
దాసరి మనవరాలి తెరంగ్రేటం!
దర్శకరత్న దాసరి నారాయణరావు మనవరాలు నీరాజిత తెరంగ్రేటం చేయనుంది. తాత దర్శకత్వంలోనే ఆమె నటించనుంది.
దర్శకరత్న దాసరి నారాయణరావు మనవరాలు నీరాజిత తెరంగ్రేటం చేయనుంది. తాత దర్శకత్వంలోనే ఆమె నటించనుంది. దాసరి త్వరలో తెరకెక్కించనున్న 151వ చిత్రంతో నీరాజిత తెలుగు తెరకు పరిచయం అవుతోంది. తన తాతకు మనవరాలిగానే ఆమె నటించనుండడం విశేషం. సినిమాతో ఈ పాత్ర ఎంతో కీలకంగా నిలుస్తుందని చెబుతున్నారు.
తమిళ సూపర్హిట్ ‘మంజ పై’ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. దాసరి తాతగా, మంచు విష్ణు మనవడిగా నటిస్తున్నారు. విష్ణుకు జోడీగా కేథరిన్ని ఎంపిక చేశారు. చక్రి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అయితే ఈ సినిమాకు 'ఎర్రబస్సు' అని టైటిల్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు.