర్, హరీశ్బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్, నాగర్కర్నూలు తదితర లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కేటీఆర్ ప్రచారం చేపట్టారు. అలాగే హరీశ్రావు మెదక్, జహీరాబాద్, కరీంనగర్, నల్లగొండ, భువనగిరి, వరంగల్ లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో విస్తృతంగా ప్రచారం చేశారు. కాగా, బస్సు యాత్రకు భారీగా జనం తరలివచ్చారని, బీఆర్ఎస్ పట్ల ఓటరు సానుకూలతకు ఇది సంకేతమని పార్టీ భావిస్తోంది. కనీసం 8 నుంచి 12 సీట్లలో విజయం సాధిస్తామనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది. -
చేనేతలపై జీఎస్టీ మోదీ చలవే
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, సిద్దిపేట: ‘నేతన్నల నడ్డి విరిచేలా చేనేతలపై జీఎస్టీ విధించిన తొలి ప్రధాని మోదీయే. నేత కార్మికులకు బీమాతోపాటు ఇతర సదుపాయాలు రద్దు చేశాడు. బీజేపీ ఎజెండాలో కార్పొరేట్లే తప్ప చేనేతలు, కార్మికులు, పేదలు ఉండరు. అబ్ కీ బార్ 400 పార్ కాదు.. బీజేపీ మళ్లీ గెలిస్తే పెట్రోల్ డీజిల్ ధరలు రూ. 400 అవుతాయి. అలవిగాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటి అమల్లో విఫలమైంది’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం పాత బస్టాండ్ సమీపంలోని నేతన్న సర్కిల్లో రోడ్ షోతోపాటు సిద్దిపేట పాత బస్టాండ్ అంబేడ్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. ప్రధాని వేములవాడకు ఒక్క రూపాయి అయినా ఇస్తామన్నాడా? లోక్సభ ఎన్నికల బరిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ఏం చేసిందో అందరికీ తెలుసు. నిన్న ప్రధాని వేములవాడకు వచ్చిండు. బండి సంజయ్ పక్కనే ఉన్నడు. దేశం కోసం ధర్మం కోసం అనే ప్రధాని... పొద్దున లేస్తే హిందూ జపం చేసే బండి సంజయ్ వేములవాడకు ఒక్క రూపాయి అయినా ఇస్తామని చెప్పారా? మోదీ వచ్చి గోదావరిని ఎత్తుకుపోతా అంటున్నారు. గోదావరిని ఎత్తుకుపోతే మనం ఎలా బతుకాలే? అందుకే ఆలోచించి ఓటేయండి. వినోద్కుమార్ పార్లమెంటులో మనకోసం కొట్లాడే వ్యక్తి. 2001 నుంచి తెలంగాణ సాధన ఉద్యమంలో ఉన్నాడు. సీఎం రేవంత్ ఈ జిల్లాను రద్దు చేస్తా అంటున్నాడు. సిరిసిల్ల జిల్లా ఉండాలంటే వినోద్కుమార్ గెలవాలి. కాంగ్రెస్వి అలవికాని హామీలు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఒక్కటీ అమలు చేయలేదు. అవి అమలు అవుతాయన్న ఆశ కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గద్దెనెక్కింది. మహిళలకు రూ. 2500, రుణమాఫీ, రైతుబంధు రాలేదు. కరెంట్ లేదు. కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. రంగనాయక సాగర్ను ఎండబెట్టడం వల్ల రైతుల పంటలు కూడా ఎండిపోయాయి. ఉచిత బస్సు ఫెయిల్ అయింది. మా పాలనలో అందరినీ కాపాడాం.. బీఆర్ఎస్ పాలనలో రూ. 30 వేల కోట్లను రెండు దఫాలుగా రుణమాఫీ చేశాం. డిసెంబర్ 9న రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ ఇప్పటివరకు చేయలేదు. మేం అన్ని వర్గాల ప్రజలను కులమతాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లాం. అందరినీ కాపాడాం. పేదలు, వృద్ధులకు రూ. 2 వేల పెన్షన్ ఇచ్చాం. కాంగ్రెస్ నేతలు పెన్షన్ను రూ. 4 వేలు చేస్తామని చేయట్లేదు. అందుకే రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం ఆలోచించి బీఆర్ఎస్కు ఓటేయండి. సిద్దిపేటను మేం జిల్లా చేస్తే.. సీఎం రద్దు చేస్తా అంటున్నాడు ఎనీ్టఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిద్దిపేట జిల్లా కావాలని అడిగా. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి నేను సీఎం అయ్యాక సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశా. జిల్లాకు రైలు, నీళ్లు తెచ్చాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తామంటోంది. ప్రజల చెంతకు పరిపాలన తీసుకురావాలని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే ఈ మూర్ఖ ముఖ్యమంత్రి, ప్రభుత్వం దాన్ని రద్దు చేస్తాం అంటున్నారు. సిద్దిపేట ప్రజలు ఎటువంటి పులులో నాకు తెలుసు. మీరు పట్టుబడితే.. జట్టుకడితే.. మెదక్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి లక్ష మెజారిటీ అందించడం మీకు లెక్కనే కాదు. వెంకట్రామిరెడ్డి గెలుపులోనే సిద్దిపేట జిల్లా గెలుపు ఉంది.రూ. 5.04 లక్షలు ఇప్పించండి కొదురుపాకలో మిడ్మానేరు నిర్వాసితుల ప్లకార్డుల ప్రదర్శన బోయినపల్లి (చొప్పదండి): ముంపు గ్రామాల బాధితులైన తమకు రూ. 5.04 లక్షల పరిహారం ఇప్పించాలని కోరుతూ మిడ్మానేరు భూ నిర్వాసితులు కేసీఆర్ బస్సు యాత్రలో ప్లకార్డులు ప్రదర్శించారు. తమ సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ శుక్రవారం కరీంనగర్ నుంచి సిరిసిల్లకు వెళ్తుండగా కొదురుపాక వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కేసీఆర్ బస్సు వెళ్లిపోయాక ప్లకార్డులు ప్రదర్శించిన నిర్వాసితులతో స్థానిక బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు.బజ్జీలు తిని.. చాయ్ తాగి..బస్సులో వెళ్లే క్రమంలో కేసీఆర్ బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలోని ఓ హోటల్ వద్ద కాసేపు ఆగారు. హోటల్లో కూర్చొని మిర్చీ బజ్జీలు తిని, టీ తాగారు. అక్కడే ఉన్న స్థానికులతో కాసేపు మాట్లాడారు. పలువురు చిన్నారులు కేసీఆర్తో ఫొటోలు దిగారు. కాగా, కొదురుపాక చెక్పోస్టు వద్ద చెక్పోస్టు సిబ్బంది కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు. -
అబద్ధాల మోదీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ ఇచ్చిన 6 హామీల్లో ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు, 500 సిలిండర్, 200 ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ లాంటివి ఇప్పటికే ప్రారంభించాం. మిగిలిన ఒకటి కూడా త్వరలోనే ప్రారంభి స్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జునఖర్గే ప్రకటించారు. ఎన్నికల కోడ్ కారణంగా హామీల అమలు తాత్కాలికంగా ఆగిందని, కోడ్ ముగియగానే అమలు చేస్తామని చెప్పారు.తాము తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ప్రదేశ్లో ఇచ్చిన వాగ్దానా లను అమలు చేస్తూ పోతున్నామని, బీజేపీ ఎన్ని కల మేనిఫెస్టో గురించి మాట్లాడకుండా, కాంగ్రెస్ను తిట్టడంపైనే ఫోకస్ చేసిందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్ వచ్చిన మల్లి కార్జున ఖర్గే తాజ్కృష్ణలో విలేకరులతో మాట్లా డారు. పూర్తి వివరాలు ఆయన మాట్లల్లోనే... తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు. ఐదేళ్లపాటు అద్భుతపాలన అందిస్తాం. మీ సీబీఐ ఏం చేస్తోంది..?జనగణనను మోదీ బయటపెట్టడం లేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మహిళలు, పిల్లలు ఎందరున్నారు? వారి స్థితిగతులేంటి? వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ఏ సంక్షేమ పథకాలు చేపట్టాలి? విద్య, వైద్యం పరిస్థితి ఏంటీ? అయితే మోదీ సర్కారు ఈ గణాంకాలను దాచిపెడుతోంది. మోదీ అబద్ధాలపై అబద్ధాలు చెబుతున్నారు. అదానీ, అంబానీలు రాహుల్గాంధీకి టెంపోలో డబ్బులు పంపిస్తున్నారని మోదీ ఆరోపిస్తున్నారు.మీ సీబీఐ ఏమైంది..ఈడీ, ఆదాయపు పన్నుశాఖ ఏం చేస్తోంది? కావాలంటే విచారణ జరిపించు. ప్రతిపక్ష నాయకులను భయబ్రాంతులకు గురిచేస్తున్న కేంద్రం.. అసలు అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ సంస్థల రైడింగ్ ఎందుకు జరపడం లేదో మోదీకే తెలియాలి. వారితో అమిత్షా ఎప్పుడూ కలిసే తిరుగుతారు. 50 కోట్ల మంది వద్ద ఎంత సంపద ఉందో ఆ ఇద్దరి వద్ద అంత ఉంది.దేశాన్ని విడదీసే ప్రయత్నం చేస్తున్నారు‘మోదీ, అమిత్షా ఆందోళనలో ఉన్నారు. అభివృద్ధి చూసి ఓటు వేయమని మోదీ అడగం లేదు. మటన్, మందిర్, మంగళసూత్రం, మైనారిటీలు లాంటి అంశాలనే ప్రధాని మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రధానిని ఇంత వరకు ఎవరూ చూసి ఉండరు. కాంగ్రెస్ను చూసి బీజేపీ భయపడుతోంది. అందుకే మమల్ని టార్గెట్ చేసి మోదీ విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి రాగానే పథకాలు..‘ఆలిండియా సర్వీసెస్ అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలెందరో చెప్పడం లేదు. మేం అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం పోస్టులిస్తాం. మహిళలకు 50%... జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం. మహాలక్ష్మీ యోజన కింద రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తాం. 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రైతుకు కనీస మద్దతు ధర ఇస్తాం. పదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏమీ చేయలేదు. దేశరాజధాని స్థాయిలో హైదరా బాద్లో అభివృద్ధి జరగాల్సి ఉండగా, ఆ మేరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.హైదరాబాద్, బెంగళూరు, ముంబైలను పక్కకు పెట్టి అన్నీ ఒక్క గుజరాత్కే తరలిస్తే ఎంతవరకు సమంజసం. చేయిని తీసివేయడం ఎవరికీ సాధ్యం కాదు. మరోసారి నొక్కి చెబుతున్న హామీలన్నీ అమలు చేసి తీరుతాం’ అని మల్లికార్జున ఖర్గే వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, మధు యాష్కీగౌడ్, జబీర్ అహ్మద్ పాల్గొన్నారు. -
బీజేపీ వైపే ప్రజలు
(కె.రాహుల్) : ‘కరీంగనగర్లోనే కాదు, రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా ప్రజల మూడ్ బీజేపీకి, మోదీకి పూర్తి అనుకూలంగా కనిపిస్తోంది. ప్రధానిగా మోదీ ఉండాలని, తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలు అత్యధిక సంఖ్యలో గెలవాలని ప్రజలు డిసైడ్ అయ్యారు..’ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ చెప్పారు. ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండాతో వివిధ వర్గాల ఓట్లు సాధించి లోక్సభ ఎన్నికల్లో తాను కూడా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వేములవాడలో 8న జరిగిన ప్రధాని మోదీ సభకు ఉదయం 9 గంటలకే వెల్లువలా వచ్చిన ప్రజలు సంజయ్దే విజయమని ప్రకటించేశారన్నారు. తనపై పోటీచేస్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రెండోస్థానం కోసమే పోటీపడాల్సి ఉంటుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్కుమార్ నాన్ లోకల్ అయితే, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. ‘నేను ఈ గడ్డమీదే పుట్టిన. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు ఎన్నికల్లో గెలిచినా ఓడినా ఇక్కడే ఉన్నా. ప్రజల కష్టాల్లో అండగా ఉన్న. నాకు ఈ గడ్డతో ఉన్నది పేగు బంధం. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నడైనా ఈ గడ్డ ప్రజల కోసం పోరాటాలు చేశారా? మళ్లీ గెలిపిస్తే నాకున్న పరిచయాలు, ఢిల్లీ పెద్దలతో ఏర్పడ్డ సంబంధాలతో మరింత అభివృద్ధి చేస్తా..’ అని చెప్పారు. కరీంనగర్తో పాటు రాష్ట్రంలో పరిస్థితి, కాంగ్రెస్ పాలన, అభివృద్ధి, పలు రాజకీయ అంశాలపై బండి సంజయ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.\నేనేం చేశానో గ్రామాల్లో కన్పిస్తోందిమా పోరాటాల వల్లే కేసీఆర్ సర్కార్ పీడ విరగడైంది. తెలంగాణ ప్రజలను అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గల్లిలోకి గుంజుకొచ్చి గడీల పాలనను బద్దలు కొట్టినం. ఏ ప్రభుత్వమైతే ధర్నాలు, నిరసనలను నిషేధించిందో అదే ప్రభుత్వాన్ని ధర్నా చౌక్కు గుంజుకొచ్చిన. కేసీఆర్ పాలనలో విసిగి, అన్యాయాలకు గురైన ప్రజలకు అండగా ఉంటూ పోరాటాలు చేసిన. కేసీఆర్ ప్రభుత్వం అన్నో ఇన్నో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చింది అంటే నా పోరాటం వల్లనే. జిల్లాకు సంబంధించిన అనేక రోడ్ల పనులకు కేంద్రం నిధులు ఇచ్చేలా ఒప్పించి పనులు స్టార్ట్ చేయించిన. రూ.12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిన వివరాలు గ్రామ గ్రామాన కళ్లకు కన్పిస్తుంటే ఏమీ చేయలేదనే వాళ్లను ఏమనాలి ? మేం పక్కా హిందుత్వవాదులంహిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది ఎంఐఎం. ఆ పార్టీతో పదేళ్ల పాటు సంసారం చేసింది బీఆర్ఎస్. మనుగడ కోసం ఒవైసీతో అంటకాగుతోంది కాంగ్రెస్. హిందువుల ఆత్మ గౌరవం కోసం నేను కొట్లాడుతా. నేను ఎన్నడూ రాజకీయం కోసం హిందుత్వాన్ని వాడుకోను కానీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం బరాబర్ రాజకీయం చేస్తా..దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుక్కునే బిచ్చగాళ్లు బీజేపోళ్లని రేవంత్రెడ్డి హేళన చేశారు. హామీల అమలుపై కాంగ్రెస్ మాటలు జనం నమ్మడం లేదని ఆ దేవుడి మీదే ఒట్టేసే పరిస్థితికి వచ్చిండు. రాముడి అక్షింతలను, తీర్ధ ప్రసాదాలను హేళన చేసిన కేసీఆర్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొంద పెట్టారు. ఆ పార్టీని పాతాళంలోకి తొక్కడం ఖాయం.నాకే బాధ్యత ఇవ్వాలో పార్టీ నిర్ణయిస్తుందిరాష్ట్రవ్యాప్తంగా 10 నుంచి 12 సీట్లలో బీజేపీ గెలవబోతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అంతకు మించి గెలిచినా ఆశ్చర్యపోవడానికి లేదు. నేను గెలిచిన తర్వాత కేంద్రమంత్రి పదవి ఇస్తారా? ఏ బాధ్యత అప్పగిస్తారనేది మోదీ నాయకత్వంలోని మా కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది. నేను బీజేపీ సైనికుడిని. కరీంనగర్ ప్రజల సేవకుడిని. పార్టీ అప్పగించిన పని వంద శాతం నిర్వహించడమే నా బాధ్యత.ఫోన్ ట్యాపింగ్ డబ్బులు ఇక్కడ ఖర్చు చేస్తున్నారుఫోన్ ట్యాపింగ్ డబ్బులు తీసుకొచ్చి కరీంనగర్లో ఖర్చు చేస్తున్నారు. ఓటుకు వెయ్యి ఇచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి. కాళేశ్వరం అవినీతిపై, ఫోన్ ట్యాపింగ్పై కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలు, ఆ పార్టీపై, ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదు. ఈ రెండు పార్టీలు ఓ ప్లాన్ ప్రకారం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని పైకి డ్రామాలు ఆడుతున్నాయి.రిజర్వేషన్లకు కాంగ్రెస్ తూట్లుకాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది. ముస్లిం రిజర్వేషన్ల అమలు పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలకు అన్యాయం చేసింది. అగ్రకులాల్లోని పేదలకు కూడా 10% రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి మోదీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తున్న నేత. అలాంటి నాయకుడు రిజర్వేషన్లను రద్దు చేస్తారంటే ఎవరూ నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, ఇతర హామీలు అమలు చేయకపోవడంతో మోసం చేసిందనే భావన ప్రజల్లో ఉంది. దీన్నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు, హైదరాబాద్ను యూటీ చేస్తారనే ప్రచారాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నాయి. ఆ పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎంకాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మధ్యవర్తి ఎంఐఎం. ఈ పార్టీలన్నీ అవినీతి ఎలా చెయ్యాలి, ప్రజలను ఎలా మోసం చెయ్యాలి.. తిరిగి ఎన్నికలొస్తే డబ్బులతో ఓట్లు ఎలా కొనాలి? అనే చూస్తాయి. దేశాన్ని దోచుకోవడంలో కాంగ్రెస్, రాష్ట్రాన్ని దోచుకోవడంలో బీఆర్ఎస్ పార్టీలు పీహెచ్డీ చేశాయి. కేసీఆర్ కుటుంబం అవినీతిలో గుడిని మింగితే.. కాంగ్రెస్ ప్రభుత్వం గుడిలో లింగాన్ని కూడా వదలిపెట్టనట్లుగా అవినీతికి తెరదీస్తూ... ఆ డబ్బుతో ఢిల్లీకి కప్పం కడుతోంది. గ్యారెంటీలను నమ్మి గెలిపించిన ప్రజలకు పంగనామాలు పెట్టింది. వంద రోజుల పేరుతో 6 గ్యారంటీల్లో 5 హామీలను అమలు చేశామనడం పెద్ద అబద్ధం. -
మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
సాక్షి, హైదరాబాద్: పదేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పార్లమెంట్ వ్యవస్థను ధ్వంసం చేసిందని రాష్ట్ర నీటిపా రుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మరోసారి మోదీ ప్రధానైతే ఉత్తర కొరియా, రష్యా, పాకిస్తాన్లా దేశం తయారవుతుందని, ప్రజాస్వామ్యం స్థానంలో నియంతృత్వ పాలన వస్తుందని హెచ్చరించారు.తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్లు్యజే) ఆధ్వర్యంలో శుక్రవారం బషీర్బాగ్లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో మంత్రితో ‘మీట్ ది ప్రెస్’ జరిగింది. ఉత్తమ్ మాట్లాడుతూ పదేళ్లలో మోదీ ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదని విమర్శించారు. దేశంలో ఇండియా కూటమి గెలుస్తుందనీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.దేశ రక్షణకు అగ్ని వీర్ మంచిది కాదుఅగ్నివీర్ దేశ రక్షణకు మంచిది కాదని సైన్యంలో పనిచేసిన అనుభవంతో చెపుతున్నానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మోదీ ప్రధాని అయిన తరువాత రక్షణ విషయంలో చాలా పొరపాట్లు జరిగాయని, దేశ భూ భాగంలోకి 2000 కిలోమీటర్లు లోపలికి చైనా చొరబడిందన్నారు. ఇప్పటికే చాలామంది భారత సైనికులు బలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.ఆర్ధిక వనరుల పెంపుపై కమిటీ: ఆర్థిక వనరులను పెంచడం కోసం తనతో పాటు భట్టి విక్రమార్క, శ్రీదర్ బాబు కలిసి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైందని, ఎన్నికల కోడ్ తరువాత ఆర్థిక వనరుల సమకూర్పుపై ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. రేవంత్ సీఎంగా, భట్టి ఉప ముఖ్యమంత్రిగా, ఇతర మంత్రులతో 11 మందితో పటిష్టమైన క్రికెట్ టీంగా ఉన్నామని, ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదని, ఆ పార్టీలో ఎవరూ ఉండదలచుకోవడం లేదని, ఎన్నికల తరువాత ఏం జరుగుతుందో అందరు చూస్తారని వ్యాఖ్యానించారు.వచ్చే సీజన్ నుంచి రూ.500 బోనస్అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ భరోసానిచ్చారు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి రైతులకు క్వింటాలు ధాన్యానికి రూ.500 బోనస్గా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎన్నికల తర్వాత కొత్త రేషన్కార్డులు ఇచ్చే కార్య క్రమం మొదలుపెడతామని వెల్లడించారు. జర్నలిస్ట్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. టీయూడ బ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ పాల్గొన్నారు.కాళేశ్వరంలో నీరు నింపొద్దన్న ఎన్ఎస్డీఏకాళేశ్వరం ప్రాజెక్టులోకి ఈ వర్షాకాలంలో కూడా నీరు నింపకూడదని ఎన్ఎస్డీఏ రెండు రోజుల క్రితం ఇచ్చిన మధ్యంతర నివేదికలో స్పష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. నీటిపారుదల శాఖను సర్వనాశనం చేసిందే కేసీఆరేనని ధ్వజమెత్తారు. -
నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు చేవెళ్ల లోక్సభ పరిధిలో పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డికి మద్దతుగా వికారాబాద్లో, నాగర్కర్నూల్ పార్లమెంట్ ప రిధిలో అభ్యర్థి భరత్ ప్రసాద్కు మద్దతుగా వనపర్తిలో బహిరంగ సభల్లో పాల్గొననున్నా రు.సాయంత్రం 6 గంటలకు రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం తరఫున అమిత్షా చివరి ప్రచారసభల్లో ప్రసంగించనున్నారు. -
బీజేపీపై తప్పుడు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా బీజేపీ ని ఎదుర్కో లేక, ప్రజ ల దృష్టి మరల్చేందు కు కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల నేతలు పిరికిపందల మాదిరిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మండిపడ్డారు. తాము ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏం అమలు చేశారో, మిగతావి ఏ రకంగా అమలు చేయబోతున్నారో చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉందన్నారు. బీజేపీపై కాంగ్రెస్ ఎన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు నమ్మడం లేదన్నారు.శుక్రవారం ఎల్బీ స్టేడి యంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ లో ఆయన మాట్లాడారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారని కిషన్రెడ్డి చెప్పారు. దేశం కోసం, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని అన్నారు. ఈ విషయంలో రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి, కేసీఆర్ల సర్టిఫికెట్లు తమకు అవ సరం లేదన్నారు. తమకు కావాల్సింది తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ మాత్రమేనని స్పష్టం చేశారు.రేవంత్రెడ్డి మిడిమిడి జ్ఞానంతో బీజే పీని విమర్శిస్తున్నారని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం రూ.9 లక్షల కోట్లకు పైగా నిధు లు ఖర్చు చేస్తే.. ముఖ్యమంత్రి దాన్ని గాడిద గుడ్డుతో పోలుస్తున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ కుటుంబపాల నతో రాష్ట్రానికి, ప్రజలకు తీరనినష్టం జరిగితే బీజేపీ, మోదీ మాత్రమే ఆదుకున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగా ణ ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలన్నారు. -
బీజేపీ కేన్సర్ లాంటిది
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కేన్సర్ లాంటిదని, దాన్ని రాష్ట్రంలోనికి ఎంతమాత్రం అనుమతించకూడదని సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆత్మబలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో బీజేపీలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టే పార్టీకి చోటు లేదన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యాచరణ అమలుకే బీజేపీ పని చేస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగ మార్పు, రిజ ర్వేషన్లకు కోతే బీజేపీ ఎజెండా అని చెప్పారు. హైదరాబాద్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. బీజేపీ మతాల పేరుతో చీలుస్తోంది ‘ఎన్నికల్లో ఓడి బలహీనపడ్డ బీఆర్ఎస్ నిస్సహాయతతోనో, వ్యూహాత్మకమో తెలియదు గానీ.. బీజేపీకి రాష్ట్రాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ప్రమాదకరమైన భావజాలం గల బీజేపీని నిలువరించగల శక్తి ఒక్క కాంగ్రెస్కే ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు సరిగా లేవని పెట్టుబడులు రావడం లేదు. మరోవైపు హైదరాబాద్ అభివృద్ధి జరుగుతోంది. అందు కే పెట్టుబడులు వస్తున్నాయి. దేశంలోనే విశ్వనగరంగా పేరు తెచ్చుకుంది. పొర పాటున బీజేపీ చేతుల్లోకి అధికారం పోతే, నిట్ట నిలువునా మతాల పేరుతో చీలుస్తుంది. మధ్యయుగ చరిత్రను గుర్తుకు తెస్తుంది..’ అని రేవంత్ హెచ్చరించారు. ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తోంది ‘భావోద్వేగాలను రెచ్చగొట్టడమే బీజేపీ ఎజెండా. రాజ్యాంగ మార్పు ద్వారా దేశానికి తీవ్ర నష్టం చేయాలని చూస్తోంది. కొన్ని వర్గాల రిజర్వేషన్లు ఎత్తేసేందుకు కుట్ర చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ ఎంతకైనా దిగ జారుతున్నారు. 2019లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాహూల్ గాం«దీపై విష ప్రచారం చేస్తున్నారు. ప్రాంతాల వారీగానూ బీజేపీ అసమానతలు సృష్టిస్తోంది.కేంద్ర మంత్రి పదవులన్నీ గుజరాత్, యూపీకే ఇస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రధాని ఒక ప్రాంతానికి చెందిన వారుంటే, రాష్ట్రపతి మరో ప్రాంతం వారుండేవారు. గుజరాత్ పెత్తందారీ పోకడలకు చెక్ పెట్టకపోతే ప్రమాదం..’ అని సీఎం వ్యాఖ్యానించారు. బీజేపీ మోసాన్ని ప్రజలు గుర్తించాలి ‘నియోజకవర్గాల పునర్విభజన పేరుతో బీజేపీ ఆడాలనుకుంటున్న నాటకం తెలంగాణకు నష్టం చేస్తుంది. జనాభా ప్రాతిపదికన విభజన చేపడితే తెలుగు రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. వన్ ఇండియా వన్ నేషన్ పేరుతో బీజేపీ చేయాలనుకునే మోసాన్ని ప్రజలు గుర్తించాలి. ఓటు వేయడం సామాజిక బాధ్యతగా ప్రజలు గుర్తించాలి. ప్రమాదకరమైన బీజేపీ విధానాలను తిప్పికొట్టేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలి..’ అని రేవంత్ విజ్ఞప్తి చేశారు. బాండ్లపై విచారణకు సిద్ధం ‘ఎన్నికల బాండ్లపై విచారణకు మేం సిద్ధం. ఎన్నికల ఖర్చు, పార్టీలకు వస్తున్న ఆదాయంపై ఓ కమిటీని నియమించి విచారణ జరిపించాలి. ఇందుకు మా పార్టీ సిద్ధం. ఏ సంస్థ దగ్గరా డబ్బులు తీసుకోకుండా, తమ జేబుల్లోంచి తెచ్చి ఎన్నికల ఖర్చు చేస్తున్నామని భద్రాచలం రాముల వారి దగ్గర నరేంద్రమోదీ గానీ, ఆ పార్టీ వాళ్ళుగానీ ప్రమాణం చేసి చెప్పగలరా? తన పక్కనే అవినీతి పరులను కూర్చోబెట్టుకుని అవినీతి గురించి మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఆస్తులు కూడబెడితే, నరేంద్రమోదీ సర్కార్ బడా పారిశ్రామిక వేత్తలకు వాటిని ధారాదత్తం చేసింది. ఇన్ని చేసిన మోదీ నిజాయితీపరుడినని చెప్పుకోవడం హాస్యాస్పదం..’ అని సీఎం విమర్శించారు. బీఆర్ఎస్కు కొన్నిచోట్ల డిపాజిట్లు రావు ‘ఒవైసీని గెలిపించేందుకే బీజేపీ ఓల్డ్ సిటీలో వివాదాస్పదమైన వ్యక్తిని పోటీలో పెట్టింది. నరేంద్రమోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. కేసీఆర్ మానసిక ఒత్తిడితో నాపై విమర్శలు చేస్తున్నారు. ఆయన పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కొన్నిచోట్ల డిపాజిట్లు కూడా రావు. కల్తీ కల్లు, డ్రగ్స్పై మా సర్కార్ ఉక్కుపాదం మోపుతుంది. బీసీ కులగణన చేపట్టడం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచాలన్నదే మా విధానం ..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, హైదరాబాద్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్షుడు కె.శ్రీకాంత్, పలువురు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. -
హిందువుల విభజనే కాంగ్రెస్ రణనీతి
సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: వెనుకబడిన వర్గాలకు దక్కాల్సిన రిజర్వేషన్లను లాక్కొని ముస్లింలకు కట్టబెట్టే మోడల్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. హిందువులను విభజించి తమ ఓటుబ్యాంక్ను సంతోషపరచడమే కాంగ్రెస్ రణనీతి అని ధ్వజమెత్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీలో బీసీలకు దక్కాల్సిన మెజారిటీ సీట్లను మత రిజర్వేషన్ల పేరిట ముస్లింలకు కట్టబెట్టినట్టుగానే దేశమంతా చేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను లాక్కొని మత ప్రాతిపదికన ముస్లింలకు ఇవ్వాలని రాహుల్గాంధీ చూస్తున్నారని విమర్శించారు.దీనికి ఇండియా కూటమికి చెందిన బెయిల్పై ఉన్న నేత (లాలూప్రసాద్ యాదవ్).. ముస్లింలకు రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో ఇవ్వాల్సిందేనంటూ వంతపాడుతున్నారని మండిపడ్డారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లను గుంజుకునేందుకు ప్రయత్నిస్తే మీరు ఊరుకుంటారా? అందుకే మీ హక్కులు, అధికారాలను కాపాడడానికి మోదీ చౌకీదార్లా ఉంటాడు..’ అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచి్చనప్పటి నుంచి డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ హైదరాబాద్, తెలంగాణలను తమ ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు.వాస్తవానికి ఈ డబుల్ ఆర్కు మరో ఆర్.. రజాకార్ ట్యాక్స్ కూడా తోడయ్యిందని చెప్పారు. రజాకార్ ట్యాక్స్ హైదరాబాద్ పాతబస్తీ వారికి పూర్తిగా తెలుసునని అన్నారు. ఢిల్లీలో కూడా డబుల్ ఆర్ ట్యాక్స్పైనే చర్చ నడుస్తోందని చెప్పారు. వాస్తవానికి నేను ఎవరికోసం ట్యాక్స్ వసూలు చేస్తున్నారో చెప్పలేదు కానీ ఇక్కడి సీఎం భుజాలు తడుముకుంటున్నాడని, అవి ఎవరికి వెళ్తున్నాయో అర్థం చేసుకోవాలని అన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో బీజేపీ ఎంపీ అభ్యర్థులు జి.కిషన్రెడ్డి (సికింద్రాబాద్), ఈటల రాజేందర్ (మల్కాజిగిరి, మాధవీలత (హైదరాబాద్), కొండా విశ్వేశ్వర్రెడ్డి (చేవెళ్ల), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), డీకే అరుణ (మహబూబ్నగర్)లకు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభల్లో మోదీ మాట్లాడారు.మీ ఓటుతోనే అన్నిటికీ పరిష్కారం ‘హైదరాబాద్ సొల్యూషన్ సిటీ. ఇక్కడ ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అయితే భారత్ అవినీతి వంటి సమస్యతో ముందుకెళ్ల గలుగుతుందా? లక్షల కోట్ల స్కాములు చేసిన పార్టీలతో ముందుకెళ్లగలమా? ఇలాంటి పార్టీలు మీకు మేలు చేస్తాయా? దేశ భవిష్యత్తును మారుస్తాయా? ఇవన్నీ మోదీ కూడా చేయలేడు.. కానీ ఒక్క మీ ఓటు బలంతో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. బీజేపీ, ఎన్డీఏలకు ఓటేసి గెలిపిస్తే భారత్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కారమవుతాయి..’ అని ప్రధాని చెప్పారు. కొత్త ఓటర్లు పదేళ్లలో జరిగింది తెలుసుకోవాలి ‘నేడు భారత్ డిజిటల్ పవర్. ఫిన్టెక్ పవర్. స్టార్టప్ పవర్, స్పేస్ పవర్. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ. ఇది మోదీ ట్రాక్ రికార్డ్. కానీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్ ఏంటి? లూటీ లూటీ లూటీ. దోచుకోవడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. సంతుష్టికరణ రాజకీయాలు, ఉగ్రవాదులను కాపాడుకోవడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. మొదటిసారి ఓట్లు వేసేవారు ఒక్కసారి గత పది, పదిహేనేళ్లలో ఏమి జరిగిందో తెలుసుకోవాలి. గతంలో దిల్సుఖ్నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయనే విషయం వారు తెలుసుకోవాలి.కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా ఎప్పుడూ ఇలాంటి న్యూసే వినిపించేది. కానీ ఇప్పుడు ఇలాంటి న్యూస్ ఏదైనా మీకు విని్పస్తోందా? ఈ బాంబు పేలుళ్లను మీ ఒక్క ఓటే ఆపింది. కేంద్రంలో మీరు బీజేపీకి అవకాశం ఇచ్చారు. అందువల్లే ఈ పేలుళ్లు ఆగాయి. కాంగ్రెస్కు ఓటు వేయడమంటే మళ్లీ పాత రోజులు వచి్చనట్లే..’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్ది నరానరాన జాత్యహంకారమే.. ‘గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మధ్యతరగతి ప్రజలను అవమానించేలా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ ప్రజల ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు మధ్యతరగతి ప్రజల ఆదాయం, సంపత్తిపై కన్నేసింది. మీ సంపత్తి మీ సంతానానికి, వారసులకు దక్కకుండా లాక్కోవడం మీకు అంగీకారమేనా? కాంగ్రెస్ నరానరాన జాత్యహంకారం నిండి ఉంది. యువరాజు రాహుల్గాంధీ గురువు దేశవాసుల శరీరరంగు ఆధారంగా చైనా, ఆఫ్రికాకు చెందినవారని అవమానిస్తున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం జరగొద్దని, పూజలు జరగొద్దని చెప్పాడు. శ్రీరాముడికి పూజలు చేయడం దేశద్రోహమా? తప్పా? ’ అని మోదీ నిలదీశారు. కాంగ్రెస్ ఐడియా ఆఫ్ ఇండియాకే వ్యతిరేకం...‘దేశాన్ని విదేశీ కళ్లద్దాల్లో చూసే కాంగ్రెస్కు ఐడియా ఆఫ్ ఇండియా అనేదానిపై కనీసం అంచనా కూడా వేయలేదు. వెయ్యేళ్ల సంస్కృతి, సత్యమేవ జయతే, అహింస పరమోధర్మ, బుద్ధం శరణం గచ్చామీ, గాడ్ ఈజ్ గ్రేట్.. ఇవన్నీ.. ఐడియా ఆఫ్ ఇండియా..నాకు జన్మనిచి్చన భూమి స్వర్గం కంటే ఎక్కువ.. ఇది ఐడియా ఆఫ్ ఇండియా. కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియా ఆఫ్ ఇండియాకే వ్యతిరేకం.. ’ అని ప్రధాని విమర్శించారు. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ ‘కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దశాబ్దాలుగా తప్పుడు వాగ్దానాలు ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు దేశం మోదీ గ్యారంటీని నమ్ముతోంది. మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధికి గ్యారంటీ. రాష్ట్ర, జాతీయ భద్రతకు గ్యారంటీ, ప్రపంచంలో భారత్ గౌరవం పెంపొందించే గ్యారంటీ, రానున్న ఐదేళ్లలో పేదలకు మూడు కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చే గ్యారంటీ..70 ఏళుŠల్ పైబడిన వృద్ధులకు ఉచితంగా వైద్య చికిత్స అందించే గ్యారంటీ. మోదీ గ్యారంటీ అంటేనే పక్కాగా పూర్తి చేసే గ్యారంటీ.తెలంగాణలో వేగవంతమైన అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. తెలంగాణ గ్లోబల్ స్థాయిలో నిలుస్తోంది. డిఫెన్స్ మొదలు బయో టెక్నాలజీ, ఏఐ, మేనేజ్మెంట్, సేవా రంగాల్లో రాబోయే ఐదేళ్లలో మరింత వేగవంతమైన అభివృద్ధిని సాధించబోతోంది. పదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి లక్షల కోట్లు అందజేశాం. ఈ డబ్బులు అవినీతి ఏటీఎంలోకి వెళ్లగా.. బీఆర్ఎస్ జేబులో నింపుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తోంది. అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ.. బీఆర్ఎస్కు జిరాక్స్ కాపీలా మారింది..’ అని మోదీ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్కే.. ‘మీరు బీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటూ కాంగ్రెస్కు మద్దతునిస్తుంది. కాంగ్రెస్కు వేసే ఓటుతో ఆ పార్టీ అధికారంలోకి రాదు. అందుకే కమలం పువ్వు గుర్తుపై భారీగా ఓట్లు వేసి గెలిపించాలి. నా తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో పెద్దెత్తున ఓటింగ్ శాతం పెంచుకోవడం ద్వారా పాత రికార్డులను బద్దలు కొట్టి బీజేపీని 17కు 17 సీట్లలో గెలిపించబోతోంది. ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీని గెలిపించండి..’ అని ప్రధాని విజ్ఞప్తి చేశారు. ప్రసంగానికి ముందు మోదీ అక్షయ తృతియ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సభికుల మధ్యలోనే రాజాసింగ్ బహిరంగ సభ వేదికపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కనిపించలేదు. సభకు ఆయన ఇరవై నిమిషాలు ముందే వచ్చినప్పటికీ వేదికపై ప్రధాని మోదీతో పాటు కూర్చునే బీజేపీ నాయకుల జాబితాలో పేరు లేకపోవడంతో ఆయన స్టేజీ పైకి వెళ్లేందుకు ఎస్పీజీ బలగాలు అనుమతించలేదు. దీంతో సాధారణ కార్యకర్తలాగా సభికుల మధ్యనే కూర్చుండిపోయారు.దివ్యాంగ బాలికను ముందుకు పిలిచిన మోదీ ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల మధ్య వీల్చైర్లో కూర్చున్న ఓ దివ్యాంగ బాలిక యాదగిరి అక్షిత సీతారాముల చిత్రపటాన్ని ప్రదర్శించింది. దీన్ని గమనించిన మోదీ ముందుకు తీసుకురమ్మని సూచించడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని అక్షితను వీల్చైర్తో సహా ముందుకు తీసుకొచ్చి ప్రధాని ముందు ఉన్న గ్యాలరీలో కూర్చోబెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నక్కో అంటున్నారు..‘తెలంగాణ మూడ్ అంతా కాంగ్రెస్ నక్కో, బీఆర్ఎస్ నక్కో, ఎంఐఎం నక్కో.. బీజేపీ కో ఇచ్ ఓట్ దియెంగే.. జితాయేంగే (కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దు.. బీజేపీనే గెలిపిద్దాం)’ అన్నట్టుగా ఉంది. (ఈ వాక్యాన్ని హైదరాబాదీ ఉర్దూ యాసలో పలికారు) తెలంగాణ వ్యాప్తంగా నేను జరిపిన పర్యటనల్లో ఇదే స్పష్టమైన విప్లవం కనిపిస్తోంది. తెలంగాణలో వచ్చే ఫలితాలు దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని తీసుకురాబోతున్నాయి.జూన్ 4న వెలువడే ఫలితాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. 4న దేశం విజయం సాధిస్తుంది. 140 కోట్ల మంది ప్రజల సంకల్పం గెలుస్తుంది. భారత్ విరోధులు పరాజయం పాలవుతారు. ఆత్మనిర్భర్, సీఏఏ, యూసీసీ విరోధులు, ఆరి్టకల్ 370, ట్రిపుల్ తలాక్ను సమరి్థంచేవారు, అవినీతి, సంతుష్టికరణ రాజకీయాలు నమ్మేవారు ఓడిపోతారు..’ అని మోదీ అన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పాలి.. : బండి సంజయ్
కరీంనగర్: మోసపూరితమైన వాగ్ధానాలతో మరో సారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చె ప్పాలని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ సూచించారు. శుక్రవారం గన్నేరువరంలో స్ట్రీట్కార్నర్ మీటింగ్లో పాల్గొని ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. రాముడి పేరుతో రాజకీయాలంటూ ఇరుపార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మించడం తప్పా అని ప్రశ్నించారు.మైనార్టీ ఓట్లు పొందడానికి ఇరు పార్టీలు ఆరాటపడుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలే నరేంద్ర మోదీకి పెద్ద కుటుంబమని, ఆ కుటుంబం నుంచి ఎవరిని దూరం చేయలేరని అన్నారు. ఆరు గ్యారంటీల అమలులో సీఎం రేవంత్రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందని పదేపదే కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయని, కేంద్ర నిధులతో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కనబడడం లేదా అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 120రోజులు కావస్తున్నా ఇంతవరకు రైతుల రుణ మాఫీ ఎందుకు చేయలేదని, మహిళలకు రూ.2500 ఎందుకు ఇవ్వడం లేదన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాన్ని బీజేపీ ప్రశ్నిస్తేనే, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని, ఇప్పుడు మళ్లీ మోసపోవద్దన్నారు. వివిధ పార్టీలకు చెందినవారు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నగునూరి శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు సాయిని మల్లేశం, కోమల ఆంజనేయులు, నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్రెడ్డి, మాజీ సర్పంచ్ ఏలేటి చంద్రారెడ్డి, సొల్లు అజయ్వర్మ, అనిల్రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. -
జూన్ 4న దేశం గెలుస్తుంది: ప్రధాని మోదీ.
సాక్షి,హైదరాబాద్: జూన్ 4న దేశం గెలుస్తుందని, 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్కు ఓటు వేయడమంటే పాత రోజులను ఆహ్వానించినట్లే.. దేశం ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకూడదు.2012లో దిల్సుఖ్నగర్లో జంట పేలుళ్లు జరిగాయి. ఎంతో మంది అమాయకులు కాంగ్రెస్ పాలనలో బలయ్యారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే బాంబు పేలుళ్లు ఆగాయి. అందుకే మోదీని దించాలని చాలామంది చూస్తున్నారు. కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు. మజ్లిస్ వద్దని తెలంగాణ అంటోంది. బీజేపీ కావాలంటోంది. లూటీ లూటీ లూటీ, వారసత్వ రాజకీయాలు ఇవే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు. మీ సంపదను లాక్కునే వాళ్లు కావాలా.. మీ సంపదపై మీ పిల్లలకు హక్కుఉండాలా వద్దా. రాముడికి పూజ చేయడం తప్పా. నాకు హైదరాబాద్ చాలా ప్రత్యేకం. యువరాజుకు ట్యూషన్ చెప్పే నేత రామ నవమి చేసుకోవడం తప్పన్నారు. కాంగ్రెస్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు కోత పెట్టి ముస్లింలకు కోటా ఇచ్చింది. ఇదీ కాంగ్రెస్ పార్టీ మోడల్. తెలంగాణకు ఎయిమ్స్, వందేభారత్ రైళ్లు ఇచ్చిందెవరో చెప్పాలి’అని మోదీ ప్రసంగించారు. -
కాంగ్రెస్ హామీలన్నీ అబద్ధాలే: ప్రధాని మోదీ
సాక్షి,నారాయణపేట: మోదీ గ్యారెంటీ అంటే అభివృద్ధికి గ్యారెంటీ అని కాంగ్రెస్ అన్నీ అబద్ధపు హామీలిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం(మే10) నారాయణపేటలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘దేశ భవిష్యత్ను నిర్ణయించే ఎన్నికలివి. రాబోయే ఐదేళ్లలో మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి మోదీ గ్యారెంటీ. పదేళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. తెలంగాణకు లక్షల కోట్లు పంపించాం. ఆ డబ్బును బీఆర్ఎస్, కాంగ్రెస్ లూఠీ చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నో అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. తెలంగాణప్రజలు డబుల్ ఆర్ ట్యాక్స్ గురించి ఆలోచించాలని నేను చెప్పాను. అందులో ఎవరి పేరు చెప్పలేదు. కానీ ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్పై మాట్లాడాడు. అంటే డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో మీరు అర్థం చేసుకోండి. కాంగ్రెస్ దేశానికి ఇప్పటివరకు చేసిందొక్కటే నమ్మకద్రోహం. కాంగ్రెస్ నేతలు ఎన్నికలు వచ్చాక దేశాన్ని విభజించేలా మాట్లాడుతున్నారు. యువరాజు గురువు దక్షిణాది వారిని ఆఫ్రికన్లలా ఉన్నారంటాడు. యువరాజు ఎన్నికల ముందు ప్రేమ దుకాణం తెరుస్తాడు. కాంగ్రెస్ హిందువులను సొంత దేశంలోనే హిందువులను రెండవ తరగతి పౌరులను చేస్తోంది. నేను గుడికి వెళ్లడాన్ని కూడా తప్పు పడుతున్నారు. రామనవమికి మీరు గుడికి వెళ్లరా. పసిపిల్లలు నాపై చూపే ప్రేము కూడా కాంగ్రెస్ నేతలకు ఇబ్బంది కలిగిస్తోంది. కాంగ్రెస్కు దేశంలోని హిందువుల పట్ల ప్రేమ లేదు. కాంగ్రెస్ది హిందువుల పట్ల వ్యతిరేక భావన. 2014లో కేసీఆర్ను మీరు ఎన్నుకుంటే ఆయన మిమ్మల్ని మరిచిపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది’అని మోదీ విమర్శించారు. -
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: మాజీ సీఎం కేసీఆర్పై బీజేపీ ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న సంజయ్.. బోయిన్పల్లి వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని సవాల్ విసిరారు. సీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరని మండిపడ్డారు. హిందువులను కేసీఆర్ కించపరుస్తున్నారని, ఆయనకు తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.సిరిసిల్లలో శుక్రవారం బండి సంజయ్ మాట్లాడుతూ.. తనను ఓడిచేందుకు ముస్లింలంతా ఒక్కటి కావాలంటూ కేసీఆర్ పిలుపునిచ్చారని అన్నారు. హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా అని కేసీఆర్ను ప్రశ్నించారు. తన వెనక 80శాతం హిందువులున్నారని అన్నారు. 20 శాతం ఓట్లు కోసం 80 శాతం హిందువులను కించపరుస్తావా అని మండిపడ్డారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కు బుద్ది చెప్పాలని తెలిపారు.'కేటీఆర్ నోటి నుంచి జై శ్రీరాం మాటే రాదు. కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్ర ఇది. ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తవా?. కేసీఆర్ లాంటి గలీజు లీడర్ ఇంకొకరు లేరు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరు. రూ.లక్ష కోట్ల అవినీతి బయటపడుతుందనే భయంతో కాళేశ్వరంపై డీపీఆర్ ఇవ్వకుండా జాతీయహోదా పేరుతో కేంద్రాన్ని బదనాం చేయాలనుకునే మోసగాడు. ఎందుకూ పనికిరాకుండా పోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చిన్న సమస్యగా చిత్రీకన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చ ర్చకు సిద్ధమా?తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిన చరిత్ర మోదీదే. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా?.చర్చకు సిద్ధమైతే... పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ఆధారాలు నిరూపిస్తాం. కేసీఆర్తో కుమ్మక్కైన కాంగ్రెస్ నేతలు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కాంగ్రెస్ యత్నం. ఇవన్నీ ప్రశ్నిస్తుంటే.. నన్ను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నన్ను ఓడించేందుకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయ్. ఓటుకు రూ.5 వేలు ఒకరు. రూ.2 వేల చొప్పున మరొకరు పంచుతున్నయ్. అయినా కరీంనగర్ ప్రజలంతా నావైపే ఉన్నారు..సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరే కదా.. బతుకమ్మ బకాయిలివ్వకుండా అరిగోస పెడుతున్నది మీరే కదా?. విద్యుత్ బిల్లుల్లో, యార్న్ పై సబ్సిడీ ఇవ్వకుండా సాంచాలు మూతపడేలా చేసింది మీరే కదా? రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేని మీరా మాట్లాడేది? తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత మాది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివ్రుద్ధి చేసే బాధ్యత నాది. కేటీఆర్ సభలో ప్రశ్నించిన హిందుత్వ వాదుల అరెస్ట్ను ఖండిస్తున్నా’ అని మండిపడ్డారు బండి సంజయ్. -
ఆయన రాహుల్ గాంధీ కాదు.. ‘రాంగ్’ గాంధీ: హరీశ్రావు
సాక్షి, సిద్ధిపేట జిల్లా: రైతుల ఉసురు పోసుకుందంటూ.. బీజేపీని కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు మాజీ మంత్రి హరీష్రావు. బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే బీజేపీ ఆలోచించిందని.. 14 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని విమర్శించారు.హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పంచిన బొమ్మలను చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా? అంటూ ప్రశ్నించారు.అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదు.. ట్రస్ట్ కట్టింది.ఆలయ నిర్మాణానికి తానుకూడా 2 లక్షలు ఇచ్చానని చెప్పారు.నిన్న హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది. 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడిగితే ఐదు నెలల 12,500 ఇచ్చిన తర్వాతే ఓటు వేస్తామని అక్క చెల్లెళ్లు చెప్పండి. ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజీ హుస్నాబాద్కు వచ్చిందా? రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడు, ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ’’ అంటూ హరీశ్ ఎద్దేవా చేశారు.‘‘ఈ కాంగ్రెస్ పాలన వచ్చాక కల్యాణ లక్ష్మి ఖతమయ్యింది. తులం బంగారం తుస్సు మంది. బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు. బండి సంజయ్ కి ఓటు వేస్తే అంతా వృధా అయిపోతుంది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ మూడోస్థాలో ఉంది. అది గెలిచే ప్రసక్తే లేదు’’ అని హరీశ్రావు పేర్కొన్నారు. -
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
సాక్షి, యాదాద్రి: ‘దేశంలో కుటుంబ పాలనకు, భార తీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికలు మోదీ, రాహుల్కు మధ్య జరుగుతు న్నాయి. మోదీ దేశం కోసం.. వారు కుటుంబాల సంక్షేమం కోసం పని చేస్తారు. ‘ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ డెవలప్మెంట్.. రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్ మోదీ అభివృద్ధి గ్యారంటీ’ మధ్య ఎన్ని కలు జరుగుతున్నాయి..’అని కేంద్ర హోం మంత్రి అమిత్షా అన్నారు. 2019లో తెలంగాణలో బీజేపీ 4 స్థానాల్లో గెలిచిందని, రేవంత్రెడ్డీ చూస్కో.. ఈసారి 10 కంటే ఎక్కువ సీట్లలో బీజేపీ గెలవబోతోంది అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్ బీజేపీని 400 స్థానాల్లో గెలిపించేందుకు మార్గం సుగ మం చేస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారిందని, రాహుల్ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, రైతులకు ఏటా రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం అమలు కాలేదన్నారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో భువనగిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం ‘నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పదేళ్లు తమ కుటుంబం బాగు కోసమే పని చేసింది. ఇప్పుడు కాంగ్రెస్కు ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. కానీ ఆ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుంటోంది. అబద్ధాలతో ఈ ఎన్నికలు గెలవాలని ఆ పార్టీ చూస్తోంది. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ మోదీ పదేళ్లుగా ఫుల్ మెజార్టీతో అధికారంలో ఉండి కూడా రిజర్వేషన్లు తొలగించలేదనే విషయం గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు 4 శాతం అందిస్తోంది. మేం ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాం. తెలంగాణలో బీజేపీని కనీసం పది సీట్లలో గెలిపించండి. దేశంలోనే నంబర్ వ¯న్గా తెలంగాణను మార్చుతాం..’అని అమిత్ షా హామీ ఇచ్చారు. ఏబీసీలు మూడూ ఒక్కటే ‘తెలంగాణలో ఏబీసీలు (ఏ అంటే అసద్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్) మూడూ ఒక్కటే. మూడూ ట్రయాంగిల్ లాంటివి. షరియత్, ఖురాన్ ప్రకారం పాలన కొనసాగించాలని చూస్తున్నారు. బుజ్జగింపు రాజకీయాలుచేస్తున్న వీరు హైదరాబాద్లో శ్రీ రామ నవమి ఊరేగింపుపై ఆంక్షలు విధించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతివ్వలేదు. సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. మళ్లీ ట్రిపుల్ తలాక్ తీసుకురావాలనుకుంటున్నారు. రామ మందిర నిర్మాణాన్ని కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లు ఆపింది. కానీ మోదీ ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఐదేళ్లలో రామమందిరానికి భూమి పూజ చేయడంతో పాటు ఆలయ నిర్మాణం, బాల రాముని ప్రాణ ప్రతిష్టను పూర్తి చేశారు. దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని మోదీ అంతం చేశారు. నక్సలైట్ సిద్ధాంతాన్ని సమాప్తం చేశారు. 370 ఆర్టీకల్ రద్దుతో కశ్మీర్ మనదే అని తేలిపోయింది. కొత్త టెక్స్టైల్ విధానంతో 8 లక్షల మంది చేనేత కార్మీకులకు ఉపాధి లభించింది. రూ.1,500 కోట్లతో ఈ విధానం అమల్లోకి తెచ్చాం. మోదీ చేనేత పాలసీ తీసుకువచ్చారు..’అని వివరించారు. నర్సయ్యగౌడ్కు ఓటు వేస్తే మోదీకి, అభివృద్ధికి వేసినట్లే అని అన్నారు. ఈ సమావేశంలో నర్సయ్యగౌడ్తో పాటు గూడూరు నారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.