
సీనియర్ నటుడు మృతి
ప్రముఖ మలయాళ నటుడు కె ఎన్ జగన్నాథ వర్మ(77) తిరువనంతపురంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. న్యూ ఢిల్లీ, లీలం, పత్రం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు
ప్రముఖ మలయాళ నటుడు కె ఎన్ జగన్నాథ వర్మ(77) తిరువనంతపురంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. న్యూ ఢిల్లీ, లీలం, పత్రం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న జగన్నాథవర్మ 500లకు పైగా సినిమాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు పోలీస్ శాఖలో పనిచేసిన ఆయన కథాకళి కళాకారుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు.
మళయాల ఇండస్ట్రీలో పోలీస్ ఆఫీసర్, జడ్జ్, బిషప్ లాంటి పాత్రలకు ఆయన ఆహార్యం పర్ఫెక్ట్గా సూట్ అయ్యేది. జగన్నాథ వర్మ కుమారుడు మను వర్మ కూడా నటుడిగా పేరు తెచ్చుకోగా ఆయన అల్లుడు విజి తంబి మాలీవుడ్లో ప్రముఖ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడున్నర దశాబ్దాలకు పైగా మలయాళ సినిమాకు సేవలందించిన జగన్నాథ వర్మ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.