టీడీపీకి ఉద్యోగుల భారీ షాక్‌

 Set back to TDP  in Postal  ballet - Sakshi

సాక్షి, అమరావతి  : ఆంధ్రప్రదేశ్‌  అసెంబ్లీ ఎన్నికల్లో  వైఎస్‌ఆర్‌సీపీ దూకుడుగా ఉంది. పోస్టల్‌  బ్యాలెట్‌ లెక్కింపులో అధికార తెలుగుదేశం పార్టీకి  ఊహించినట్టుగానే  భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగులు టీడీపీకి తీవ్రంగా తిరస్కరించారు. దీనికి ప్రతిఫలంగా పోస్టల్‌ బ్యాలెట్‌  ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి ఈ లెక్కింపులో గణనీయమైన మెజార్టీ లభిస్తోంది. ఇది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పార్టీ  విజయానికి శుభ సంకేతమని  రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

వైఎస్సార్‌సీపీ పార్టీ ముందంజలో సాగుతూ తొలి ఫలితాల్లోనే ఫ్యాన్‌  వేగం పుంజుకుంటోంది.  పులివెందుల సహా పలు నియోజకవర్గాల్లో జననేత  వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితో పాటు  చోట్ల పార్టీ గెలుపు గుర్రాలు హవాను చాటుతున్నారు.  
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top