సంక్రాంతి పండుగకు ఊరు వెళ్ళి వచ్చేసరికి దొంగలు ఇళ్ల తాళాలు పగులగొట్టి నగలు, నగదు దోచుకెళ్ళారు.
మేడ్చల్లో రెచ్చిపోయిన దొంగలు
Jan 16 2017 11:23 AM | Updated on Aug 30 2018 5:27 PM
మేడ్చల్: సంక్రాంతి పండుగకు ఊరు వెళ్ళి వచ్చేసరికి దొంగలు ఇళ్ల తాళాలు పగులగొట్టి నగలు, నగదు దోచుకెళ్ళారు. మేడ్చల్ ఉమానగర్లో రెచ్చిపోయిన దొంగలు శాండిల్ అపా మెంట్లోని నాలుగు ఇళ్ల తాళాలు పగులగొట్టి భారీగా చోరీ చేశారు. ఇంటి యజమానులు సంక్రాంతి పండుగకు స్వంత ఊరికి వెళ్ళి ఉండటాన్ని గమనించిన దొంగలు తాళాలు పగులగొట్టి ఉన్నకాడికి దోచుకున్నారు. ఫ్లాట్ యజమానులు ఊరినుంచి రాకపోవడంతో ఎంతమేర చోరీ జరిగిందనేది తెలియరాలేదు. ఇరుగుపొరుగువారి సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దొంగతనం జరిగిన విషయాన్ని ఇళ్ల యజమానులకు తెలియజేశారు.
Advertisement
Advertisement