కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి | Three Maoists killed in Jharkhand | Sakshi
Sakshi News home page

కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

Mar 24 2017 11:53 AM | Updated on Oct 9 2018 2:53 PM

కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి - Sakshi

కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి

జార్ఖండ్‌లోని పలమావు జిల్లాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.

రాంచీ: జార్ఖండ్‌లోని పలమావు జిల్లాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. శుక్రవారం రెండు మావోయిస్టు గ్రూపుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మహ్మద్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీతాచువా గ్రామంలో కాల్పులు జరిగాయని పోలీసులు వెల్లడించారు. మృతి చెందినవారిలో అజయ్‌ యాదవ్‌ అనే మావోయిస్టు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడి తలపై 10 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో గాయపడిన మావోయిస్ట్‌ రెబల్‌ గ్రూప్‌కు సంబంధించిన వ్యక్తితో పాటు.. ఒక ఏకే 47 ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement