గుంజుకుంటామంటే సహించం: రేవంత్ | Revanth comments on government | Sakshi
Sakshi News home page

గుంజుకుంటామంటే సహించం: రేవంత్

Jul 26 2016 2:54 AM | Updated on Aug 10 2018 8:16 PM

గుంజుకుంటామంటే సహించం: రేవంత్ - Sakshi

గుంజుకుంటామంటే సహించం: రేవంత్

రైతుల నుంచి భూములు గుంజుకుంటామంటే సహించమని, వారి పక్షాన పోరాడుతామని రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు.

సాక్షి, హైదరాబాద్ : రైతుల నుంచి భూములు గుంజుకుంటామంటే సహించమని, వారి పక్షాన పోరాడుతామని రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులతో ప్రభుత్వం మాట్లాడి సమస్యను పరిష్కరించాలని  డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి ప్రభుత్వమే చికిత్స చేయించాలన్నారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా వచ్చే నెల 13, 14 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పోలీసులతో రాజ్యం చేస్తున్నారని, అరెస్టులకు భయపడమని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement