బలంగా, ధైర్యంగా ఉంటాను: చిదంబరం

Chidambaram Tweets After Sonia Gandhi, Manmohan Singh visit him in Tihar jail - Sakshi

న్యూఢిల్లీ :  కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నంత కాలం తాను కూడా ధైర్యంగా ఉంటానని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరాన్ని ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిదంబరం విచారణ అనంతరం జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ సోమవారం జైలులో చిదంబరాన్ని కలిశారు.

చదవండి : చిదంబరాన్ని కలిసిన సోనియా, మన్మోహన్‌

ఈ నేపథ్యంలో వారితో భేటీ విషయమై చిదంబరం ట్విటర్‌లో స్పందించారు. ‘నా తరపున నా కుటుంబాన్ని ట్వీట్‌ చేయని కోరాను. ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ, డా. మన్మోహన్‌సింగ్‌ నన్ను కలిశారు. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉన్నంత కాలం నేను కూడా బలంగా ఉంటాను’ అని పేర్కొన్నారు. కాగా చిదంబరం తనయుడు కార్తీ కూడా సోమవారం జైల్లో ఉన్న తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా... ‘దేశం అంతా బాగానే ఉంది, నిరుద్యోగం, ఉన్న ఉద్యోగాన్ని తొలగించడం, తక్కువ వేతనాలు, కశ్మీర్‌ సమస్య, విపక్ష నాయకులను జైలుకు నెట్టడం మినహా’ అంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి చిదంబరం మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top