మంత్రి కేటీఆర్‌ క్రేజీ సెల్ఫీ! | 10KRun in Hyderabad | Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్‌ క్రేజీ సెల్ఫీ!

Nov 28 2016 12:25 AM | Updated on Aug 30 2019 8:24 PM

నగరంలో ఆదివారం ఉదయం 10కే రన్‌ అట్టహాసంగా జరిగింది.

హైదరాబాద్‌: నగరంలో ఆదివారం ఉదయం 10కే రన్‌ అట్టహాసంగా జరిగింది. నగరవాసులు 10కే రన్‌లో పెద్దసంఖ్యలో పాల్గొని.. ఉత్సాహం పరిగెత్తారు. ఆటపాటలతో ఉర్రూతలూగించారు. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావుతోపాటు పలువురు సెలబ్రిటీలు ఈ పరుగులో పాల్గొని.. ఆహూతుల్లో ఉత్సాహం నింపారు. 10కే రన్‌ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ పలువురు సెలబ్రిటీలతో కలిసి దిగిన సెల్ఫీ హల్‌చల్‌ చేస్తోంది.

టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా, మెగాహీరో రాంచరణ్‌ తేజ, నటి రాశిఖన్నా, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి కేటీఆర్‌ సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీని సానియామీర్జా తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేసుకున్నారు. 10కే రన్‌ అనంతరం మంత్రి కేటీఆర్‌, సానియామీర్జా, రాశీ ఖన్నాలను రాంచరణ్‌ తన కారులో తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement