కోడుమూరు, కొత్తపల్లి మండలాల తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అకస్మికంగా బదిలీ చేశారు.
రెండు మండలాలకు తహసీల్దార్ల మార్పు
May 11 2017 11:47 PM | Updated on Apr 4 2019 2:50 PM
కర్నూలు(అగ్రికల్చర్): కోడుమూరు, కొత్తపల్లి మండలాల తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ అకస్మికంగా బదిలీ చేశారు. కోడుమూరులో పనిచేస్తున్న నిత్యానందరాజును కొత్తపల్లికి, కొత్తపల్లిలో పనిచేస్తున్న రామకృష్ణను కోడుమూరుకు నియమించారు. ఇటీవల కోడుమూరులో నిర్వహించిన సమీక్షలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి.. తహసీల్దారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Advertisement
Advertisement