వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఎస్ ఎర్రబల్లి గ్రామ శివారున ఉన్న చెరువు వద్ద అనుమానాస్పదంగా ఓ యువతి మృతిచెందింది.
రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం ఎస్ ఎర్రబల్లి గ్రామ శివారున ఉన్న చెరువు వద్ద అనుమానాస్పదంగా ఓ యువతి మృతిచెందింది. మృతురాలు ఎర్రబల్లి గ్రామానికి చెందిన శ్రీదేవి(18) గా గుర్తించారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీదేవి మంగళవారం శవమై కనిపించింది. శ్రీదేవిని ప్రేమించిన వ్యక్తే హత్య చేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.