మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.
తూప్రాన్లో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
Sep 17 2016 2:48 PM | Updated on Oct 16 2018 3:12 PM
తుప్రాన్: మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో శనివారం వెలుగు చూసింది. గ్రామంలోని కూడలిలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇది గుర్తించిన గ్రామస్థులు పోలీసులుకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


