పొలానికి నీరు కట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు.
కాటేసిన కరెంట్
Apr 8 2017 11:16 PM | Updated on Jun 4 2019 5:16 PM
- విద్యుదాఘాతంతో రైతు మృతి
- కలుగొట్లలో దుర్ఘటన
కోవెలకుంట్ల: పొలానికి నీరు కట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. కలుగొట్ల గ్రామంలో శనివారం దుర్ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సహదేవుడి(35)కి..కుందూనది పరివాహకంలో ఎకరా పొలం ఉంది. ఈ ఏడాది రబీలో మినుము పంట సాగు చేశాడు. వేసవి కాలం కావడంతో సాగు నీరు మళ్లించేందుకు పొలం వద్దకు వెళ్లాడు. స్టార్టర్ ఆన్ చేయగా షార్ట్ సర్క్యూట్ అయి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య సాలమ్మ, కుమారులు నందు ,సందీప్ ఉన్నారు.విద్యుత్ ప్రమాదంలో కుటుంబ యజమాని మృత్యువాత పడడంతో భార్య, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Advertisement
Advertisement